Articles by "Mahamutharam ( మహాముత్తారం )"
Showing posts with label Mahamutharam ( మహాముత్తారం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహా ముత్తారం, జూలై 19: కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల TPCC సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్టల వెంకటేష్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుట్టల వెంకటేష్ మాట్లాడుతూ, కొండగోర్ల బాపు సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, డివిజన్‌లోని గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులకు అండగా నిలుస్తూ, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేలా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొండగోర్ల బాపు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను కలుపుకొని వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని కొండగోర్ల బాపుకు శుభాకాంక్షలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహా ముత్తారం: సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాపుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్పంచుల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి కొండగోర్ల బాపు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్ కుమార్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశిరాజ్, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహా ముత్తారం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ముత్తారం మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై BLAలు, BLA సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. TPCC ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, SIR మండల ఇన్‌చార్జి అంగజాల అశోక్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి BLA సూపర్వైజర్ చురుకుగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన దరఖాస్తులు పూర్తి చేయించడంతో పాటు, హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ప్రజలకు సహాయం అందించాలని కోరారు. నిబంధనల ప్రకారం SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి, సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ అధ్యక్షుడు కొండగోర్ల బాపు, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ నాయకులు, BLAలు, BLA సూపర్వైజర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూలై 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతమైన మహాముత్తారంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద ప్రజలు సరైన సమయంలో చికిత్స పొందలేక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు తక్షణ వైద్యం అవసరమవుతోందని తెలిపారు. అదే విధంగా రాత్రింబవళ్లు పొలాల్లో శ్రమించే రైతులు పాము, తేలు కాట్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అవసరమైన మందులు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. స్థానిక అధికారులతో పాటు అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల వైద్య సేవలు ప్రారంభించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు రామగిరి రాజుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 14: మహా ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) డాక్టర్ డెప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం యామనపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో మహా ముత్తారం పీహెచ్‌సీ డాక్టర్‌ను డెప్యుటేషన్‌పై పంపడం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని విమర్శించారు. నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డెప్యుటేషన్ ఉత్తర్వులను రద్దు చేసి డాక్టర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న బీసీ హాస్టల్‌ను తరలించే ప్రయత్నాలను విరమించుకుని, యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించకపోతే మండలవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్ నాయక్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు, అయిత బాపు, మండల కో-కన్వీనర్ లింగమల్ల సడవలరావు, సురేష్, కాసర్ల రాజకుమార్, బానోత్ రాజు నాయక్, పులియాల దుర్గేష్, జనగామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం మహబూబ్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నం సారయ్య (60)ను ఆయన కుమారుడు రవీందర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవీందర్ గొడ్డలితో సారయ్యపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సారయ్య మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో విధులు నిర్వహించాల్సిన డ్యూటీ డాక్టర్‌ను నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌పై జిల్లా కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మహా ముత్తారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లు పోస్టింగ్‌లో ఉన్నప్పటికీ, వారిలో ఒకరు అధికారుల సిఫార్సులు, పైరవీలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య గ్రామీణ ప్రజల ఆరోగ్య హక్కులను దెబ్బతీసేదిగా ఉందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లను జిల్లా కేంద్రాలకు తరలించడం వల్ల స్థానిక పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత డాక్టర్ డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేసి, ఆయనను యథావిధిగా మహా ముత్తారం పీహెచ్‌సీకి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలని, లేనిపక్షంలో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహముత్తారం, జూలై 4 (న్యూస్): మహముత్తారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని కాటారంకు తరలించడం అన్యాయమని, ఇందుకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వార్డెన్ స్వయంగా నిర్ణయం తీసుకుని రాత్రికి రాత్రే హాస్టల్‌ను కాటారంకు తరలించడం తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వల్ల మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా మహముత్తారంలోని బీసీ బాలుర వసతి గృహం పేద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభ్యాసానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్టల్‌ను తరలించడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఇటీవల 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని, హాస్టల్ తరలింపుతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని బీసీ బాలుర వసతి గృహాన్ని తిరిగి మహముత్తారానికే తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్, కో-కన్వీనర్ రామగిరి రాజు, మండల చైర్మన్ ముక్కెర వెంకటస్వామి గౌడ్, మండల కన్వీనర్ లింగమల సడవాలిరావు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూన్ 11: మహాముత్తారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్‌ను నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం సడువలి పాల్గొన్నారు. అలాగే నేతకాని రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజబాబు నేత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాముత్తారం మండలం వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎస్సై రమేష్‌ను కోరారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత పాటిస్తూ మండల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎస్సై రమేష్, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. మహాముత్తారం మండల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దుర్గం సడువలి, రాజబాబు నేతలు ఎస్సై రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌కు చెందిన పంగ సురేష్, మారగోని బాపు (పులి బాపు), జాడి బాపులు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండ గొర్ల బాపు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, మార్క బాపు, మహిళా మండల ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గాదె రవీందర్, మహాముత్తారం టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకుడు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూన్ 10: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామంలోని బొడ్రాయి సమీపంలో ఓ ఇంటికి అత్యంత సమీపంలో విద్యుత్ తీగలు ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని భూపాలపల్లి సమాచార హక్కు చట్టం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కెర వెంకటస్వామి ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న తీగలను సురక్షిత ప్రాంతానికి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రమాద అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించే ముందు విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం, జూన్ 7: మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన భూక్యా నరేష్, భూక్యా సురేష్‌లపై అటవీశాఖ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారని, సంబంధిత అధికారులపై హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి న్యాయ విచారణ జరపాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం నిమ్మగూడెం గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ఆదివారం భూక్యా నరేష్ తన సొంత భూమిలో భూమి చదును పనులు చేపట్టేందుకు వెళ్లగా నిమ్మగూడెం బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రెడ్డిపల్లి బీట్ ఆఫీసర్ అఖిల్ రెడ్డి కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. నరేష్‌ను చంపే ఉద్దేశంతో పురుషాంగాలపై, కాళ్లపై కొట్టడంతో పాటు మెడపై నొక్కారని తెలిపారు. ఈ దాడిని అడ్డుకునేందుకు వచ్చిన భూక్యా సురేష్‌పై కూడా కర్రలతో దాడి చేసి, శరీరంలోని పలు భాగాలపై తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. వారి అరుపులు విని సమీపంలోని రైతులు, గ్రామస్తులు వచ్చి విడిపించారని తెలిపారు. దాడి కారణంగా ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా, గ్రామస్తులు పోలీసుల సహకారంతో అంబులెన్స్‌లో భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఇదే సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోందని పీక కిరణ్ విమర్శించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, సంబంధిత అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా ఎస్పీ, ఎస్సీ-ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు, మండల కోఆర్డినేటర్ పుల్యాల సురేష్, వావిళ్ల సడవలి, గోల్కొండ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం మండలంలోని మీనాజిపేట గ్రామంలో “మొదటి 1000 రోజులు – బిడ్డ జీవితానికి బలమైన పునాది” అనే అవగాహన కార్యక్రమాన్ని ఈఓ నిహారిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భధారణ దశ నుండి బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్ల వయస్సు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు, గ్రామస్తులకు వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, అదనపు పౌష్టికాహారం, బాలల అభివృద్ధి మైలురాళ్లు, బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పాటించాల్సిన 6 ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లి మరియు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం మండలం (రెడ్డిపల్లి): మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖకు కొత్త అధ్యక్షునిగా ధరం సోత్ సారయ్యను నియమించారు. ఈ నియామకం ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి, నూతన అధ్యక్షుడికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC లింగమళ్ల శారద దుర్గయ్య, గ్రామ సర్పంచ్ సగుళం అనసూయ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశీ రాజ్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మాజీ ZPTC మడిపల్లి సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ వేముల మధుకర్ గౌడ్, నాయకులు నూకల రవి, సాగుళం నర్సింహా తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ధరం సోత్ సారయ్య తెలిపారు.