వరంగల్: నగర పరిధిలోని గొర్రెకుంట 15వ డివిజన్ బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు (45) ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొగిలిచర్ల గ్రామ శివారులోని చెరువు వద్ద రాజు మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజు మృతి వెనుక కారణాలపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులు రాజు ఇటీవల కొన్ని వ్యక్తులతో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ కోణం కూడా పరిశీలనలోకి తీసుకున్న పోలీసులు, రాజు మొబైల్ ఫోన్ డేటా, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. “మరణం వెనుక ఉన్న అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు కొనసాగుతుంది,” అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గొర్రెకుంట, మొగిలిచర్ల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజు మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, న్యాయమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు."రాజు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. ఆయన మృతి మాకు తీవ్ర లోటు," అని బీఆర్ఎస్ స్థానిక నాయకులు పేర్కొన్నారు.
(ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 22 సెప్టెంబర్2025 న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మృతిచెందిన) మృతదేహం కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుండి ఈ రోజు 18 అక్టోబర్2025,శనివారం, ఉదయం 6-30,గంటలకు తీగలకుంటపల్లి గ్రామంలోకి ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామిక వాదులు నివాళులు అర్పించి ఊరేగింపుగా ఇంట్లో కి తీసుకువచ్చారు.నివాళుల తర్వాత మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమై గ్రామపురి వీధులనుండి స్మశానం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది శ్రీదేవి అమరుడు ఖాతా రామచంద్రరెడ్డి@వికల్ప్ చివరి చూపు కోసం పౌర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు గ్రామస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నాటి తోటి స్నేహితులు అభ్యుదయ విప్లవ రచయిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాంపూర్ లోని వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, మడికొండ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఈ రెండు విద్యాసంస్థల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డివో రాథోడ్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ: సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం లను భద్రపరిచే గోదాం భవన నిర్మాణ తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్, రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. గత ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధానం, నమోదైన కేసులపై పరిశీలన చేయాలని అధికారులకు, ఏసీపిలకు కమిషనర్ సూచించారు. రూట్ లు, జోన్ల వారిగా మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టు లను, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించిన అంశాలలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రూట్ మ్యాపులను ఎంపీడీవో లు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్ పోస్ట్, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు నియమించు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల, రూట్ ల ఏర్పాటు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.
మండల స్థాయిలో సజావుగా ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు .సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలుడల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తులు కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు తదుపరి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిషా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, మారిన అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా డౌట్స్ వస్తే చాలా సమస్యలు వస్తాయని, ముందు నుండే సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి పొరపాటుకు నిర్వహించొచ్చని వివరించారు. ఎన్నికలు ట్రాన్స్ఫరెన్సీ, సక్సెస్ ఫుల్ గా జరగాలని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సహకార అధికారి వాలియా నాయక్, ఆడిట్ అధికారి మానస, డిఆర్డిఓ బాలకృష్ణ, డిఈఓ రాజేందర్, సిపిఓ బాబురావు, మత్స్యశాఖ అధికారి విజయకుమార్, అన్ని మండలాల ఎంపీడీవోలు మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు .
సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి , గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. రెండు విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలు లోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి నిబంధనల ప్రకారం 24 గంటలు, 48 గంటలు, 72 గంటల లోపు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు.
బ్యాలెట్ బాక్స్, పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్స్, సరిపోయేంత మెటీరియల్ అన్నీ సరిగా చూసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జిల్లాలోని ఆరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో మిగతా 6 మండలాల్లో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఎన్నికల విధులకు సంబంధించి రెండు దఫాలుగా ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ,డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా పరిషత్ సీఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
జిల్లాలో జరుగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సమన్వయం, సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ సోమవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, వెబ్కాస్టింగ్ తదితర విభాగాల వారీగా సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
రాష్ట్రంలో రెండు దఫాలుగా ఎంపిటిసి, జడ్పిటిసి, 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అనుసరిస్తూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్ లను తొలగించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ఎన్నికల నిర్వహించడానికి అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు నిర్వహణపై పిఓలు, ఏపిఓ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టి,విఎస్టీ, ఎంసిసి టీములను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంపిటిసి, జడ్పిటిసి, వార్డు సభ్యులు, సర్పంచి ఎన్నికలు నిర్వహణకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు.
బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మరమ్మత్తు చేయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండాలని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం, డబ్బు లేదా బహుమతుల తదితర కార్యక్రమాలు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం మరియు ఐటీ ఆధారిత పర్యవేక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాలలో బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనికీలు చేపట్టాలని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై నిఘా పెంచాలని పర్యవేక్షణకు, ఫ్లైయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి
గురించి ఎంపిడిఓలకు, తహసీల్దార్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. నామినేషన్లు, కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపధ్యంలో తక్షణమే జిల్లాలో (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు పటిష్టంగా అమలుకు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని నియమావళి ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సాయంత్రం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వేడుకగా మహిళల ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో భాగంగా మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని, పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకు మరియు జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు అన్ని పండుగలను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహిస్తున్నామని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు మరియు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొంటూ, జిల్లాలోని ఉద్యోగులందరం జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారూ. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే పండుగ బతుకమ్మ అని పేర్కొంటూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తున్నదని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగినులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా అధికారులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు
కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్య నాయక్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు బైరీ సోమయ్య,డాక్టర్ ప్రవీణ్,పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్,శ్యామ్ సుందర్,మాధవ రెడ్డి, వాసం శ్రీనివాస్,రాజ్యలక్మి,బోనాల మాధవి,మల్లారం అరుణ,పావని,జ్యోత్స్న,రజిత,సరస్వతి,శ్రీలత, రాజమణి, యమున,ఇందిరా ప్రియ దర్శిని,విజయ లక్ష్మీ, కత్తి రమేష్,రాము నాయక్, లక్ష్మి ప్రసాద్,రాజీవ్, అనూప్ ,ప్రణయ్,పృథ్వి, నిఖిల్ , అనిల్ రెడ్డి,రాజమణి,నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. అలాగే దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని, ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు.
ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, అందించిన సేవలు చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రముఖ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. స్వాతంత్ర్య, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణ కు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాల తరువాత బీసీ కులగణనకు రాష్ట్రంలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపీతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీలకు ప్రభుత్వం ఎలాంటి ఉందని, ప్రభుత్వానికి అండగా బీసీలు అండగా నిలవాలని పేర్కొన్నారు. బీసి భవన్, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు కు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యే తో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బీసి భవన్ ఏర్పాటు కు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, ఇతర శాఖల అధికారులతో పాటు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య, నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్:మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లాలోని 12 ఎంపిపి, 12 జడ్పిటిసి స్థానాలు ఉండగా ఇందులో మహిళా స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను డ్రా తీశారు.
ముందుగా ఎంపీపీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల డ్రా తీయగా అనంతరం జడ్పీటీసీ స్థానాలకు డ్రా తీశారు. రిజర్వేషన్ల ప్రకటన, మహిళా రిజర్వేషన్ స్థానాలకు డ్రా ప్రక్రియ మొత్తంను వీడియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో మేన శ్రీను, డీటీవో శ్రీనివాస్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ. వి. శ్రీనివాస్ రావు, కొలను సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నిశాంత్, రజినీకాంత్, శ్యామ్ సుందర్, కొట్టె ఏసోబు, ప్రవీణ్ కుమార్, నేహాల్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
చరిత్రను, మన సంస్కృతి తెలిపే గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్న ప్రదేశం మన ఓరుగల్లు అని రాథోడ్ రమేష్ అన్నారు. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని శనివారం నాడు హరిత కాకతీయలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి సూచికగా ఎదుగుతున్నది అని అన్నారు. రామప్ప, లక్నవరం, మేడారం, వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, మేడారం లాంటి చాలా పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని అన్నారు. అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. టూరిజం పోటెన్షియల్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పర్యాటక రంగం పై అవగాహన కల్పించడంలో భాగంగా హనుమకొండ జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలు నిర్వహించి నట్లు తెలిపారు. పర్యాటక ఆకర్షణలు పెంచడానికి, దేశ విదేశీ పర్యాటకులను వరంగల్ రప్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేసవిలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సుందరీమణులు నగరానికి తీసుకు రావడం వల్ల మన కీర్తి విశ్వవ్యాప్తం అయింది అని అన్నారు.అనంతరం 60 మంది విజేతలు అయిన విద్యార్థులకు రాథోడ్ రమేష్, శివాజీ సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందించారు. ఆకట్టుకున్న సంస్కృతిక కార్యక్రమాలు. పర్యాటక ఉత్సవాల్లో భాగంగా తాడూరి రేణుక శిష్య బృందం నిర్వహించిన నృత్యాలు అలరించాయి. పర్యాటక ప్రాంతాలను తెలిపే గీతం తో పాటుగా బతుకమ్మ ప్రత్యేక గీతానికి కళాబృందం చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు హరిత కాకతీయ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, కుమారస్వామి, ధనరాజ్, కుసుమ సూర్య కిరణ్, కే . లోకేశ్వర్, డీ. చిరంజీవి, శరత్, సతీష్ , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్యాకేజీ టూర్...
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సహకారంతో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను నిర్వహించారు. విద్యార్థుల కోసం వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్ ప్రాంతాలను చూపించి, గైడ్ సహకారంతో ఆయా ప్రాంత చరిత్రను వివరించారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా లో అభివృద్ధి పనులకి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసినట్లయితే వాటికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన రైల్వే , మున్సిపల్, కుడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో కాజీపేట, హనుమకొండ పరిధిలో రైల్వే వంతెనలు, పైపులైన్లు, రోడ్లు, తాగునీటి సమస్యలు, ఎఫ్ సీ ఐ గోదాం, అంబేద్కర్ భవన్, హనుమకొండ చౌరస్తాలలో వరద నీరు నిలవడంతో తలెత్తుతున్న ఇబ్బందులు, భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ సమస్య, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
రైల్వే సంబంధిత అంశాలను, సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తాను పాల్గొని మాట్లాడినట్లు పేర్కొన్నారు. అక్కడి సమావేశంలో కాజీపేటలో బస్టాండ్ ఏర్పాటు అంశం కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. రైల్వేకు సంబంధించి ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందామన్నారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపి సమన్వయంతో పరిష్కరించే విధంగా జిల్లా అధికారులను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లు వేయాలని తన వద్దకు ప్రజలు వస్తున్నారని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలలో రోడ్లు వేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు నిలవకుండా తీసుకునే చర్యలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. దిశ సమావేశంలోనూ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే విధంగా జిల్లాకు సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరు అయ్యిందని పేర్కొన్నారు. సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ కోసం ప్రభుత్వ భవనం కావాల్సి ఉందని, త్వరగా బిల్డింగ్ ఇచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 22 సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లను కేంద్రం మంజూరు చేసింది అని, అందులో ఒకటి వరంగల్ కు మంజూరు చేసిందన్నారు.
రైల్వే, దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన ప్రసాద్ పథకం, యూనివర్సిటీలలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు అందించినట్లయితే వాటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ దృష్టికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీసుకెళ్లగా పైపులైన్ వేసి ఉందని, వాటిని కలిపి తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామన్నారు. హనుమకొండ అశోక జంక్షన్, చౌరస్తా లో పార్కింగ్ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించగా ప్రతిపాదనలను పరిశీలిస్తామని కమిషనర్ బదులిచ్చారు. హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ భవన్ ప్రాంతాలలో వరద నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కి సూచించారు. వరద నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని కమిషనర్ సమాధానమిచ్చారు. భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు, న్యూ శాయంపేటలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు, వెజ్, నాన్ మార్కెట్ ఏర్పాటు, తదితర అంశాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు.
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. నగర సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాలలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్ వివిధ సమస్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డి ఆర్ ఓ వై వి గణేష్, ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు,కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావు సింగ్, రవీందర్ రెడ్డి, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి అదనపు ఎస్పీ ఏ.నరేష్ కుమార్ ,పూలమాల వేసి నివాళులుర్పించారు .
ఈ సందర్భంగా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ని స్మరించుకోవడం జరిగింది. “చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె నిజమైన వీరవనిత. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు ఈ తరం వారికి ఆదర్శం” అని వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఓ ఫర్హాన, ఆర్.ఐ లు రత్నం, శ్రీకాంత్, ఆర్ఎస్ఐ లు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధిని రూ. 4.29 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా ) రూ. 4.29 కోట్ల నిధులతో నిర్మించిన ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, హైమావతి, సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి సెంట్రల్ లైటింగ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుడా నిధులతో ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎల్కతుర్తి అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రి ఉన్నతీకరణ, విద్యుత్ ఉపకేంద్రం, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు మంజూరు అయి ఉన్నాయని అన్నారు. బాసర ఐఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు స్థల సేకరణతో పాటు ఇతరత్రా కారణాలవల్ల ఆలస్యమైందని, కానీ వచ్చే ఏడాది తప్పకుండా తీసుకువస్తామన్నారు. వంగరలో కూడా నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని, వీలైనంత తొందరలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడం జరిగిందని, ఐదు కోర్సులతో తరగతులు జరుగుతున్నాయన్నారు. కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ జరుగుతుందని, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ ఆసుపత్రిని 150 నుండి 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి పీజీ కోర్సులకు అందించే విధంగా వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. త్వరలో వీటిని ప్రారంభించుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా సిపివో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, విద్యుత్ శాఖ అధికారులు, మండల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.































