పెద్దపల్లి:సుల్తానాబాద్:సెప్టెంబర్:16 :ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి బీటెక్ విద్యార్థి తాండ్ర అక్షితరాణి ఆత్మహత్యకు కారకులైన పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్,సింగరేణి ఓవర్ మెన్ బొమ్మకంటి రవికుమార్ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి..ప్రభుత్వం ఆకుటుంబానికి అండగా నిలవాలి...గోదావరిఖని లెనిన్ నగర్ లో తాత్కాలికంగా నివాసముంటున్న తాండ్ర అక్షిత రాణి 21 సంll,శనివారం 12 సెప్టెంబరు సాయంత్రం గడ్డి మందు తాగి13సెప్టెంబర్ 2026 ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందిన సంఘటనపై పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రేగడి మద్దికుంట గ్రామములో అక్షిత తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సేకరించిన వివరాలు.. ఎస్సీ దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాండ్ర ఐజాక్ పాస్టర్ రజితల కూతురు తాండ్ర అక్షితరాణి గర్రెపల్లిలో గురుకుల పాఠశాలలో పదవ తరగతి పాసై 2022లో మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలిటెక్నిక్ లో మైనింగ్ డిప్లమా చేస్తున్న కాలంలో రెండవ సంవత్సరములో ఆకాలేజీ లెక్చరర్(పాలిటెక్నిక్)జెట్టి నవీన్,అక్షితరాణిపై తీవ్రమైన లైంగిక వేధింపులు చేస్తే కుటుంబ సభ్యులు కాలేజీకి పోయి వేధింపులకు వ్యతిరేకంగా నవీన్ ను నిలదీస్తే అతను వారిని తీవ్రంగా బెదిరింపులు.భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు.ఆసందర్భంగా బెదిరిపోయిన అక్షిత తల్లిదండ్రులు మేనమామలు చదువు క్యారియర్ కోసం జాగ్రత్తతో పాలిటెక్నికు మైనింగ్ డిప్లవం కోర్సు పాస్ అయింది.డిప్లమా విద్యార్థులకు ఈసెట్ ఎంట్రెన్స్ ద్వారా మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ లో అడ్మిషన్లు భాగంగా అక్షిత ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాదులో అడ్మిషన్ తీసుకుంది.బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో అప్రెంటిషిప్ కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు గనుల ప్రాంతంలో గోదావరిఖని రామగుండం డివిజన్ 1 లోని 2 ఇంక్లైన్ బొగ్గు బావిలో జనవరి ఫిబ్రవరి 2026 లో 12 రోజుల అప్రెంటిషిప్ చేసింది. ఆ బొగ్గుగని మైనింగ్ సూపర్వైజర్ బొమ్మ కంటి రవికుమార్ అక్షితను వేధింపులకు గురి చేసిండు రవికుమార్ కూడా నస్పూర్ పాలిటెక్నిక్ లో మైనింగ్ డిప్లమా చదివినాడు రవికుమార్,నవీన్ లెక్చరర్ స్టూడెంట్ వీరిద్దరి మధ్యల చాలా సాన్నిత్యము ఉంది.కొద్ది రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి క్లాసులకు అక్షిత పోతున్న సందర్భంగా కూడా రవి కుమార్ వేధింపులు కొనసాగించాడు.ఈ వేధింపుల వల్ల కొద్ది రోజులు అక్షిత యూనివర్సిటీ క్లాసులకు పోకుండా ఇంటి దగ్గరే ఉంది,తిరిగి ఓయూ ప్రొఫెసర్ ను కలిసి 4వ సెమిస్టర్ లో జాయిన్ అయింది.అప్పుడు తన తల్లి తండ్రి మేనమామ,అడ్వకేట్ జీవన్ కుమారులతో కలిసి,అప్రెంటిషిప్ కాలంలో జీడికే టూయింగ్ లైన్ లో ఓవర్ మెన్ రవికుమార్ తనపై చేసిన వేధింపులపై రామగుండం డివిజన్ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.పోలీస్ స్టేషన్ లేదా సింగరేణి హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయమన్నాడు జిఎం..గత కొద్ది కాలంగా వర్క్ నాలెడ్జి కోసం గోదావరిఖని గౌతమి నగర్ లోని ఒక ఆటోమొబైల్ షాప్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా అక్షితారాణి పని చేస్తున్నది,12 సెప్టెంబర శనివారం సాయంత్రం డ్యూటీ నుండి గోదావరిఖని బస్టాండ్ కు ఆటోలో వస్తున్నానని తన తండ్రికి ఫోన్ చేసి బస్టాండ్ వద్దకు సాయంత్రం 6:30 గంటలకు రమ్మన్నది.కొద్దిసేపటికి తనకు వాంతులు అవుతున్నాయని గోదావరిఖని బస్టాండ్ వద్ద ఉన్నానని అక్షిత తండ్రికి ఫోన్ లో చెప్పింది వర్షం ఉన్నందున ఆటో తీసుకొని తండ్రి ఆమెను ఇంటికి రమ్మన్నాడు.కొద్ది సేపు తర్వాత ఫోన్ చేస్తే అక్షిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు.45 నిమిషాల తర్వాత ఏడున్నర గంటలకు అక్షిత తండ్రికి నవీన్ ఆమె ఫోన్ నుండి కాల్ చేసి,అక్షిత గడ్డి మందు తాగిందని చెప్పి ఆమరుక్షణమే వాళ్ల ఇంటి దగ్గరలోని చర్చి వద్దకు భారీ వర్షం కురుస్తున్న సమయంలో కారులో నవీను అక్షితను నోటి నుండి నురుగలు కక్కుతున్న స్థితిలో తీసుకువచ్చి అక్షిత తల్లిదండ్రులతో పాటు అతని కారులో గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ అడ్మిట్ చేయించారు.తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితికి లోనై 13 సెప్టెంబర్ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు అక్షిత మరణించారు.మొత్తం ఈ వ్యవహారంలో పాలిటెక్నిక్ లెక్చరర్ నవీన్ వేధింపులు రవికుమార్ల ఆగడాలతోనే మనస్థాపానికి గురై అక్షితరాణి ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా పౌర హక్కుల సంఘం నాయకులు భావించి ఈ పత్రిక ప్రకటన ద్వారా వివరిస్తున్నాం.గోదావరిఖనిలోని లెనిన్ నగర్ లో ప్రస్తుత నివాసముంటున్న అక్షిత తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని తమ సొంత గ్రామమైన రేగడి మద్దిగుంటకు అదే రోజు రాత్రి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు...డిమాండ్స్ 1.అక్షితరాణి ఆత్మహత్యకు కారకులైన పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్,సింగరేణి ఓవర్ మెన్ బొమ్మ కంటి రవికుమార్ లపై ఎస్సీ ఎస్టీ ఆస్ట్రాసిటీ కేసు నమోదు చేయాలి.వెంటనే ఆఇద్దరిని పోలీసులు అరెస్టు చేయాలి.2 అక్షిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.3.సింగరేణి రామగుండం డివిజన్ వన్1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ నిర్లక్ష్యంగా అక్షిత ఫిర్యాదుపై వ్యవహరించినందున చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి,4 పాలిటెక్నిక్ విద్యా సంస్థలు,సింగరేణి ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణ కోసం మహిళా ఉద్యోగులు,మహిళా ఆఫీసర్లు,పోలీస్ షీటీంల ఆధ్వర్యంలో మహిళా వేధింపుల నిరోధక కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి..5.బుధవారం వరకు ఈ సంఘటన పట్ల పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ లు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు,ఇది అత్యంత బాధ్యతారహిత్యం. జయహో అని పేర్కొన్నారు..ఈ నిజ నిర్ధారణలో పాల్గొన్న వారు మాదన కుమారస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌరహక్కుల సంఘం తెలంగాణ.9849548275నార వినోద్,ఉపాధ్యక్షుడు,పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ,బండారి రాజలింగం,బండి శంకర్ గౌడ్,బండి సతీష్ గౌడ్,ప్రజా సంఘాల నాయకుడు,మృతురాలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: