Articles by "Peddapalli ( పెద్దపల్లి )"
Showing posts with label Peddapalli ( పెద్దపల్లి ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,రామగిరి,సెప్టెంబర్ 3 : రామగిరి మండలం చందనపూర్ గ్రామ పంచాయతీలో గురువారం ఎస్ఐఆర్ వెరిఫికేషన్ గ్రామసభ నిర్వహించారు..రామగిరి మండల్ ఎమ్మార్వో సుమన్, పాల్గొని సుమారు 250 ఓటర్ ఐడి కార్డులను సరి చేశారు. ఇంకెవరైనా నోటీసు వచ్చిన వారు ఉంటే బిఎల్ఓ శ్రీలతకు ఇచ్చి సరి చేసుకోవాలని ఎమ్మార్వో తెలిపారు..ఈ కార్యక్రమంల డిటి మానస,జిపిఓ వెంకటేశ్వర్లు,సర్పంచ్ కొండ మంజుల,ఉపసర్పంచ్ రజిత-రమ్ చందర్,మాజీ మండల కోఆప్షన్ యండి.ఇబ్రహీం,వార్డ్ మెంబర్స్ సౌందర్య-కుమర్,బాగే రాజు,కుమారస్వామి,బి ఎల్ఓ షాహిద్,యెరవెల్లి సాయికిరణ్,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

పెద్దపల్లి,గోదావరిఖనిలో,ఆగస్టు,7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో,రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో తెలంగాణ ఉద్యమకారుల సమితి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమితి గోదావరిఖని ఆఫీసులో రాష్ట్ర మహిళా కమిటీ జిల్లా మహిళా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలుగా అనుముల కళావతి రాష్ట్ర కార్యదర్శిగా తోడేటి స్వరూప రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కోడిపుంజుల జ్యోతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా గంగారపు శాంతలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది మేకల సరోజన జిల్లా ఉపాధ్యక్షురాలుగా పున్నం మంజుల జిల్లా కార్యదర్శిగా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ తమ హక్కులు,సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అన్నారు.ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయడం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.హామీల అమలులో ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తోడేటి శంకర్ గౌడ్ తెలిపాడు,ఉద్యమకారులంతా పార్టీలు,వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడడం,వారి సంక్షేమాన్ని నిర్ధారించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అనిఆయన పేర్కొన్నారు.సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం,సభ్యత్వ నమోదు,ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ,రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.కమిటీని మరింత పటిష్టం చేసి ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి నగునూరి రాజయ్య గౌడ్ చీఫ్ అడ్వైజర్,జనరల్ సెక్రటరీ చిలుక శంకర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు,ఎరుకల పోసక్క ఈదునూరి పద్మ,జున్ను రమాదేవి,గంగారపు శాంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని ఆగస్టు,7: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఎన్నికైన ఏసిఎంఓ గా నియమితులైన డాక్టర్ ప్రసన్నకుమార్ ను ఘనంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపి స్వీట్లు తినిపించి బహుమతి ప్రధానం చేశారు.ఆల్ ఇండియా అంబేద్కర్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్,ఈ కార్యక్రమంలో కొంకటి కుటుంబ సభ్యులు,కొంకటి వెంకటేష్,కొంకటి పులేబాబు,కొంకటి సిద్ధార్థ.కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పేద్దపల్లి :ఏడుగురు అరెస్ట్..రూ.35,200 నగదు,ఏడు మొబైల్ ఫోన్లు,52 పేకముక్కలు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి నాగేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.35,200 నగదు,52 పేకముక్కలు,ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం..నాగేపల్లి గ్రామంలోని ఓ నివాస గృహంలో నగదును పందెంగా పెట్టుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో రామగిరి పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.దాడి సమయంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద ఉన్న నగదు,పేకముక్కలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,పేకాట,జూదం,మాదకద్రవ్యాల విక్రయం,అక్రమ మద్యం తయారీ,గుట్కా అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలకు చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని,ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

పెద్దపల్లి, మే 31: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కార్మికులు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,మే,16 పోరాట దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు.2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు,నేటి బీఆర్ఎస్ పార్టీ మంథనికి స్వాతంత్రం వచ్చిన రోజు,మంథని ప్రజాస్వామ్య పోరాటం–మే16విముక్తి దినాన్ని పురస్కరించుకొని,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు రామగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని ముస్త్యాల గ్రామంలో శనివారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్లను పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.తీవ్ర ఎండల మధ్య కూలీలకు చల్లని మజ్జిగ అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.సమాజసేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాసినేని వినోద్–సత్యనారాయణరావు మరియు సుందిళ్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొడ్డుపెల్లి రవి,గోశిక నరసయ్య,కాశిపేట ప్రశాంత్,మద్దెల కొమురయ్య,రైతు రమేష్,సుందిళ్ల సతీష్,బొండ్రా అంజయ్య,ఆవులూరి సాగర్,సాధుల సందీప్,బొడ్డుపెల్లి రాకేష్,సిద్ధ శేఖర్,సుధమల్ల రోహిత్,పులి అభిలాష్,కంది గురువయ్య,రామగిరి కృష్ణ,అవునూరి రాజేశం,ఎలుకటూరి అరవింద్,బొడ్డుపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం పుట్ట మధుకర్ ఆశయమని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,మే,12 : ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.ముస్త్యాల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,అభిషేకము అర్చనలు నిర్వహించి గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.మరియు సంపత్తి భోజనం కూడా ఏర్పాటు చేశారు.ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో గ్రామ సర్పంచ్ సుంకరి మహేందర్-మాధవి,ఉపసర్పంచ్ బాసినేని వినోద-సత్యనారాయణరావు, వార్డుసభ్యులు,గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,మే,1: కార్మిక హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి-సిఐటియు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు ఆర్జి -2ఏరియా కార్యాలయంలో శుక్రవారం 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు బానోత్ వినయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా మేడే జెండాను ఆవిష్కరించిన ఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడరు,చికాగో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని దినానికి నేడు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.12 గంటల పని దినం,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన,ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్-2020'ద్వారా కార్మికులతో 12 గంటల వరకు పని చేయించుకునే వెసులుబాటును కల్పించడం అత్యంత దుర్మార్గమని,దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.​ప్రభుత్వ జీవోల వైఖరి తో కేవలం పెట్టుబడిదారుల లాభాల కోసం 8 గంటలకు బదులు 10 గంటల పనిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవో నెంబర్ 282 వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.శ్రమ దోపిడీకి పరాకాష్టగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి,ఎల్&టి సుబ్రహ్మణ్యం వంటి కార్పొరేట్ శక్తులు వారంతపు సెలవులు లేకుండా 18 గంటల వరకు పనిచేయాలని కోరడం ఆధునిక బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. కార్మికులకు రక్షణ కవచాలుగా ఉన్నటువంటి 44 చట్టాలను ఈ4లేబర్ కోడ్స్ చేయడం  వల్ల కార్మికులకు కనీస వేతనం,పీఎఫ్,ఈఎస్ఐ వంటి సౌకర్యాలు దూరం కావడమే కాకుండా,పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో ఎఫ్ టిఇ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నియామకాలతో ఉద్యోగ భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉల్లి మొగలి,శ్రీహరి,మంద భూమయ్య,లక్ష్మీరాజం,వినేష్,తిరుపతి,శివకుమార్,రమేష్, శ్రావణ్,రాకేష్,లక్ష్మీనారాయణ,రాములు,రవీందర్,రాజు,ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్,28 : సింగరేణి సంరక్షణకై–మొండి  బకాయిలు వెంటనే చెల్లించాలి:సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు)డిమాండ్:సింగరేణి కాలరీస్ సంస్థను ఆర్థిక సంక్షోభం నుండిగట్టెక్కించాలని,జెన్‌కో(టిజిజిఇన్కో)ట్రాన్స్‌కోసంస్థలు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ,మంగళవారం హైదరాబాద్ విద్యుత్ సౌదా  వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించరు,అనంతరం యూనియన్ నాయకులు(టిజీజీఇఎన్ సిఓ)ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడరు.​ఆర్థిక సంక్షోభంతో సింగరేణి సంస్థలో సుమారు 40,000 మంది శాశ్వత ఉద్యోగులు,27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సింగరేణి సంస్థ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.కార్మికుల జీతభత్యాలు,సంక్షేమ పథకాలు,కనీస పనిముట్లు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి కీలకమైన హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ,డీజిల్ డోజర్లు,భూగర్భగనులలో  ఎల్ హెచ్ డి మిషనరీలు  కొనుగోలుకు కూడా నిధుల కొరత ఏర్పడటం శోచనీయం,డబ్బులు లేక సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని,రక్షణని గాలికి వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందిఅని,భారీగా పేరుకుపోయిన బకాయిలు, 2014 నుండి ఇప్పటివరకు విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు,46,000 కోట్లకు చేరుకున్నాయి.ఇప్పటివరకు జన్కోనుండి రూ.19000 కోట్లు బకాయిలు,ట్రాన్స్కో నుండి 27000 కోట్లు బకాయి ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.గత రెండేళ్లలోనే(2023-25) వరకు 10,000 కోట్లు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంఅని అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు,ప్రభుత్వ గ్యారెంటీతో బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి,ఇతర ప్రభుత్వ సంస్థలైన జెన్‌కో,ట్రాన్స్‌కోల నుండి బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది,ఒక ప్రభుత్వ సంస్థను కాపాడటానికి మరో సంస్థ బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తపరిచారు: డిమాండ్లు(టిజిజిఇన్కో),ట్రాన్స్‌కో నుండి రావాల్సిన.46,000 కోట్ల బకాయిలను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలి.సింగరేణి కార్మికుల సంక్షేమానికి,సంస్థ అభివృద్ధికి ఆటంకం కలగకుండా నిధులు విడుదల చేయాలి.బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చే పరిస్థితి నుండి సంస్థను విముక్తి చేయాలని పేర్కొన్నారు,​ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్,రాష్ట్ర అధ్యక్షులు మందా నర్సింహారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి,ఆర్టి-టూఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్,అధ్యక్షులు బానోత్ వినయ్ లు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్ 20: పెద్దపల్లి,అనారోగ్యంతో పోరాడుతున్న డయాలసిస్ రోగికి సమాజం నుంచి అందిన సహాయం మరోసారి మానవత్వాన్ని ప్రతిబింబించింది.పెద్దపల్లి పట్టణానికి చెందిన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో,సోమవారం,తురకల మద్దికుంట గ్రామానికి చెందిన డయాలసిస్ బాధితుడు రాచకొండ లక్ష్మణ్‌కు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ములుగురి కమల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ములుగురి కమల్ మాట్లాడరు,శివసాయి సంస్థ తమ లాభాల్లో భాగాన్ని కష్టాల్లో ఉన్నవారికి పంచడం గొప్ప విషయం అని అన్నారు.ఇటువంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు.సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.శివసాయి సంస్థ చైర్మన్,డైరెక్టర్లు పెద్దపల్లి ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు ప్రశంసనీయం అని కమల్ అన్నారు.సంస్థ సేవలు వ్యాపార అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ,పెద్దపల్లి బ్రాంచ్‌లో కూడా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ సూచించారు.ప్రభుత్వం అందజేస్తున్న స్కూల్ యూనిఫాంల కుట్టు పనులను మహిళలకు అప్పగించేలా చైర్మన్,కమిషనర్‌లతో చర్చించి వారికి ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.శివసాయి సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు.కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలో సమాజం ముందుకు రావడం అవసరమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు