Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

గోదావరిఖనిరూరల్,19,మార్చి(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ)రామగుండం 22వ డివిజన్ ఎఫ్ సీఐ ఎలక్కలపల్లి గేట్ లో కాంపల్లి లక్ష్మీప్రసన్న రఘు కొత్తసంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సర సందర్భంగా ఒంటరి మహిళ చంద్రకళకు 25కిలోల బియ్యం1000రూపాయలు ఆర్థికసాయం గురువారం కేఆర్ టీం ఆధ్వర్యంలో అందజేశారు..22వ డివిజన్ ప్రజలు,హిందూ బంధువులందరు.ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి స్వీకరించారు,ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సందీప్,ప్రవీణ్,సురేష్,నవీన్,అరుణ్ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెల 15 తేదీ ఆదివారం కావడంతో, ఒంటిపూట బడులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇదిలా ఉండగా బోర్డ్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలలకు సూచించారు. విద్యార్థులపై ఎండల ప్రభావం తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాటారం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. ఆమెతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డి పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో జరుగుతున్న శుభ్రత పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రజా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో రోజువారీ నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు క్రమబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని క్రిమేటోరియంను సందర్శించి నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పంత కానీ సడువలి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జిల్లాలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ (MRI) యంత్రానికి అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతి నిర్వహణపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ మండల శాఖ ఖండించింది. బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్, మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. గత నెల ఫిబ్రవరి 19న కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని, అయితే అనంతరం పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం బాధాకరమని తెలిపారు. కాటారం‌లో హిందువులు శివాజీ జయంతి జరుపుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఇదే మండల కేంద్రంలో జయంతి, వర్ధంతి పేరుతో ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కేసులు ఎందుకు పెట్టరని ఆయన నిలదీశారు. హిందువులు ఐక్యంగా ఉంటే హిందూ వ్యతిరేకుల ఆగడాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ తరఫున త్వరలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.మార్చి.1,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)44 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన మావో మల్లోజుల పెద్దపెళ్లికి కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపు..మావోయిస్టు పార్టీ మాజీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారతో కలిసి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం వచ్చారు.సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి అలింగణం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1980 వ దశలో అన్న కిషన్ జితో కలిసి ఉద్యమ బాటపట్టి 44 ఏళ్ల పాటు సాయిధ పోరాట జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే..అయితే అప్పటినుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది.మల్లోజుల సోదరుడు అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యారు.ఆయనను కలవడానికి వచ్చిన మల్లోజులను.పెద్ద సంఖ్యలో బంధువులు.స్నేహితులు తరలివచ్చారు కొంతసేపు కుటుంబ సభ్యులు.స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరితో కలిసి ఫోటోలు దిగారు.మల్లోజుల పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేకంగా నిఘ ఉంచింది.అయితే మల్లోజుల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.మల్లోజుల రాక పెద్దపల్లిలో చర్చనీయంగా మారింది...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం పట్టణంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ, నేరాల నియంత్రణలో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా మారి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఎస్ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలోని బయ్యారం గ్రామపంచాయతీ ప్రాంతంలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాలువ నిర్మాణానికి సంబంధించి అధికారులు చేపట్టిన సర్వే కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన అధికారులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూములే కుటుంబాల జీవనాధారమని పేర్కొన్నారు. ఆ భూముల మీదుగా కాలువ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ జీవనోపాధి సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న సారవంతమైన భూములను కోల్పోతే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కాలువ నిర్మాణానికి ముందు రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా సర్వేలు నిర్వహించడం సరికాదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. భూముల స్వాధీనం, పరిహారం చెల్లింపు, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలకు తగిన పరిష్కారం చూపే వరకు సర్వే పనులు కొనసాగించనివ్వమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సమస్యపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 53 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ స్పీకర్ శ్రీపాద రావు స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు అండగా నిలుస్తూ ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న శ్రీను బాబు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. యువతకు మార్గదర్శిగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న శ్రీను బాబు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎంపీడీవో అడ్డూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామాభివృద్ధి పనుల అమలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో పారదర్శక పాలనకు, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ నిర్వహణకు వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, ప్రజలతో సమన్వయం పెంచుకొని సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని అన్నారు. శిక్షణలో శ్రీనివాస్, డి.రాజశేఖర్, బి.దేవేందర్ రెడ్డి, కె.మహేష్ శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై మార్గదర్శనం చేశారు. గుండ్రాత్లి, దామరకుంట, ఎలసాగర్, రంగారం, రేగులగూడెం, శంకరంపల్లి గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్రాజెక్టుపై టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం, నిర్వహణ పనితీరును సమగ్రంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంపొందించడం ద్వారా విద్యుత్ సమస్యలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తనిఖీ సమయంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై వివరాలు వెల్లడించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం కొత్తపల్లి సుందరాజ్‌పేట్ గ్రామంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిధిలో కాలువలు నిర్మించవద్దని కోరుతూ ఇరిగేషన్ డీఈకు వినతిపత్రం సమర్పించారు. కాలువల నిర్మాణం వల్ల సాగుభూములు నష్టపోయే ప్రమాదం ఉందని, పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. భూములు కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములను రక్షిస్తూ కాలువ మార్గాన్ని మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వేసవికాలంలో తలెత్తే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమ్మర్ వాటర్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. గ్రామ పరిధిలోని దంతాలపల్లి, శ్రీనివాస కాలనీ, బొప్పారం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు పరిశీలించారు. మిషన్ భగీరథ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో కలిసి గ్రామంలోని వాటర్ ట్యాంకులను తనిఖీ చేసి, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించారు. వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దంతాలపల్లి, బొప్పారం ప్రాంతాల్లో కొత్త బోర్లు మంజూరు చేయాలని గ్రామ ప్రతినిధులు కోరగా, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొర్రల్ల రాజయ్య, అసిస్టెంట్ సంపత్, లైన్మెన్ వెంకటేశ్వర్లు, బాల్నే ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేసవికాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఫిబ్రవరి,5(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)బోరు మారింది...దాహం తీరింది..ముస్త్యాల గ్రామం మురిసింది..ప్రజాప్రతినిధుల చొరవపై ప్రశంసల వెల్లువ..ఆ ఊళ్లో బోరు చెడిపోయి...తాగునీటి కోసం గోస పడుతున్న జనం బాధ తీరింది.బాధ్యత గల ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో గ్రామం మురిసింది. బోరు పని చేయడంతో ఇండ్లలో వాడకం నీటి సమస్య.దాహం తీరింది.పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం ముస్త్యాల గ్రామ సర్పంచి సుంకరి మహేశ్,ఉపసర్పంచి బాసినేని వినోద-సత్యనారాయణరావుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిసింది.వివరాలు ఈ విధంగాఉన్నాయి...ముస్త్యాల గ్రామ పంచాయతీలోని రెండవ వార్డులో బెల్లంకొండ వారి ఇంటి ముందు ఉన్న నీటి బోరు మోటార్ స్టార్టర్ కాలిపోయి ఆ వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.ఇటీవల గ్రామస్థుల సహకారంతో మెజారిటీ విజయం సాధించిన సర్పంచ్,ఉపసర్పంచ్ ల దృష్టికి ఈ సమస్య వెళ్లింది.రెండవ వార్డులో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు.ఆగమేఘాల మీద బుధవారం పాత మోటార్ ను తొలగించి అదే రోజు రాత్రి మోటార్ స్టార్టర్ తీసుకవచ్చి బిగించి పునరుద్ధరించారు.దీనితో బోరు పనిచేయడం ప్రారంభమైంది.తాగునీటి సమస్యను పరిష్కరించి గ్రామస్థుల దాహం తీర్చిన సర్పంచ్,ఉపసర్పంచ్ ల పనితీరు పట్ల సర్వత్రా హర్షంవ్యక్తమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడరు.తమను నమ్ముకొని ఓటు వేసిన ప్రజలకు వెన్నంటి ఉంటామనీ,గ్రామంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తాము ముందు నిలబడుతామనీ,ఏలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.ఇది తమ కర్తవ్యమనీ,గ్రామస్థుల సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త వేగంగా వైరల్ అయింది. ఈ వార్త కారణంగా భక్తులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని పోలీసులు స్పష్టంచేశారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మామిడితోట ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం జంపన్నవాగు సమీపంలో ఓ షాపులో దాక్కున్న వారిని పోలీసులు పట్టుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపిన అనంతరం, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని కూడా అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ములుగు జిల్లా పోలీసు అధికారులు, మేడారం జాతర ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని వివరించారు. జాతర ప్రాంగణం అంతటా భారీగా పోలీస్ బలగాలు, మహిళా పోలీసులు, ప్రత్యేక నిఘా బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. జాతర జరుగుతున్న కాలంలో ప్రతి ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసుల ప్రకారం, సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడమే కాకుండా, శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతాయి. అందుకే, ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. జాతర శాంతియుతంగా, సురక్షితంగా కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతం మంగళవారం ఉదయం ఒక్కసారిగా భయాందోళనలకు కేంద్రంగా మారింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఫర్నీచర్ షాపులో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపులో ఉన్న సోఫాలు, చెక్క ఫర్నీచర్, వార్నిష్ సామగ్రి కారణంగా మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించి, భారీగా ఎగసిపడ్డాయి. మంటలతో పాటు దట్టమైన నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. షాపు పక్కనే ఉన్న వాణిజ్య సముదాయాలు, నివాస భవనాల్లో ఉన్నవారు ప్రాణభయంతో ఖాళీ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నారని సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. భవనం లోపలికి వెళ్లి నీటి జెట్లు, ఫోమ్ స్ప్రేలు ఉపయోగిస్తూ మంటల వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నించారు. ఒకవైపు మంటలను ఆర్పుతూ, మరోవైపు లోపల చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్, పోలీస్, రెస్క్యూ బృందాలకు తగిన సూచనలు ఇస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత భవనానికి జరిగిన నష్టం, ప్రాణనష్టం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంతో నాంపల్లి ప్రాంతం మొత్తం కొంతసేపు ఉలిక్కిపడింది. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల వినోద్‌ (30) అనే యువకుడు పొలంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, వినోద్ తన పొలంలో ట్రాక్టరుతో రూట్ వెయిటర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద నలిగిపోయిన వినోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామ నూతన సర్పంచ్ లావణ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వినోద్ మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబంలో ఆయన ఏకైక ఆధారమని తెలిసింది. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చిన్నంబావి మండలంలోని వెలగొండ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌గా ఎన్నికైన రాచాల రజిత వినోద్ గౌడ్‌ను జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం జై గౌడ్ ఉద్యమం కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు సూరగౌని వెంకస్వామి గౌడ్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై గౌడ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షుడు తమటం వెంకటస్వామి గౌడ్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ శశికళ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల లచ్చ గౌడ్, సోమ భాస్కర్ గౌడ్ హాజరయ్యారు. అలాగే జై గౌడ్ ఉద్యమ నేతలు గుర్రం వరలక్ష్మి, వెంకటస్వామి గౌడ్, గుండ్రాతి సత్యం గౌడ్‌తో పాటు వెలగొండ గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య గౌడ్, కార్యదర్శి పరమేశ్వర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గోవింద్ గౌడ్, మోహన్ గౌడ్, బాబు గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, రాచాల రజిత వినోద్ గౌడ్ ప్రజల విశ్వాసంతో ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ఆమె అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.