Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పెద్దపల్లి,గోదావరిఖని,జనవరి,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ) గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం గోదావరిఖనిలోని అదనపు జిల్లా(ఏడిజే)న్యాయస్థానం,మున్షిఫ్ కోర్ట్ కాంప్లెక్స్ లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు ఆయా కోర్టులలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు,ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి లు ఆవిష్కరించారు.అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు,విధులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దేశ అభివృద్ధిలో పాలుపంచు కోవాలన్నారు.అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన బార్ అసోసియేషన్ లోగోను న్యాయ మూర్తి టి శ్రీనివాసరావు"ఖని"ఏసీపీ మడత రమేష్ లు,ఆవిష్కరించారు.ఇటీవల మృతి చెందిన ముస్త్యాల గ్రామానికి చెందిన"ఖని" న్యాయవాది గోసిక ప్రకాష్ స్మారక క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పలువురికి బహుమతులను ప్రదానం చేశారు.బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ అధ్యక్షతనా జరిగిన ఈ కార్యక్రమలో,బార్ అసోసియేషన్ నాయకులు ముచ్చకుర్తి కుమార్,ఉపాధ్యక్షులు దేశెట్టి అంజయ్య క్రీడా కార్య దర్శి ఎరుకల ప్రదీప్ కుమార్,కోశాధికారి ఎండి.ఉమర్,పెర్క మనోహర్,డి.గోపాల్ రెడ్డి,పంగ శంకర్,రాగం శ్రీధర్,పులిపాక రాజ్ కుమార్,శోభ,సబా తబస్సుం,గాదె శ్రీలత సీనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్,వన్ టౌన్ సీఐ ఏ.ఇంద్రసేనరెడ్డి,సీనియర్ జూనియర్ న్యాయవాదులు జాగీరు రాజయ్య,మేడ చక్రపాణి,పెట్టేం శ్రీనివాస్,సీతాకారి చంద్ర శేఖర్,గుర్రాల రాజేందర్ అసంపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు...


