Articles by "Kataram ( కాటారం )"
Showing posts with label Kataram ( కాటారం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 1 : విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను బుధవారం కాటారం అంబేడ్కర్ సెంటర్‌లో ఆవిష్కరించారు. విరసం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య మాట్లాడుతూ, జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో "భారతదేశంలో ఫాసిజం: ప్రత్యేకతలు" అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులను ప్రజలు అర్థం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దువ్వాసి పార్వతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల విషయంలో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజలను విభజించే విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బాపు మాట్లాడుతూ, ఫాసిజం స్వరూపాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించి, దానిని ఎదుర్కొనే సమగ్ర ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రాజకీయాలతో మాత్రమే సమస్యలకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేష్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి పనిచేయాలని కోరారు. ఫాసిస్టు ధోరణులను ఎదుర్కొనే భావజాల చర్చలకు ఈ సదస్సు వేదిక కానుందని తెలిపారు. ప్రజాస్వామికవాదులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై జూలై 5న జరిగే సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, ఆదివాసీ మహిళా నాయకురాలు రాజమణి, ప్రజా సంఘాల నాయకుడు జాగిరి బాలయ్యతో పాటు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
 

కాటారం, జూలై 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో ఈ నెల 29న జరిగిన వివాహిత రాజమని అలియాస్ రజిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త మంతెన సత్యం (43)ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంతెన సత్యం, రాజమని అలియాస్ రజిత దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రవళి (13), మాన్విత్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతోందనే అనుమానంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్య మెడపై దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం హత్యకు ఉపయోగించిన కత్తి, ఘటన సమయంలో ధరించిన దుస్తులను తీసుకుని వాటిని ఎక్కడైనా పడేసి పరారవ్వాలనే ఉద్దేశంతో బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారికి వస్తుండగా, పోలీసులను గమనించిన నిందితుడు పరుగు తీశాడు. అప్రమత్తమైన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ  శ్రీనివాస్ మరియు పోలీసు సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించబడింది. ఈ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ చి. శ్రీనివాస్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 29: కాటారం డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు, పోడు భూముల దందాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొందరు అటవీ శాఖ అధికారుల ప్రమేయంతో అటవీ భూములు నాశనమవుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్, అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ భూముల విక్రయాలు, ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, కొందరు ఫారెస్ట్ అధికారులు, స్థానిక బ్రోకర్లు కలిసి ఇతర ప్రాంతాల వ్యక్తులకు భూములను విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను మాయమాటలు చెప్పి, బెదిరింపులకు పాల్పడి స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెం పరిధిలో అటవీ భూముల అక్రమ విక్రయాలపై గతంలో సీసీఎఫ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన చర్యలు కనిపించలేదని తెలిపారు. అలాగే మల్హర్ మండలంలోని కొయ్యూర్ రేంజ్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇటీవల సస్పెన్షన్ చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలు అన్ని చోట్ల కొనసాగించాలని కోరారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని, వర్షపాతం తగ్గుతూ కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ నిర్వహించి, సంబంధిత అధికారుల కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల వివరాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులైన అధికారులు, బ్రోకర్లు, ఇతర సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని గిరిజనుల పోడు భూములకు, అటవీ సంపదకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం, రేగులగూడెం, దామరకుంట రైతువేదికలలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి "సీడ్ మేళ" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాటారం గ్రామ సర్పంచ్  పంతకాని సడవలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  వేమునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు వరి సాగుకు అనువైన 8 రకాల సన్న విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
కాటారం, జూన్ 18 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల ఉపాధ్యక్షుడు చీర్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమై ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, నాయకులు బండము మల్లారెడ్డి, గోగుల రాజేష్, కొండ రామ్, వార్డు సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, జిలేష్, గండు మల్లారెడ్డి, గండు తిరుపతి, చీర్ల చంద్రశేఖర్, వడ్ల రవీంద్రాచారి, సురేష్, రత్నాకర్, నరేష్, జగదీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), బీఎల్‌వో పర్యవేక్షకులకు కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారి, కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు తహసీల్దార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అమలు విధానం, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయి బాధ్యతలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించారు. మూడు మండలాలకు చెందిన బీఎల్‌వోలు, బీఎల్‌వో పర్యవేక్షకులు శిక్షణలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) అమలుపై కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జూన్ 18న ఉదయం 11 గంటలకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, మాస్టర్ ట్రైనర్లు హాజరై ఓటరు జాబితాల సవరణ విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో 87 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), 10 మంది బీఎల్వో పర్యవేక్షకులు పాల్గొననున్నారు. ఇందులో కాటారం మండలం నుంచి 36 మంది బీఎల్వోలు, 4 మంది పర్యవేక్షకులు, మహాముత్తారం మండలం నుంచి 27 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు, మల్హర్‌రావు మండలం నుంచి 24 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు హాజరు కానున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా ప్రతినిధులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్ కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17 : కాటారం మండలంలో 2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిణి (ఎంఈవో)పై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ఎంఈవో శ్రీదేవి గానీ, ఎంఆర్సీ సిబ్బంది గానీ తమ బిల్లుల మంజూరు విషయంలో ఎప్పుడూ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో ఎంఈవో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ బిల్లుల చెల్లింపుల విషయంలో డబ్బులు అడిగినట్లు కొందరు వ్యక్తులు ఉపాధ్యాయ సంఘాలకు తప్పుడు సమాచారం అందించడంతోనే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం బాధాకరమని, ఎంఈవో శ్రీదేవి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన అసత్య ప్రచారాలను 2008-డీఎస్సీ ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఖండన తెలిపిన ఉపాధ్యాయులు:
ఈ. అరుణ, జె. స్వప్న, పి. స్వప్న, వి. సుమతి, పి. పద్మజ.
ఇట్లు,
2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, కాటారం మండలం.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం గ్రామ పరిధిలోని ఆదర్శ కాలనీలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను లాక్కెళ్లడం, ఇంటి సామగ్రిని ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కోతుల దాడుల భయంతో బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. కోతుల సంచారంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కోతుల బెడద నుంచి ఆదర్శ కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 15: కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలు వాహనదారులకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు, సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు, జెండాలు ఇప్పటికీ తొలగించకపోవడంతో కూడలి వద్ద దృశ్యమానత తగ్గుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. గారేపల్లి అంబేద్కర్ సెంటర్ మంథని–భూపాలపల్లి, భూపాలపల్లి–కాలేశ్వరం ప్రధాన రహదారులు కలిసే రద్దీ కూడలి కావడంతో అక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఒత్తిడి ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు, జెండాలు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని కోరుతున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గతంలోనూ అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని కొందరు విమర్శిస్తున్నారు. విగ్రహం గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఫ్లెక్సీ రహిత జోన్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల కొందరు యువకులు అక్కడ ఏర్పాటు చేసిన జెండాలను తొలగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ సెంటర్ పరిసరాల్లో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 11: కాటారం మండలంలోని బయ్యారం గ్రామానికి చెందిన పసుల పద్మ అనే మహిళ ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్థులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. పద్మ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే 99635 92134 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. గ్రామస్థులు కూడా ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 11: కాటారం కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లకు మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) సమర్థవంతమైన అమలుపై గురువారం జెడ్పీహెచ్‌ఎస్ కాటారం వేదికగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యు. సోమలింగం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆహార నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత, ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం, రాగి జావ ప్రాముఖ్యత, అయోడైజ్డ్ ఉప్పు వినియోగం, పోషకాహార లోపాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం కీలకమని పేర్కొంటూ, కుక్-కమ్-హెల్పర్లు సేవాభావంతో పనిచేసి విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 11: మంథని నియోజకవర్గం కాటారం మండలంలోని గారేపల్లి ప్రాంతానికి చెందిన విలాసాగారం లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.2 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. బాధితురాలి పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి సహాయకులు సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సహకారంతో వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక భరోసా లభించిందని వారు పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 10 : కాటారం మండలం మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మేడిపల్లి–కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, పాఠశాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారిని బడిలో చేర్పించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్యా సదుపాయాలు తదితర అంశాలను వివరించారు. పిల్లల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల నమోదు పెంపుతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన ఉపాధ్యాయులు, ప్రతి చిన్నారి విద్యను పొందేలా తల్లిదండ్రులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం, జూన్ 10: కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి, మద్దులపల్లి, బయ్యారం, అంకుషాపూర్, కొత్తపల్లి, మేడిపల్లి, ఆదివారంపేట గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, తాగునీటి నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాల ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించారు. గ్రామసభల్లో మండల స్థాయి అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అజెండా అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ), మండల అధికారులు, వ్యవసాయ శాఖ (ఏఓ), ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండల పరిధిలో నిర్వహించాల్సిన అన్ని గ్రామసభలు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.









Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 8: గ్రామాల్లో గంజాయి విక్రయాలు, గంజాయి సేవించడం, గుడుంబా తయారీ మరియు విక్రయాల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు కాటారం ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, సేవించడం, గుడుంబా తయారీ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు బీమా చేయించుకోవాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా కలిగి ఉండాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రహదారులు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తక్కువ వేగంతో ప్రయాణించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామాలను మత్తు పదార్థాలు మరియు నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖతో కలిసి పనిచేయాలని ఎస్ఐ రాజశేఖర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 6: కాటారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ పనులను శనివారం బీజేపీ కాటారం మండల శాఖ నాయకులు పరిశీలించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాటారం పట్టణంలో ప్రస్తుతం కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. గతంలో ఇదే కారణంగా ఓ మహిళ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్వంత మండలంలోనే మార్కెట్ నిర్మాణం ఆలస్యమవుతుండటం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కాటారం మండల శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవీందర్, జిల్లా నాయకులు డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. 



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 05:  కాటారం పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు భారీగా లీకై వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండాకాలంలో అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు విలువైన తాగునీరు గంటల తరబడి రోడ్లపై పారిపోతున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు లీకేజీని మరమ్మతు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 5: ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతాపగిరి గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా మొక్కల నాటకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటారం అటవీ క్షేత్ర అధికారి మరియు అటవీ శాఖ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ, విద్యుత్ తీగలు మరియు ఉచ్చులు ఏర్పాటు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అక్రమ అటవీ నరికివేతలు మరియు ఆక్రమణలను అరికట్టే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో హెచ్. సురేందర్ (డీఆర్‌వో, కాటారం సెక్షన్), డి. ఝాన్సీ రాణి (డీఆర్‌వో, యామన్‌పెల్లి సెక్షన్), పి. చంద్రశేఖర్ (ఎఫ్‌ఎస్‌వో, దామరకుంట సెక్షన్), పి. సోనీ కిరణ్ (ఎఫ్‌ఎస్‌వో, చింతకాని సెక్షన్), కాటారం రేంజ్ బీట్ అధికారులు రాజేందర్, సంజీవ్, మొయినుద్దీన్, హరీష్, మోనా కౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది మల్లేష్, రేంజ్ జీపు డ్రైవర్ మహమూద్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు నగునూరు శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు శ్రీనివాస్‌ను అడ్డుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడారు. అనంతరం ఆయనను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తాను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని, ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అన్యాయంగా తన పేరును జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కక్షలు, పక్షపాత ధోరణులు పక్కనపెట్టి తనలాంటి పేదవారికి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.