పెద్దపల్లి,గోదావరిఖని,మే,16 పోరాట దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు.2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు,నేటి బీఆర్ఎస్ పార్టీ మంథనికి స్వాతంత్రం వచ్చిన రోజు,మంథని ప్రజాస్వామ్య పోరాటం–మే16విముక్తి దినాన్ని పురస్కరించుకొని,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు రామగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని ముస్త్యాల గ్రామంలో శనివారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్లను పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.తీవ్ర ఎండల మధ్య కూలీలకు చల్లని మజ్జిగ అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.సమాజసేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాసినేని వినోద్–సత్యనారాయణరావు మరియు సుందిళ్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొడ్డుపెల్లి రవి,గోశిక నరసయ్య,కాశిపేట ప్రశాంత్,మద్దెల కొమురయ్య,రైతు రమేష్,సుందిళ్ల సతీష్,బొండ్రా అంజయ్య,ఆవులూరి సాగర్,సాధుల సందీప్,బొడ్డుపెల్లి రాకేష్,సిద్ధ శేఖర్,సుధమల్ల రోహిత్,పులి అభిలాష్,కంది గురువయ్య,రామగిరి కృష్ణ,అవునూరి రాజేశం,ఎలుకటూరి అరవింద్,బొడ్డుపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం పుట్ట మధుకర్ ఆశయమని పేర్కొన్నారు.

Post A Comment: