కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కాటారం, మహాముత్తారం, మల్హర్రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), బీఎల్వో పర్యవేక్షకులకు కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారి, కాటారం, మహాముత్తారం, మల్హర్రావు తహసీల్దార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అమలు విధానం, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయి బాధ్యతలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించారు.మూడు మండలాలకు చెందిన బీఎల్వోలు, బీఎల్వో పర్యవేక్షకులు శిక్షణలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.
Post A Comment: