బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. '420 అబద్ధపు హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ చేయని శపథం లేదు.. ఆడని అబద్ధం లేదు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్. అధికారం కోసం అందరికీ రుణమాఫీ.. అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ. అప్పుడు అందరికని.. ఇప్పుడు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అంటున్నారు. నాడు ఓట్ల కోసం హామీలు.. నేడు ఎగవేత కోసం కొర్రీలు' అని Xలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 అబద్ధపు హామీలు ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక కొందరికే రుణమాఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అర్హులందరికీ రుణమాఫీ చేశాం.. ఇగ ఇచ్చేది లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రైతు భరోసా ఎగవేతకు సిద్ధమైన కాంగ్రెస్‌ సర్కార్‌ మోసాన్ని ఎండగట్టాలని రైతులకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకంపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలతో కూడిన దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: