కాటారం, జూన్ 18 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల ఉపాధ్యక్షుడు చీర్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమై ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, నాయకులు బండము మల్లారెడ్డి, గోగుల రాజేష్, కొండ రామ్, వార్డు సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, జిలేష్, గండు మల్లారెడ్డి, గండు తిరుపతి, చీర్ల చంద్రశేఖర్, వడ్ల రవీంద్రాచారి, సురేష్, రత్నాకర్, నరేష్, జగదీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: