Articles by "Kataram ( కాటారం )"
Showing posts with label Kataram ( కాటారం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: శక్తి పేరుతో ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీ కళాశాలలను విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగే రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాటారం మండలం కొత్తపల్లి శివారులోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట జీఓ 97కు వ్యతిరేకంగా విద్యార్థినీ, విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీజేపీ కాటారం మండల శాఖ తరఫున రంజిత్‌కుమార్‌ మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అత్యవసరంగా జీఓ 97ను తీసుకొచ్చారని ఆరోపించారు. శక్తి పేరుతో ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఏటీసీలను విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జీఓపై విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు జీఓ 97పై ఉన్న సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్యను ఏఐసీటీఈ పరిధిలోనే కొనసాగించాలని, విద్యార్థులకు ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే విధానాన్ని కొనసాగించాలని అన్నారు. శక్తి పేరుతో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రంజిత్‌కుమార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఓ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్ష సంరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలోని తల్లి వృక్షాన్ని గుర్తించి విద్యార్థినీలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు తల్లి వృక్షానికి పూజ చేసి, అనంతరం వృక్షాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వృక్షాలు మానవాళికి అందించే ప్రాణవాయువు, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రను గుర్తుచేస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి, పెంచి పెద్దవిగా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో వివరించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలందరూ మొక్కలను పెంచుతూ, వృక్షాలను సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీతతో పాటు ఉపాధ్యాయులు విజయ, నళిని, శిరీష, సుజాత, మణిమాల, అరుణ, రాజమణి, కవిత, శ్రీలత, స్వప్న, సరిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినీలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని వృక్ష సంరక్షణపై తమ నిబద్ధతను చాటారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఆగస్టు 16: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర, జిల్లా, డివిజనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం జరగనుంది..ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించవచ్చు. కాటారం మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్ణీత సమయంలో ఎంపీడీవో కార్యాలయానికి హాజరై ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. నోడల్ అధికారి అడ్డూరి బాబు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విధించిన నిబంధనలను వెంటనే సవరించి, ఒక్కో ఇంటికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి పార్వతి డిమాండ్ చేశారు. శుక్రవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలతో పూర్తి స్థాయి ఇల్లు నిర్మించడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు 400–600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితి విధించడం వల్ల భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ పరిమితిని కనీసం 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంత్రుల నివాసాల మరమ్మతులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఇల్లు నిర్మించేందుకు మాత్రం రూ.5 లక్షలు మాత్రమే కేటాయించడం సమంజసం కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు నిబంధనలను సవరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూడిది లావణ్య, నాయకులు మంథని మల్లేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day




కాటారం, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కాటారం మండలంలోని చీడెనేపల్లి, రెగులగూడెం రెవెన్యూ గ్రామాల్లో బుధవారం అవగాహన గ్రామసభలు నిర్వహించారు. చీడెనేపల్లి గ్రామపంచాయతీలో చీడెనేపల్లి రెవెన్యూ గ్రామానికి, రెగులగూడెం గ్రామపంచాయతీలో రెగులగూడెం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన గ్రామసభల్లో భూ రీ-సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ, భూ రికార్డుల ఖచ్చితత్వం, రైతులు సమర్పించాల్సిన పత్రాలు, భూ వివాదాల పరిష్కారంలో రీ-సర్వే ప్రాధాన్యతపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాటారం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భూములకు శాశ్వత హద్దులు ఖరారు చేయడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిచేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి రైతు సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ డిప్యూటీ ఐఓఎస్, సంబంధిత సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ పంచాయతీ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, చీడెనేపల్లి, రెగులగూడెం గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామసభలో రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి, రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంశెట్టి రాజు పటేల్ అనే యువకుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం ప్రకారం, రాంశెట్టి రాజు పటేల్ స్నానానికి వెళ్లే సమయంలో బాత్రూం సమీపంలో ఉన్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు చేతికి తగలడంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దామెరకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, ఆగస్టు 1: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు దోమల వ్యాప్తి, అంటువ్యాధులను అరికట్టేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో అధికంగా పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలను నిర్మూలించేందుకు గడ్డి మందు పిచికారీ నిర్వహించారు. గ్రామంలో ఎక్కడా పిచ్చిమొక్కలు పెరగకుండా, దోమలు వృద్ధి చెందే పరిస్థితులు లేకుండా ఉండేలా పంచాయతీ సిబ్బంది విస్తృతంగా మందు పిచికారీ చేశారు. అలాగే గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్య కార్మికులతో పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. నిల్వ నీరు ఉండే ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి సువర్ణ-రమేష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే గ్రామపంచాయతీ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో దోమల వ్యాప్తిని అరికట్టి డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపసర్పంచ్ కోట అశోక్ మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం పారిశుధ్య నిర్వహణలో భాగస్వామ్యం కావాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, 5వ వార్డు సభ్యుడు దుర్గం అజయ్, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా గ్రామంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 31 : కాటారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ప్రత్యేక అధికారి పీ. బాలకృష్ణ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ఏఎంసీ చైర్‌పర్సన్, పీఏసీఎస్ చైర్మన్, మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి సూచించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల గ్రామాల్లో నెలకొనే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బయ్యారం, ప్రతాపగిరి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున స్థానికంగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో గంజాయి వినియోగం, బెల్ట్ షాపుల నిర్వహణ పెరుగుతున్నట్లు సమావేశంలో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించి, ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 31: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల రైతు వేదికలో శుక్రవారం "ఎరువుల విక్రయ విధివిధానాలు (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్)" అంశంపై సెంట్రల్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) రూపంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎరువుల విక్రయాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ యాప్ వినియోగంపై అధికారులు, ఎరువుల డీలర్లకు ఈ సందర్భంగా సమగ్రంగా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడంతో పాటు ఎరువుల విక్రయాల్లో పారదర్శకతను పెంపొందించడమే సెంట్రల్ యాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి విక్రయాన్ని యాప్‌లో నమోదు చేయడం, నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడం, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా ఎరువుల పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఎరువుల డీలర్లు సెంట్రల్ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని, విక్రయాల సమయంలో రైతుల వివరాలు, ఎరువుల పరిమాణం, నిల్వలు వంటి సమాచారాన్ని కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో కాటారం మండల వ్యవసాయ అధికారిణి (ఎంఏఓ) పూర్ణిమ, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), కాటారం మండలంలోని ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. సెంట్రల్ యాప్ వినియోగంపై తలెత్తే సందేహాలను నివృత్తి చేస్తూ, యాప్‌లో నమోదులు చేసే విధానం, విక్రయాల నమోదు ప్రక్రియ, నిబంధనల అమలు తదితర అంశాలపై అధికారులు వివరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడం, అక్రమ విక్రయాలను అరికట్టడం, ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడం కోసం ప్రతి డీలర్ సెంట్రల్ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో భారీ వర్షానికి పేద కుటుంబానికి చెందిన ఇంటి గోడలు కూలిపోయాయి. గ్రామానికి చెందిన శ్రీరాములు మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి గోడలు కూలిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే శ్రీరాములు మల్లయ్య కుటుంబానికి ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్షాకాలంలో ఇంటి గోడలు కూలిపోవడంతో కుటుంబ సభ్యులకు తలదాచుకోవడమే కష్టంగా మారింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న పేద కుటుంబానికి ఇంటి గోడలు కూలిపోవడం మరింత భారంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న 10వ వార్డు సభ్యుడు మానెం రాజబాపు, గొనె రవి, సంబరాతి మనోహర్‌తో పాటు ఎర్రగుంటపల్లి గ్రామ యువత సంఘటన స్థలానికి చేరుకుని కూలిపోయిన ఇంటి గోడలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా గోడలు కూలిపోయిన విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎర్రగుంటపల్లి గ్రామ యువత మాట్లాడుతూ..

ఆకాశం నుంచి కురిసిన భారీ వర్షం శ్రీరాములు మల్లయ్య కుటుంబానికి కన్నీటిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి జీవనం సాగిస్తున్న పేద కుటుంబం ఇంటి గోడలు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. కూలిపోయిన గోడలతో ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని, ఇంటిని పునర్నిర్మించుకునేందుకు అవసరమైన సహకారం అందించాలని గ్రామ యువత డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబం అర్హతను పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. పేద కుటుంబాల ఇబ్బందులను అధికారులు స్వయంగా పరిశీలించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ యువత కోరింది. శ్రీరాములు మల్లయ్య కుటుంబం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. "కూలిపోయింది కేవలం ఇంటి గోడలు కాదు.. ఓ పేద కుటుంబం ఆశలు, భరోసా. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్రీరాములు మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి. తక్షణ సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి" అని ఎర్రగుంటపల్లి గ్రామ యువత డిమాండ్ చేసింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 27: రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా మంగళవారం కాటారం మండలంలోని రేగులగూడెం, కాటారం రైతువేదికల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఓ రైతువేదిక నుంచి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా జిల్లాలో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రస్థాయిలో వివరించనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాటారం మండలంలోని రైతులందరూ రేగులగూడెం, కాటారం రైతువేదికలకు హాజరై కార్యక్రమాన్ని వీక్షించాలని పూర్ణిమ కోరారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, మెళకువలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని రైతులను ప్రోత్సహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 27: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్‌ కె. మదన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పప్పుధాన్యాలు, కూరగాయల విత్తన మేళాలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పంటల ఎదుగుదల మందగించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే ప్రత్తి–కంది, కంది–మొక్కజొన్న వంటి అంతర పంటల విధానాలను అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆదాయంలో స్థిరత్వం సాధించవచ్చన్నారు. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ పంటల వైవిధ్యీకరణ చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.

ఐదు కౌంటర్ల ఏర్పాటు

విత్తన మేళాలో రైతులకు పప్పుధాన్యాలు, కూరగాయల నాణ్యమైన విత్తనాలను సులభంగా అందించేందుకు ఐదు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, జిల్లా వ్యవసాయ అధికారి, మహాదేవపూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కాటారం మండల వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాటారం మండలంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే మూడు రోజుల విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 26: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా టోల్ రుసుములు వసూలు చేస్తున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ ఆరోపించారు. టోల్ ప్లాజా వద్ద ఉచిత బాత్రూమ్‌లు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని ఆయన విమర్శించారు. టోల్ ప్లాజా వద్ద ఒక్క అంబులెన్స్ మినహా ప్రయాణికులకు అవసరమైన ఇతర సదుపాయాలు కనిపించడం లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా మేడిపల్లి టోల్‌గేట్ పరిసరాల్లో రహదారి గుంతలమయంగా మారిందని, అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై ప్రయాణికుల నుంచి టోల్ రుసుములు వసూలు చేయడం సరికాదని పీక కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ వసూలు చేస్తున్న నిర్వాహకులు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారిపై గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద తక్షణమే శుభ్రమైన ఉచిత టాయిలెట్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసి, రహదారి మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. అధికారులు, టోల్ నిర్వాహకులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బాధితులు, వాహనదారులతో కలిసి టోల్ ప్లాజాను ముట్టడించి, టోల్ వసూళ్లను అడ్డుకుంటామని పీక కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ అయితే బాపు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 24: కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతకాని గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5,430 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి సమయంలో మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అరెస్ట్ చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాటారం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్‌-100కు సమాచారం అందించాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం, జూలై 24: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టి. రామారావు (కేటీఆర్‌) జన్మదినాన్ని పురస్కరించుకుని ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా కాటారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగులు, వారి సహాయకుల కోసం కాటారం బీఆర్‌ఎస్‌ నాయకులు కుర్చీలను అందజేశారు. కాటారం పీహెచ్‌సీలో రోజురోజుకు బాహ్య రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సంబరాలకు దూరంగా ఉండి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడటమే కేటీఆర్‌ జన్మదినాన్ని నిర్వహించే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ చూపిన ‘సంబరాలు వద్దు – సేవనే ముద్దు’ అనే స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అలాగే కాటారం పీహెచ్‌సీని ప్రజల అవసరాలకు అనుగుణంగా **‘మినీ మాతా–శిశు ఆసుపత్రి’**గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మరోసారి కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కాటారం బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వరరావు, తోట జనార్ధన్, కొండ గొర్ల వెంకటస్వామి, లక్ష్మీ చౌదరి, మంతెన అర్చన, జక్కు శ్రవణ్, మానేం రాజబాబు, జాడి శ్రీశైలం, ఊరకొండ లింగయ్య, ఆత్కూరి బాలరాజు, కామెడీ ప్రమోద్, గాజుల విక్రం, మంతెన చిరంజీవి, మంతెన టోనీ, సకినాల ప్రశాంత్, ఉప్పు సంతోష్, రామిల్ల రాజు, కొండపర్తి రవి, తూటి మనోహర్, సంగటి రమణ రెడ్డి, మొరహరి చారి, వంగల రాజేంద్ర చారి, జాగరి మహేష్, పూత సంతోష్, రత్న రమేష్, జిముడ వంశీ, అంబటి సాగర్, పైడాకుల మహేందర్, శ్రీరాముల రజనీకాంత్, తోట సంపత్, మంతెన శ్రావణ్, కొలుగూరి సంతోష్, జంజర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ నాయకత్వం వహించారు. దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించేందుకు నాయకులు బయలుదేరుతున్న సమయంలో కాటారం పోలీసులు వారిని అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో కాటారం మండల కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను, నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని పాగె రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, మహాముత్తారం మండల బీజేపీ అధ్యక్షుడు మేడిపల్లి పూర్ణచందర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జయశంకర్ భూపాలపల్లి: రానున్న సీజన్‌లో ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ సూచనల మేరకు కాటారం మండల రైతులు పంట మార్పిడికి శ్రీకారం చుట్టారు. వరి సాగుకు బదులుగా పప్పుదినుసులు, కూరగాయల సాగును చేపడుతున్నారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారుల బృందం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను పరిశీలించింది. తక్కువ నీటితో సాగు చేయగల పప్పుదినుసులు, కూరగాయల ద్వారా నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు మంచి దిగుబడులు, మార్కెట్‌లో మెరుగైన ధరలు పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి బాపు రావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ కంటె, కాటారం మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఏఈఓలు పి. శ్రీకన్య, జె. రాజన్న, రైతులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: నీట్ పేపర్ లీక్, కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, విద్యార్థుల సమస్యలపై కాటారం చౌరస్తాలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కాటారం మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటివరకు రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై బీజేపీ నాయకులు మౌనం వహించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడులు చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హత్య అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిందని, అలాంటి కుటుంబానికి చెందిన నాయకులపై లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థినులు, మహిళలపై వేలాది మంది పోలీసులతో లాఠీచార్జీ చేయించడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు. దేశ యువత, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని గోప్యంగా ఉంచడం అప్రజాస్వామికమని ప్రభాకర్ రెడ్డి ఖండించారు. దేశంలో యువత సమస్యలపై పోరాడుతుంటే మతం పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నాయకులు విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. అమిత్ షా తన కుమారుడిని బీసీసీఐ కార్యదర్శిగా చేయడంలో చూపిన శ్రద్ధను దేశంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తును కాపాడటంలో చూపడం లేదని విమర్శించారు. విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగే వరకు, బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని వేమునూరి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూలై 20: కాటారం మండలం గుండా వెళ్లే జాతీయ రహదారి 353-సీపై మూగజీవాలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కాటారం పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు కాటారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఆవులు, బర్రెలు, లేగలు తదితర పెంపుడు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుండడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మూగజీవాలు రహదారిపై పడుకోవడం లేదా వాహనాలకు అడ్డుగా నిలవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మూగజీవాల యజమానులు తమ పశువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేయకుండా, తమకు చెందిన స్థలాలు లేదా పశువుల షెడ్లలోనే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ మూగజీవాలను రహదారులపై వదిలే యజమానులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత కోసం ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం : కాటారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టిటిడబ్ల్యూయూఆర్‌జేసీ (TTWURJC) బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థినికి ప్లాస్మోడియం ఫాల్సిపరం (PF) మలేరియా నిర్ధారణ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీహెచ్ మధుసూదన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సందీప్ ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో జిల్లా మలేరియా అధికారి ఏ. సుధాకర్, ఎపిడెమిక్ బృందం సభ్యులు హాస్టల్‌లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విద్యార్థినులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. హాస్టల్‌లోని వంటశాల, భోజనశాల, స్టోర్‌రూమ్, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల నివారణ కోసం హాస్టల్‌లోని అన్ని గదుల్లో ఆల్ఫా సైఫర్‌మెత్రిన్‌తో పిచికారీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరని, హాస్టల్‌లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. డాక్టర్ మౌనిక విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పర్సనల్ హైజీన్, సమతుల ఆహారం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంతకాని సడవలి, వార్డు సభ్యులు అక్కపాక మల్లయ్య తదితరులు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మున్వర్, జిల్లా మలేరియా అధికారి ఏ. సుధాకర్, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, ఎపిడెమిక్ బృంద సభ్యులు కపర్తి రాజు, ఊరుకొండ గోపీకృష్ణ, తలకోటి పరమేశ్వర్, సతీష్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.