Articles by "Siddipet ( సిద్దిపేట )"
Showing posts with label Siddipet ( సిద్దిపేట ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట, జూన్ 12: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో తాటి ఈత చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో, సర్వే నంబర్ 105లో ఉన్న సుమారు 3 వేల తాటి ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయని స్థానిక గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ ఘటనలో తాటి చెట్లతో పాటు మోటార్లు, పైపులు పూర్తిగా కాలిపోవడంతో బాధితులకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గీత కార్మికుల జీవనోపాధికి తీవ్ర దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్ మాట్లాడుతూ, తాటి చెట్లను దహనం చేయడం ద్వారా గీత కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీశారని అన్నారు. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు ముష్మీర్ మహేష్ గౌడ్, బొమ్మకంటి రమేష్ గౌడ్, రాచకొండ బాలయ్య గౌడ్, బొమ్మకంటి కిషోర్ గౌడ్, బొమ్మకంటి చక్రపాణి గౌడ్, వ్యాసరేని కనకయ్య గౌడ్, వ్యాసరేని భూమేష్ గౌడ్, ఉత్కం పెంటయ్య గౌడ్, మద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట, జూన్ 13: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో ఉన్న తాటి చెట్ల తొలగింపు ఘటనపై జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీ సహాయంతో తొలగించారని ఆరోపిస్తూ గౌడ సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అంతకుముందు జై గౌడ ఉద్యమం నాయకులు సంబంధిత అధికారులను కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గీత కార్మికుల జీవనోపాధికి నష్టం వాటిల్లిందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్, జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు యాదగౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామంలో కులదైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో 12 సంవత్సరాల క్రితం నాటిన తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడంపై గౌడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న, కల్లు తీయడానికి అనువుగా ఎదిగిన తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేయడం గీత కార్మికుల జీవనోపాధిపై దెబ్బతీసే చర్యగా అభివర్ణించాయి. కాంతారెడ్డి సువర్ణదేవి, ఆమె కుటుంబ సభ్యులు జేసీబీ (AP 23 AI 6355) సహాయంతో చెట్లను తొలగించారని ఆరోపిస్తూ, ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తాటి చెట్లు గౌడ కుటుంబాల జీవనాధారమని, వాటిని అక్రమంగా తొలగించడం వందలాది గీత కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణగోని చంద్రం గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, కస్తూర్‌పల్లి గ్రామ అధ్యక్షుడు యాద గౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాద గౌడ్తో పాటు సంఘ సభ్యులు, గ్రామ గౌడ కులస్తులు పాల్గొన్నారు.