August 2022
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎన్ టి పి సి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్మిక అన్నలకు మద్దతుగా ఈరోజు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారి హక్కులు సాధించేవరకు ఏ పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని రామగుండం ప్రజల ఆత్మగౌరవం నిలబడే విధంగా ఎన్టిపిసి యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పే వరకు న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కలిసికట్టుగా ఐక్యమత్యంగా పోరాడుదాం అని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా   దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్  సహకారంతో కార్మికుల హక్కుల సాధన కోసం మా వంతు పాత్ర పోషిస్తామని స్పష్టం చేశాం ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కౌశిక్ హరి మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ డిప్యూటీ మేయర్ అభిషేక రావు యాకయ్య రామాచారి తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు వెంచర్ల మహేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ వంశీ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు.

 ప్రతి ఇంటా వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించే గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి,అందరికీ గణనాథుని ఆశీసులతో శుభాలు, విజయాలు చేకూరాలని కోరారు.

మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని  కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ


 


హన్మకొండ ;

ఈ వినాయ‌క చ‌వితి...ప్ర‌జ‌ల‌కు విఘ్నాలు తొల‌గించి... విజ‌యాలు చేకూర్చాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆకాంక్షించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పండగవేళ ప్రతీ ఇల్లు ఒక దేవాలయం కావాలి. సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలి. విఘ్నాలు, ప్రజల కష్టాలు తొలగి శాంతి సౌఖ్యాలు నెలకొనాలి. పూర్వ పద్ధతిలో విఘ్నేశ్వరుడిని కలుద్దాం పర్యా వరణానికి పాటు పడదాం. మట్టి గణపతి ని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఆటంకాలెన్ని ఎదురైనా, వాటిని అదిగ‌మించి, స‌ల‌క ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పాల‌న కొన‌సాగాల‌ని, ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని మంత్రి కోరుకున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

బాలల సంక్షేమంపై దృష్టి సారించి వారి హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో బాలల సంక్షేమం మరియు బాలల సంరక్షణ కమిటీ, మరియు బెటి బచావో బేటి పడావో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం  జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా  హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల బాలల సంరక్షణ కేంద్రాలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సంబంధిత అధికారిక కమిటీతో పాటు ఒక మెడికల్ ఆఫీసర్  పర్యవేక్షణ చేసి బాల బాలికల ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు వ్యక్తిగత నివేదిక సిద్ధం చేసి సంబంధిత శాఖ దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు.

జీవో ఎం ఎస్ నంబర్ 47 ప్రకారం అర్హులైన పిల్లలకు సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పించుటకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పెన్సిల్ పోర్టల్ పై విస్తృత అవగాహన కల్పించాలని, ఇట్టి విషయంలో కార్మిక శాఖ ముఖ్య భూమిక  పోషించాలని,14 సంవత్సరాలలోపు బాల కార్మికులను గుర్తించి సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయాలని అన్నారు.

అర్బన్ డిప్రైవ్డ్ పాఠశాలకు వెళ్లి అక్కడి అవసరాలను గుర్తించి నివేదికను అందించినట్లయితే తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు,

బేటి బచావో బేటి పడావో పై మరియు గర్భస్థ లింగనిర్ధాన చట్టం పై విస్తృత అవగాహన కల్పించాలని, నగర కూడళ్లలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేయాలని అన్నారు, బాలల సమస్యల తక్షణ పరిష్కారం కోసం బాలల లోక్ అదాలత్ నిర్వహించుటకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచించారు, బాలసదనంలో ఆశ్రయం పొందుచున్న బాలికల చదువు సాజావుగా కొనసాగించుటకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రవాణా నిమిత్తం ఆర్టీసి అధికారులతో మాట్లాడి బస్సు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు, 

బాలల రక్షణ సంరక్షణ కోసం అధికారులు అంకిత భావంతో పని చేసి బాలల స్నేహ పూర్వక సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు

బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ కే శిరీష మాట్లాడుతూ అన్ని సంక్షేమ గురుకులాలలో సజెషన్ బాక్స్ ఏర్పాటు చేసి బాల బాలికల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాలని కోరినారు.

కాగా కార్యక్రమంలో ప్రగతి నివేదికను డిసిపివో సంతోష్ కుమార్, చైల్డ్ రెస్క్యూ వివరాలను చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ పాషా  పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

కార్యక్రమంలో  అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు, కార్మిక శాఖ అధికారుకు డాక్టర్ సామ్యూల్ జాన్,ప్రసాద్ రావు, ఎన్సిఎల్పి పిడి బి అశోక్ కుమార్, డిటిడివో ప్రేమకళ, డీఎస్సీడివో బి నిర్మల, ఆర్సీవోలు వి రాంసింగ్, డాక్టర్ శరత్ బాబు, శ్రీపాల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, కే దామోదర్, ఎస్ రాజేంద్ర ప్రసాద్, పి హైమావతి, 

యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ కే సుజాత,

బాల సదనం పర్యవేక్షణాధికారి కల్యాణి, యూడిసి వెంకట్ రామ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎల్సిపివో సతీష్ కుమార్, చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ పాషా,కౌన్సిలర్ మాధవి, విజయ్ కుమార్, జ్ఞానేశ్వరి, రవి కృష్ణ,  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కళ్యాణ్, ఎర్ర శ్రీకాంత్, ఫాదర్ అలెక్స్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు

తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో  వినాయక వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు.

గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ లోని  సమావేశం మందిరం లో శాంతి కమిటీ సమావేశానికి సీపీ తరుణ్ జోషి, హనుమకొండవరంగల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఉన్నత అధికారులు హాజరు అయ్యారు.ఈ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.

హనుమకొండ కలెక్టర్  మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు వంటి సౌకర్యాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గణేష్ పండుగ సందర్భంగా భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క ప్రాణ నష్టం సంభవించకూడదని అన్నారు. ముఖ్యంగా విద్యుదాఘాతం బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక మంటపాలు ప్రతిష్టించే గణేష్ మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా ట్రాన్స్ కో కు  నామమాత్రపు రుసుము చెల్లించి అధికారిక కనెక్షన్లు పెట్టించుకోవాలని హితవు పలికారు. ఎఈ విషయంలో ట్రాన్స్ కో తో పాటు పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పే గణేష్ మంటపాలు వివరాలను తప్పనిసరిగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులకు జాగ్రత్తలు సూచించాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా కూడా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాల నిమజ్జనం చేసే ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో జరగాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, ప్లాటుఫారం, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

సీపీ తరుణ్ జోషి  మాట్లాడుతూ 

 సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్, రెవెన్యూ శాఖల  సమన్వయము తో పని  చేయలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్య రాణి, శ్రీవాత్సవ, హరిసింగ్, డిసిపిలు అశోక్ కుమార్, పుష్ప, వెంకట లక్ష్మీ, ఆర్డిఓలు వాసు చంద్ర, మహేందర్ జీ, మునుస్పాల్, సంబంధిత శాఖల సిబ్బంది వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

ఆర్టిసి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ  హనుమంతు తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం  లో వరంగల్  జిల్లా కలెక్టర్  గోపీతో కలిసి టి.ఎస్.ఆర్.టి.సి  డి ఎల్ సి ( District level committee)సమావేశం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు  మాట్లాడుతూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలనీ, బస్ స్టాండ్ ప్రాంగణంలోకి ప్రైవేట్ వాహనాలు రాకుండా చూడాలని, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేయాలని, అతిక్రమించి లోపలికి వచ్చిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని,  ఎంట్రీ ఇన్, ఔట్ ఏరియాలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని, నో పార్కింగ్ - నో ఎంట్రీ జోన్ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. బస్ స్టాండ్ ఆవరణ బయట నో పార్కింగ్ జోన్ లో పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో బస్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రైవేట్ వాహనాల్లో తూఫాన్, ఆటోలలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకొని వెళ్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ గోపీ  మాట్లాడుతూ 

బస్ ప్రాంగణం, ఆవరణ పరిశుభ్రం గా ఉంచాలని, శానిటేషన్ పెంచాలని, చెత్త ను మునిసిపల్ సిబ్బందికి అందించాలని, టాయ్లెట్ లు శుభ్రంగా ఉంచి ప్రయాణికుల మన్ననలు పొందాలని తెలిపారు.

 ఈ సమావేశంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి శ్రీదేవి, డిప్యూటీ ఆర్.ఎం. బి కృపాకర్ రెడ్డి, డి.ఎం లు సత్యనారాయణ,పవన్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్  సంధ్యారాణి ఐడిఓసి  మహిళా ఉద్యోగినిల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు.  కుటుంబ బాధ్యతలు చూస్తూ తనగురించి కానీ తన ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించటంలేదని  ఆరోగ్య సదస్సులు కల్పించటం వలన మహిళా ఉద్యోగినిల  విధి నిర్వహణ లో కుటుంబ బాధ్యత నిర్వహణలో చాలా చురుకుగా  పని చేయగలరని నిర్ణయం తో డాక్టర్ వాణిశ్రీ హసన్ పర్తి డి.డీఎం&హెచ్. ఓ  సలహాలు మహిళా ఉద్యోగినిలకు  వివరించారు. కుటుంబ బాధ్యతలు గురించి ఆలోచిస్తారు కానీ స్వతహాగా ఆహారం విషయంలో సరైన  ఆహారం తీసుకోవటం లేదు కనుక ఐరన్ లోపం సంభవించి నీరసం, అలసట, కల్లుతిరగటం , చేతులు , కాళ్లు , తిమ్మిర్లు  పట్టడం విపరీతమైన తలనొప్పి , గోర్లు స్పూన్ వలె మార్పు రావటం వంటి సూచనలు ఉంటే అనీమియా లోపం  అని గ్రహించి వెంటనే సరై న డాక్టర్ సలహా మేరకు ఐరన్ మాత్రలు, బికాంప్లెక్స్, సి విటమిన్ వంటివి  క్రమం తప్పకుండా వాడాలని ఆహారం లో ఆకుకూరలు, పండ్లు, చిరు దాన్యాలు, గుడ్లు, నువ్వులు, బెల్లం, పల్లీలు ఇవి అన్ని మన అందుబాటు లో ఉండేవే   కనుక తప్పక తీసుకోవాలని  అవగాహన సదస్సు లో సవివరంగా అందరికీ తె లియచేశారు. ఈ కార్యక్రమం లో డిప్యుటి రిజిస్టర్  నీరజ మహిళా ఉద్యోగినిలను ఉద్దేశించి ఆరోగ్య పరిజ్ఞానం  కలిపించేల ప్రసంగించారు  ఈ కార్యక్రమం లో ఐడిఓసి  మహిళా ఉద్యోగిని  లు  అందరూ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                                                                                              


పెద్దపల్లి:ఆగస్టు:29:పెద్దపల్లి జిల్లాలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు రామగిరి మండలం ముస్త్యాల గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు,నాయకురాలు తరలివెళ్లారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తరలివెళ్లిన నాయకులు,నాయకురాలు,గ్రామశాఖ అధ్యక్షుడు బసీనేని సత్యనారాయణరావు,టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు పుట్ట రాజన్న,ఒకటవ వార్డు మెంబర్ బాసినేని వినోదరావు, పార్టీ క్యాడర్స్ తాటి శీను,సుంకరి మహేష్,గందె ప్రత్యూష(పండు)రాపెళ్లి పుష్ప, బేరా పూర్ణచందర్,సుంకరి సమ్మయ్య,కొండ్ర భూమయ్య రాపెళ్లి శ్రావణ్,శంకరయ్య అనేకమంది సభకు తరలి వెళ్లారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


మాజీ ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాయూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బెడదంలింగస్వామి మునుగోడు నియోజకవర్గ యువజనకాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్ లు

బిజెపి పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో

జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఫ్లోర్లీడర్ పొలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్ బండమీదిమల్లేశం, పోలోజు వనజ అనిల్ చారి పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


జేఏసీ కార్మిక సంఘాల నాయకులను ఎంతమందిని  అక్రమంగా అరెస్టు చేసిన ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ లు పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని ఎన్టిపిసి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు తెలియజేశారు.

ఈరోజు ఎన్టిపిసి ప్లాంట్ గేట్ నెంబర్ 2 వద్ద కార్మికులు జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తమ హక్కుల కోసం నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఏసీ కార్మిక సంఘాల నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్ లను ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని,  కార్మిక నాయకుల్ని అరెస్టు చేసి, కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధానాన్ని ఎన్టిపిసి యాజమాన్యం మానుకోవాలని,కాంట్రాక్ట్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, యాజమాన్యం దిగివచ్చి లాఠి చార్జి చేసిన సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, దీనికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, అలాగే గతంలో చేసుకున్న పెండింగ్లో ఉన్న మూడు డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికుల అసహనాన్ని పరీక్షించవద్దని, వెంటనే పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఎన్టిపిసి యాజమాన్యాన్ని హెచ్చరించారు.

ఈ  నిరసన కార్యక్రమంలో జేఏసీ కార్మిక సంఘాల నాయకులు సిఐటియు ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, దండ రాఘవరెడ్డి , ఐ ఎఫ్ టి యు ఐ కృష్ణ, నరేష్, బుచ్చన్న, సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్,గోదావరి యూనియన్  రాజమల్లు,హెచ్ఎంఎస్ నాయకులు డి సత్యం, టిఆర్ఎస్ నాయకులు ఈ భూమయ్య, సిహెచ్ సత్యం, బిఎంఎస్ నాయకులు టీ శ్రీనివాస్, ఏఐటీయుసీ నాయకులు శంకర్, ఆర్ లక్ష్మణ్ ఐఎఫ్టియు నాయకులు నాగభూషణం, టిన్టీయూసీ నాయకులు ఏ శ్రీనివాస్, మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



: కొట్టడానికే నీ దగ్గర గులాబీ దళాలు ఉన్నాయా...? అని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు  దుర్గ నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వేస్తే ఎవరికీ బాడిత పూజ చేస్తారు... ప్రశ్నించినా...వారినా...ప్రజాలనా...అని ఆయన ప్రశ్నించారు... ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో గడిలా పాలన నడుస్తుందని నిర్భందలు.. పోలీసుల ప్రహారలో సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి బ్రిటిష్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ లో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అనుచరులే డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని హరీష్ అనే యువకుడు సోషల్ మీడియాలో లేటర్ రాసి చనిపోయిన దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అలాగే మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. హరీష్ మృతికి బాధ్యత వహించి ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే హరీష్ అనే యువకుడు మృతి చెందాడన్న విషయం ఇంటలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ ఎఫ్ సీ ఎల్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కొత్త నాటకాలకు తెరతిస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో చనిపోయిన హరీష్ మృతదేహాన్ని హడావిడిగా కరీంనగర్ కు తరలించి పోస్టుమార్టం చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి వస్తే ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ ఉద్యోగ దంధాలో ఎమ్మెల్యే బిజినెస్ మిత్రులే ఉన్నారని అంతేకాకుండా శ్రీనివాస్ అనే వ్యక్తిని తప్పించి ఆయన స్థానంలో తమ్ముడిని ఇరికించారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భవనమని అక్కడికి ప్రజలు ప్రజా సమస్యల కోసం వస్తుంటారని ప్రజల కోసం ఏర్పాటైన ఎమ్మెల్యే ప్రభుత్వ భవనానికి వచ్చే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. కొట్టడానికి నీ దగ్గర గులాబీ దళాలు ఉన్నాయని బెదిరింపులకు భయపడేది లేదని.ఒకరి పోరాటం వల్ల కాదని ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళి పిసిసి కార్యదర్శి ప్రకాష్ , కార్పొరేటర్ ముస్తఫా , నగునురి రాజు, మైనారిటీ ప్రెసిడెంట్ ఖాజా నజీంముద్దిన్ , యూత్ కాంగ్రెస్ నాజీముద్దున్, కౌటం సతీష్, కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,ఈదునూరి హరిప్రసాద్ ,అరుకుటి రాజమల్లు  యాదవ్, మడ్డి తిరుపతి,సింగం కిరణ్ కుమార్ గౌడ్ ఎండి గౌస్ బాబా,  తదితరులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


సీఎం కెసిఆర్ పెద్దపెల్లి జిల్లా పర్యటన లొ భాగంగా రామగుండం నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్ సింగ్ ను అరెస్ట్ చేయడం జరిగింది రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లొ ప్రతిపక్షం నేతలను ముందస్తు హాస్ అరెస్ట్ చేయడం నియంత  నిరకుశ పాలన అన్నారు.. సీఎం గారు పెద్ద పెల్లి జిల్లాలో ఉన్న సమస్య లపై స్పందించి మొదట గా Rfcl బాధితులకు భరోసా ఇచ్చే విదంగా ఎవరైతే దళారులను నమ్మి డబ్బులు ఇప్పించి బాధ్యత సీఎం కెసిఆర్ దే అని చెప్పి పత్రిక ముఖంగా ప్రకటన చేసి ఆత్మ హత్య చేసుకున్న ముంజ హరీష్ కుటుంబ నికి కోటి రూపాయలు ఎక్షగ్రెసియా ప్రకటించివారి కుటుంబ లొ ఒకరికి ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చిన తర్వాత నే ఈ జిల్లాలో అడుగు పెట్టాలని డిమాండ్ చేసారు...

ఈ ప్రెస్ మీట్ లొ కార్పొరేటర్ మహంకాళి స్వామి, పెద్దల్లి ప్రకాష్, ముస్తప, *అర్కూటీ రాజమల్లు యాదవ్ హారి ప్రసాద్, సింగం కిరణ్, నాగునూరి రాజు, కౌతం సతీష్, గౌస్ మద్ది తిరుపతి, గౌస్,తదితరులు పాలుగోన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



అక్రమ అరెస్టు ఖండించండి.

సీఎం పెద్దపల్లి వస్తున్నాడని

PDSU, కాంగ్రెస్,బీజేపీ,నాయకులు, RFCL బాధితులను

అందరినీ తెలవరేజమున అరెస్టు చేసి అంతర్ గాం పోలీస్ స్టేషన్ లోఉంచారు.ఇందులో

PDSU రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్,

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అకెనపల్లి సర్పంచ్  మేరుగు పోచన్న,

బీజేపీ మండల అధ్యక్షుడు

మడ నారాయణ రెడ్డి

బొడకుంటి సుభాష్

బీజేపీ నాయకులు, మండల్ 

EX వైస్ ప్రెసిడెంట్ పవన్,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాణాల స్వామి లతో పాటుRFCL బాధితులు 

VRO ల మండల అధ్యక్షుడు

రాములు లతో పాటు 19 మందిని అరెస్టు చేయడం జరిగింది

కెసిఆర్ సీఎం  పెద్దపల్లి కి ఇచ్చిన వాగ్దానాలను అమలు పై జవాబు చెప్పాలి RFCL బాధితుల పరిస్థితి పై స్పష్టత ఇవ్వాలిపెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న పరిశ్రమలలో మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక పొగ మోసం చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తుననారుజిల్లాను ఏమి అభివృద్ధి చేశారు చెప్పాలి అక్రమ అరెస్టు చేయడం కాదు

ఇప్పటికైనా విద్యార్థి యువజన ప్రజల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఆగవు అని హెచ్చరిస్తుననారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


గోదావరిఖని-; సీఎం కెసిఆర్ పెద్దపల్లికి వస్తున్న నేపధ్యంలో ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రామగుండం సింగరేణి కార్మికులు ఎన్నిసార్లు బ్లాస్టింగ్ లో చనిపోయినప్పుడు , 800 మంది ఆర్ ఎఫ్ సి ఎల్ కార్మికుల డబ్బు 45 కోట్లు వసూలు చేసిన టిఆర్ఎస్ నాయకుల చేసిన దోపిడి కి అన్యాయంగా ముంజ హరీష్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న  అనేక ప్రజా సమస్యల పట్ల  మాట్లాడిన సీఎం, ntpc మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, B పవర్ హౌస్ కార్మికులు, మా నీళ్ళు మాకు కావాలని రైతులు,నిరుద్యోగులు అడ్డుకుంటారని భయంతో ముందస్తుగా అరెస్టు చేసి,ప్రజా సమస్యలు ఉన్నప్పుడు రాని ముఖ్యమంత్రి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి  వస్తున్నందుకు ఎంతటి దుర్మార్గమైన పాలన టిఆర్ఎస్ ప్రభుత్వనిది అని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

 కానిస్టేబుల్ రాత పరీక్షకు మొత్తం 4755 మందికి గాను, 4428 మంది హాజరు, 327 మంది అభ్యర్థులు గైరాహాజరు అయ్యారు. 

జిల్లా పరిధిలోని కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాలను పరిశీలించిన  ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి పరిశీలించారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  పరిధిలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్  ప్రిలిమినరీ రాత పరీక్ష  సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  రాత పరీక్ష నిర్వహించగా, జిల్లాలోని 17 పరీక్షా కేంద్రాలను ఎస్పి  జె. సురేందర్ రెడ్డి   స్వయంగా పర్యవేక్షించి, పోలీసు అధికారుల నుండి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో పకడ్బందీగా  పరీక్షలు  నిర్వహించిన  ప్రిలిమినరీ రాత పరీక్ష పోలీసు నోడల్ అధికారి అడిషనల్ ఎస్పి వి. శ్రీనివాసులు, రీజినల్   కో-ఆర్డినేటర్ MS మూర్తి,  చీప్ సూపర్డెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, పోలీస్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ   అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




RFCL బాధిత మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్  గ్రేషియా తో పాటు కుటుంబం లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి_అని రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అరేస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినపోలీసులు*బాధితులందరికీ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగాఉంటుందిగోదావరిఖని RFCL బాధితులకు న్యాయం చేయాలనీ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్  ఆధ్వర్యంలో గోదావరి ఖని మెయిన్ చౌరస్తా లో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మరియు అడ్లూరి లక్ష్మణ్  హాజరైయ్యారు * ఈ సందర్బంగా *రాజ్ ఠాకూర్*మాట్లాడుతూ..

రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మృతుడి ఆ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించి ఒక ఉద్యోగం ఇవ్వాలని అలాగే RFCL బాధితులoదరికి డబ్బులు చెల్లించాలని, వారికి న్యాయం చేయకపోతే ని ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలనీ డిమాండ్ చేశారు. బాధితులు స్వయంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో  తెల్పినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతోనే  హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

దీనికి ఎమ్మెల్యే మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ పూర్తి బాధ్యత వహిస్తూ  బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసారు..జరిగిన దందాలో స్థానిక 

ఎమ్మెల్యే  పేరు వినబడుతున్నా, తన పాత్ర ఉన్నదంటున్నా తమకేమి తెలియదన్నట్లుగా కమిటీ వేస్తానని, బాధితులు క్యాంపు కార్యాలయంకు  వచ్చి తమ బాధలు చెప్పుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్


అంతర్గాం మండలంలోని మురుమూరు గ్రామం మాల సంఘం అధ్యక్షులు మగ్గిడి చంద్రయ్య గ్రామ ఉపసర్పంచ్ రాకేష్ మరియు 20 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు మరియు కేసీఆర్ పాలనపై ఇష్టంతో రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ చేసే అభివృద్ధి పనులు నచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు వారిని సాధారణంగా కోరు కంటి చందర్ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


హైదరాబాద్ గాంధీభవన్ లో  ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ...

RFCL లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 790 మంది దగ్గర సుమారు 42 కోట్లు వసూలు చేసిన రామగుండం MLA కొరుకంటి చందర్ అనుచరులు..

ఇందులో ఒక బాధితుడు బయట తిసుకచ్చిన అప్పుకి వడ్డీ కట్టలేక నాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ బాధితుడికి జరాగద్ధని వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఈ రోజు ముంజ హరీశ్ అనే బాధితుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ....

రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తక్షణమే ఆ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించి ఒక ఉద్యోగం ఇవ్వాలని అలాగే RFCL బాధితులoదరికి డబ్బులు చెల్లించాలని, వారికి న్యాయం చేయకపోతే ని ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలని చందర్ ను కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. బాధితులు స్వయంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో  తెల్పినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతోనే ఈరోజు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

దీనికి ఎమ్మెల్యే మరియు తన అనుచరులుగా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసిన దళారులు బాధ్యత వహించాలని అన్నారు. నిజం కళ్లకుకట్టినట్టుగా కనబడుతుంటే జరిగిన దందాలో స్థానిక 

ఎమ్మెల్యే  పేరు వినబడుతున్నా, తన పాత్ర ఉన్నదంటున్నా తమకేమి తెలియదన్నట్లుగా కమిటీ వేస్తానని, బాధితులు క్యాంపు కార్యాలయంకు  వచ్చి తమ బాధలు చెప్పుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. బాధితులు న్యాయం చేయాలని రోర్డుల మీదికి వచ్చిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తే ఈరోజు హరీశ్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదని అన్నారు. 

ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇప్పిస్తారని అన్నారు.

ఇప్పటికయినా చిత్త శుద్దితో స్థానిక ఎమ్మెల్యే గారు,మరియు పోలీసులు స్పందించి హరీష్ ఆత్మహత్య కు కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న దళారులను అరెస్టు చేసి వారి నుండి బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



తన డబ్బులతో పాటు తోటి కార్మికులకు డబ్బులు ఇప్పించాలని ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నేను బలిదానం చేసుకుంటున్నానని వాట్సప్ ద్వారా మెసేజ్ చేసే శుక్రవారం అదృశ్యమైన ముంజ హరీష్ (30) కమాన్పూర్ ప్రాంతంలోని ఒక బావిలో శవమై తేలాడు. శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన హరీష్ ఆర్ఎక్స్ ఎల్లో ఉద్యోగం కోసం ఒక బ్రోకర్ ద్వారా సుమారు ఏడు లక్షల రూపాయలు ఇచ్చి లోడింగ్ కార్మికుడిగా చేరాడు. ఐదు నెలల క్రితం అతన్ని తొలగించడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. నిన్న ఉదయం 9 గంటలకు బైక్ పై ఇంటిలో నుంచి వెళ్ళిన హరీష్ మధ్యాహ్నం ఒంటిగంటకు తాను బలిదానం చేసుకుంటున్నానంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. అలాగే తన లొకేషన్ కూడా పంపాడు. ఆ లొకేషన్ ఆధారంగా హుజరాబాద్ ఓదెల మండలం పోతులపల్లి వరకు వెళ్లి వెతికిన దొరకలేదు. సాయంత్రం 6 గంటలకు కమాన్పూర్ ప్రాంతంలో ఒక చెరువు వద్ద బైక్, సెల్ ఫోన్లు దొరికాయి. రాత్రంతా ఆ పరిసరాల్లో గాలించారు. ఉదయం ఒక బావిలో హరీష్ మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



శ్రావణమాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం అభిషేకం హోమం ,గాజులతో అలంకరణ అనంతరం సాయంత్రం సత్యం భజన మండలి ఆధ్వర్యంలో భజన  నిర్వహించారు ,భజన మండలి సభ్యురాలు అయినకీర్తిశేషులు  శ్రావణినీ గుర్తు చేసుకుని శ్రావణి చేసిన దేవాలయాలలో సేవలు భజనలు గుర్తించి కొద్దిసేపు మౌనం పాటించారు,  కార్యక్రమంలో ఆలయ పూజారి మరియుఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




జలశక్తి అభియాన్  కేంద్ర బృందం అంతర్గం  మండలంలోని కుందనపల్లి  గ్రామాన్ని పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులను, Zptc ఎంపీపీ  పుష్ప గుచ్చం మరియు శాలువాతో సత్కరించారు.  Sohaib Ahmed kalaal,

 Dy. Secretary, Neethi ayog. మరియు 

Rakesh guptha, Technical Officer  ఇద్దరు ఈ టీమ్ లో సభ్యులు

జలశక్తి అభయాన్ సంబంధించిన పనులను పరిశీలించనైనది.    Mgnregs క్రింద అటవీ భూమిలో కొత్తగా తవ్విన కుంట ను పరిశీలించి, సంతోషం వ్యక్తం చేసినారు.కుందనపల్ల్లి మహిళా సంఘాలు తో ముచ్చటించి, సంఘంగా ఏర్పడి మహిళలు ఆర్థికంగా వృద్ది చెందాలని, తెలిపారు.అనంతరం ఫారెస్ట్ శాఖ ద్యారా నిర్మించ బడిన చెక్ డ్యాం, ప్లాంటేషన్ ను పరిశీలించినారు.

ఈ కార్యక్రమంలో Zptc  అముల నారాయణ  mpp దుర్గం విజయ dfo, drdo శ్రీధర్ apd సత్యనారాయణ ఎంపిడిఓ, mpo, ps, egs staff మరియు అటవీ సిబ్బంది,మహిళా సంఘాల  సభ్యులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

         

   


ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని... పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే సంకల్పంతో తాము చేసిన ప్రయత్నాలు ఫలించి రామగుండం మెడికల్ కళాశాలకు కేంద్రం నుండి అనుమతులు లభించడం పట్ల ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆనందం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... సమాఖ్య పాలన తెలంగాణలోని వైద్య వ్యవస్దను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారరు.

సమైక్య రాష్ట్రంలో కేవలం రెండు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 8 మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన ఘనత సి.ఎం కేసీఆర్‌ ది అన్నారుజిల్లా కేంద్రంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ స్థానిక ప్రజల పట్ల కెసిఆర్ కు ఉన్న అభిమానం మేరకు సింగరేణి సహకారంతో ప్రత్యేకంగా మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాలను సాధించుకున్నామని రామగుండం ప్రజల దశాబ్దాల కళ నేరవెర్చమని చెప్పారు.

 ఆరంభం నుండి ఈ మెడికల్ కళాశాలను అడ్డుకునేందుకు పలువురు నాయకులు అనేక రకాల అడ్డంకులను సృష్టించారని  అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రయత్నాలను కొనసాగించి అంతిమ విజయం సాధించడం జరిగిందన్నారు.150 సీట్లకు అనుమతి లభించిన నేపథ్యంలో ఈ సంవత్సరంలోనే మెడికల్ కళాశాలనుప్రారంభిస్తామన్నారు.రామగుండం నియోజకవర్గం లోని పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించెందుకు మెడికల్ కళాశాల ప్రసాదించిన ఆరోగ్య ప్రధాత సిఎం కేసీఆర్‌ అన్నారు.అనంతరం రామగుండం మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి అనుమతి లభించడానికి హర్షిస్తూ  కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. సంబరాలు జరుపుకున్నారు ఈ విలేఖరుల సమావేశం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి ‌అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు 

మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ హిమబిందు  హాస్పిటల్ డిప్యూటీ సూపరిందెంట్ అశోక్, కార్పొరేటర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెరాసపట్టి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


 


2018 లో జరిగిన ఒప్పందం లోని పెండింగ్ అంశాలు అమలుచేయమని గత 22న జేఏసీ అధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మిక నాయకులు మరియు కాంట్రాక్టు కార్మికుల పై లాఠీ ఛార్జి చేసి తలలు పగిలేలా, కాళ్లు చేతులు విరిగేలా కొట్టడం దుర్మార్గమైన, చర్య అని నాయకులు అన్నారు.దాడికి కారకులైన ఎన్టీపీసీ అధికారులను, CISF సిబ్బందిని సస్పెండ్ చేయాలని,కేసులు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికులు చేసే పోరాటాలకు కార్మివర్గ పార్టీ గా సీపీఎం అండగా ఉంటుందని, ఈ పోరాటం ప్రజపొరట o గా మరకముందే ఎన్టీపీసీ యాజమాన్యం మొండిగా వ్యవ హరించకుండా   కార్మికసంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలోని పెండింగ్ అంశాలను వెంటనే అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి,నాయకులు గిట్ల లక్ష్మారెడ్డి, కదశి మల్లేష్, టీ.రవీందర్,M. సాంబయ్య, మమిడల శంకర్ , బి.నారాయణ,గోపాలరెడ్డి, E నర్సయ్య,దర్ని రాజయ్య,T. నారాయణరెడ్డి,మదనయ్య, పాల్గోన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ ;

ఈ నెల 31 నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఛీఫ్  విప్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ , మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా , నియోజకవర్గ యువతకు మట్టి వినాయకులను మాత్రమే పూజించి కాలుష్యంతో నిండుకుపోయిన పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాల వలన చెరువులు, కుంటలు నాశనం అవుతున్నాయన్నారు.

పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు. మట్టి వినాయకులనే పూజిద్దాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, నగర్ మేయర్ సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్,మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ,జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో  ఎస్పి  జె. సురేందర్ రెడ్డి   శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లో సిబ్బంది నేరాల సంఖ్యను  తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని నమోదైన కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపడుతూ కోర్ట్ డ్యూటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోర్టు ట్రయల్ కు ఎప్పటికప్పుడు హాజరవుతూ కన్విక్షన్ల శాతాన్ని పెంచాలన్నారు.  అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ఉండాలని, వారు తీసుకొచ్చే ఫిర్యాదులను చట్టప్రకారం తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అన్ని వర్టికల్ లలో  ప్రతిభ చూపిన 14  మంది పోలీసు అధికారులు, సిబ్బందికి   KPI   (కీ పర్ఫామెన్స్ ఇండికేటర్)  ప్రసంశ పత్రాలు అందజేశారు.

జిల్లా లో మహిళల మరియు పిల్లల పట్ల జరుగే నేరాల పట్ల త్వరగా స్పందించి, కేసు నమోదు చేసి నాణ్యతతో కూడిన దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లను, నియమిత కాలంలో  కోర్టుకు సమర్పించాలన్నారు. పాత కేసులలో కూడా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.

ఎస్సీ & ఎస్టీ లపై  జరుగే నేరాలలో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి నియమిత సమయంలో కోర్టులో ఛార్జిషీటు సమర్పించవలసిందిగా ఎస్పి సురేందర్ రెడ్డి  ఆదేశించారు.

పాత కేసులలో FSL రిపోర్టులు పెండింగ్ లేకుండా చూసుకొని త్వరగా రిపోర్టులను సేకరించి ఛార్జ్ షీట్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. ప్రాపర్టీ సంబంధిత కేసులలో ప్రత్యేక కార్యాచరణ తో కేసులను ఛేదించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, కాటారం, భూపాలపల్లి డిఎస్పీలు, బోనాల కిషన్, ఏ రాములు, డీఎస్పీ కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్ లు పెద్దన్నకుమార్, జానీ నరసింహులు, వాసుదేవరావు,  అజయ్ కుమార్, పులి వెంకట్, రంజిత్ రావు, కిరణ్, సతీష్ జిల్లా పరిధిలోని ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

వినాయక చవితి వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి అన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన చేసే నిర్వహకులు పోలీసులకు సహకరించాలని శుక్రవారం  ఎస్పి   పేర్కొన్నారు. గణేష్ వేడుకల్లో భాగంగా ఎక్కడా సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో పోలీసులతో పాటు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. 

గణేష్ మండపం, నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఎస్పి   కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలతో  సమన్వయం చేసుకోవాలని ఎస్పి  సూచించారు. 

 వినాయక చవితి ఉత్సవాలను సక్రమంగా నిర్వహించుటకు నిర్వాహకులు పోలీసు శాఖ  సూచించిన కింది సూచనలు పాటించాలని ఎస్పి  అన్నారు.

వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయాల్సిన నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత ఎస్సై మరియు సీఐ ద్వారా డీఎస్పీ గారి దగ్గర అనుమతులు తీసుకోవాలి.

డీఎస్పీ ఆఫీస్ నందు అనుమతులకు దరఖాస్తు పెట్టేముందు దరఖాస్తు తో పాటు పంచాయతీ లేదా మున్సిపాలిటీ,  ఫైర్ డిపార్ట్మెంట్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుమతులు జత చేయాలి.

 బలవంతపు చందాలు వసూలు  చేయరాదు. ప్రతి మండపానికి వారి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసును కోఆర్డినేటర్ గా (విపిఓ) నియమించడం జరుగును.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ,కృతిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఉపయోగించరాదని,  మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే ఉపయోగించవలెనని సూచన చేయడమైనది.

విగ్రహం యొక్క సైజు మరియు బరువు ఉత్సవం 

ఎన్ని రోజులు నిర్వహిస్తారు నిమజ్జనం తేదీ సమయం సంబంధిత పోలీసులకు ముందుగానే తెలియపరచాలి.

దీపారాధన సమయం నందు మరియు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైన (fire extinguisher ) అందుబాటులో ఉంచుకోవాలి.

 బాక్స్ టైపు స్పీకర్ను మాత్రమే వినియోగించవలెను 

డీజేలు వినియోగించరాదు. 

 రాత్రి సమయంలో కమిటీ సభ్యులు మండపం వద్ద కాపలాగా ఉండాలి నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ లు  ఏర్పాటు చేసుకోవాలి.

 మండపాలు ఉండే ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయరాదు. ఈ విషయం లో నిర్వాహకులు గమనించాలి.

 ఊరేగింపు సమయంలో ఆశ్లీల పాటలు, డాన్సులు చేసిన ఎడల మరియు మందు గుండు సామాన్లు వెలిగించిన ఎడల వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడును .

 నిమజ్జనం నిర్దేశించిన సమయంలో ఊరేగింపు ప్రారంభించి నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనం చేయవలెను.

 ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు పోలీసు శాఖ విజ్ఞప్తి చేయడం జరిగింది.    సోషల్ మీడియాలో వచ్చే  వదంతులను ప్రజలు నమ్మవద్దని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై పోలీసులకు తెలపాలని, అలాగే పోలీసులు విద్వేషం రగిలించే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పి సురేందర్ రెడ్డి  ఆదేశించారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 



 చౌటుప్పల్ పురపాలక పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బియ్య లింగస్వామి గత కొన్ని రోజుల క్రితం ఫైనాన్స్ కంపెనీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటి పెద్దను కోల్పోయిన ఆ

కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుం

టానని హామీ ఇచ్చారు. వేధింపులకు గురి చేసిన సదరు ఎక్వయిటస్ ఫైనాన్స్

కంపెనీ పై ప్రభుత్వం తగ్గిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 



చౌటుప్పల్ మున్సిపల్

పరిధిలోని తంగడపల్లిగ్రామంలో బీరప్ప బోనాలనుయాదవులు ఘనంగానిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగామున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డిరాజు హాజరయ్యారు. ఈసందర్భంగా వెంకట రాజుమాట్లాడుతూ యాదవులు బీరప్ప స్వామి వారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు ఆలె నాగరాజు, పోలోజు శ్రీధర్ బాబు, కొరగోని లింగస్వామి,బండమీది మల్లేష్, నాయకులు తాడూరు పరమేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 



 చౌటుప్పల్ మున్సిపల్

పరిధిలోని లింగారెడ్డిగూడెంలోని జిఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం

బిజెపి మండల, మున్సిపల్ ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

రాజగోపాల్ రెడ్డి ని పోలోజు అనిల్ చారి గజమాలతో, శాలువాతో ఘనంగా

సన్మానించారు అనంతరం పోలోజు అనిల్ కుమార్ చారి ఆధ్వర్యంలో తంగడపల్లి గ్రామానికి చెందిన సుమారు 100మంది యువకులు, వివిధ పార్టీనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బిజెపి పార్టీలో చేరారు. పార్టీలోచేరిన వారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాలను కప్పి

పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నగేష్ లింగస్వామి, బండిరాజు, భైరు సాయి, శ్రీకాంత్, శ్యామల అనిల్, చంటి, గట్టు గణేష్, కొలుకులపల్లి బుచ్చయ్య, చింతల రాజు తదితరులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 



 చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల పాలకూర్లశివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో, చౌటుప్పల్కు చెందిన 30మంది గర్భిణీ స్త్రీలకు గురువారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిహెచ్

చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యురాలు సుభాషిని లు హాజరై, మాట్లాడుతూ రక్తహీనత రాకుండా గర్భిణీలుతగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణిలు ప్రభుత్వ ఆసుపత్రి లో సాధారణ ప్రసవాల

కోసం ఇప్పటి నుండి తగిన ఆహార జాగ్రతలు తీసుకోవాలన్నారు. మాతా శిశువుల మరణాలు తగ్గించాలని అంగన్ వాడీ సెంటర్లు ఆరోగ్య లక్ష్మికీ హాజరై అనుబంధ ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతిగర్భిణి 4కిలోల శిశువు ప్రసవించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సూపర్వైజర్ శోభ, సీనియర్వైద్యుడు చలపతి రెడ్డి, ఫౌండేషన్ నిర్వహుకురాలు పాలకూర్ల భాను,అంగన్వాడి టీచర్లు, సఫియ,

సుజాత, నజీమున్నీసా, చంద్రకళ, జ్యోతి, నిర్మల, ఫౌండేషన్ సభ్యులు సోని, గౌతమి పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్టీపీసీ లో నిరసన చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పై సిఐఎస్ఎఫ్ సిబ్బంది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ తెలిపారుఎన్టిపిసి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దాడిలో గాయపడిన కార్మికులు వెంకట స్వామి, పెద్దులు, మేకల లింగయ్య, దుర్గయ్య, కంది నాగరాజు లను పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, 2018 లో కాంట్రాక్టు కార్మికులతో ఎన్టీపీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీపీసీ  ప్లాంట్ గేట్ నెంబర్ 2 వద్ద జరిగిన నిరసన లో కాంట్రాక్టు కార్మికులపై, కార్మిక సంఘాల నాయకులపై అకారణంగా సిఐఎస్ఎఫ్ సిబ్బందిచే ఎన్టీపీసీ యాజమాన్యం లాఠీ చార్జి చేయించి, విచక్షణా రహితంగా రక్తాలు కారేవిధంగా దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

లాఠీ చార్జి లో గాయపడ్డ జేఏసీ కార్మిక సంఘాల నాయకులకు, కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, మరియు వారికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, లాఠీ చార్జి కి పాల్పడ్డ సిఐఎస్ఎఫ్ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు చేసే పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర కమిటి తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

 ఈ కార్యక్రమం లో  యూనియన్ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఏం రామాచారి, కే పురుషోత్తం, దండ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 





రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పరిష్కారం అయ్యే వరకు  పోరాడుదామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్టీపీసి లెబర్ గెట్ నుండి FCI క్రాస్ రోడ్దు వరకు జేఏసీ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడారు. 

రాజకీయ జెండాలకు పక్కనపెట్టి ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాడుదామన్నారు. గతంలో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తూ కార్మికులపై యాజమాన్యం విచక్షణ రహితంగా సిఐఎస్ఎఫ్ సిబ్బందితో లాఠీ ఛార్జి చేయడంతో వందల సంఖ్యలో కార్మికులకు గాయాల పాలయ్యారు. ఎన్ టి పి సి యాజమాన్యం త్వరగతినా  సమస్య పరిష్కరించకుంటే శుక్రవారం నుండి కార్మికులు కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యం దిగచ్చేవరకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కార్మికుల సమస్య పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకతీతంగా జెండాలను పక్కనపెట్టి అందరం కలిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏకధాటిగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అన్నమయ్యకు నీరాజాలాపన అభినంద సభలో కోవిద  సహృదయ ఫౌండేషన్ వారు నిర్వహించిన అభినందన సభలో తెలంగాణ జానపద వృత్తి కళా సంఘం రామగుండం భజన ఇంచార్జ్ డి సత్యం ను గణపురం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేతుల మీదుగా డాక్టర్ శ్రీ అనూహ్య రెడ్డి శాలువాతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ రామగుండంలో భజన కళాబృందానికి సత్యం ఇన్చార్జిగా ఉండడం ఎన్నో భజన కార్యక్రమాలు చేస్తూ ప్రతి దేవాలయంలో ఎక్కడ భజన ఉన్నా అక్కడ ప్రత్యక్షమై తన గానం ద్వారా భక్తులను పరవశింపజేసే సత్యమును సత్కరించడం నిజంగా రామగుండం ప్రాంత ప్రజల అదృష్టమని సత్యంలాగే అందరూ వారి పాటల ద్వారా సంతోషింప చేయాలని కోరుతున్నామని డాక్టర్ శ్రీ అనూహ్య రెడ్డి అన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనపై CISF సిబ్బంది అమానుషంగా లాఠీ చార్జీ జరిపి తలలు పగల గొట్టి కాళ్లు చేతులు విరగ గొట్టిన పాశవిక దాడిని ఖండిస్తూ కార్మికులకు JAC  ఆధ్వర్యంలో  రాజీవ్ రహదారిపై రాస్తారోకో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ  రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ *ఎం.ఎస్ రాజ్ ఠాకూర్*మాట్లాడుతూ.. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ తెలంగాణ వాదులపై తెలంగాణ కార్మికులపై సిఐఎస్ఎఫ్ బలగాలచే దాడి చేయించి పాశవిక ఆనందం పొందుతుందని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందాని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

 ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందించడమే కేసిఆర్, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.

ఖిలా వరంగల్ 37వ డివిజన్ దళితబంధు ద్వారా మంజూరైన యూనిట్లతో  లబ్దిదారుడు నలిగంటి నవీన్ ఏర్పాటు చేసుకున్న పింకి ఈవేంట్స్ (డిజే మరియు లైటింగ్ , సౌండ్స్ )ను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, కేసిఆర్  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. ప్రతి దళిత కుంటుంబానికి అందించేవరకు పథకం కొనసాగుతుందని అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి దళిత కుటుంబం ఆర్థికం ఏదగాలని అన్నారు..

ఈ సందర్బంగా డా.బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి మరియు అమరవీరుల స్థూపానికి ఎమ్యేల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్దానిక కార్పోరేటర్ బోగి సువర్ణ-సురేష్ ,34వ డివిజన్ కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి, 38వ డివిజన్ కార్పోరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ , స్దానిక తెరాస నాయకులు ఎల్లయ్య, ఉల్పత్ ,రాజారాం,శ్రీను,ప్రతాప్ , రాజేష్ ,అరుణ్ ,అజయ్ , అకిల్ ,సుధాకర్ ,తదితరులు పాల్గోన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

సామాజిక వ్యవస్థలో సాంప్రదాయక జీవన విధానం ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో కీలకంగా దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం కార్యక్రమం యూనివర్సిటీ ఆడి టోరియం లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  న్యూఢిల్లీలోని సైన్స్, ఇంజనీరింగ్ పరిశోధన బోర్డు విభాగం కార్యదర్శి ఆచార్య సందీప్ వర్మ అధ్యక్షత  వహించగా , కాకతీయ విశ్వవిద్యాలయ ఉప కులపతి తాటికొండ  రమేష్ , పాలక మండలి సభ్యులు, పాల్గొన్నారు.

ఈ  సందర్బంగా గవర్నర్ సౌందర్  రాజన్ మాట్లాడుతూ సంప్రదాయక జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనకు ఎంతగానో దోహదపడతాయని ఆమె అన్నారు, ఆరోగ్య పరిరక్షణ విషయంలో అందరూ జాగరూకతతో వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతరం మారుతుందని ముఖ్యంగా ఆహారపు విషయాలలో సాంప్రదాయక ఆహారాన్ని తీసుకోకుండా, ఫాస్ట్ ఫుడ్ ఆహారాన్ని తీసుకోవడం చాలా వరకు విఘాతం కలుగుతుందని కాబట్టి ఆరోగ్య పరిరక్షణ విషయంలో యువత కీలకంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఆరోగ్యం ముఖ్యమని, కాబట్టి యువత ఎప్పుడు సంతోషంగా ఉండాలని జీవన విధానంలో సాంప్రదాయక విధానం అనుసరించాలని ఆమె సూచించారు. Covid 19 నివారణలో భారత దేశంలో ఉత్పత్తి చేసిన టీకామందు ప్రపంచానికి ఎంతగానో ఉపయోగపడిందని భారతదేశంలో  టీకా తయారుచేసే పరిజ్ఞానం, భారతీయ శాస్త్రవేత్తలకు ఉందన్నారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానం ఎంతో పురోభివృద్ధి సాధించిందని ఆధునిక సాంకేతిక ను ఉపయోగించుకొని దేశం మరింత ముందుకు పోవాలని ఇందుకు యువత దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని గవర్నర్ అన్నారు. కాకతీయ సామ్రాజ్యం పాలనలో మహిళల పాత్ర గణనీయమైన ని రుద్రమదేవి ని ఆదర్శంగా తీసుకుని మహిళలు సాధికారిక సాధించడానికి ముందుకుపోవాలని ఆమె అన్నారు. విద్యార్థులు నేడు డిగ్రీలు తీసుకుంటున్నారు అంటే వారి వెనుక తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైందని వారు కష్టపడి మిమ్ములను చదివిస్తున్నారు అని వారి కష్టాలను వృధా చేయకుండా నిబద్ధతతో అభివృద్ధి సాధించాలని ఆమె అన్నారు. తరగతి గదిలో విద్యార్థి ఎంతో నేర్చుకుంటానని ఇందుకు ఇటీవల 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారతదేశంలో నూతన విద్యా వ్యవస్థ రానున్న రోజుల్లో ఎంతగానో అభివృద్ధి కి మార్గదర్శకాలు గా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసే దిశగా తన వంతు పాత్ర పోషిస్తానని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తో ఏర్పాటుచేసిన సమావేశంలో కూడా, విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన రంగాన్ని మరింత పటిష్ట పరచుటకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. నూతన విద్యా విధానం సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగ పడుతుందని  గవర్నర్ పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఆచార్య సందీప్ వర్మ మాట్లాడుతూ భారతదేశం నాగరికత ప్రపంచ నాగరికత అన్నింటిలో చాలా పురాతనమైన ని భారతీయ విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా నాగరిక జీవనానికి దోహదపడిందని ముఖ్యంగా తక్షశిల, నలంద గొప్ప విద్యా కేంద్రాలను ఆయన అన్నారు.ప్రాచీన జీవనవిధానంలో సైన్స్, టెక్నాలజీ, ఆర్థిక సామాజిక విషయాలను తెలియజేసే గొప్ప విద్యా వ్యవస్థ ఉండేదని ఆయన అన్నారు. ప్రస్తుత జీవన విధానం దినదిన అభివృద్ధి సాధిస్తుందని ఇందులో విద్య ఎంతో కీలక భూమికను పోషిస్తున్న ని జాతీయ నూతన విద్యా విధానం 2020 భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లో ఎంతో పురోభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని ఆయన అన్నారు. ఒకేషనల్ స్కిల్స్ తో కూడిన, మానవీయ శాస్త్రాలు, సంస్కృతి జీవన వ్యవస్థ పై ప్రభావాన్ని చూపుతాయని ఆయన అన్నారు. భారతదేశం కోవిడ్ 19 ఎదుర్కోవడంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించిందని ఆయన అన్నారు. కరోనా సమయంలో భారతదేశం ప్రజలు అనుసరించినా నిబద్ధత విధానమే ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశ ప్రధానమంత్రి సూచిస్తున్న విధంగా అభివృద్ధి పరుస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని అన్నారు. భారతదేశంలో ఫార్మసీ రంగం ఎంతగానో అభివృద్ధి దిశలో పయనిస్తుందని, ఇందులో ముఖ్యంగా కరోనా వైరస్ నివారణకు ఉత్పత్తి చేసిన వ్యాక్సినేషన్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే భారతదేశంలో తయారు చేశామని, ఇది దేశ గొప్పతనం ఆయన అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని దేశం మరింత ముందుకు పోయే అవకాశం ఉందని ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా పురోభివృద్ధి సాధిస్తుందని ఇది భారతీయులందరు కలిసికట్టుగా ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న, అభివృద్ధి, బోధన పరిశోధన, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీల ఛాన్స్ లర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ చేతులమీదుగా ఆర్ట్స్, సోషల్ సైన్స్ , కామర్స్, సైన్స్, ఫార్మసీ, విద్యా విభాగం, ఇంజనీరింగ్ విభాగాలలో  52 పి హెచ్ డి డిగ్రీలు, 192 బంగారు పథకాలు  అందజేశారు విద్యార్థులకు అందజేశారు.


ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు డాక్టర్. చంద్రమౌళి, రచన రాజిరెడ్డి, డాక్టర్ నాగేంద్ర బాబు, డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ సీతారాం ఆచార్య మనోహర్, డాక్టర్ సుమతి రెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం, రిజిస్టర్ ఆచార్య వెంకట్ రామ్ రెడ్డి, పరీక్షల విభాగం అధికారి ఆచార్య మల్లారెడ్డి వివిధ విభాగాలకు చెందిన డీన్ లు అధ్యాపకులు, విద్యార్థులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


పోలీసులు భారీ బందోబస్తు


తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయము ఛాన్స్లర్ డాక్టర్ తమిళ సౌందర్ రాజన్ గురువారం కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ రాక సందర్భంగా స్నాతకోత్సవ సభాస్థలి లో డాగ్స్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.  స్నాతకోత్సవం ముగిసిన తర్వాత, గవర్నర్ విశ్రాంతి గృహానికి చేరుకుని, భోజనం అనంతరం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. పోలీసు బందోబస్తుకు హనుమకొండ ఎసిపి, కేయూ సిఐలు ఎస్ ఐ లు పోలీసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయానికి

 11 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 22వ స్నాతకోత్సవం లో గవర్నర్ పాల్గొని పట్టాలు అందజేయడం వల్ల డిగ్రీ పొందిన, బంగారు పతకాలు పొందిన విద్యార్థులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్





జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: కాళేశ్వరంలో మృతుల కుటుంబాలకు,వరద ముంపుకు గురైన చిరు వ్యాపారులకు,ఈరోజు బిజెపి రాష్ట్ర నాయకులు,మంథని నియోజకవర్గం ఇన్చార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి  ఆదేశానుసారం,స్థానిక బిజెపి నాయకుల ఆధ్వర్యంలో, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గగ్గురి బాపు, బెల్లంపల్లి శ్రీనివాస్ వారి కుటుంబాలకు 25 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులను అందజేశారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ముంపుకు నష్టపోయిన నదీతీర ప్రాంత చిరు వ్యాపారస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు 

గోర దేవయ్య,మండల ప్రధాన కార్యదర్శి బొల్లం కిషన్,బీజేవైఎం జిల్లా కార్యదర్శి గోర శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడు రేవెల్లి రాకేష్,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లేతకరి చరణ్ దాస్,సతీష్,జావిద్,జక్కులు తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనపై CISF సిబ్బంది అమానుషంగా లాఠీ చార్జీ జరిపి తలలు పగల గొట్టి కాళ్లు చేతులు విరగ గొట్టిన పాశవిక దాడిని ఖండిస్తూ కార్మికులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కార్పోరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్  ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటర్లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ  రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ.. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ బీహారీ పాలసీని అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ వాదులపై తెలంగాణ కార్మికులపై సిఐఎస్ఎఫ్ బలగాలచే దాడి చేయించి పాశవిక ఆనందం పొందుతుందని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందాని తెలిపారు.  రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచి పోవడంతో రాజ్ ఠాకూర్ తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్టిపిసి లేబర్ గేట్ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై సిఐఎస్ఎఫ్ పోలీస్ వారు లాఠీచార్జి చేయడం అమానుషం అని 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సమయంలొ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు" గత 2018 లొ జరిగిన కార్మిక ఒప్పందాలను అమలు చేయాలని , తమ హక్కుల కోసం గత కొంత కాలంగా శాంతియుతంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తుంటె నిమ్మకు నిరెత్తకుండా ఎన్టిపిసి యాజమాన్యం వ్యవహరిస్తున్నారు. ఈ రోజు విచాక్షణ రహితంగా కార్మికులపై లాఠీఛార్జీ చేయడం అత్యంత దారుణమని, ఈ చర్యకు పాల్పడిన సిఐఎస్ఎఫ్ పోలీసులను సస్పండ్ చేయాలని, ముఖ్యంగా ఈ చర్యలను ప్రోత్సహించిన ఎన్టిపిసి హెచ్ ఆర్ అధికారులను వెంటనే తొలగించాలని, ఎన్టిపిసి ఎన్ని జిమ్మిక్కులు చేసిన రాజకీయాలకు అతీతంగా మేమంతా ఒక్కటె, మా కార్మికులమంతా ఎకమై ఉంటాం, మరింత ఉద్యమం తీవ్రతరం చేస్తాం, మా హక్కుల సాధిస్తాం, మీ మెడలు వంచుతాం, స్థానిక రామగుండం పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా ఈ కార్మిక పోరాటానికి మద్దతుగా ఉంటాం, పోరాటం చేస్తామని, హక్కులు సాదించే వరకు తగ్గెదిలేదని, ఎన్టిపిసి హెచ్ఆర్ అధికారుల్లారా ఖబర్దార్, కార్మికుల జోలికి వస్తే ఖతమైపోతారని జాగ్రత్తని, కార్మికుల పై లాఠీచార్జి కి నిరసనగా మూడు రోజులు నల్లబ్యాడ్జి తొ నిరసన తెలుపుతానని" అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం 20 వ డివిజన్ భరత్ నగర్ లొ పేదమ్మాయి ధరవత్ సమ్మక్క వివాహానికి స్థానిక 20 వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ రూ . 5000 / -ల ఆర్థిక సహాయంను అందచేశారు. ధరవత్ సమ్మక్కకు తండ్రి ధరవత్ వీరు గత రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. తల్లి ధరవత్ అమ్మి మనస్థిమితం లేక ఎటొ వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ "మా తల్లిగారైన స్వర్గీయ కన్నూరి సౌందర్యమ్మ సమాజంలో మంచి చేయడానికి ఎంత చేయగలిగితే , అంత ఎన్ని సార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు మంచి చేయాలని , మానవత్వం ను చాటాలని అన్నారని, అందుకని మా తల్లి స్మారకార్థం ఇలాంటి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని" అన్నారు . ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షహేదాభాను, కోశాధికారి బి.రజని లు సమ్మక్కకి చీర జాకెట్ గాజులు అందచేశారు. ఈ కార్యక్రమంలొ బి.బుగ్గరాములు గౌడ్, డివిజన్ టి.ఆర్.ఎస్ అధ్యక్షులు షెక్.బాబుమియా, టి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు దండుగుల.శ్రీను, కనుకుంట్ల.రాకేష్, కొమ్మరాజుల.శీను, కొమ్ము.చందు, గండా.రాజు , బి.రజిత  తదితరులు పాల్గొన్నారు .

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

          


 లాఠీచార్జికి కారణమైన సి.ఐ.ఎస్.ఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేసి విదులనుండి సస్పెండ్ చేయాలి,NTPC లో కాంట్రాక్టు కార్మికులకు 2018 సంవత్సరంలో చేసిన అగ్రిమెంట్ ను అమలు చేయాలని ఈరోజు జే.ఏ.సి. ఆధ్వర్యంలో నెంబర్-2 గేటు వద్ద సామరస్యంగా నిరసన తెలుపుతున్న క్రమంలో సి.ఐ.ఎస్.ఎఫ్. వారు ఎలాంటి హెచ్చరిక లేకుండా, విచక్షణా రహితంగా పశువులను బాదినట్లుగా లాఠీ ఛార్జి చేసారు. ఇది చాలా హేయమైన చర్య, ఈసంఘటనను తీవ్రంగా ఖండిస్తునం. వందలాదిమంది కాంట్రాక్టు కార్మికులపై లాఠీచార్జి కి ఉసిగొల్పిన ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించి. కార్మికులపట్ల వారి విధానాలు మార్చుకోవాలని. మహిళా కార్మికులని చూడకుండా ఎక్కడపడితే అక్కడ చితకబాదడం సిగ్గుచేటని . అనేకమంది కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలకు ఈ దాడిలో తలలు పగిలి,చేతులు విరిగాయని. పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సి.ఐ.ఎస్.ఎఫ్. వారు వినిపించుకోకుండా కార్మికులను వేటాడి,వేటాడి లాఠీలు విరిగేల కొట్టడడం దుర్మార్గమైన చర్య, NTPC వేజ్ బోర్డ్ చైర్మన్ ఆవుల | గోవర్ధన్ యాదవ్ వచ్చి  కార్మికులు చేస్తున్న పోరాటం  తెగువని చూసి అయన యాజమాన్యం దిగివచ్చి వారి సమస్యలను  డిమాండ్లను నెరవేర్చే దిశగా ఆలోచించాలని ఇలాంటి కవింపులు చేస్తే కార్మికులను నిరోధించాలని చూస్తే కార్మికులు తిరగబడితే యాజమాన్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది సంస్థకు వచ్చే లాభాలు దెబ్బతింటాయి కావున న్యాయపరమైనటువంటి కార్మికుల డిమాండ్ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, కార్మిక సంఘలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కార్మికులకు న్యాయపరమైనటువంటి డిమాండ్ లను నెరవేర్చ వరకు పోరాటం చేస్తూ వారికి  మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నానం.       

*ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి*పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్                             ‌                             ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్  

*ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి

*జిల్లా ప్రధాన కార్యదర్శి జూల రాజేష్   

*ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి

*పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కుక్క గంగా ప్రసాద్                                                                             

*ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు జారుపూల శ్రీనివాస్                ‌‌                                            ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి రామగుండం నియోజకవర్గం నాయకులు కిరణ్

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 

పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు* 

బండారి ఓం ప్రకాష్*

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్టిపిసి కాంటాక్ట్ కార్మికులపై మరియు బిజెపి నాయకుడు కార్మిక నేత కౌశిక హరి పై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ  అంతర్గాం మండలం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ సంఘటనను ఖండిస్తున్నాం. బిజెపి సీనియర్ నాయకులు గాలింనికి ప్రసాద్, నిమ్మరాజుల రవి మాట్లాడుతూ కార్మికులపై కార్మిక నాయకులపై ఎన్టిపిసి యాజమాన్యం మరియు సిఐఎస్ఎఫ్ దళాల దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్పటివరకు ఎన్టిపిసి చరిత్రలో ఇలాంటి చర్యలు ఏనాడు జరగలేదని ఇది కార్మికుల ఐక్యత ను చెడగొట్టే కుట్ర అని కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన నిరంకుస ఆలోచన అని దీనికి పాల్పడ్డ సిఐఎస్ఎఫ్ పోలీసులపై ఎన్టిపిసి హెచ్ఆర్ విజయలక్ష్మి పై హత్యయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల శాఖ నిమ్మ రాజుల రవి ఆలకుంట పరశురాం మాదా శంకర్ గౌడ్ ఉప్పులేటి  ప్రవీణ్ మగ్గిడి రాజు గోపు శంకర్ పులి శ్రీనివాస్ కన్నం మోహన్ తోటపల్లి శ్రీకాంత్  గాలంకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనపై CISF సిబ్బంది అమానుషంగా లాఠీ చార్జీ జరిపి తలలు పగల గొట్టి కాళ్లు చేతులు విరగ గొట్టిన పాశవిక దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ .. గాయాల పాలైన కార్మికులను ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ లాఠీఛార్జ్ లో తీవ్ర గాయం కావడం జరిగిందని కార్మికులకు, అనేకమంది కార్మిక నేతలకు తీవ్ర గాయాలు అయ్యాయని వారు పేర్కొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ బీహారీ పాలసీని అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ వాదులపై తెలంగాణ కార్మికులపై సిఐఎస్ఎఫ్ బలగాలచే దాడి చేయించి పాశవిక ఆనందం పొందుతుందని వెంటనే దాడి చేసిన CISF అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు..