Articles by "Mahadevapur ( మహాదేవపూర్ )"
Showing posts with label Mahadevapur ( మహాదేవపూర్ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కోట రాజబాబు, వామన్‌రావు, రామారావు, మహాదేవపూర్ ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ గౌరవ సభ్యులు, మైనార్టీ సెల్ బ్లాక్ అధ్యక్షుడు అస్రార్, ఇర్షాద్, కోట సమ్మయ్య, శివరాజు, రవిచంద్ర, రాఘవేంద్ర, చక్రధర్, కొయ్యల సత్యం, తడకల జగదీశ్వర్, నాగరాజు, మాజీ ఎంపీటీసీ గంగులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో విశేష మార్పు తీసుకువచ్చాయని కొనియాడారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాదేవపూర్: మహాదేవపూర్ మండలంలో స్థానిక పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో సైబర్ భద్రత, గంజాయి మత్తు పదార్థాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత గంజాయికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని వివరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు..ఈ అవగాహన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ పాల్గొని, ప్రజలు పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు, యువత, వివిధ వర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్, జూన్ 6 : మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో మొక్కలు నాటారు. "పచ్చదనాన్ని పెంచుదాం – ప్రకృతిని పరిరక్షిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల ద్వారా స్వచ్ఛమైన గాలి, నీడ లభించి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. "ప్రకృతి ఉంటేనే ప్రగతి – పర్యావరణం ఉంటేనే మనుగడ" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్ల సమ్మిరెడ్డి, వార్డు సభ్యుడు సోయం శశికాంత్, గ్రామ కార్యదర్శి చల్లూరి ఇందిర, ఫీల్డ్ అసిస్టెంట్ సల్ల రాజశేఖర్, యువకులు సల్లం రాజు, మంచినీళ్ళ రాజబాపు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్, మే 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ శివారులో ఉన్న ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రమాదంలో గెస్ట్ హౌస్‌తో పాటు అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, ఇతర విలువైన సామగ్రి, సిబ్బందికి చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గెస్ట్ హౌస్ ఇన్‌చార్జ్ తపాస్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అగ్నిప్రమాదంలో జరిగిన మొత్తం నష్టం సుమారు రూ.1,48,11,795 (ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు)గా అంచనా వేశారు. సమాచారం అందుకున్న మహాదేవపూర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహాదేవపూర్ ఎస్‌ఐ కె. పవన్ కుమార్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.