కాటారం, జయశంకర్ భూపాలపల్లి: రానున్న సీజన్లో ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ సూచనల మేరకు కాటారం మండల రైతులు పంట మార్పిడికి శ్రీకారం చుట్టారు. వరి సాగుకు బదులుగా పప్పుదినుసులు, కూరగాయల సాగును చేపడుతున్నారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారుల బృందం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను పరిశీలించింది. తక్కువ నీటితో సాగు చేయగల పప్పుదినుసులు, కూరగాయల ద్వారా నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు మంచి దిగుబడులు, మార్కెట్లో మెరుగైన ధరలు పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి బాపు రావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ కంటె, కాటారం మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఏఈఓలు పి. శ్రీకన్య, జె. రాజన్న, రైతులు పాల్గొన్నారు.


Post A Comment: