Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నందున ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రూ.100 టిక్కెట్ కొన్న భక్తులను, సాధారణ (ధర్మ) దర్శనానికి వచ్చిన భక్తులను ఒకే క్యూ లైన్‌లో నిలబెట్టడంతో గందరగోళం నెలకొంది.

చాలామంది భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి నిలబడటం కష్టంగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు భక్తులు మాట్లాడుతూ, "మేము రూ.100 టిక్కెట్ కొన్నా కూడా సాధారణ క్యూలోనే నిలబడాల్సి వస్తోంది. దీనివల్ల సమయం వృథా అవుతోంది. ప్రత్యేక క్యూ లైన్ ఉంటే త్వరగా దర్శనం చేసుకునే అవకాశం ఉండేది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుండటంతో నిరాశ చెందుతున్నారు. అందరినీ ఒకేసారి క్యూలో పంపడం వల్ల ఆలస్యమవుతోందని వారు అంటున్నారు.

ఈ సమస్యపై వెంటనే స్పందించాలని భక్తులు దేవాలయ అధికారులను కోరుతున్నారు. టిక్కెట్ కొన్నవారికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్‌ను, ధర్మ దర్శనం చేసుకునేవారికి మరొక క్యూ లైన్‌ను ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

దేవాలయ అధికారులు ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తారో చూడాలి. భక్తుల యొక్క ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయో వేచి చూడాలి.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, అధిక లోడుతో లారీలు తిరుగుతున్నాయని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత మారపల్లి మల్లేశ్, వైఎఫ్ఎ నేత బాపు యాదవ్ ఆరోపించారు. కాటారంలో ఇసుక క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయని, వాటి లైసెన్సులు రద్దు చేయాలని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అధిక లోడుతో వెళ్తున్న లారీల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని, అధిక లోడుతో తిరుగుతున్న లారీలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మారపల్లి మల్లేశ్ మాట్లాడుతూ, "కాటారం ప్రాంతంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని అన్నారు. బాపు యాదవ్ మాట్లాడుతూ, "అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాజకీయ అండదండలతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, లారీల రాకపోకల వల్ల దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్, వైఎఫ్ఎ కార్యకర్తలు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ అన్నారు. బుధవారం హనుమకొండ కుడా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పై వెరిఫికేషన్ అధికారులతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 


జిల్లాలోని గ్రామాల, గ్రేటర్ వరంగల్ నగరంలోని వార్డుల వారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పాటిస్తున్న వేరిఫికేషన్ ప్రక్రియ, అర్హులు, అనర్హుల జాబితాను ఎలా గుర్తిస్తున్నారు, ఇండ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయి, తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి. పి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్న డేటా తో వెరిఫికేషన్ క్షేత్ర స్థాయిలో  సరిచూసుకున్న తరువాతనే నియోజక వర్గ నోడల్ అధికారి ద్వారా జాబితాను కలెక్టర్ లాగిన్ కు పంపాలన్నారు. పైలట్ గ్రామాలలో ఇప్పటి వరకు ఇండ్లు ప్రారంభం కాని వారి స్థానంలో ఇతర గ్రామానికి చెందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వర్ధన్నపేట పరిధిలో పలు ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెరిఫికేషన్ అధికారి చెప్పడంతో హౌసింగ్ ఎండీ గౌతమ్ అభినందనలు తెలిపారు. లబ్ధిదారు వేగంగా ఇల్లు నిర్మాణంలో స్లాబ్ పూర్తి చేసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ప్రాతిపాదికగా తీసుకోవాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. లబ్దిదారుడు  సరసమైన ధరలో  దశలవారీగా

ఇండ్ల నిర్మాణం చేసుకునేలా

ప్రతి దశలో అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని అన్నారు. 

ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన

ఏఈ లను  ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని,  ఆ తదుపరి త్వరలో నగరంలో చేపట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇందిరమ్మ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, ఆ తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న దృష్ట్యా లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామగ్రి ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు  మాట్లాడనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ అధికారులు, మండలాల  తాపీ మేస్త్రి సంఘాలతో త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల జాబితా వెరిఫికేషన్ లో అర్హులు, అనర్హుల జాబితాను సరిచూసుకోవాలన్నారు.వరంగల్ జిల్లాతో పాటు  వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు గ్రేటర్ వరంగల్ పరిధిలోని సోమిడి, వడ్డేపల్లి, దేశాయిపేట ప్రాంతాల్లో వేరిఫికేషన్ అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎండి విపి గౌతమ్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే తో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పారదర్శక నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్,  జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, రవీందర్ నాయక్, నియోజకవర్గ నోడల్ అధికారులు, వెరిఫికేషన్ అధికారులు తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఒక మహిళపై గొడ్డలితో దాడి జరగడం కలకలం రేపింది. హైటెక్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు గుంటల భూమికి సంబంధించిన వివాదంలో హత్యకు గురైన వ్యక్తి కుమారుడు నిందితురాలిపై దాడి చేశాడు.

కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లచ్చక్క (42) అనే మహిళ, మారుపాక సారయ్యను హత్య చేసిన కేసులో నిందితురాలు. ఆమెను అరెస్టు చేయగా, కొద్ది రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది.

ఆ విధంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న లచ్చక్కపై అంజి అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో లచ్చక్కకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దేవరాంపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 14న సారయ్యను లచ్చక్కతో పాటు మరో ముగ్గురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు గురైన సారయ్య కుమారుడు అంజి, తల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశాడు. సరైన సమయం కోసం వేచి చూసి, మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటే లచ్చక్కపై దాడి చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్;

 

హనుమకొండ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో  వివిధ వసతుల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిని గురించి  జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. 


అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్ పనులను పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ముఖ్య ప్రణాళిక అధికారి  సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు, సీడిపి ఓలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టం ఆధారంగా భూ సమస్యలు  పరిష్కారం అవుతాయని  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం సర్వాపూర్, ముస్త్యాలపల్లి  గ్రామాల లో  భూభారతి చట్టంపై  రెవెన్యూ సదస్సులను  అధికారులు నిర్వహించారు. 

ఈ రెవెన్యూ సదస్సులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుకు జిల్లాలో నడికూడ మండలాన్ని ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. రెవెన్యూ సదస్సులో రైతులు అందించే విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  స్వాతంత్ర్య  భారతదేశంలో 1954లో కాస్ర పహాణి ద్వారా భూ రికార్డులకు సంబంధించి బేస్ డాక్యుమెంట్ ఉండేదన్నారు. 2020 లో ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేదిగా కొత్తగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఉండాలి కానీ దాని ద్వారా భూ సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయని అన్నారు. ధరణి చట్టం గ్రామాలలో భూ సమస్యలు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైందన్నారు. గతంలో భూ రికార్డులలో పట్టాదారులు ఉన్నప్పటికీ ఖాస్తు కాలమ్ లో అనుభవదారు కాలమ్ ఉండేదన్నారు. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత అనుభవదారు కాలమ్ ను తీసేసారని అన్నారు. అనుభవదారు కాలమ్ తీసివేయడం పెద్ద తప్పిదమన్నారు.   ఇందిరమ్మ ప్రభుత్వం రావడానికి రైతులు ప్రధాన భూమిక పోషించారని అన్నారు. పైలెట్ గా ఎంపికైన నడికూడ  మండలంలో రైతులు సూచించిన సమస్యలను క్రోడీకరించి ఈ నెల చివరినాటికి ఈ గ్రామాలకు సంబంధించి భూ సమస్యలను తహసిల్దార్ ఆర్డీవోలు తగిన పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు. సర్వేయర్లు లేకపోవడంతో అనేక చోట్ల సర్వే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనిలో భాగంగానే ప్రత్యేకంగా సర్వేయర్లను  నియమిస్తున్నారని తెలిపారు.  కలెక్టర్ స్థాయిలోనే  భూ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. 1954 లో వచ్చిన కాస్రా పహాని  బేస్ గా ఉందో అదేవిధంగా భూభారతి చట్టం  భూ సమస్యల నమస్కారానికి బేస్ గా ఉండాలనేది  ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. 

 

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకున్న రైతులకు వారి చుట్టుపక్కల ఉన్నవారికి  నోటీసులు అందించి  క్షేత్రస్థాయిలో విచారించి నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు. పైలెట్ మండలంలో ఉన్న నడికూడ మండలంలో 90 శాతం వరకు  భూ సమస్యలు నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు.  మిగిలిన 10 శాతం సమస్యలను కూడా పరిష్కరించేందుకు  చర్యలు చేపడతామన్నారు. సమస్యలు ఉన్న రైతులు అర్జీలను అందించాలని కలెక్టర్ సూచించారు. 

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, హనుమకొండ  డిప్యూటీ కలెక్టర్ మంగీలాల్, నడికూడ తహసిల్దార్  నాగరాజు, ఇతర అధికారులతో పాటు స్థానిక  రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్ ;

సమాజాభివృద్ధి కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు కోరారు . విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేమని అన్నారు. హన్మకొండలోని భీమారంలో ఉన్న వి.ఆర్ కన్వెన్షన్ లో సోమవారం నాడు జరిగిన ధర్మసాగర్ మండలంలోని పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 1974 -75 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నల్సార్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి కావడం తో పాటుగా సమావేశానికి హాజరు కావడం ఈ సమ్మేళనానికి శోభనిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థులు కృషి చేయాలని కోరారు. 60 ఏళ్ల పిదప విశ్రాంతి తీసుకోకుండా సమాజాభివృద్ధి లో భాగస్వామి కావాలని ఆయన కోరారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి యైన తాను ఈ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

పూర్వ విద్యార్థులంతా తమ వయసుని పక్కన పెట్టి ఈ కార్యక్రమం లో పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974-75 సంవత్సరపు ఎస్ ఎస్ సి బ్యాచ్ విద్యార్థులైన ప్రముఖ వ్యాపార వేత్త మామిడాల సురేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటేర్డ్ ప్రిన్సిపాల్ ఉపేందర్,1974-75 సంవత్సర విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్   ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,స్వాతి, శ్రీషికలతో  కూడిన బృందం హనుమకొండ పట్టణంలో గల ఫుడ్ ఆన్ ఫైర్, ల్యాండ్ మార్క  రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ల నందు వంట గది పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడం, మురికితో దుర్వాసన కలిగిన రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు  సుమారు 45వేల రూపాయల  విలువ కలిగిన 32 కిలోల నిలువ చేసిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన  చికెన్  కాలం చెల్లిన ఐస్ క్రీములు, పాల ప్యాకెట్లు, మసాలాపొడులు,లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన కార్న్,కొబ్బరి పొడి మరియు ఇతర ఆహార ముడి సరుకులు మరియు, ఫంగస్ తో కూడుకున్న కాలీఫ్లవర్,క్యాబేజీ వంటి కూరగాయలను,

  గుర్తించడం, బిర్యానీ మరియు ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో మోతాదును మించి హానికర రసాయనాలతో కూడిన రంగులను వాడటం,హోటల్ యాజమాన్యం పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి  తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ,అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని వాటిని ధ్వంసం చేసి ఎఫ్ ఎస్ ఎస్ 2006, చట్టాన్నిఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేయడం జరిగింది మరియు అనుమానిక శాంపిలను సేకరించి హైదరాబాద్లో గల ల్యాబ్ పంపడం నివేదిక ఆధారంగా కల్తీ అనే నిర్ధారణ అయితే వారిపై చట్టరీత్య చర్యలు ఉంటాయని తెలిపారు.

 

ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార తయారీదారులు మరియు ఆహారం అమ్మేవారు ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా  ఆహారాన్ని ప్రజలకు విక్రయించాలని  హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం  క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో  సీజ్ కూడా చేస్తామని  హెచ్చరించడం   జరిగింది. ఆహారాన్ని తయారుచేసి, నిలువ చేసి,రవాణా చేసి ప్రజలకు అమ్మే  వ్యాపారస్తులు కల్తీల పట్ల  అవగాహన పెంచుకోవాలని,  ప్రజలకు స్వచ్ఛమైన శుచి, శుభ్రత గల ఆహార పదార్థాలను మరియు ఆహార వ్యాపారులు సరైన  బాధ్యతతో వ్యవహరించాలని, సురక్షితమైన కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించవలసిందిగా  వ్యాపారస్తులను టాస్క్ఫోర్స్ టీం హెడ్  వి.జ్యోతిర్మయి సూచించారు. ఈ నిబంధనలు పాటించని యెడల చట్ట ప్రకారం శిక్షకు గురి కాబడతారని హెచ్చరించడం జరిగింది.

ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ మండలంలోని మల్కాపూర్లో భార్య తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయిందన్న తీవ్ర మనస్తాపంతో ఓ భర్త అత్యంత దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. సొంత పిల్లలైన ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటన మల్కాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్న పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలంలోని చిదనపల్లిలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన గురించి వినడానికి చాలా బాధగా ఉంది. మార్క రాజేందర్ అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎరువుల దుకాణం నడుపుతూ రైతులకు సుమారు 20 లక్షల రూపాయల వరకు అరువు ఇచ్చాడు. అయితే, రైతులు ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత నెల 28న ఇంటి నుండి వెళ్ళిపోయిన రాజేందర్, శనివారం మహాదేవపూర్లోని అయ్యప్ప గుడి సమీపంలో ఒక నీటి ట్యాంక్ వద్ద ఉరి వేసుకొని మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒత్తిడికి గురవుతారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మానసిక మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. రైతులకు కూడా సరైన సమయంలో ఆర్థిక సహాయం అందేలా చూడాల్సిన అవసరం ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్ హనుమకొండ ప్రతినిధి మధు

తెలంగాణ స్టేట్ లీగల్ ఆథారిటీ హైదరాబాద్ పిఎన్ విపిఎస్ యూనివర్సల్ కమ్యూనిటీ మెడిషియన్ సెంటర్ ను హనుమకొండలోని జ్యోతిర్లింగాల నగర్ లో శుక్రవారం జ్యోతిర్లింగాల యూనివర్సల్ కమ్యూనిటీ మీడియేటర్ డాక్టర్ పోరండ్ల ప్రభాకర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు, ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే, కేయూ ఎస్సై పి. సతీష్, తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మామనూర్ నాలుగు బెటాలియన్ లో  సయ్యద్ అబ్బాస్ హుస్సేన్,  బి. ఖీమా ఏఆర్ఎస్ఐలుగా విధులు నిర్వర్తించి నేడు పదవి విరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధి గా కమాండెంట్  బి.రామ్ ప్రకాష్ గారు హాజరు అయ్యి పదవి విరమణ పొందుతున్న  సయ్యద్ అబ్బాస్ హుస్సేన్, బి. ఖీమా గారికి శాలువ కప్పి సన్మానించారు.తమ సర్వీస్ లో  ఎలాంటి రిమార్క్స్ లేకుండా పదవి విరమణ పొదుతున్నారని మరియు పదవి విరమణ తర్వాత తన కుటుంబంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ క్రిష్ణ ప్రసాద్ , వీరన్న, రిజర్వు ఇన్స్పెక్టర్స్ రవి, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ,  అధికారులు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు నేటి నుండి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులు రావడంతో, ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు కూడా వారి సరదా సమయాన్ని గడపడానికి సిద్ధమయ్యారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వేసవి వేడిమి నుండి ఉపశమనం పొందడానికి, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది మంచి అవకాశం. ఈ సెలవులను విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలకు, ఇతర పొరు కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకుంటారని ఆశిద్దాం. తిరిగి కళాశాలలు తెరిచిన తర్వాత ఉత్సాహంగా విద్యాభ్యాసం కొనసాగిస్తారు కదూ! ఈ వేసవి సెలవులు విద్యార్థులకు ఒక గొప్ప విరామంలాంటివి. పరీక్షల ఒత్తిడి, కళాశాల యొక్క రోజువారీ రొటీన్ నుండి వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది.ఈ సమయంలో విద్యార్థులు కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాకుండా, వారి అభిరుచులను పెంపొందించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. కొంతమంది విద్యార్థులు పెండింగ్‌లో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు లేదా కొత్త హాబీలను అలవర్చుకోవచ్చు. ఉదాహరణకు, ఒకరు ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించవచ్చు, మరొకరు ఒక కొత్త భాషను నేర్చుకోవచ్చు లేదా ఇంకొకరు తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు చిత్రలేఖనం లేదా కథలు రాయడం వంటి వాటిపై దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా, ఈ సెలవులు కుటుంబ సభ్యులతో బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఒక చక్కని అవకాశం. చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన విద్యార్థులతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సంతోషంగా గడుపుతారు. కలిసి భోజనం చేయడం, విహారయాత్రలకు వెళ్లడం లేదా కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా అనుబంధం మరింత పెరుగుతుంది. వేసవి సెలవుల్లో ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు తగినంత నీరు త్రాగాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మరియు ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆటలు ఆడటం లేదా వ్యాయామం చేయడం మంచిది. మొత్తానికి, ఈ వేసవి సెలవులు డిగ్రీ విద్యార్థులకు ఒక పునరుత్తేజాన్నిచ్చే సమయం. వారు తిరిగి కళాశాలలకు వచ్చినప్పుడు మరింత ఉత్సాహంతో మరియు నూతన శక్తితో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. సెలవులను ఆనందించండి మరియు సురక్షితంగా ఉండండి!


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

డిగ్రీ విద్యార్థులకు వేసవి సెలవుల ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 30 డిగ్రీ కళాశాలలకు మే నెలాఖరు వరకు సెలవులు ఉండనున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) మరియు కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) విద్యార్థులకు మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. శాతవాహన విశ్వవిద్యాలయం (Satavahana University) మరియు పాలమూరు విశ్వవిద్యాలయం (Palamuru University) విద్యార్థులకు జూన్ 1వ తేదీ వరకు సెలవులు ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం, రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులు రానున్న వేసవిలో తమ సెలవులను ఆనందించవచ్చు. ఇప్పటికే పాఠశాల మరియు ఇంటర్ విద్యార్థులు సెలవుల్లో ఉండగా, డిగ్రీ విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులందరూ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లభించింది. తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు ఇది నిజంగా సంతోషకరమైన వార్త! వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సరైన సమయంలో సెలవులు ప్రకటించింది. ఈ విరామం విద్యార్థులకు చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సెలవుల్లో విద్యార్థులు తమ అభిరుచులకు సమయం కేటాయించవచ్చు. కొందరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు, మరికొందరు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయవచ్చు. ఇంకొందరు ప్రయాణాలు చేస్తూ కొత్త ప్రదేశాలు చూడవచ్చు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడపవచ్చు. అయితే, సెలవులను పూర్తిగా వినోదానికే పరిమితం చేయకుండా, విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సద్వినియోగం చేసుకోవడం మంచిది. తమ తర్వాతి సెమిస్టర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను ఒకసారి గుర్తు చేసుకోవడం లేదా ఏదైనా నైపుణ్యాభివృద్ధి కోర్సులో చేరడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యమే. మొత్తానికి, ఈ వేసవి సెలవులు డిగ్రీ విద్యార్థులకు ఒక మంచి అవకాశం. చదువుతో పాటు ఇతర విషయాలపై దృష్టి సారించడానికి, తమను తాము పునరుత్తేజపరుచుకోవడానికి ఇది సరైన సమయం. సెలవులను ఆనందిస్తూనే, భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు కూడా చేయాలని ఆశిద్దాం. తిరిగి కళాశాలలు తెరిచిన తర్వాత ఉత్సాహంగా విద్యాభ్యాసం కొనసాగించాలని కోరుకుందాం.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. ఆయన నడుముకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయన కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. కేటీఆర్ ఈ విషయాన్ని 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ గాయం కారణంగా, రాబోయే కొన్ని రోజుల్లో ఆయన పాల్గొనాల్సిన కొన్ని రాజకీయ కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది. కేటీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన తరచుగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తారు. ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ చురుకుగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కేటీఆర్ గాయం గురించి వైద్యులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయనకు సంబంధించిన ఆరోగ్య సమాచారం గోప్యంగా ఉంచారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ రాష్ట్రంలోని టీనేజ్ బాలికల ఆరోగ్యం మరియు ఆర్థిక స్వావలంబన కోసం మంత్రి సీతక్క ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. దాని వివరాలు ఈ విధంగా ఉన్నాయి బాలికల్లో ఆర్థిక స్వావలంబనను పెంపొందించడానికి మరియు వారి సమస్యలను వారే పరిష్కరించుకునేలా ప్రోత్సహించడానికి ఈ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. టీనేజ్ వయస్సులో పౌష్టికాహారం చాలా అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించనున్నారు. 14-18 ఏళ్లలోపు బాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పల్లీ పట్టీ, చిరుధాన్యాల పట్టీలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకాన్ని మొదటగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా టీనేజ్ బాలికల్లో ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన మరియు సామాజిక చైతన్యం పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

బాలికల్లో రక్తహీనత (అనీమియా) సమస్యను తగ్గించడం. బాల్య వివాహాలను నివారించడం. చదువు మధ్యలో మానేసే వారి సంఖ్యను తగ్గించడం. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం. పొదుపు మరియు రుణ సౌకర్యాలు. వృత్తి శిక్షణ మరియు మార్గదర్శకత్వం. ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు. చట్టపరమైన హక్కులపై అవగాహన. ఈ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో అమలు చేయనున్నారు. స్థానిక స్వయం సహాయక సంఘాల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం యొక్క పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి మరియు మూల్యాంకనం చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, డేటా సేకరణ మరియు దానిని విశ్లేషణ చేయడం చాలా అవసరం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం చాలా అవసరం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక నాయకులను భాగస్వాములను చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయం మరియు ఇతర వనరులను అందిస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ప్రభుత్వం నిరంతరంగా సహకారం అందిస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణలోని టీనేజ్ బాలికల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి మధు

ఆత్మకూరు మండలo లోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఎఫ్ ఎం ఎం సాంఘిక సేవా సంస్థ వరంగల్ మరియు మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా  ఫౌండేషన్ సహకారంతో గ్రామాఖ్య సంఘ ప్రతినిధులకు, మండల సమాఖ్య ప్రతినిధులకు, స్వయం సహాయక బృందం  మహిళలతో మహిళ సాధికారత, లింగ సమానత్వము మరియు బాలలపై హింసను నిరోధించుట అనే అంశం పైన అవగాహన సదస్సును సంస్థ డైరెక్టర్ *సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఇంకా మహిళల పట్ల అనేక రకాలుగా హింస జరుగుతుందని పిల్లల పైన కూడా వివక్షత ముఖ్యంగ ఆడపిల్లల పైన వివక్షత చూపడం జరుగుతుందని దీనికి అనేక సామాజిక కట్టుబాట్లు, సాంఘిక నియమాలు కూడా వీటికి కారణమయ్యాయి అని తెలిపారు అయితే లింగ సమానత్వం సాధించడం ద్వారా, మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం ద్వారా మహిళా సాధికారత తో పాటు లింగ సమానత్వం పాటించడం ద్వారా  పిల్లల పైన హింస లేకుండా చూడవచ్చని తెలిపారు ఈ సందర్భంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిన, బాలల అక్రమ రవాణాకు ప్రయత్నం చేసిన, బాలల పైన హింస జరిపిన తక్షణమే పోలీసు 100, చైల్డ్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వచ్చని తెలిపారు .ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రిసోర్స్ పర్సన్ గా హాజరైన ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ*, ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ సాంఘిక కట్టుబాట్లు ,లింగ ఆధారిత మూఢనమ్మకాలు అనేవి మహిళలకు మరియు బాలలకు వారి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని వీటిని నిరోధించాలని తెలిపారు అంతేకాకుండా సమాజంలో బాలల సంరక్షణ కొరకు మహిళల సంరక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆన్లైన్లో మహిళల పైన పిల్లల పైన జరుగుతున్న వేధింపులను గుర్తించి తక్షణమే సైబర్ సెల్ పోలీస్ 1930కు రిపోర్ట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాజరైన యూత్ *అంబాసిడర్ మధుమతి* మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల్ని అర్థం చేసుకొని ఈ డిజిటల్ యుగంలో వారు మొబైల్ ఫోన్ ద్వారా చేస్తున్న పనులను పర్యవేక్షించాలని తల్లిదండ్రులు స్నేహపూరితమైన వాతావరణంలో పిల్లల్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి నాగ బండి శివప్రసాద్ ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఫైనాన్స్ మేనేజర్ M.అజయ్ కుమార్ తదితరులతోపాటు పంచాయతీ కార్యదర్శి.   N  శ్వేత పంచాయతీ ఆఫీసర్ విమల గ్రామైక్య సంఘ ప్రతినిధులు విజయ స్రవంతి, ఉమ తదితరులతోపాటు సుమారు 50 మంది SHG మహిళలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రవి తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపిసి  నుండి మచ్చిక సాయి తేజ 984, మొహమ్మద్ సాబీర్ పాషా  963, ఎంపీసీ నుండి ఎస్. వివేక్ 948, ఎండి వసీం అహ్మద్ 945 ప్రథమ సంవత్సరం ఎంపీసీ నుండి ఎండి. రియాన్ 416, జి.రాజ్ కుమార్ 405, బైపిసి నుండి ఎండి.అత్తఉర్రహ్మాన్ 356 సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల  అధ్యాపకులు రాజ్ కుమార్ ,శేఖర్ ,సుధాకర్, కృష్ణ, ముస్తఫా గీతారాణి వార్డెన్ షేక్ వలి పాషా పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలంలోని మేడిపల్లి జాతీయ రహదారి 353 సి పై ఉన్న టోల్ ప్లాజా నిర్వాహకులు వాహనదారుల నుండి అక్రమంగా టోల్ వసూళ్లు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండల యువజన విభాగం అధ్యక్షుడు రామిళ్ల కిరణ్ తీవ్రంగా ఆరోపించారు. టోల్ ప్లాజా వద్ద కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం అత్యంత దారుణమైన విషయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రామిళ్ల కిరణ్ విలేకరులతో మాట్లాడుతూ, టోల్ ప్లాజా సిబ్బంది నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేట్ బస్సుల నుండి అధిక మొత్తంలో టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనివలన ప్రయాణికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, టోల్ ప్లాజా దాటేందుకు వచ్చే వాహనదారులు ప్రాథమిక అవసరాల కోసం కూడా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.


ఇప్పటికైనా సంబంధిత జాతీయ రహదారుల సంస్థ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా - NHAI) అధికారులు మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, టోల్ ప్లాజాలో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని రామిళ్ల కిరణ్ డిమాండ్ చేశారు. టోల్ ప్లాజా వద్ద తక్షణమే పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షితమైన త్రాగునీటి సౌకర్యం మరియు ఇతర అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఒకవేళ అధికారులు స్పందించకపోతే బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మామునూర్ నాలుగవ బెటాలియన్ కమాండెంట్ శ్రీ బి.రామ్ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు అన్వువల్ రిఫ్రెషర్ కోర్స్ లో భాగంగా, C కంపెనీ అధికారులు మరియు సిబ్బంది కొత్తవాడ(ఆటోనగర్) లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలను సందర్శించి వారికీ నిత్యావసర వస్తువులు, పండ్లు, స్కూల్ బాగ్స్ అందిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో C కంపెనీ ఆర్ఐ కిరణ్, ఆర్ఎస్ఐలు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.