మహా ముత్తారం, జూలై 14: మహా ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) డాక్టర్ డెప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం యామనపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో మహా ముత్తారం పీహెచ్‌సీ డాక్టర్‌ను డెప్యుటేషన్‌పై పంపడం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని విమర్శించారు. నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డెప్యుటేషన్ ఉత్తర్వులను రద్దు చేసి డాక్టర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న బీసీ హాస్టల్‌ను తరలించే ప్రయత్నాలను విరమించుకుని, యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించకపోతే మండలవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్ నాయక్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు, అయిత బాపు, మండల కో-కన్వీనర్ లింగమల్ల సడవలరావు, సురేష్, కాసర్ల రాజకుమార్, బానోత్ రాజు నాయక్, పులియాల దుర్గేష్, జనగామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: