Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను ఉరేసి హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ సమస్యలు మరియు వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కలచివేస్తున్నాయి. చిన్నారుల మృతితో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలు ఈ దారుణానికి కారణమా అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
