MEDIGADDA TV NEWS CEO

MEDIGADDA TV NEWS CEO
CEO ANAPARTHI SRINIVAS GOUD Mobile Number 9848223934 9618970144

MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

                                                                                    కె. నాగరాజు - అడ్వకేట్
                                                                         (బీకాం. ఎంఏ జర్నలిజం, ఎల్ఎల్బీ)

                                                                                            కామారెడ్డి

"పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు" అని మన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. మరి అలాంటి పల్లెల్లో మనకు ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగించింది. మన రాష్ట్ర  స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ (12778), ఎంపీటీసీ (5773), జెడ్పిటీసీ (566) స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నవి. ఈ ఎన్నికలు మన ప్రత్యేక్ష్య ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అంటారు మరి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఒకసారి ఈ ఎన్నికల చరిత్ర చూడాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప మలుపు 1992లో వచ్చింది. అదే 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు. ఈ రెండు సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరిచారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లుగా మూడు స్థాయిలలో స్థానిక పాలన ఏర్పాటైంది. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు, మహిళలకు 33% రిజర్వేషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ఆర్థిక సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇక 74వ సవరణ పట్టణ ప్రాంతాలకు సంబంధించినది. దీనివల్ల మునిసిపాలిటీలకు కూడా స్వతంత్ర హోదా లభించింది. నగర పంచాయతీ, మునిసిపాలిటీ, మహానగర పాలకమండళ్లు ఏర్పాటు అయ్యాయి. ఈ సవరణల ద్వారా ప్రజలకు తమ సమస్యలపై నేరుగా పరిష్కరించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అలాగే గ్రామీణ పట్టణ స్థాయిలో సామజిక న్యాయం, నాయకత్వ అభివృద్ధి, మరియు ప్రజా పాలన అనే సూత్రాలపై స్పష్టత వచ్చింది. ఈ రెండూ సవరణలు వలన భారతదేశంలో కేంద్రీకృతమైన పాలన నుంచి ప్రజల పాలన దిశగా ఒక గొప్ప మార్గం చూపాయి. ఇవి ప్రజాస్వామ్యానికి నిజమయిన స్వరూపాన్ని ఏ విధంగా చూపెట్టినవి అని ఒకసారి పరిశీలించి చూస్తే మనకు అనేక అంశాలు స్ఫురణకు వస్తాయి.  

అవి ఏంటి అంటే! స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా సామాన్య ప్రజలకు ప్రత్యక్ష పాలనలో అవకాశం లభిస్తుంది. ప్రజలు స్వయంగా తమ నాయకులను ఎన్నుకుంటారు, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వారే పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇది ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని మరియు సమానతను అందిస్తుంది.  ప్రతి గ్రామాలలో పట్టణాలలో అనేక సమస్యలు ఉంటాయి. వారి స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కోసం అక్కడి యంత్రాంగం మరియు ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. (ఉదాహరణకు: నేటి సమస్య, మురికి కాలువ సమస్య, రోడ్డు సమస్య కావచ్చు) స్థానిక సంస్థల ద్వారా ఈ అవసరాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. మహిళలు, దళితులు, గిరిజనులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కలిగి ఉండడం వల్ల వారు నాయకత్వంలోకి వస్తున్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఇది దోహదపడుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా గ్రామపంచాయతీకి చేరవేయడం. ఉదాహరణకు స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం నిధులు, వైకుంఠధామం) స్థానిక సంస్థల ద్వారా అమలవుతాయి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నిర్ణయించడం, స్థానిక నాయకుల ద్వారా ఈ పథకాలు వేగంగా ప్రజలకు చేరతాయి. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. గ్రామీణ స్థాయిలో జరిగే చిన్న చిన్న వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించి వాటిని నివారించడం. ఇది న్యాయవ్యవస్థపై భారం తగ్గిస్తుంది, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తుంది.

కానీ ప్రస్తుత రోజుల్లో ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని మరియు అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వాము కల్పిస్తూ, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాయా? అంటే అది సత్య దూరమే!.  మనం ఒకసారి పునరాఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇవే రాజకీయ పార్టీల ఉనికిని కాపాడుతుందనీ వారి విశ్వాసం. మరి రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మంచిదే దాని ద్వారా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. కానీ ఏదైతే మనం రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ఎన్నికల నిర్వహించుకొని గ్రామ అభివృద్ధికి ఆ విధంగా తోడ్పడుతున్నాయా? అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. సర్పంచ్ అంటే గ్రామంలో ఉండే పంచాయతీలకు సమస్యలను తీర్చే ఒక పెద్ద దిక్కు.  గ్రామ సర్పంచ్ అంటే అది ఒక గ్రామం పై అధికారం చలాయించడం అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయి. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క గుర్తింపు పైన మాత్రమే జరిగే ఎన్నికలు. గ్రామానికి ఉపయోగపడే, అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవడంలో సఫలీకృతం కావాలి. ఇది యావత్ తెలంగాణ ప్రజలు గ్రహించాలి. మనకు కావలసింది ఒక నిబద్ధత కలిగిన గ్రామ ప్రతినిధి కానీ అక్కడి అధికారులకు ఎమ్మెల్యేలకు బానిసలాగా పనిచేసే వ్యక్తి కాదు. గ్రామం కోసం అవసరమైన నిధులను పోరాడి తెచ్చే నాయకత్వాన్ని ఎంచుకోవడంలో ఓటర్లు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కేవలం రాజకీయ పార్టీ వ్యక్తిగా, పెద్ద నాయకులతో ఉంటున్నాడు కాబట్టి మంచి చేస్తాడు అనే భ్రమలో పడకుండా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేయగలరు వారిని ప్రజలు గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనకు ఏదైతే రాజ్యాంగం చట్టబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలాలను మనం అందుకోగలుగుతాం. ఒక మహాత్ముడు ఇలా అన్నారు "గ్రామం నశిస్తే, భారతదేశం కూడా నశిస్తుంది. భారతదేశం యొక్క ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది." గ్రామానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసే వారిని ప్రజలు గ్రహించాలి.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే గ్రామాలలో ఒక అలజడి వాతావరణ ఏర్పడుతుంది. ఈసారి ఎవరు పోటీ చేయాలి? ఎవరు పోటీ చేస్తే ఎంత? ఖర్చు పెడతారు. ఎవరు పోటీ చేస్తే అభివృద్ధి చేస్తారు. ఎవరు పోటీ చేస్తే దోచుకుంటారు. అనే ప్రశ్నలు చర్చ తరచుగా వింటుంటాం. అయితే ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే మిగతా ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం జరుగుతుంది. కానీ అదే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓటింగ్ నమోదు శాతం తగ్గుతుంది. అసలు దీనికి కారణం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆలోచించాయా? అయితే అదే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓటింగ్ శాతం మళ్ళీ కాస్త తగ్గిపోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణాలు ఏమిటి? 

అయితే ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి. అయితే మనం సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా అక్కడ సిబ్బంది మరియు పోటీ చేసే అభ్యర్థులు ముందు నుండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రధానంగా  గ్రామాల నుండి అనేకమంది పట్టణాలకు వెళుతూ ఉంటారు. యువకులు పై చదువులకు కావచ్చు, అలాగే కూలి పని కోసం కావచ్చు, కొందరు ఉద్యోగరీత్యా వెళుతుంటారు. కానీ వీరు అందరూ ఓటు హక్కును సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే పోటీ చేసే అభ్యర్థి తన సొంత డబ్బును ఖర్చు చేసి వారిని తీసుకురావడం మళ్ళీ తీసుకుపోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ కనీసం ఓటింగ్ శాతం 88% (2019)వరకు కూడా మనకు కనిపిస్తుంది. అదే మిగతా జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో 77.81% (2019) తగ్గుతుంది కారణం అది కొంతమేరకు విస్తృతస్థాయి కి సంబంధించింది రెండు గ్రామాలు లేక ఒక మండలానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి. మళ్లీ ఇంకొంత ముందుకెళితే అసెంబ్లీ 71.34%(2023)మరియు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది 65.67%(2024) ఇంకాస్త తగ్గిపోతుంది. కారణం ఒకటే ఇక్కడ విస్తృతస్థాయి కాబట్టి చాలామందికి ఓటు వేసిన వేయకున్నా పట్టించుకునే నాధుడు లేడు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇంకా వోటింగ్ పెంచి ప్రజాస్వామ్యాన్ని పరఢవిల్లే విధంగా చేయవచ్చు. రాష్ట్రం మొత్తంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దానిని ఈ ఎన్నికల దృష్ట్యా పురుషులకు కూడా వర్తింప చేస్తే కొద్ది మేరకు మనం మంచి ఫలితాలను చూడవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే దీని ద్వారా ఒక నిష్పక్షికమైన ఓటింగ్ జరుగుతుంది. సాధారణంగా పైన చెప్పినట్లు సర్పంచ్ ఎన్నికల్లో ప్రయత్నం చేసి తీసుకు వస్తారు కొందరు వచ్చేస్తుంటారు. అయితే వచ్చిన ఓటరు స్వతంత్రంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే స్వాభిమానాన్ని కలిగి ఉండాలి. ఆ స్వభిమానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే చిన్న ప్రయత్నమే ఈ ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఎన్నికల రోజు మాత్రమే వర్తింప చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కొన్ని ప్రధాన పార్టీలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులకు అత్యధిక అవకాశం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అయితే అది పూర్తిస్థాయిలో సఫలీకృతం కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు, ప్రధాన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫునుండి జరగాలి. ఇలా యువనాయకత్వానికి అవకాశం ఇస్తే  అది స్థానిక సంస్థల ఎన్నికల ఆశయాలు  పూర్తిస్థాయిలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది.  దీనికోసం ఎన్నికలు నిస్వార్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరగాలి. గ్రామస్థాయిలో ఉన్న పంచాయితీ యంత్రాంగాన్ని పటిష్టం చేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకునేటట్లు చేయడం. ప్రతి గ్రామంలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వడం వలన వారు ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అలాగే ఇలాంటి  సమయంలో వారే అనేక పనులకు బుజానవేసుకొనే అవకాశము కూడా ఉంది, అవి చూసుకుంటే, వాలంటీర్ల (యువకులను) వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం వంటి పంపిణీ చెయ్యకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తారు. వాలంటీర్ల ద్వారా అవగాహన సదస్సులు మరియు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లు ఎలాంటి  ప్రలోభాలకు (డబ్బు, మద్యం, కుల సంఘాలు సొంత ప్రయోజనం కోసం) గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో పాటు గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకోవచ్చు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమవుతుంది సంపూర్ణ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఈ ఎన్నికలను నిర్వహించుకోవాలి. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా ఈ ప్రయత్నం చేయాలి. "గ్రామాల అభివృద్ధియే దేశ అభివృద్ధి ఇదే నినాదంతో మనం ముందుకు వెళ్లాలి".  ఇదే విధంగా మండల పరిషత్, జిల్లా పరిషత్‌, నగర పంచాయతీ, మునిసిపాలిటీ లలో కూడా పనిచేస్తే ప్రజలకు చేరువుగా ఉన్న వ్యవస్థలతో ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని చేకూరుస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వాము కల్పిస్తూ, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా భారతదేశ ఆత్మను సుసంపన్నం చేసే దిశగా ప్రయత్నం చేసిన వాళ్ళము అవుతాము.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం  చిదినేపల్లిలో రాజకీయ వేడి పెరుగుతోంది. రాబోయే స్థానిక ఎన్నికలను ఎదురు చూస్తున్న గ్రామ ప్రజల్లో ఒక్క మాటే వినిపిస్తోంది… ఈసారి మార్పు కావాలి, యువ నాయకత్వం రావాలి!” గ్రామ అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు కావాలి… సమకాలీన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కావాలి… అందుకే ఈసారి యువ నేతకే అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం చిదినేపల్లి గ్రామం మొత్తంలో వినిపిస్తోంది. చిదినేపల్లి లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్కూల్ సదుపాయాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు—ఇలా ఎన్నో సమస్యలు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. పెద్దలు, యువత ఎవర్నైనా అడిగినా ఒకే సమాధానం… “ఆలోచన మార్చే నాయకుడు వస్తే తప్ప గ్రామం మారదు.” “పాత నాయకులు బాగానే చేశారు, కానీ ఇప్పుడు మా గ్రామానికి వేగం ఉన్న నాయకుడు కావాలి. యువ నాయకుడు వస్తే గ్రామం ముందుకు దూసుకెళ్తుంది.” డిజిటల్ సర్వీసులు, ట్రాన్స్‌పరెన్సీ, ప్రభుత్వ పథకాల అమలులో స్పీడ్—all these need young leadership. ఈసారి మార్పు పక్కా.” సరికొత్త ఆలోచనలు, స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ సమస్యలకు ఫాస్ట్ రెస్పాన్స్… యువ నాయకుడు వస్తే చెడ్నెపల్లి కొత్త దిశలో అడుగులు వేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. “ చిదినేపల్లి లో మార్పు తరంగం ఎటు వైపు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రజల మాట మాత్రం స్పష్టంగా ఉంది… ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం యువ నేతకే ఛాన్స్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో…చిదినేపల్లి మీద మా స్పెషల్ రిపోర్ట్‌తో ముందుకి తెస్తూనే ఉంటాం.”
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు, సోషల్ మీడియాలో చేసిన చిత్రాల పోస్టింగ్‌తో కుంగిపోయిన 20 ఏళ్ల సందీప్తి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే—

రేలకాయలపల్లికి చెందిన సందీప్తి, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ నరేశ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం వారి ఇళ్ల వారికి తెలిసిన తర్వాత సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచారు. అయినప్పటికీ నరేశ్ ఆమెపై ఒత్తిడి కొనసాగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగింది. తక్షణమే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర కలకలం రేగగా, యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులపై మరొకసారి చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శుక్రవారం వెలువడిన ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పేలుడు వ్యాఖ్యలు చేసి పార్టీ వర్గాల్లో సంచలనం రేపారు. ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవటం పార్టీ “పూర్తిగా వైఫల్యం” అనే మాటకు నిదర్శనమని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకువచ్చి తమ అభ్యర్థి విజయానికి అహర్నిశలు శ్రమిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాదు—ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారు అంటూ ఆరోపించారు. పార్టీ కీలక నేతలైన కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్లను సూటిగా ప్రస్తావిస్తూ రాజాసింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. “ఇంత పెద్ద పరాభవంపై వారు సాధారణ కార్యకర్తలకు ఏమి సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తి అలలు ఎగసిపడుతున్న తరుణంలో రాజాసింగ్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఉపఎన్నిక ఫలితాలతో పార్టీ బలహీనత స్పష్టమైందని, ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అయన వ్యాఖ్యలతో బీజేపీ అంతర్గత రాజకీయాలు మళ్లీ ద్రవీభవించాయి. పార్టీ శ్రేణుల్లో ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఉపఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీ రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.లక్షెట్టిపేట.నవంబర్.14(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్.బ్యూరోఆఫ్ తెలంగాణ)లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేసిన నాయకులు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను అధికారులు ఆదివారాలు సెలవు ఇవ్వకుండా నెల రోజులు పని చేస్తున్న అధికారులు ఇది చట్ట విరుద్ధం ఆదివారం కార్మికులు పనిచేస్తే డబ్బులు మాస్టర్ ఇవ్వాలి లేదా సెలవు దినముగా ఉండాలి.అలా కాదని అధికారులు కార్మికులపై జులుం చెలాయిస్తూ పనిభారం మోపడం మంచి పద్ధతి కాదని తెలిపారు.దేశంలో ఎక్కడ లేనటువంటి విధానాన్ని లక్షట్పేట్ మున్సిపాలిటీలో అమలు చేస్తున్నారు కాబట్టి మంచిర్యాల జిల్లాలోని ఉన్న ఏడు మున్సిపాలిటీలలో అత్యవసరము తప్ప ఆదివారాలు మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహించే విధానం ఎక్కడ లేనందున లక్ష్యపేట మున్సిపాలిటీలో కూడా ఇకనుండి ఆదివారాలు సెలవు ఇవ్వాలని.కొత్తగా ఏర్పడిన అటువంటి మున్సిపాలిటీలో జిఓ ఎంఎస్ నెంబర్ 14 ప్రకారంగా ట్రాలీ.డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్లకి డ్రైవర్ల వేతనాలు ఇస్తున్నారు,లక్షేట్టిపేట్ మున్సిపల్ లో కూడా ట్రాలీ మరియు ట్రాక్టర్ల డ్రైవర్లకి డ్రైవర్ వేతనాలు ఇవ్వాలని. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు దేవి సత్యం.లక్షేట్టిపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆవునూరు లింగయ్య ఆధ్వర్యంలో లక్షట్పేట్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆవునూరి సత్తయ్య,శేఖర్,మొగిలి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు....

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

చౌటుప్పల్  : చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదానం కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి – విప్లవ్ కుమార్ గౌడ్ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ – “అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుప్రాప్తం, ఈ సేవలో భాగం కావడం మా అదృష్టం” అని అన్నారు. అయ్యప్ప స్వామి మాలదారులు, శివదీక్ష – హనుమాన్ దీక్ష మాలదారులు విప్లవ్ కుమార్ గౌడ్ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు – అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకుడు తొర్పు నూరి నర్సింహ గౌడ్, సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, మార్గం శేఖర్ యాదవ్, అందొజు సన్నిధ్ చారి, పోల్డాస్ రాజు, దాసరి మురళి స్వామి, బందరపు శివ గౌడ్, చెరుకు చైతన్య స్వాములు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిసర ప్రాంత రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్ద లభించిన మృతదేహం గుర్తింపు లభించింది. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన మంథని పరిధిలో ఇటీవల చోటుచేసుకుంది. ఆ యువకుడే అన్నారం వద్ద లభించిన మృతదేహమని పోలీసులు నిర్ధారించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన రావికంటి సాయికృష్ణ గా గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు, సాయికృష్ణ స్నానానికి గోదావరి ప్రవాహంలోకి దిగి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మంథని పోలీసులు గల్లంతు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరికి ఎగువ నుంచి ప్రవాహంలో కొట్టుకుపోయిన శవం మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్దకు చేరింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పత్రాలు, దుస్తుల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అనంతరం మంథని పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Blog Archive