Articles by "Kataram ( కాటారం )"
Showing posts with label Kataram ( కాటారం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, మే 09 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం తాగునీటి కష్టాలకు నిలయంగా మారింది. వేసవి కాలం దృష్ట్యా ఎండలు మండిపోతున్నా, కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు కనీసం మంచినీళ్లు అందించే నాథుడే కరువయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలనుంచి ధరణి, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర ప్రభుత్వ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే, గంటల తరబడి వేచి ఉండే అర్జీదారులకు గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది.

మరమ్మతులకు నోచుకోని వాటర్ కూలర్:

కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. సాంకేతిక లోపంతో అది పనిచేయకపోవడంతో కేవలం మూలన పడి ఉన్న ‘షోపీస్’లా దర్శనమిస్తోంది. వేసవి తీవ్రత పెరుగుతున్నా అధికారులు దానిని బాగు చేయించడంలో కానీ, ప్రత్యామ్నాయంగా చలివేంద్రం ఏర్పాటు చేయడంలో కానీ చొరవ చూపడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

అవస్థలు పడుతున్న వృద్ధులు, మహిళలు:

దూర ప్రాంతాల నుండి వచ్చే వృద్ధులు, మహిళలు దాహం వేస్తే కిలోమీటరు దూరంలో ఉన్న దుకాణాలకు వెళ్లి నీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలు నీళ్లు కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల గదుల్లో ఏసీలు, చల్లని నీరు అందుబాటులో ఉంటుందని, కానీ తమ దాహార్తిని తీర్చే వ్యవస్థ లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే స్పందించాలి:

జిల్లా అధికారులు మరియు మండల రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి, కార్యాలయ ప్రాంగణంలో తాగునీటి వసతిని పునరుద్ధరించాలని లేదా కనీసం మంచినీళ్ల ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం దేవరాంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న మంథని–కాటారం రహదారి పనులు ఆలస్యమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. రూ.3 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ పనులు 30 నెలలు గడిచినా పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డీఎంఎఫ్‌టీల ద్వారా భారీ నిధులు సమీకరించి రహదారి పనుల్లో పురోగతి సాధించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను సంప్రదించే ధోరణి సరికాదని, ఓటు విలువను ప్రజలు గుర్తించాలని సూచించారు.


రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కాటారం ప్రాంత ప్రజలు తమ అభివృద్ధి కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక శక్తివంతమైన సాధనమని, దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఏప్రిల్ 28: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాటారం మండలంలోని కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల భద్రత రక్షణ మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్‌ల ఫోరం డివిజన్ అధ్యక్షుడు, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలని, ఈనాటి యువతే రేపటి దేశానికి వెన్నెముకవంటివారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయిని సరిగా ఉంచుకోవడం అవసరమని తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం నిర్వహించే ‘ఆరోగ్య మహిళా’ క్యాంపులకు హాజరై పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సఖి సెంటర్ ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ కిశోర బాలికలు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఎదుగుతున్న వయసులో అనవసర ఆకర్షణలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా బాధ్యత వహించే వ్యక్తులతో పంచుకోవాలని, అవసరమైతే హెల్ప్‌లైన్ నంబర్లు 1098, 181, 100లను వినియోగించుకోవాలని వివరించారు. సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ రక్తహీనత నివారణ కోసం చిరుధాన్యాలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై అంగన్వాడీ టీచర్ల సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ఏపీఎం రవికుమార్, సఖి DHEW గాయత్రి, సూపర్వైజర్లు శివరాణి, వీణ, ఎండి పర్జన, మహిళా సంఘ ప్రతినిధులు, సీసీలు, వీవోఏలు, అంగన్వాడీ టీచర్లు మరియు కిశోర బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం మండలంలోని అంకుషాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ప్రోగ్రాము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా సర్పంచ్ కల్పన దేవయ్య  హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగపరుచుకోవాలని సూచించడం జరిగినది అలాగే చిరుధాన్యాలకు మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించడం జరిగినది. సూపర్వైజర్ శివరాణి  మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను ముర్రుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది అలాగే వెయ్యి రోజుల ( గర్భిణీ దశ నుండి రెండు సంవత్సరముల పిల్లల వరకు జరిగే అభివృద్ధి )ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది ప్రీస్కూలు ఆవశ్యకతను గురించి వివరించడం జరిగినది. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో స్వేచ్ఛ వాతావరణంలో ఆటపాటల ద్వారా విద్యను అందించడం వలన సమగ్ర అభివృద్ధి జరుగుతుందని వివరించడం జరిగినదిప్రథమ్ ఎన్జీవో సమ్మయ్య గారు పాఠశాల సంసిద్ధత మరియు బాలమేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదనంతరము గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన దేవయ్య ఉపసర్పంచ్ ఉమా శంకర్ అంగన్వాడి సూపర్వైజర్స్ శివరాణి రమాదేవి వ్రతం ఎన్జీవో సమ్మయ్య గారు కార్యదర్శి రజిత వార్డు మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తుల భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ TPF సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. 41 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం స్పందించకుండా 41 రోజుల తర్వాత ఐఏఎస్ తో  కమిటీ వేశామని కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది. గత ఎన్నికలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వంచనకు గురిచేసింది. ఈ స్థితిలో అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టింది. సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలంతా ఆర్టీసీ కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కార్మికులంతా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంగా ఉండాలని, ఎన్ని ఒత్తిడిలు ఎంత నిర్బంధం ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలని కిరణ్ పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: ప్రజా పాలనలో భాగంగా స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలుర కళాశాలలో హ్యాండ్‌బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ క్యాంప్ ఈనెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సోమోజీ  ప్రారంభించగా, గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి , సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పీడీ కె. కల్పన , కుడిమేత మహేందర్ , పీటీ మంతెన శ్రీనివాస్ , కోచ్ మూల వెంకటేష్ , డిప్యూటీ వార్డెన్ రజనీకాంత్  మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో రేపు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఈరోజు ప్రముఖ నేతలు సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అందించనున్న “తీపి కబురు”గా ఏప్రిల్ 20న రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ బాబు , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను వారు సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే , ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రేపటి సభ విజయవంతం కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఏప్రిల్ 19:  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా స్థలాన్ని అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)  సభా ప్రాంగణాన్ని సందర్శించి వివిధ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. సభకు వచ్చే ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని జనరల్ పార్కింగ్‌తో పాటు VIP, VVIP పార్కింగ్ స్థలాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే త్రాగునీటి సౌకర్యాలు, తగిన లైటింగ్ ఏర్పాట్లు, శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహణ జరగేలా చర్యలు తీసుకోవాలని ఆర్గనైజర్లకు స్పష్టం చేశారు. భద్రతా పరమైన అంశాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ శాఖల అధికారులు, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం బయ్యారం గ్రామంలో సర్పంచ్ ఇనుగాల లింగయ్య ఆధ్వర్యంలో గ్రామసభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో పర్యవేక్షణ అధికారి కృష్ణ మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో కాలువ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితుల పేర్లను గ్రామసభలో చదివించారు. వారికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా పంచాయతీ కార్యదర్శి లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అనంతరం భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ ధర కంటే అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంవత్సరాలుగా భూమిని సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మరియు యాజమాన్య హక్కులు కల్పించాలని డిప్యూటీ తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు గుంటి శ్రీనివాస్, సురేందర్, మహేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఇరిగేషన్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ రమా, విఆర్‌ఏలు ఓదెలు, భాను ప్రసాద్, మాజీ సర్పంచ్ సంజీవయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి రాజబాబు, నాయకులు అయిలి శ్రీనివాస్, గోగు సమ్మయ్య, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ అయిలి రాజబాబు, కారోబార్ మీర్జా సాబీర్ బేగ్, పారిశుధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలంలోని బయ్యారం నుంచి పోతులవాయి గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మార్గంలో అనేక చోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రతిరోజూ ఈ రహదారిని వినియోగించే ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో చిన్నపాటి ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.