కాటారం, ఆగస్టు 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామానికి చెందిన మారపాక ఏలారి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చికిత్సకు అనుకూలంగా లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ చిదినేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జూకంటి రమేష్ ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని సానుకూలంగా పరిశీలించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా రూ.2 లక్షల 20 వేల విలువైన ఎల్వోసీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ ఆర్థిక సహాయంతో చికిత్స కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఎల్వోసీ పత్రాలను అందుకున్న మారపాక ఏలారి, వారి కుటుంబ సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను వెంటనే గుర్తించి, వైద్య సహాయం అందించడంలో ప్రత్యేక చొరవ చూపిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జూకంటి రమేష్కు కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నారని వారు తెలిపారు.
Home
Chidnepally (చిదినేపల్లి )
అనారోగ్య బాధితుడికి మంత్రి శ్రీధర్ బాబు అండ.. రూ.2.20 లక్షల ఎల్వోసీ మంజూరు

Post A Comment: