Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు, సోషల్ మీడియాలో చేసిన చిత్రాల పోస్టింగ్‌తో కుంగిపోయిన 20 ఏళ్ల సందీప్తి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే—

రేలకాయలపల్లికి చెందిన సందీప్తి, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ నరేశ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం వారి ఇళ్ల వారికి తెలిసిన తర్వాత సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచారు. అయినప్పటికీ నరేశ్ ఆమెపై ఒత్తిడి కొనసాగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగింది. తక్షణమే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర కలకలం రేగగా, యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులపై మరొకసారి చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శుక్రవారం వెలువడిన ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పేలుడు వ్యాఖ్యలు చేసి పార్టీ వర్గాల్లో సంచలనం రేపారు. ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవటం పార్టీ “పూర్తిగా వైఫల్యం” అనే మాటకు నిదర్శనమని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకువచ్చి తమ అభ్యర్థి విజయానికి అహర్నిశలు శ్రమిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాదు—ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారు అంటూ ఆరోపించారు. పార్టీ కీలక నేతలైన కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్లను సూటిగా ప్రస్తావిస్తూ రాజాసింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. “ఇంత పెద్ద పరాభవంపై వారు సాధారణ కార్యకర్తలకు ఏమి సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తి అలలు ఎగసిపడుతున్న తరుణంలో రాజాసింగ్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఉపఎన్నిక ఫలితాలతో పార్టీ బలహీనత స్పష్టమైందని, ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అయన వ్యాఖ్యలతో బీజేపీ అంతర్గత రాజకీయాలు మళ్లీ ద్రవీభవించాయి. పార్టీ శ్రేణుల్లో ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఉపఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీ రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.లక్షెట్టిపేట.నవంబర్.14(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్.బ్యూరోఆఫ్ తెలంగాణ)లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేసిన నాయకులు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను అధికారులు ఆదివారాలు సెలవు ఇవ్వకుండా నెల రోజులు పని చేస్తున్న అధికారులు ఇది చట్ట విరుద్ధం ఆదివారం కార్మికులు పనిచేస్తే డబ్బులు మాస్టర్ ఇవ్వాలి లేదా సెలవు దినముగా ఉండాలి.అలా కాదని అధికారులు కార్మికులపై జులుం చెలాయిస్తూ పనిభారం మోపడం మంచి పద్ధతి కాదని తెలిపారు.దేశంలో ఎక్కడ లేనటువంటి విధానాన్ని లక్షట్పేట్ మున్సిపాలిటీలో అమలు చేస్తున్నారు కాబట్టి మంచిర్యాల జిల్లాలోని ఉన్న ఏడు మున్సిపాలిటీలలో అత్యవసరము తప్ప ఆదివారాలు మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహించే విధానం ఎక్కడ లేనందున లక్ష్యపేట మున్సిపాలిటీలో కూడా ఇకనుండి ఆదివారాలు సెలవు ఇవ్వాలని.కొత్తగా ఏర్పడిన అటువంటి మున్సిపాలిటీలో జిఓ ఎంఎస్ నెంబర్ 14 ప్రకారంగా ట్రాలీ.డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్లకి డ్రైవర్ల వేతనాలు ఇస్తున్నారు,లక్షేట్టిపేట్ మున్సిపల్ లో కూడా ట్రాలీ మరియు ట్రాక్టర్ల డ్రైవర్లకి డ్రైవర్ వేతనాలు ఇవ్వాలని. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు దేవి సత్యం.లక్షేట్టిపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆవునూరు లింగయ్య ఆధ్వర్యంలో లక్షట్పేట్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆవునూరి సత్తయ్య,శేఖర్,మొగిలి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు....

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

చౌటుప్పల్  : చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదానం కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి – విప్లవ్ కుమార్ గౌడ్ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ – “అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుప్రాప్తం, ఈ సేవలో భాగం కావడం మా అదృష్టం” అని అన్నారు. అయ్యప్ప స్వామి మాలదారులు, శివదీక్ష – హనుమాన్ దీక్ష మాలదారులు విప్లవ్ కుమార్ గౌడ్ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు – అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకుడు తొర్పు నూరి నర్సింహ గౌడ్, సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, మార్గం శేఖర్ యాదవ్, అందొజు సన్నిధ్ చారి, పోల్డాస్ రాజు, దాసరి మురళి స్వామి, బందరపు శివ గౌడ్, చెరుకు చైతన్య స్వాములు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిసర ప్రాంత రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్ద లభించిన మృతదేహం గుర్తింపు లభించింది. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన మంథని పరిధిలో ఇటీవల చోటుచేసుకుంది. ఆ యువకుడే అన్నారం వద్ద లభించిన మృతదేహమని పోలీసులు నిర్ధారించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన రావికంటి సాయికృష్ణ గా గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు, సాయికృష్ణ స్నానానికి గోదావరి ప్రవాహంలోకి దిగి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మంథని పోలీసులు గల్లంతు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరికి ఎగువ నుంచి ప్రవాహంలో కొట్టుకుపోయిన శవం మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్దకు చేరింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పత్రాలు, దుస్తుల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అనంతరం మంథని పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కాపాడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణం దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఆ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. సమస్యల పరిష్కారంలో మండల శాఖకు సహకరించిన జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్  కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇటీవల 317 జీవోకు సంబంధించిన నోటిఫికేషన్లో బాధిత ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే అవకాశం , మరి కొంతమంది బాధ్యత ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వలేదు కావున ప్రతి ఒక బాధిత ఉపాధ్యాయులకు ఈ ఒక నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.పై సమస్యను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మీ ద్వారా రాష్ట్ర శాఖకు ఈ సమాచారం తెలియజేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు ఎన్. సురేషు, అసోసియేట్ మహిళ  అధ్యక్షులు బాసాని రజిత మరియు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు,  ఎంపీపీ విలాసాగర్ పాఠశాలలో పనిచేస్తూ అనారోగ్యంతో అకాల మరణం చెందిన పద్మ మృతికి సంతాపంగా జిల్లా మరియు మండల నాయకులు నివాళులు అర్పించారు. ఈ రోజు పెద్దకర్మ సందర్భంగా ఆమె స్వగ్రామమైన నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘంలో సభ్యురాలిగా ఉన్న పద్మకు  పి ఆర్ టి యు తెలంగాణ సంక్షేమ నిధి నుండి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె భర్త యాదగిరి రెడ్డికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి సభ్యుని సంక్షేమానికి పి ఆర్ టి యు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు న్. సురేష్, రాజశేఖర్, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: పి.ఆర్.టి.యూ తెలంగాణ రాష్ట్ర సంఘం తరపున సభ్యుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సభ్యురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పి.ఆర్.టి.యూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రెగురి శుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన ఎం.పి.పి.ఎస్. విలాసగర్ (ఎస్‌సి) పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి వై. పద్మ గారి కుటుంబానికి సంఘం సహాయక హస్తం అందించింది. సంఘం సంక్షేమ నిధి నుండి రూపాయల 1,00,000 చెక్కును మరణించిన ఉపాధ్యాయురాలి భర్త శ్రీ యాదగిరి రెడ్డి గారికి పెద్దకర్మ రోజున వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యూ మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు ఎన్. సురేష్, ఎస్. రాజశేఖర్ రావు, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున వై. పద్మ గారి కుటుంబానికి సంతాపం తెలియజేసి, అవసరమైన సహాయాన్ని అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

వరంగల్: నగర పరిధిలోని గొర్రెకుంట 15వ డివిజన్ బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు (45) ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొగిలిచర్ల గ్రామ శివారులోని చెరువు వద్ద రాజు మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజు మృతి వెనుక కారణాలపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులు రాజు ఇటీవల కొన్ని వ్యక్తులతో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ కోణం కూడా పరిశీలనలోకి తీసుకున్న పోలీసులు, రాజు మొబైల్ ఫోన్ డేటా, సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. “మరణం వెనుక ఉన్న అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు కొనసాగుతుంది,” అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గొర్రెకుంట, మొగిలిచర్ల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజు మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, న్యాయమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు."రాజు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. ఆయన మృతి మాకు తీవ్ర లోటు," అని బీఆర్ఎస్ స్థానిక నాయకులు పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

(ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 22 సెప్టెంబర్2025 న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మృతిచెందిన) మృతదేహం కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుండి ఈ రోజు 18 అక్టోబర్2025,శనివారం, ఉదయం 6-30,గంటలకు తీగలకుంటపల్లి గ్రామంలోకి ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామిక వాదులు నివాళులు అర్పించి ఊరేగింపుగా ఇంట్లో కి తీసుకువచ్చారు.నివాళుల తర్వాత  మధ్యాహ్నం   అంతిమయాత్ర ప్రారంభమై గ్రామపురి వీధులనుండి స్మశానం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది శ్రీదేవి అమరుడు ఖాతా రామచంద్రరెడ్డి@వికల్ప్ చివరి చూపు కోసం పౌర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు గ్రామస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నాటి తోటి స్నేహితులు అభ్యుదయ విప్లవ రచయిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల  ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాంపూర్ లోని  వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, మడికొండ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఈ రెండు విద్యాసంస్థల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డివో రాథోడ్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ: సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం లను భద్రపరిచే గోదాం భవన నిర్మాణ తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


 ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ తహసీల్దార్  రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

 స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హనుమకొండ,  జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్,  రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా  నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో    సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను  గుర్తించామని పేర్కొన్నారు. గత ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధానం, నమోదైన కేసులపై పరిశీలన చేయాలని అధికారులకు, ఏసీపిలకు కమిషనర్ సూచించారు. రూట్ లు, జోన్ల వారిగా మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టు లను, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించిన అంశాలలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రూట్ మ్యాపులను ఎంపీడీవో లు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్ పోస్ట్, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు నియమించు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల, రూట్ ల ఏర్పాటు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.


మండల స్థాయిలో సజావుగా ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు .సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలుడల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు,  ఏఆర్వోలు,  ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు,  పరిశీలన, గుర్తులు కేటాయింపు,  నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ,  కేంద్రాలు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు తదుపరి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిషా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా  ఎన్నికల నిబంధనల మేరకు జరిగేలా  చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు  ఎప్పటికప్పుడు మారుతుంటాయని, మారిన అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని  తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా డౌట్స్ వస్తే చాలా సమస్యలు వస్తాయని,  ముందు నుండే సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి పొరపాటుకు నిర్వహించొచ్చని వివరించారు.   ఎన్నికలు ట్రాన్స్ఫరెన్సీ, సక్సెస్ ఫుల్ గా జరగాలని ఆయన స్పష్టం చేశారు.  


అనంతరం మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి,  సహకార అధికారి వాలియా నాయక్, ఆడిట్ అధికారి మానస, డిఆర్డిఓ బాలకృష్ణ, డిఈఓ రాజేందర్,  సిపిఓ బాబురావు, మత్స్యశాఖ అధికారి విజయకుమార్,  అన్ని మండలాల ఎంపీడీవోలు మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  రాణి కుముదిని అన్నారు .

సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని   రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో  ఎంపిటిసి, జడ్పిటిసి , గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. రెండు విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదల  నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలు లోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి నిబంధనల ప్రకారం 24 గంటలు, 48 గంటలు, 72 గంటల లోపు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు.

బ్యాలెట్ బాక్స్, పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్స్, సరిపోయేంత మెటీరియల్ అన్నీ సరిగా చూసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జిల్లాలోని ఆరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో మిగతా 6 మండలాల్లో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఎన్నికల విధులకు సంబంధించి  రెండు దఫాలుగా  ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ,డిఆర్డిఓ  మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా పరిషత్ సీఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

జిల్లాలో జరుగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సమన్వయం, సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ సోమవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, వెబ్‌కాస్టింగ్ తదితర విభాగాల వారీగా సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

రాష్ట్రంలో రెండు దఫాలుగా ఎంపిటిసి, జడ్పిటిసి, 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అనుసరిస్తూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్ లను తొలగించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ఎన్నికల నిర్వహించడానికి అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు నిర్వహణపై పిఓలు, ఏపిఓ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టి,విఎస్టీ, ఎంసిసి టీములను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంపిటిసి, జడ్పిటిసి, వార్డు సభ్యులు, సర్పంచి ఎన్నికలు నిర్వహణకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు.

బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మరమ్మత్తు చేయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.


మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండాలని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం, డబ్బు లేదా బహుమతుల తదితర కార్యక్రమాలు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం మరియు ఐటీ ఆధారిత పర్యవేక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాలలో బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనికీలు చేపట్టాలని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై నిఘా పెంచాలని పర్యవేక్షణకు, ఫ్లైయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి

 గురించి ఎంపిడిఓలకు, తహసీల్దార్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. నామినేషన్లు, కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపధ్యంలో తక్షణమే జిల్లాలో (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు పటిష్టంగా అమలుకు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని నియమావళి ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సాయంత్రం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వేడుకగా మహిళల ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో భాగంగా మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని, పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా జిల్లాలోని ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకు మరియు జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు అన్ని పండుగలను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహిస్తున్నామని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు మరియు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొంటూ, జిల్లాలోని ఉద్యోగులందరం జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారూ. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే పండుగ బతుకమ్మ అని పేర్కొంటూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తున్నదని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగినులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా అధికారులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు 

కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్య నాయక్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు బైరీ సోమయ్య,డాక్టర్ ప్రవీణ్,పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్,శ్యామ్ సుందర్,మాధవ రెడ్డి, వాసం శ్రీనివాస్,రాజ్యలక్మి,బోనాల మాధవి,మల్లారం అరుణ,పావని,జ్యోత్స్న,రజిత,సరస్వతి,శ్రీలత, రాజమణి, యమున,ఇందిరా ప్రియ దర్శిని,విజయ లక్ష్మీ, కత్తి రమేష్,రాము నాయక్, లక్ష్మి ప్రసాద్,రాజీవ్, అనూప్ ,ప్రణయ్,పృథ్వి, నిఖిల్ , అనిల్ రెడ్డి,రాజమణి,నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. అలాగే దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని,  ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో  దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, అందించిన సేవలు చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. 

శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రముఖ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. స్వాతంత్ర్య, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణ కు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాల తరువాత బీసీ కులగణనకు రాష్ట్రంలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపీతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ  బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీలకు ప్రభుత్వం ఎలాంటి ఉందని, ప్రభుత్వానికి అండగా బీసీలు అండగా నిలవాలని పేర్కొన్నారు. బీసి భవన్, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు కు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యే తో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బీసి భవన్ ఏర్పాటు కు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, ఇతర శాఖల అధికారులతో పాటు  పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య, నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.