Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సందర్భంగా ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఓ వార్త వేగంగా వైరల్ అయింది. ఈ వార్త కారణంగా భక్తులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని పోలీసులు స్పష్టంచేశారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, మామిడితోట ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం జంపన్నవాగు సమీపంలో ఓ షాపులో దాక్కున్న వారిని పోలీసులు పట్టుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపిన అనంతరం, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని కూడా అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ములుగు జిల్లా పోలీసు అధికారులు, మేడారం జాతర ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని వివరించారు. జాతర ప్రాంగణం అంతటా భారీగా పోలీస్ బలగాలు, మహిళా పోలీసులు, ప్రత్యేక నిఘా బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. జాతర జరుగుతున్న కాలంలో ప్రతి ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసుల ప్రకారం, సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడమే కాకుండా, శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతాయి. అందుకే, ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. జాతర శాంతియుతంగా, సురక్షితంగా కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతం మంగళవారం ఉదయం ఒక్కసారిగా భయాందోళనలకు కేంద్రంగా మారింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఫర్నీచర్ షాపులో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపులో ఉన్న సోఫాలు, చెక్క ఫర్నీచర్, వార్నిష్ సామగ్రి కారణంగా మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించి, భారీగా ఎగసిపడ్డాయి. మంటలతో పాటు దట్టమైన నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. షాపు పక్కనే ఉన్న వాణిజ్య సముదాయాలు, నివాస భవనాల్లో ఉన్నవారు ప్రాణభయంతో ఖాళీ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నారని సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. భవనం లోపలికి వెళ్లి నీటి జెట్లు, ఫోమ్ స్ప్రేలు ఉపయోగిస్తూ మంటల వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నించారు. ఒకవైపు మంటలను ఆర్పుతూ, మరోవైపు లోపల చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్, పోలీస్, రెస్క్యూ బృందాలకు తగిన సూచనలు ఇస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత భవనానికి జరిగిన నష్టం, ప్రాణనష్టం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంతో నాంపల్లి ప్రాంతం మొత్తం కొంతసేపు ఉలిక్కిపడింది. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల వినోద్‌ (30) అనే యువకుడు పొలంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, వినోద్ తన పొలంలో ట్రాక్టరుతో రూట్ వెయిటర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద నలిగిపోయిన వినోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామ నూతన సర్పంచ్ లావణ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వినోద్ మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబంలో ఆయన ఏకైక ఆధారమని తెలిసింది. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చిన్నంబావి మండలంలోని వెలగొండ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌గా ఎన్నికైన రాచాల రజిత వినోద్ గౌడ్‌ను జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం జై గౌడ్ ఉద్యమం కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు సూరగౌని వెంకస్వామి గౌడ్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై గౌడ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షుడు తమటం వెంకటస్వామి గౌడ్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ శశికళ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల లచ్చ గౌడ్, సోమ భాస్కర్ గౌడ్ హాజరయ్యారు. అలాగే జై గౌడ్ ఉద్యమ నేతలు గుర్రం వరలక్ష్మి, వెంకటస్వామి గౌడ్, గుండ్రాతి సత్యం గౌడ్‌తో పాటు వెలగొండ గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య గౌడ్, కార్యదర్శి పరమేశ్వర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గోవింద్ గౌడ్, మోహన్ గౌడ్, బాబు గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, రాచాల రజిత వినోద్ గౌడ్ ప్రజల విశ్వాసంతో ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ఆమె అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.గోదావరిఖని.డిసెంబర్.22(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)రామగిరి మండలం.ముస్త్యాల గ్రామ నూతన పంచాయితీ పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.పంచాయితీ సెక్రెటరీ అషీయా నిశాత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన స్పెషల్ ఆఫీసర్ అరవింద్ సర్పంచ్.ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.సర్పంచ్ సుంకరి మహేష్.ఉపసర్పంచ్ బాసినేని వినోదరావు.వార్డు సభ్యులు నీలం శ్రీనివాస్.గోశిక విజయ్ కుమార్.సుందిళ్ల శారద.డేగ సందీప్ కుమార్.గోశిక రాజనర్సు.సుందిళ్ల కనకతారా.గుమ్మడి మల్లయ్య లతో ప్రమాణ స్వీకారం చేయించారు.పంచాయతీ సెక్రెటరీ వారిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పాలకవర్గం కొలువుదీరింది ప్రజా సమస్యలను తీర్చగలమని గ్రామ ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు.ఈసందర్భంగా కొందరు ప్రోటోకాల్ ను ధిక్కరించి!..వాళ్లే ప్రజాప్రతినిధులుగా!.అధికారుల!..అన్నట్టు వ్యవహరించారు?.ఎవరిని ఎవరు ఎందుకు సత్కరిస్తాన్నారో అర్థంగాని పరిస్థితి గందరగోళం.!.చూసేవారు ఇదేమి పద్ధతి అంటూ అసహనంవ్యక్తం...చేస్తూ ఆశ్చర్యపోయారు!.టూటౌన్ పోలీస్ వారు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు.పంచాయతీ సెక్రెటరీ అషీయ నిషాత్,కారోబార్ ఎలుకటూరు శంకర్.సిహెచ్ఓ క్వాలిటీ మేనేజర్ రూప.హెడ్మాస్టర్ రాజేందర్.ఏఎన్ఎం.ఆశా వర్కర్.అంగన్వాడి టీచర్.విద్యుత్ శాఖ వారు..బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పుట్ట రాజన్న.వికలాంగుల రాష్ట్ర నాయకులు కన్నం స్వామి.గ్రామపంచాయతీ సిబ్బంది.పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు.పార్టీ నాయకులు కార్యకర్తలు.సాదుల సందీప్.శేఖర్.బొడ్డుపెళ్లి రవీందర్.రౌతు రమేష్-రేణుక. మచ్చ రవీందర్. భాసినేని రవీందర్రావు..సోలార్ కంపెనీ అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


 డిసెంబర్ 22 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. దుర్గం నగేష్ నేటి జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ అన్నారు. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్’ గౌరవ డాక్టరేట్‌ను ఇటీవల అందుకున్న సందర్భంగా, ఆదివారం ఎన్టిపిసిలోని ఆయన నివాసంలో తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. దుర్గం నగేష్‌కు, ఆయన సతీమణి దుర్గం ప్రమీలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బందెల రాజశేఖర్ మాట్లాడుతూ, దుర్గం నగేష్ ఒక దినపత్రికలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తూనే ప్రజా సమస్యలపై వార్త కథనాలు రాస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక చైతన్యానికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు బందెల శ్రీనివాస్, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల నగేష్, సమతా సైనిక దళ్, సమతా ఫౌండేషన్ సభ్యులు చందనగిరి శివప్రసాద్, గూడూరి లవన్ కుమార్, దుర్గం వెంకట నరసయ్య, బెక్కం సాయి నిఖిల్, హరక్షిత తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు, సోషల్ మీడియాలో చేసిన చిత్రాల పోస్టింగ్‌తో కుంగిపోయిన 20 ఏళ్ల సందీప్తి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే—

రేలకాయలపల్లికి చెందిన సందీప్తి, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ నరేశ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం వారి ఇళ్ల వారికి తెలిసిన తర్వాత సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచారు. అయినప్పటికీ నరేశ్ ఆమెపై ఒత్తిడి కొనసాగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగింది. తక్షణమే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర కలకలం రేగగా, యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులపై మరొకసారి చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శుక్రవారం వెలువడిన ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పేలుడు వ్యాఖ్యలు చేసి పార్టీ వర్గాల్లో సంచలనం రేపారు. ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవటం పార్టీ “పూర్తిగా వైఫల్యం” అనే మాటకు నిదర్శనమని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకువచ్చి తమ అభ్యర్థి విజయానికి అహర్నిశలు శ్రమిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాదు—ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారు అంటూ ఆరోపించారు. పార్టీ కీలక నేతలైన కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్లను సూటిగా ప్రస్తావిస్తూ రాజాసింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. “ఇంత పెద్ద పరాభవంపై వారు సాధారణ కార్యకర్తలకు ఏమి సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తి అలలు ఎగసిపడుతున్న తరుణంలో రాజాసింగ్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఉపఎన్నిక ఫలితాలతో పార్టీ బలహీనత స్పష్టమైందని, ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అయన వ్యాఖ్యలతో బీజేపీ అంతర్గత రాజకీయాలు మళ్లీ ద్రవీభవించాయి. పార్టీ శ్రేణుల్లో ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఉపఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీ రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.లక్షెట్టిపేట.నవంబర్.14(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్.బ్యూరోఆఫ్ తెలంగాణ)లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేసిన నాయకులు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను అధికారులు ఆదివారాలు సెలవు ఇవ్వకుండా నెల రోజులు పని చేస్తున్న అధికారులు ఇది చట్ట విరుద్ధం ఆదివారం కార్మికులు పనిచేస్తే డబ్బులు మాస్టర్ ఇవ్వాలి లేదా సెలవు దినముగా ఉండాలి.అలా కాదని అధికారులు కార్మికులపై జులుం చెలాయిస్తూ పనిభారం మోపడం మంచి పద్ధతి కాదని తెలిపారు.దేశంలో ఎక్కడ లేనటువంటి విధానాన్ని లక్షట్పేట్ మున్సిపాలిటీలో అమలు చేస్తున్నారు కాబట్టి మంచిర్యాల జిల్లాలోని ఉన్న ఏడు మున్సిపాలిటీలలో అత్యవసరము తప్ప ఆదివారాలు మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహించే విధానం ఎక్కడ లేనందున లక్ష్యపేట మున్సిపాలిటీలో కూడా ఇకనుండి ఆదివారాలు సెలవు ఇవ్వాలని.కొత్తగా ఏర్పడిన అటువంటి మున్సిపాలిటీలో జిఓ ఎంఎస్ నెంబర్ 14 ప్రకారంగా ట్రాలీ.డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్లకి డ్రైవర్ల వేతనాలు ఇస్తున్నారు,లక్షేట్టిపేట్ మున్సిపల్ లో కూడా ట్రాలీ మరియు ట్రాక్టర్ల డ్రైవర్లకి డ్రైవర్ వేతనాలు ఇవ్వాలని. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు దేవి సత్యం.లక్షేట్టిపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆవునూరు లింగయ్య ఆధ్వర్యంలో లక్షట్పేట్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆవునూరి సత్తయ్య,శేఖర్,మొగిలి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు....

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

చౌటుప్పల్  : చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదానం కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి – విప్లవ్ కుమార్ గౌడ్ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ – “అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుప్రాప్తం, ఈ సేవలో భాగం కావడం మా అదృష్టం” అని అన్నారు. అయ్యప్ప స్వామి మాలదారులు, శివదీక్ష – హనుమాన్ దీక్ష మాలదారులు విప్లవ్ కుమార్ గౌడ్ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు – అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకుడు తొర్పు నూరి నర్సింహ గౌడ్, సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, మార్గం శేఖర్ యాదవ్, అందొజు సన్నిధ్ చారి, పోల్డాస్ రాజు, దాసరి మురళి స్వామి, బందరపు శివ గౌడ్, చెరుకు చైతన్య స్వాములు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిసర ప్రాంత రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్ద లభించిన మృతదేహం గుర్తింపు లభించింది. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన మంథని పరిధిలో ఇటీవల చోటుచేసుకుంది. ఆ యువకుడే అన్నారం వద్ద లభించిన మృతదేహమని పోలీసులు నిర్ధారించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన రావికంటి సాయికృష్ణ గా గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు, సాయికృష్ణ స్నానానికి గోదావరి ప్రవాహంలోకి దిగి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మంథని పోలీసులు గల్లంతు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరికి ఎగువ నుంచి ప్రవాహంలో కొట్టుకుపోయిన శవం మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్దకు చేరింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పత్రాలు, దుస్తుల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అనంతరం మంథని పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కాపాడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణం దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఆ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. సమస్యల పరిష్కారంలో మండల శాఖకు సహకరించిన జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్  కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇటీవల 317 జీవోకు సంబంధించిన నోటిఫికేషన్లో బాధిత ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే అవకాశం , మరి కొంతమంది బాధ్యత ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వలేదు కావున ప్రతి ఒక బాధిత ఉపాధ్యాయులకు ఈ ఒక నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.పై సమస్యను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మీ ద్వారా రాష్ట్ర శాఖకు ఈ సమాచారం తెలియజేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు ఎన్. సురేషు, అసోసియేట్ మహిళ  అధ్యక్షులు బాసాని రజిత మరియు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు,  ఎంపీపీ విలాసాగర్ పాఠశాలలో పనిచేస్తూ అనారోగ్యంతో అకాల మరణం చెందిన పద్మ మృతికి సంతాపంగా జిల్లా మరియు మండల నాయకులు నివాళులు అర్పించారు. ఈ రోజు పెద్దకర్మ సందర్భంగా ఆమె స్వగ్రామమైన నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘంలో సభ్యురాలిగా ఉన్న పద్మకు  పి ఆర్ టి యు తెలంగాణ సంక్షేమ నిధి నుండి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె భర్త యాదగిరి రెడ్డికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి సభ్యుని సంక్షేమానికి పి ఆర్ టి యు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు న్. సురేష్, రాజశేఖర్, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: పి.ఆర్.టి.యూ తెలంగాణ రాష్ట్ర సంఘం తరపున సభ్యుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సభ్యురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పి.ఆర్.టి.యూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రెగురి శుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన ఎం.పి.పి.ఎస్. విలాసగర్ (ఎస్‌సి) పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి వై. పద్మ గారి కుటుంబానికి సంఘం సహాయక హస్తం అందించింది. సంఘం సంక్షేమ నిధి నుండి రూపాయల 1,00,000 చెక్కును మరణించిన ఉపాధ్యాయురాలి భర్త శ్రీ యాదగిరి రెడ్డి గారికి పెద్దకర్మ రోజున వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యూ మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు ఎన్. సురేష్, ఎస్. రాజశేఖర్ రావు, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున వై. పద్మ గారి కుటుంబానికి సంతాపం తెలియజేసి, అవసరమైన సహాయాన్ని అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

వరంగల్: నగర పరిధిలోని గొర్రెకుంట 15వ డివిజన్ బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు (45) ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొగిలిచర్ల గ్రామ శివారులోని చెరువు వద్ద రాజు మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజు మృతి వెనుక కారణాలపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులు రాజు ఇటీవల కొన్ని వ్యక్తులతో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ కోణం కూడా పరిశీలనలోకి తీసుకున్న పోలీసులు, రాజు మొబైల్ ఫోన్ డేటా, సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. “మరణం వెనుక ఉన్న అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు కొనసాగుతుంది,” అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గొర్రెకుంట, మొగిలిచర్ల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజు మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, న్యాయమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు."రాజు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. ఆయన మృతి మాకు తీవ్ర లోటు," అని బీఆర్ఎస్ స్థానిక నాయకులు పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

(ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 22 సెప్టెంబర్2025 న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మృతిచెందిన) మృతదేహం కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుండి ఈ రోజు 18 అక్టోబర్2025,శనివారం, ఉదయం 6-30,గంటలకు తీగలకుంటపల్లి గ్రామంలోకి ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామిక వాదులు నివాళులు అర్పించి ఊరేగింపుగా ఇంట్లో కి తీసుకువచ్చారు.నివాళుల తర్వాత  మధ్యాహ్నం   అంతిమయాత్ర ప్రారంభమై గ్రామపురి వీధులనుండి స్మశానం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది శ్రీదేవి అమరుడు ఖాతా రామచంద్రరెడ్డి@వికల్ప్ చివరి చూపు కోసం పౌర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు గ్రామస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నాటి తోటి స్నేహితులు అభ్యుదయ విప్లవ రచయిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల  ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాంపూర్ లోని  వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, మడికొండ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఈ రెండు విద్యాసంస్థల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డివో రాథోడ్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ: సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం లను భద్రపరిచే గోదాం భవన నిర్మాణ తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


 ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ తహసీల్దార్  రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

 స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హనుమకొండ,  జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్,  రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా  నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో    సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను  గుర్తించామని పేర్కొన్నారు. గత ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధానం, నమోదైన కేసులపై పరిశీలన చేయాలని అధికారులకు, ఏసీపిలకు కమిషనర్ సూచించారు. రూట్ లు, జోన్ల వారిగా మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టు లను, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించిన అంశాలలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రూట్ మ్యాపులను ఎంపీడీవో లు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్ పోస్ట్, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు నియమించు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల, రూట్ ల ఏర్పాటు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.


మండల స్థాయిలో సజావుగా ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు .సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలుడల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు,  ఏఆర్వోలు,  ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు,  పరిశీలన, గుర్తులు కేటాయింపు,  నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ,  కేంద్రాలు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు తదుపరి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిషా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా  ఎన్నికల నిబంధనల మేరకు జరిగేలా  చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు  ఎప్పటికప్పుడు మారుతుంటాయని, మారిన అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని  తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా డౌట్స్ వస్తే చాలా సమస్యలు వస్తాయని,  ముందు నుండే సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి పొరపాటుకు నిర్వహించొచ్చని వివరించారు.   ఎన్నికలు ట్రాన్స్ఫరెన్సీ, సక్సెస్ ఫుల్ గా జరగాలని ఆయన స్పష్టం చేశారు.  


అనంతరం మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి,  సహకార అధికారి వాలియా నాయక్, ఆడిట్ అధికారి మానస, డిఆర్డిఓ బాలకృష్ణ, డిఈఓ రాజేందర్,  సిపిఓ బాబురావు, మత్స్యశాఖ అధికారి విజయకుమార్,  అన్ని మండలాల ఎంపీడీవోలు మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.