Articles by "POLITICS ( రాజకీయం )"
Showing posts with label POLITICS ( రాజకీయం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్, బంజారాహిల్స్ : సింగరేణి బొగ్గు కాంట్రాక్టుల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విస్తృత ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఒకేసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికుల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే అన్ని పార్టీలూ పెద్దపీట వేస్తున్నాయని, కోట్ల రూపాయల కాంట్రాక్టుల వెనుక భారీ రాజకీయ కుట్రలు నడుస్తున్నాయని ఆమె ఆరోపించారు.

“చిన్న చేప – పెద్ద తిమింగలం” సిద్ధాంతం

సింగరేణి నైనీ బ్లాక్ కాంట్రాక్టుల విషయంలో రూ.250 కోట్ల విలువైన కాంట్రాక్టు పొందిన సృజన్‌రెడ్డిని పెద్ద నిందితుడిలా చిత్రీకరిస్తూ, రూ.25 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న మేఘా కృష్ణారెడ్డి అనే “పెద్ద తిమింగలం”ను కాపాడుతున్నారని కవిత ఆరోపించారు.“చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పి, పెద్ద చేపను రక్షించే ప్రయత్నం జరుగుతోంది. గుంటనక్క, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ కలిసి ఇదే డ్రామా ఆడుతున్నారు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

గతంలో కాంట్రాక్టులు ఎవరిచ్చారు?

సృజన్‌రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పట్లో ఆయన సీఎం బావమరిది అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. “అప్పుడు రేవంత్ రెడ్డి బావమరిది అని గుర్తు రాలేదు… ఇప్పుడు మాత్రం అదే పెద్ద నేరమైపోయిందా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఎక్సెస్ టెండర్లపై అబద్దాలు

బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పడం పూర్తిగా అబద్దమని కవిత స్పష్టం చేశారు. 36, 16, 7, 8 శాతం ఎక్సెస్‌కు అనేక టెండర్లు ఇచ్చారని గణాంకాలతో గుర్తు చేశారు. “కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడతారని అనుకున్నా… కానీ ఈసారి ఆయన మాటలు వింటే బాధేసింది” అని వ్యాఖ్యానించారు.

ఎండీవో విధానంతో సింగరేణికి నష్టం

సింగరేణిలో అమలవుతున్న ఎండీవో విధానం సంస్థకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోందని కవిత ఆరోపించారు. గతంలో ఓపెన్‌కాస్ట్ గనులతో లాభాల్లో ఉన్న సింగరేణి, ఈ విధానం వల్ల అప్పులపాలైందని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలోనే రూ.25 వేల కోట్ల అప్పు పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది రూ.50 వేల కోట్లకు పెరిగిందని అన్నారు. పవర్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో జీతాలకే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులపై నిర్లక్ష్యం

కార్మికుల సమస్యలపై రెండేళ్లుగా ఎవరూ మాట్లాడలేదని, వంద అన్యాయాలు జరిగినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మౌనం పాటించాయని విమర్శించారు. కానీ “ఒక పెద్ద కాంట్రాక్టర్‌కు ఇబ్బంది వస్తే మాత్రం అందరూ ముందుకు వస్తున్నారు” అని మండిపడ్డారు. నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేసినట్లే ఎండీవో విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌ను ఓపెన్‌కాస్ట్‌గా అభివృద్ధి చేస్తే తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయని సూచించారు.

మీడియా, జర్నలిస్టుల అరెస్టులపై విమర్శలు

దళిత మహిళలపై కథనాలు వచ్చినప్పుడు జర్నలిస్టులపై అరెస్టులు చేయడం తీవ్రంగా తప్పుబట్టారు. “వాళ్లు టెర్రరిస్టులు కాదు… నోటీసులు ఇచ్చి వివరణ అడగాలి” అని సూచించారు.

“కేటీఆర్‌పై కథనం వస్తే ఒక నీతి… దళిత మహిళపై కథనం వస్తే మరో నీతా?” అంటూ ప్రశ్నించారు. మహిళల విషయంలో ఇదేనా బీఆర్ఎస్ వైఖరి అని నిలదీశారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణపై అనుమానాలు

ఫోన్ ట్యాపింగ్ విచారణను ప్రభుత్వం జోక్‌గా మార్చిందని, బాధితులకు న్యాయం జరగడం లేదని కవిత ఆరోపించారు. “టెర్రరిస్టుల కోసం ఉండాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు” అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా చేస్తున్నారని విమర్శించారు.

రాజకీయ ప్రకటనలు – జాగృతి దూకుడు

“కాంగ్రెస్ తెలంగాణలో లూజర్ పార్టీ… వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీయే” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, ఆయన వస్తే నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని బద్నాం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము సీరియస్ రాజకీయ పార్టీగా ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కాంట్రాక్టుల వ్యవహారంలో అన్ని ప్రధాన పార్టీలూ కాంట్రాక్టర్ల పక్షానే నిలుస్తున్నాయని, కార్మికుల పక్షాన నిలిచింది ఒక్క జాగృతి పార్టీ మాత్రమేనని కవిత స్పష్టం చేశారు.

“బీఆర్ఎస్ అబద్దాలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. పెద్ద చేపలను కాపాడే రాజకీయాలు ఆపాలి” అంటూ ఆమె ఘాటు హెచ్చరికతో ప్రెస్‌మీట్ ముగిసింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్న కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. పథకం రద్దు కాలేదని, పేరు మాత్రమే మారిందని బీజేపీ VB GRAM G పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ డా. మొహమ్మద్ రఫి స్పష్టం చేశారు. ఈరోజు కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డా. రఫి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరుతో ప్రారంభించిన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం చేసిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

VB G RAM G చట్టం – పేదల అభ్యుదయానికి కొత్త దిశ

దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాత MGNREGA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ “VB G RAM G Act – 2025 (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మిషన్)”గా మార్పులు చేసిందని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త చట్టంలో పేదలు, వలస కూలీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన కులాలు, పేద రైతులు, మైనార్టీ వర్గాల్లోని పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

125 రోజుల ఉపాధి – మౌలిక వసతులకు ప్రాధాన్యం

పాత చట్టంలో 100 రోజుల పని ఉండగా, కొత్త చట్టంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ కల్పించనున్నట్లు తెలిపారు. మట్టి పనులతో పాటు చెరువులు, చెక్‌డ్యాములు, పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, రోడ్లు, కాలువలు, షెడ్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక బృందాల మహిళల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.

గాంధీ ఆశయాల కొనసాగింపు

గ్రామ స్వరాజ్యం, గ్రామ వికాసం, గ్రామాల్లో ప్రజలు గౌరవంగా జీవించాలన్న మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ చట్టం రూపుదిద్దుకుందని డా. రఫి అన్నారు. పేరు మార్పు మాత్రమే సంస్కరణలలో భాగమని, పథకాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు జిల్లెల శ్రీశైలం యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు ఆత్మకూరి స్వామి యాదవ్, మంత్రి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం ములుగు పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు అధికారికంగా ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి, అలాగే బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి వాడిన పరుష పదజాలం హింసను ప్రేరేపించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రమాదం ఉందని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి తన ప్రసంగంలో హద్దులు దాటారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, హింసను సూచించేలా మాట్లాడటం సమాజ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల పార్టీ కార్యాలయాలు, జెండా గద్దెలపై దాడులు జరిగే అవకాశం ఉందని, కార్యకర్తల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఏర్పడవచ్చని ఫిర్యాదులో వివరించారు. అందువల్ల ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తక్షణమే కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఇలాంటి వ్యాఖ్యలను పునరావృతం చేయకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలని కూడా కోరారు. ఫిర్యాదును స్వీకరించిన ములుగు పోలీసులు, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా పరిశీలిస్తామని తెలిపారు. అవసరమైతే ఖమ్మం సభ ప్రసంగ వీడియోలను పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పలువురు సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, ఈ ఫిర్యాదు రాజకీయంగా మరో వివాదానికి దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

                                                                                    కె. నాగరాజు - అడ్వకేట్
                                                                         (బీకాం. ఎంఏ జర్నలిజం, ఎల్ఎల్బీ)

                                                                                            కామారెడ్డి

"పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు" అని మన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. మరి అలాంటి పల్లెల్లో మనకు ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగించింది. మన రాష్ట్ర  స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ (12778), ఎంపీటీసీ (5773), జెడ్పిటీసీ (566) స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నవి. ఈ ఎన్నికలు మన ప్రత్యేక్ష్య ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అంటారు మరి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఒకసారి ఈ ఎన్నికల చరిత్ర చూడాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప మలుపు 1992లో వచ్చింది. అదే 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు. ఈ రెండు సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరిచారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లుగా మూడు స్థాయిలలో స్థానిక పాలన ఏర్పాటైంది. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు, మహిళలకు 33% రిజర్వేషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ఆర్థిక సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇక 74వ సవరణ పట్టణ ప్రాంతాలకు సంబంధించినది. దీనివల్ల మునిసిపాలిటీలకు కూడా స్వతంత్ర హోదా లభించింది. నగర పంచాయతీ, మునిసిపాలిటీ, మహానగర పాలకమండళ్లు ఏర్పాటు అయ్యాయి. ఈ సవరణల ద్వారా ప్రజలకు తమ సమస్యలపై నేరుగా పరిష్కరించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అలాగే గ్రామీణ పట్టణ స్థాయిలో సామజిక న్యాయం, నాయకత్వ అభివృద్ధి, మరియు ప్రజా పాలన అనే సూత్రాలపై స్పష్టత వచ్చింది. ఈ రెండూ సవరణలు వలన భారతదేశంలో కేంద్రీకృతమైన పాలన నుంచి ప్రజల పాలన దిశగా ఒక గొప్ప మార్గం చూపాయి. ఇవి ప్రజాస్వామ్యానికి నిజమయిన స్వరూపాన్ని ఏ విధంగా చూపెట్టినవి అని ఒకసారి పరిశీలించి చూస్తే మనకు అనేక అంశాలు స్ఫురణకు వస్తాయి.  

అవి ఏంటి అంటే! స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా సామాన్య ప్రజలకు ప్రత్యక్ష పాలనలో అవకాశం లభిస్తుంది. ప్రజలు స్వయంగా తమ నాయకులను ఎన్నుకుంటారు, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వారే పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇది ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని మరియు సమానతను అందిస్తుంది.  ప్రతి గ్రామాలలో పట్టణాలలో అనేక సమస్యలు ఉంటాయి. వారి స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కోసం అక్కడి యంత్రాంగం మరియు ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. (ఉదాహరణకు: నేటి సమస్య, మురికి కాలువ సమస్య, రోడ్డు సమస్య కావచ్చు) స్థానిక సంస్థల ద్వారా ఈ అవసరాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. మహిళలు, దళితులు, గిరిజనులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కలిగి ఉండడం వల్ల వారు నాయకత్వంలోకి వస్తున్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఇది దోహదపడుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా గ్రామపంచాయతీకి చేరవేయడం. ఉదాహరణకు స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం నిధులు, వైకుంఠధామం) స్థానిక సంస్థల ద్వారా అమలవుతాయి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నిర్ణయించడం, స్థానిక నాయకుల ద్వారా ఈ పథకాలు వేగంగా ప్రజలకు చేరతాయి. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. గ్రామీణ స్థాయిలో జరిగే చిన్న చిన్న వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించి వాటిని నివారించడం. ఇది న్యాయవ్యవస్థపై భారం తగ్గిస్తుంది, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తుంది.

కానీ ప్రస్తుత రోజుల్లో ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని మరియు అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వాము కల్పిస్తూ, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాయా? అంటే అది సత్య దూరమే!.  మనం ఒకసారి పునరాఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇవే రాజకీయ పార్టీల ఉనికిని కాపాడుతుందనీ వారి విశ్వాసం. మరి రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మంచిదే దాని ద్వారా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. కానీ ఏదైతే మనం రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ఎన్నికల నిర్వహించుకొని గ్రామ అభివృద్ధికి ఆ విధంగా తోడ్పడుతున్నాయా? అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. సర్పంచ్ అంటే గ్రామంలో ఉండే పంచాయతీలకు సమస్యలను తీర్చే ఒక పెద్ద దిక్కు.  గ్రామ సర్పంచ్ అంటే అది ఒక గ్రామం పై అధికారం చలాయించడం అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయి. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క గుర్తింపు పైన మాత్రమే జరిగే ఎన్నికలు. గ్రామానికి ఉపయోగపడే, అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవడంలో సఫలీకృతం కావాలి. ఇది యావత్ తెలంగాణ ప్రజలు గ్రహించాలి. మనకు కావలసింది ఒక నిబద్ధత కలిగిన గ్రామ ప్రతినిధి కానీ అక్కడి అధికారులకు ఎమ్మెల్యేలకు బానిసలాగా పనిచేసే వ్యక్తి కాదు. గ్రామం కోసం అవసరమైన నిధులను పోరాడి తెచ్చే నాయకత్వాన్ని ఎంచుకోవడంలో ఓటర్లు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కేవలం రాజకీయ పార్టీ వ్యక్తిగా, పెద్ద నాయకులతో ఉంటున్నాడు కాబట్టి మంచి చేస్తాడు అనే భ్రమలో పడకుండా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేయగలరు వారిని ప్రజలు గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనకు ఏదైతే రాజ్యాంగం చట్టబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలాలను మనం అందుకోగలుగుతాం. ఒక మహాత్ముడు ఇలా అన్నారు "గ్రామం నశిస్తే, భారతదేశం కూడా నశిస్తుంది. భారతదేశం యొక్క ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది." గ్రామానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసే వారిని ప్రజలు గ్రహించాలి.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే గ్రామాలలో ఒక అలజడి వాతావరణ ఏర్పడుతుంది. ఈసారి ఎవరు పోటీ చేయాలి? ఎవరు పోటీ చేస్తే ఎంత? ఖర్చు పెడతారు. ఎవరు పోటీ చేస్తే అభివృద్ధి చేస్తారు. ఎవరు పోటీ చేస్తే దోచుకుంటారు. అనే ప్రశ్నలు చర్చ తరచుగా వింటుంటాం. అయితే ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే మిగతా ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం జరుగుతుంది. కానీ అదే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓటింగ్ నమోదు శాతం తగ్గుతుంది. అసలు దీనికి కారణం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆలోచించాయా? అయితే అదే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓటింగ్ శాతం మళ్ళీ కాస్త తగ్గిపోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణాలు ఏమిటి? 

అయితే ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి. అయితే మనం సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా అక్కడ సిబ్బంది మరియు పోటీ చేసే అభ్యర్థులు ముందు నుండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రధానంగా  గ్రామాల నుండి అనేకమంది పట్టణాలకు వెళుతూ ఉంటారు. యువకులు పై చదువులకు కావచ్చు, అలాగే కూలి పని కోసం కావచ్చు, కొందరు ఉద్యోగరీత్యా వెళుతుంటారు. కానీ వీరు అందరూ ఓటు హక్కును సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే పోటీ చేసే అభ్యర్థి తన సొంత డబ్బును ఖర్చు చేసి వారిని తీసుకురావడం మళ్ళీ తీసుకుపోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ కనీసం ఓటింగ్ శాతం 88% (2019)వరకు కూడా మనకు కనిపిస్తుంది. అదే మిగతా జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో 77.81% (2019) తగ్గుతుంది కారణం అది కొంతమేరకు విస్తృతస్థాయి కి సంబంధించింది రెండు గ్రామాలు లేక ఒక మండలానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి. మళ్లీ ఇంకొంత ముందుకెళితే అసెంబ్లీ 71.34%(2023)మరియు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది 65.67%(2024) ఇంకాస్త తగ్గిపోతుంది. కారణం ఒకటే ఇక్కడ విస్తృతస్థాయి కాబట్టి చాలామందికి ఓటు వేసిన వేయకున్నా పట్టించుకునే నాధుడు లేడు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇంకా వోటింగ్ పెంచి ప్రజాస్వామ్యాన్ని పరఢవిల్లే విధంగా చేయవచ్చు. రాష్ట్రం మొత్తంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దానిని ఈ ఎన్నికల దృష్ట్యా పురుషులకు కూడా వర్తింప చేస్తే కొద్ది మేరకు మనం మంచి ఫలితాలను చూడవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే దీని ద్వారా ఒక నిష్పక్షికమైన ఓటింగ్ జరుగుతుంది. సాధారణంగా పైన చెప్పినట్లు సర్పంచ్ ఎన్నికల్లో ప్రయత్నం చేసి తీసుకు వస్తారు కొందరు వచ్చేస్తుంటారు. అయితే వచ్చిన ఓటరు స్వతంత్రంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే స్వాభిమానాన్ని కలిగి ఉండాలి. ఆ స్వభిమానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే చిన్న ప్రయత్నమే ఈ ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఎన్నికల రోజు మాత్రమే వర్తింప చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కొన్ని ప్రధాన పార్టీలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులకు అత్యధిక అవకాశం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అయితే అది పూర్తిస్థాయిలో సఫలీకృతం కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు, ప్రధాన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫునుండి జరగాలి. ఇలా యువనాయకత్వానికి అవకాశం ఇస్తే  అది స్థానిక సంస్థల ఎన్నికల ఆశయాలు  పూర్తిస్థాయిలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది.  దీనికోసం ఎన్నికలు నిస్వార్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరగాలి. గ్రామస్థాయిలో ఉన్న పంచాయితీ యంత్రాంగాన్ని పటిష్టం చేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకునేటట్లు చేయడం. ప్రతి గ్రామంలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వడం వలన వారు ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అలాగే ఇలాంటి  సమయంలో వారే అనేక పనులకు బుజానవేసుకొనే అవకాశము కూడా ఉంది, అవి చూసుకుంటే, వాలంటీర్ల (యువకులను) వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం వంటి పంపిణీ చెయ్యకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తారు. వాలంటీర్ల ద్వారా అవగాహన సదస్సులు మరియు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లు ఎలాంటి  ప్రలోభాలకు (డబ్బు, మద్యం, కుల సంఘాలు సొంత ప్రయోజనం కోసం) గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో పాటు గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకోవచ్చు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమవుతుంది సంపూర్ణ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఈ ఎన్నికలను నిర్వహించుకోవాలి. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా ఈ ప్రయత్నం చేయాలి. "గ్రామాల అభివృద్ధియే దేశ అభివృద్ధి ఇదే నినాదంతో మనం ముందుకు వెళ్లాలి".  ఇదే విధంగా మండల పరిషత్, జిల్లా పరిషత్‌, నగర పంచాయతీ, మునిసిపాలిటీ లలో కూడా పనిచేస్తే ప్రజలకు చేరువుగా ఉన్న వ్యవస్థలతో ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని చేకూరుస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వాము కల్పిస్తూ, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా భారతదేశ ఆత్మను సుసంపన్నం చేసే దిశగా ప్రయత్నం చేసిన వాళ్ళము అవుతాము.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం  చిదినేపల్లిలో రాజకీయ వేడి పెరుగుతోంది. రాబోయే స్థానిక ఎన్నికలను ఎదురు చూస్తున్న గ్రామ ప్రజల్లో ఒక్క మాటే వినిపిస్తోంది… ఈసారి మార్పు కావాలి, యువ నాయకత్వం రావాలి!” గ్రామ అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు కావాలి… సమకాలీన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కావాలి… అందుకే ఈసారి యువ నేతకే అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం చిదినేపల్లి గ్రామం మొత్తంలో వినిపిస్తోంది. చిదినేపల్లి లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్కూల్ సదుపాయాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు—ఇలా ఎన్నో సమస్యలు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. పెద్దలు, యువత ఎవర్నైనా అడిగినా ఒకే సమాధానం… “ఆలోచన మార్చే నాయకుడు వస్తే తప్ప గ్రామం మారదు.” “పాత నాయకులు బాగానే చేశారు, కానీ ఇప్పుడు మా గ్రామానికి వేగం ఉన్న నాయకుడు కావాలి. యువ నాయకుడు వస్తే గ్రామం ముందుకు దూసుకెళ్తుంది.” డిజిటల్ సర్వీసులు, ట్రాన్స్‌పరెన్సీ, ప్రభుత్వ పథకాల అమలులో స్పీడ్—all these need young leadership. ఈసారి మార్పు పక్కా.” సరికొత్త ఆలోచనలు, స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ సమస్యలకు ఫాస్ట్ రెస్పాన్స్… యువ నాయకుడు వస్తే చెడ్నెపల్లి కొత్త దిశలో అడుగులు వేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. “ చిదినేపల్లి లో మార్పు తరంగం ఎటు వైపు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రజల మాట మాత్రం స్పష్టంగా ఉంది… ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం యువ నేతకే ఛాన్స్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో…చిదినేపల్లి మీద మా స్పెషల్ రిపోర్ట్‌తో ముందుకి తెస్తూనే ఉంటాం.”
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో ముఖ్యమైన మార్పు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ, “గత ప్రభుత్వ కాలంలో ‘ఇద్దరు పిల్లలు’ నిబంధన అమల్లో ఉండేది. అంటే, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు వార్డు సభ్యుడు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అయ్యేవారు. ఆ నిబంధనను మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది” అని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని, స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో తగిన సవరణలు చేయనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఈ మార్పుతో గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పాత నిబంధన కారణంగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన అనేక మందికి ఊరట లభించనుంది. మంత్రి వివరించిన ప్రకారం, కొత్త నిబంధనల ప్రకారం పిల్లల సంఖ్య ఆధారంగా అభ్యర్థుల అర్హతను నిరాకరించే పరిస్థితి ఇక ఉండదని స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేసే విధానాలు ఉండకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను ఎంచుకునే స్వేచ్ఛ కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది” అని పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ఇది కీలక పరిణామంగా భావించబడుతోంది. అనేక గ్రామాల్లో సామాన్య ప్రజల్లో ఈ నిర్ణయం సంతోషాన్ని కలిగించింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హనుమకొండలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ MLC మురళీధర్, సొంత పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన కారణం. మురళీధర్ ఏ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా పేర్కొనబడనప్పటికీ, అవి ఎమ్మెల్యేలను తీవ్రంగా బాధపెట్టాయని, వారిని రెచ్చగొట్టాయని తెలుస్తోంది.

ఎమ్మెల్యేల సమావేశం, వారి ఆగ్రహం:

మురళీధర్ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు MLA నాయిని రాజేందర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు:

 MLA నాయిని రాజేందర్: ఈయన ఈ అసంతృప్త వర్గానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. "చాలా కాలం నుంచి వారిని భరిస్తున్నామని, ఇక వారి పాపాలను మోయలేమని" ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. ఇది కొండా మురళీధర్ వ్యాఖ్యల పట్ల, బహుశా కొండా కుటుంబం పట్ల వారికి ఉన్న లోతైన అసంతృప్తిని తెలియజేస్తుంది.


కడియం శ్రీహరి: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి హాజరు కావడం ఈ వివాద తీవ్రతను పెంచుతోంది.

 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ: పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా, ఆమె ఈ సమావేశంలో పాల్గొనడం పార్టీలోని అంతర్గత కలహాలను స్పష్టం చేస్తుంది.

 మేయర్ సుధారాణి: హనుమకొండ మేయర్ హాజరు కూడా ఈ వివాదం ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తుంది.

ఈ నాయకులందరి ఉమ్మడి అభిప్రాయం ఏమిటంటే, కొండా మురళీధర్ (లేదా కొండా కుటుంబం) నుండి వస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తనను ఇకపై సహించేది లేదని. నాయిని రాజేందర్ వ్యాఖ్యలు ఒక "బ్రేకింగ్ పాయింట్"కి చేరుకున్నట్లు సూచిస్తున్నాయి.

తక్షణ పరిణామం: బోనం కార్యక్రమం వాయిదా

ఈ రాజకీయ ఘర్షణకు తక్షణ పరిణామంగా "అమ్మవారి బంగారు బోనం" కార్యక్రమం వాయిదా పడింది. ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం వాయిదా పడటం స్థానిక రాజకీయ వాతావరణం ఎంత ఉందో తెలియజేస్తుంది. బహుశా మరింత ఆందోళనలు లేదా కార్యక్రమానికి మద్దతు లేకపోవడం వంటి కారణాలతో వాయిదా వేసి ఉండవచ్చు.

అంతర్గత కలహాలు, విస్తృత ప్రభావం:

ఈ ఘటన హనుమకొండ/ఓరుగల్లు ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీలో లోతైన వర్గ పోరు, ఆధిపత్య పోరాటాలను సూచిస్తుంది.

  కొండా కుటుంబం ప్రభావం: కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పటికీ, ఆమె భర్త మురళీధర్ ఒక ఎన్నికైన పదవిలో లేకపోయినా, ఆయన వ్యాఖ్యలు ఇంతటి వివాదాన్ని రేకెత్తించేంత ప్రభావం కలిగి ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇది తరచుగా ఎన్నికైన ప్రతినిధుల కుటుంబ సభ్యులు అనధికారిక అధికారాన్ని చెలాయించినప్పుడు జరుగుతుంది.

 ఎమ్మెల్యేల స్వయం ప్రతిపత్తి vs బయటి ప్రభావం: ఎమ్మెల్యేల తీవ్ర ప్రతిస్పందన, మంత్రికి సన్నిహితుడైన వ్యక్తి నుండి వచ్చే అనవసరమైన జోక్యం లేదా అగౌరవం పట్ల వారి నిరసనను సూచిస్తుంది. వారు తమ స్వంత అధికారాన్ని, అసంతృప్తిని తెలియజేస్తున్నారు.

  పార్టీ క్రమశిక్షణ: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలితో సహా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం పార్టీ క్రమశిక్షణకు, ఆ ప్రాంతంలో తమ శ్రేణుల్లో ఐక్యతను కాపాడుకోవడానికి నాయకత్వానికి ఒక సవాలుగా నిలుస్తుంది.

క్లుప్తంగా చెప్పాలంటే, హనుమకొండలో (ఓరుగల్లు) కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పలువురు కీలక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇది బహిరంగ ఘర్షణకు దారితీసింది, ఎమ్మెల్యేలు అటువంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ వివాదం ఫలితంగా ఒక ముఖ్యమైన ప్రజా కార్యక్రమం కూడా వాయిదా పడింది, ఇది ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో లోతైన అంతర్గత విభేదాలను సూచిస్తుంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని ఉగ్రవాదులు హతమార్చినా, కొందరు కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. "భారత్‌లో ఉంటూ పాక్‌ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటారు. అలాగైతే ఆ దేశానికి వెళ్లిపోండి" అని పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనా, తమ విధానాలు జాతీయ స్థాయిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు తలెత్తినా సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభలో. ఆయన కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తూ, దేశభక్తిని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మత ప్రాతిపదికన 26 మందిని చంపిన సంఘటనను ఆయన ప్రస్తావించారు, ఇది దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం. జనసేన పార్టీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తమ ఉనికిని చాటుకోవాలని ఆయన కోరుకున్నారు. యుద్ధ పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం ద్వారా వారిలో దేశభక్తిని, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పార్టీ జాతీయ విధానాలను అనుసరిస్తుందని, దేశానికి అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని, నియోజకవర్గాల్లో తిరగకుండా హైదరాబాద్లోనే తిరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని, సీఎల్పీలో చెప్పినా వారి పనితీరులో మార్పు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తిరగకుండా హైదరాబాద్లోనే తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. పదవులు రాలేదని కొందరు ఎమ్మెల్యేలు నోరుజారుతున్నారని, అలాంటి వారికి అవకాశాలు ఉండవని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారికి అవకాశాలు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పార్టీలో అంతర్గత విషయాలను బహిర్గతం చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు చురుకుగా వ్యవహరించాలని, వాటి అమలును పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. పార్టీలోని అందరూ సమిష్టిగా పనిచేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. పార్టీ హైకమాండ్ కూడా ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉందని, వారిని హెచ్చరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, అవినీతికి తావు లేకుండా పాలన సాగించాలని ఆయన స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కేటీఆర్, BRS పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, వరంగల్లో జరిగిన రజతోత్సవ సభ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావడం BRS పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణలో తిరిగి BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సభకు వచ్చిన ప్రజల సందేశం కూడా అదేనని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో జరిగిన రజతోత్సవ సభ దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ సభను విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు BRS పార్టీకి అండగా నిలిచారని, వారి మద్దతుతోనే పార్టీ ముందుకు సాగుతుందని కేటీఆర్ అన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ శాంపిల్ పథకాలేనని, వాటిని ప్రారంభించి వదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ లాగా పథకాలను ప్రారంభించి వదిలిపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చని, ప్రజా సమస్యలపై చర్చించవచ్చని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, తాను మరో 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానని, ఇచ్చిన కమిట్‌మెంట్‌ను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు. తాము చేసిన పనులను ప్రజలకు తెలియజేయడంలో వెనుకబడ్డామని, ఇకపై పనులను వేగవంతం చేస్తామని, అధికార యంత్రాంగాన్ని మరింత సమర్థవంతం చేస్తామని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని, కానీ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు వంటి పథకాలు కేవలం శాంపిల్ పథకాలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతపై భారాస (BRS) ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పేరుతో 40 శాతం నూకలు కలిపిన బియ్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇది పేద ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.

గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నూకలు లేని, అత్యంత నాణ్యమైన సన్నబియ్యం అందించామని హరీశ్ రావు గుర్తు చేశారు. పేద ప్రజల ఆరోగ్యం విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ రాజీపడలేదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేశ రాజకీయాలపై కూడా హరీశ్ రావు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని, ఎంత ప్రయత్నించినా ఆ పార్టీ మళ్లీ బలపడే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విశ్వసించడం లేదని ఆయన అన్నారు.

మొత్తంగా, హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, సన్నబియ్యం పంపిణీలో నాణ్యత లోపాన్ని ఎత్తిచూపారు. గతంలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై వస్తున్న ఊహాగానాలకు స్పందించారు. 2029 తర్వాత కూడా మోదీ దేశాన్ని నడిపిస్తారని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో మాట్లాడుతూ, "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వారసుడి గురించి చర్చించడానికి ఇది సరైన సమయం కాదు. 2029లో ఆయనే మళ్లీ ప్రధానమంత్రి అవుతారు" అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో మోదీ 75వ ఏట అడుగుపెట్టనున్న నేపథ్యంలో, శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఇటీవల మోదీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫడ్నవీస్ ఇంకా మాట్లాడుతూ, "మా సంస్కృతిలో తండ్రి బతికున్నప్పుడు వారసత్వం గురించి మాట్లాడటం సముచితం కాదు. అది మొఘల్ సంస్కృతి. దీని గురించి చర్చించడానికి ఇది సమయం కాదు" అని రౌత్ వ్యాఖ్యలకు పరోక్షంగా సమాధానమిచ్చారు.

అంతకుముందు, సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మోదీ ఇటీవల నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఆయన పదవీ విరమణకు సంకేతమని అన్నారు. అంతేకాకుండా, మోదీ వారసుడు మహారాష్ట్ర నుండి వస్తాడని కూడా ఆయన జోస్యం చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్, మోదీ తమ నాయకుడని, ఆయన దేశాన్ని నడిపిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. 2029లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారని దేశం మొత్తం భావిస్తోందని ఆయన అన్నారు.

మొత్తానికి, ప్రధాని మోదీ పదవీ విరమణపై వస్తున్న ఊహాగానాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గట్టిగా ఖండించారు. 2029 వరకు మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా మోదీ దేశానికి నాయకత్వం వహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఈ సమయంలో వారసుడి గురించి చర్చించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సన్న బియ్యం పథకం గురించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. సన్న బియ్యం పథకాన్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొనసాగించాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

హరీశ్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒక పథకం మంచిదని భావిస్తే కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అదే సూత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర ముఖ్యమైన పథకాలకు కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా, కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ బంధు పథకం, దళితులకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే దళిత బంధు పథకం వంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

"సన్న బియ్యం పథకం కొనసాగించాలని అంటున్నారు.. మంచిదే. మరి కేసీఆర్  ఎంతో ముందుచూపుతో, పేద ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన బీసీ బంధు, దళిత బంధు వంటి పథకాలను ఎందుకు ఆపేశారు? వాటిని కూడా కొనసాగించాల్సిన బాధ్యత లేదా?" అని హరీశ్ రావు నిలదీశారు.

అంతేకాకుండా, హరీశ్ రావు సాంప్రదాయాల గురించి కూడా ప్రస్తావించారు. కేసీఆర్  తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ఎంతో గౌరవించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ సంప్రదాయాలను పాటించాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం మంచి పనులు చేసి ఉంటే వాటిని కొనసాగించడం కూడా ఒక మంచి సంప్రదాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం హరీశ్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తమ పథకాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత వేడిని రాజేసే అవకాశం ఉంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న విమర్శలను వారి రాజకీయ ప్రత్యర్థిగా చూడవలసి ఉంటుంది. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఏమిటి? పార్టీని బలోపేతం చేయడానికా లేదా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికా? హరీశ్ రావు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందించింది? మంత్రులు లేదా అధికార ప్రతినిధులు ఏమైనా సమాధానం ఇచ్చారా? వారి వాదన ఏమిటి? రుణమాఫీ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? రైతుబంధు నిధుల కొరతకు గల కారణాలు ఏమిటి? ఆమనగల్లులో రోడ్డు నిర్మాణం యొక్క ప్రాధాన్యత ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరింది? పథకం అమలులో ఉన్న సమస్యలు ఏమిటి? ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఏమిటి? రైతుబంధు పథకం యొక్క భవిష్యత్తు: రైతుబంధు పథకం కొనసాగుతుందా లేదా ప్రభుత్వం దాని స్థానంలో వేరే పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందా? నిధుల కొరత ఉంటే ప్రభుత్వం ఎలా అధిగమించనుంది?  ఆమనగల్లులో రూ.5 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి గల కారణాలు ఏమిటి? ఇది కేవలం సీఎం గారి నియోజకవర్గం లేదా బంధువుల ప్రాంతం కావడం వల్లనేనా లేక దీనికి ఆర్థిక లేదా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందా? ఈ ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? హరీశ్ రావు యొక్క విమర్శలపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? రైతులు ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా మరియు ఇతర వేదికల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, మార్చి 25: వరి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రైతులకు బోనస్ డబ్బులు జమ చేయకపోవడం అన్యాయమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్ అన్నారు. కాటారంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. 


ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే రైతులకు బోనస్ డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇచ్చిన హామీ మేరకు పూర్తి రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు సంబంధించిన విధివిధానాలను తక్షణమే ప్రకటించాలని కోరారు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలుగా మీరు పేర్కొన్న అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లీ సోమవారం అసెంబ్లీ లాబీలో కేటీఆర్ మరియు బాల్క సుమన్‌తో వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు రహస్యంగా సమావేశం కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇలాంటి సమావేశాలు సాధారణంగా రాజకీయంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జరుగుతుంటాయి. వివేక్ వెంకటస్వామి గత కొంతకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు మంత్రివర్గ కూర్పు దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం తక్కువగా ఉండటం కూడా ఆయన బిఆర్ఎస్  వైపు మొగ్గు చూపేందుకు ఒక కారణం కావచ్చు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ కానీ, వివేక్ వెంకటస్వామి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది కేవలం ఊహాగానం మాత్రమేనా లేక నిజంగానే వివేక్ బిఆర్ఎస్  లో చేరుతారా అనేది వేచి చూడాలి. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడి ఆదివారం రాత్రి ముంబైలోని ఖార్‌లోని హోటల్ యూనికాంటినెంటల్‌లో జరిగిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా "నయా భారత్"లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను "గద్దార్" (ద్రోహి) అని పరోక్షంగా సూచిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆగ్రహించిన షిండే నేతృత్వంలోని శివసేన సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు కామ్రా షో జరిగిన హోటల్‌పై దాడి చేసి ఆస్తిని ధ్వంసం చేశారు. కమెడియన్ కామ్రాను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివసేన ఎంపీ నరేష్ మ్హాస్కే కామ్రాను హెచ్చరిస్తూ, అతను దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగలేని విధంగా చేస్తామని, బాలాసాహెబ్ థాకరే శివ సైనికులు అతన్ని వదిలిపెట్టరని హెచ్చరికలు జారీ చేశారు. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు. కునాల్‌ను "కాంట్రాక్ట్ కమెడియన్" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే శివసేన కార్యకర్తల దౌర్జన్యాన్ని ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. '420 అబద్ధపు హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ చేయని శపథం లేదు.. ఆడని అబద్ధం లేదు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్. అధికారం కోసం అందరికీ రుణమాఫీ.. అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ. అప్పుడు అందరికని.. ఇప్పుడు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అంటున్నారు. నాడు ఓట్ల కోసం హామీలు.. నేడు ఎగవేత కోసం కొర్రీలు' అని Xలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 అబద్ధపు హామీలు ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక కొందరికే రుణమాఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అర్హులందరికీ రుణమాఫీ చేశాం.. ఇగ ఇచ్చేది లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రైతు భరోసా ఎగవేతకు సిద్ధమైన కాంగ్రెస్‌ సర్కార్‌ మోసాన్ని ఎండగట్టాలని రైతులకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకంపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలతో కూడిన దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అయిదారుసార్లు నిబంధనలను అతిక్రమించే డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
 అలాంటి వారి లైసెన్స్లను మళ్లీ పునరుద్ధరించరు.
 అలాగే వాహనాలు రిజిస్ట్రేషన్ కూడా కావని మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారథి వాహన్ పోర్టల్ మీద రవాణ శాఖలో రెండు మూడు కొత్త సంస్కరణలను అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి ప్రకటించారు. సారథి వాహన్ పోర్టల్‌లో తెలంగాణ కూడా భాగస్వామి అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 28 విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి లైసెన్సులు 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు.