Articles by "POLITICS ( రాజకీయం )"
Showing posts with label POLITICS ( రాజకీయం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి, : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలు, రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఐదుగురు అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి.

భూపాలపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి అవధూత కవిత,

18వ వార్డు నుంచి గాజ వేణుగోపాల్,

22వ వార్డు నుంచి కౌటం సౌమ్య,

28వ వార్డు నుంచి ఇనుగాల ప్రణయ్ రాజ్,

29వ వార్డు నుంచి మామిడి శ్రీకాంత్ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు.


ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, తెలంగాణలో బహుజనుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతోందని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ఇతర పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు మన బహుజన అభ్యర్థులకు మన పార్టీ నుంచే బీ-ఫారాలు అందజేయడం గర్వకారణమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన టీఆర్పీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్పీ పార్టీ అభ్యర్థులు ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.పి.కే సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సంతోష్, శ్రీకాంత్, సిద్ధు, జస్వంత్, కోటేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ కీలక అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం అత్యంత గంభీరంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరై సునేత్ర పవార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన విషాదకర విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ మృతి చెందడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల అనంతరం సునేత్ర పవార్‌ను ఉపముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తూ అధికార కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పరిపాలనా స్థిరత్వం కొనసాగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. సునేత్ర పవార్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో విశేష గుర్తింపు సంపాదించారు. మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, విద్యా రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన నాయకత్వం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆమె ప్రమాణస్వీకారంతో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సునేత్ర పవార్‌ మాట్లాడుతూ, “ఈ పదవి నాకు గౌరవంతో పాటు బాధ్యతను కూడా ఇస్తోంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తాను” అని అన్నారు. అలాగే అజిత్ పవార్‌ ఆశయాలను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు. సునేత్ర పవార్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మహిళా నాయకత్వానికి ఇది చారిత్రక మలుపుగా నిలవనుందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

मुंबई : महाराष्ट्राच्या राजकीय इतिहासात एक महत्त्वाचा टप्पा नोंदवला गेला आहे. राज्याच्या पहिल्या महिला उपमुख्यमंत्री म्हणून सुनैत्रा पवार यांनी आज शपथ घेतली. राजभवन येथे पार पडलेल्या शपथविधी सोहळ्यात राज्यपालांच्या उपस्थितीत त्यांनी पद व गोपनीयतेची शपथ घेतली. या ऐतिहासिक क्षणाचे साक्षीदार म्हणून अनेक मान्यवर नेते, मंत्री आणि वरिष्ठ अधिकारी उपस्थित होते. अलीकडेच झालेल्या दुर्दैवी विमान दुर्घटनेत उपमुख्यमंत्री अजित पवार यांचे निधन झाले होते. या घटनेनंतर राज्याच्या राजकारणात मोठी पोकळी निर्माण झाली होती. प्रशासन आणि सरकारची घडी विस्कळीत होऊ नये, यासाठी सत्ताधारी पक्षाने महत्त्वपूर्ण निर्णय घेत सुनैत्रा पवार यांच्यावर उपमुख्यमंत्रीपदाची जबाबदारी सोपवली. सुनैत्रा पवार या सार्वजनिक जीवनात फारशा सक्रिय नसल्या तरी सामाजिक कार्य, महिला सक्षमीकरण आणि ग्रामीण विकासाशी संबंधित उपक्रमांमध्ये त्यांचा सहभाग उल्लेखनीय राहिला आहे. त्यांच्या अनुभवाचा आणि सामाजिक बांधिलकीचा विचार करूनच हा निर्णय घेण्यात आल्याचे राजकीय वर्तुळात सांगितले जात आहे. शपथविधीनंतर प्रतिक्रिया देताना सुनैत्रा पवार म्हणाल्या, “राज्याच्या पहिल्या महिला उपमुख्यमंत्रीपदाची जबाबदारी मिळणे हे माझ्यासाठी सन्मानासोबतच मोठे आव्हान आहे. महाराष्ट्राच्या विकासासाठी आणि जनतेच्या हितासाठी प्रामाणिकपणे काम करेन.” तसेच स्वर्गीय अजित पवार यांच्या कार्याचा आणि विचारांचा वारसा पुढे नेण्याचा निर्धारही त्यांनी व्यक्त केला. सुनैत्रा पवार यांच्या शपथविधीमुळे महाराष्ट्राच्या राजकारणात महिलांच्या नेतृत्वाला नवे बळ मिळाले असून, हा निर्णय भविष्यातील राजकीय वाटचालीसाठी दिशादर्शक ठरेल, अशी प्रतिक्रिया विविध स्तरांतून व्यक्त होत आहे.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ముంబై/బారామతి: మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు వర్గాల పునఃకలయికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుండగా, మరోవైపు శరద్ పవార్‌తో అజిత్ కుమారుడు పార్థ్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బారామతిలో జరిగిన ఈ భేటీ సుమారు గంటకు పైగా కొనసాగినట్లు సమాచారం. NCP భవిష్యత్‌, రెండు వర్గాల ఐక్యత, పార్టీ పునర్నిర్మాణం అంశాలపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య పెరుగుతున్న సంకేతాలు ఈ భేటీకి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఇక అజిత్ పవార్ వర్గం ఇప్పటికే మహాయుతి ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతుండగా, శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్ పవార్) భవిష్యత్ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రెండు వర్గాలు ఒక్కటైతే, మహాయుతిలో NCP స్థానం కొనసాగుతుందా? లేక కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే, అది కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా రాజకీయ సంకేతంగా భావించాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది శరద్ పవార్ వర్గానికి పంపిన సందేశమా? లేక కలయికకు ముందడుగుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పవార్ కుటుంబంలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ‘మహా’ కలయికకు దారి తీస్తాయా? లేక అధికార సమీకరణాల్లో కొత్త చీలికలను తెస్తాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర రాజకీయాలు పవార్ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయన్నది విశ్లేషకుల మాట.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

मुंबई/बारामती: महाराष्ट्राच्या राजकारणात पुन्हा एकदा मोठ्या घडामोडींना वेग आला आहे. राष्ट्रवादी काँग्रेस पार्टी (NCP)च्या दोन गटांच्या संभाव्य एकत्रिकरणाबाबत राज्यभरात उत्सुकता शिगेला पोहोचली आहे. अशाच पार्श्वभूमीवर उपमुख्यमंत्री अजित पवार यांच्या पत्नी सुनेत्रा पवार आज काही तासांत उपमुख्यमंत्री पदाची शपथ घेणार असल्याची चर्चा सुरू असताना, दुसरीकडे अजित पवार यांचे पुत्र पार्थ पवार यांनी राष्ट्रवादीचे ज्येष्ठ नेते शरद पवार यांची बारामतीत भेट घेतली आहे. बारामती येथे झालेली ही भेट सुमारे तासभर चालल्याची माहिती आहे. या भेटीत राष्ट्रवादी काँग्रेसचे भवितव्य, दोन गटांमधील मतभेद, तसेच पक्षातील संभाव्य एकजूट यावर सविस्तर चर्चा झाल्याचे राजकीय वर्तुळात सांगितले जात आहे. अलीकडच्या काळात शरद पवार गट आणि अजित पवार गट यांच्यात वाढत असलेले संवाद या भेटीला विशेष महत्त्व देत आहेत. सध्या अजित पवार गट महायुती सरकारमध्ये सहभागी असून, शरद पवार यांच्या नेतृत्वाखालील राष्ट्रवादी काँग्रेस (शरद पवार)ची पुढील भूमिका काय असेल, याबाबत प्रश्न उपस्थित होत आहेत. जर दोन्ही गट एकत्र आले, तर महायुतीमध्ये राष्ट्रवादीची भूमिका कायम राहणार का, की राज्याच्या राजकारणात नवे समीकरण आकाराला येणार, याकडे सर्वांचे लक्ष लागले आहे. दरम्यान, सुनेत्रा पवार यांच्या उपमुख्यमंत्री पदाच्या शपथविधीकडेही केवळ प्रशासकीय नव्हे, तर राजकीय दृष्टिकोनातून पाहिले जात आहे. हा निर्णय शरद पवार गटासाठी एखादा राजकीय संदेश आहे का, की संभाव्य एकत्रिकरणाच्या दिशेने टाकलेले पाऊल आहे, यावर तर्कवितर्क लढवले जात आहेत. एकूणच पवार कुटुंबातील या घडामोडींमुळे महाराष्ट्राच्या राजकारणात ‘महा’ एकत्रिकरण होणार का, की नव्या राजकीय संघर्षाला तोंड फुटणार, याबाबत संभ्रम कायम आहे. येणारे काही दिवस राज्याच्या राजकारणाच्या दृष्टीने अत्यंत निर्णायक ठरणार असल्याचे राजकीय विश्लेषकांचे मत आहे.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను డిప్యూటీ సీఎంగా నియమించే అంశంపై అధికార వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు ఆమె ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఎన్సీపీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తు వ్యూహం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా పూణే జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఈ క్రమంలో సునేత్రా పవార్‌కు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పార్టీ సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సునేత్రా పవార్‌కు డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రిత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ శాఖలు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యత కలవిగా ఉండటంతో ఆమె పాత్ర మరింత కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, మహిళా ఓటర్లను ఆకర్షించడం, ఎన్సీపీకి కొత్త ఉత్సాహం తీసుకురావడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రమాణస్వీకారం ఉంటుందా? లేక చర్చల వరకే పరిమితమవుతుందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే గంటల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


मुंबई: महाराष्ट्राच्या राजकारणात आणखी एक महत्त्वाचा निर्णय होण्याची शक्यता निर्माण झाली आहे. उपमुख्यमंत्री अजित पवार यांच्या पत्नी सुनेत्रा पवार यांना उपमुख्यमंत्रीपद देण्याबाबत सत्ताधारी वर्तुळात जोरदार चर्चा सुरू आहे. उद्या सायंकाळी ५ वाजता त्यांचा शपथविधी होण्याची शक्यता असल्याची माहिती राजकीय सूत्रांकडून मिळत आहे. या पार्श्वभूमीवर मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्याशी राष्ट्रवादी काँग्रेस पक्षाच्या (एनसीपी) प्रमुख नेत्यांनी आज बैठक घेतली. आगामी स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुका, विशेषतः पुणे जिल्हा परिषद निवडणूक लक्षात घेऊन पक्षाला स्पष्ट दिशा देण्यासाठी महत्त्वाचे निर्णय घेण्याची गरज असल्याचे या बैठकीत मांडण्यात आले. सुनेत्रा पवार यांना उपमुख्यमंत्रीपदासह उत्पादन शुल्क (एक्साईज) आणि क्रीडा विभागाची जबाबदारी देण्याची शक्यता वर्तवली जात आहे. हे विभाग राजकीय आणि प्रशासकीयदृष्ट्या महत्त्वाचे असल्याने त्यांच्या भूमिकेकडे सर्वांचे लक्ष राहणार आहे. अजित पवार यांच्या राजकीय वारशाला पुढे नेण्यासाठी तसेच पक्षाला नवी ऊर्जा देण्यासाठी हा निर्णय घेतला जाऊ शकतो, अशी चर्चा आहे. महिलांचा सहभाग वाढवणे, ग्रामीण भागात पक्षाची पकड मजबूत करणे आणि संघटनात्मक बांधणी अधिक प्रभावी करणे हा या निर्णयामागील उद्देश असल्याचे मानले जात आहे. मात्र, या संदर्भात अद्याप अधिकृत घोषणा झालेली नाही. उपमुख्यमंत्रीपदाचा निर्णय अंतिम होणार की केवळ चर्चा स्तरावरच राहणार, याकडे राज्यातील राजकीय वर्तुळाचे लक्ष लागले आहे. येत्या काही तासांत याबाबत स्पष्टता येण्याची शक्यता आहे.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిపోయిన రెండు వర్గాలు తిరిగి ఏకం కావాలనే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. NCP, NCP–శరద్ పవార్ (NCP-SP) వర్గాల రీయూనియన్‌పై ఫిబ్రవరి రెండో వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు, ప్రజల్లో స్పందనను దృష్టిలో పెట్టుకుని గత కొన్ని నెలలుగా అజిత్ పవార్–శరద్ పవార్ మధ్య అంతర్గతంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ నిర్మాణం, కూటమి రాజకీయాలపై పలు దఫాలుగా సమావేశాలు జరిగినట్లు సమాచారం. అజిత్ పవార్ మరణం తర్వాత ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయని, పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలనే అభిప్రాయం బలపడినట్లు తెలుస్తోంది. విలీనం జరిగితే NCP మహాయుతి కూటమిలోనే కొనసాగుతుందన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ–శివసేన (శిండే వర్గం)తో కలిసి ముందుకు సాగాలన్న వ్యూహమే ప్రస్తుతం పార్టీ పెద్దల ఆలోచనగా టాక్. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ విభజన వల్ల కోల్పోయిన రాజకీయ బలం తిరిగి సాధించడమే ఈ విలీనానికి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. రాష్ట్రస్థాయిలో సునేత్రా పవార్ లేదా ప్రఫుల్ పటేల్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముందని సమాచారం. మరోవైపు జాతీయ స్థాయిలో శరద్ పవార్ నాయకత్వం కొనసాగుతుందని, ఆయన మార్గదర్శకత్వంలో పార్టీ కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లనుందని టాక్. యువ నాయకత్వానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విలీనం అమలైతే మహా వికాస్ అఘాడీకి ఇది భారీ రాజకీయ షాక్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న NCP పూర్తిగా మహాయుతి వైపు మొగ్గు చూపితే, ప్రతిపక్ష శక్తి సమీకరణాలు బలహీనపడే పరిస్థితి ఏర్పడనుందని అంచనా. అదే సమయంలో మహాయుతి మరింత బలపడి, రాబోయే ఎన్నికల్లో ఆధిపత్యం సాధించే అవకాశం పెరుగుతుందని విశ్లేషణ. మొత్తంగా చూస్తే, ఫిబ్రవరి రెండో వారంలో వెలువడే ప్రకటన మహారాష్ట్ర రాజకీయ దిశనే మార్చే కీలక మలుపుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. NCP రీయూనియన్‌పై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థిగా మామిడి శ్రీకాంత్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి టీఆర్పీ తరఫున రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ తరఫున పోటీ చేయదలచిన ఆశావాహులు వెంటనే నాయకత్వాన్ని సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధి, అవినీతి నిర్మూలన టీఆర్పీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అవినీతి లేని మున్సిపాలిటీలు, ప్రజలకు నిజాయితీగా సేవ చేసే పాలన లక్ష్యంగా రూపొందించబడిందన్నారు. గత పాలకుల అవినీతికి చెక్ పెట్టాలంటే టీఆర్పీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లవేళలా ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, పోటీ చేయదలచిన అభ్యర్థులు తక్షణమే పార్టీ నాయకత్వాన్ని సంప్రదించాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్.పీ.కే సాగర్, భూపాలపల్లి మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, సాయికుమార్, శ్రావణ్ కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడారం: ప్రపంచ ప్రఖ్యాత మేడారం మహా జాతర సందర్భంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ మహా ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జాతర తొలి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకున్న సందర్భంగా అరణ్య ప్రాంతం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. వనదేవతలకు అధికారికంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అమ్మవారి నామస్మరణతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టిందని అధికారులు వెల్లడించారు. భద్రత, వైద్య సేవలు, తాగునీరు, రవాణా వంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా జాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం గమనార్హంగా మారింది. ఈ గైర్హాజరుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, మంత్రుల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రి గైర్హాజరు అంశం జాతర వేళ రాజకీయంగా కొత్త చర్చలకు తెరలేపింది. పార్టీ అంతర్గత పరిణామాలు, శాఖల మధ్య సమన్వయం లోపించిందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు భక్తులు మాత్రం రాజకీయాలకతీతంగా అమ్మవారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. మేడారం మహా జాతర మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

బారామతి/పుణె: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయనకు చివరి వీడ్కోలు పలికేందుకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పుణె జిల్లా బారామతికి చేరుకున్నారు. అజిత్ పవార్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్ సేవలు చిరస్మరణీయమని అమిత్ షా పేర్కొన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా అజిత్ పవార్ మృతి దేశ రాజకీయాలకు తీరని లోటని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, “నేను ఒక మంచి మిత్రుడిని, సహచరుడిని కోల్పోయాను. అజిత్ పవార్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారు” అని భావోద్వేగంతో అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అజిత్ పవార్ నివాసం వద్ద భారీగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. బారామతి పట్టణం అంతటా విషాద వాతావరణం నెలకొంది. భద్రతా దృష్ట్యా పోలీసులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు ఏర్పడిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఆయన జ్ఞాపకాలు, సేవలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

బారామతి, మహారాష్ట్ర — బుధవారం ఉదయం 8:45 గంటలకు బారామతి ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఈ ఘట‌న‌లో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఆరుగురు ప్రయాణీకులు మృతి చెందారుప్రమాద సమయంలో విమానం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అదుపు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతులలో రెండు పైలట్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. విమానానికి పెద్ద మంటలు చెలరేగాయి. అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు త్వరగా చేరారు, మిగిలిన పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అజిత్ పవార్ కుటుంబం ఢిల్లీ నుండి బారామతికి బయలుదేరింది. ప్రస్తుతానికి అధికారులు ప్రమాద కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘట‌న మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్యన కూడా తీవ్ర చింతను రేకెత్తించింది. ముఖ్య నాయకులు, భక్తులు, మరియు స్థానిక ప్రజలు ఈ మృతుల కుటుంబాల పట్ల విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి సమాచారం : అధికారులు మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు, ప్రమాద కారణాలపై అధికారిక విచారణ ప్రారంభించబడింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి టౌన్, జనవరి 27: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివెళ్తున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతున్న సమయంలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. జాతరలో పాల్గొనే ప్రజలు, అభ్యర్థులు, ప్రపోజర్లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో మేడారం వెళ్లే పరిస్థితి ఉన్నందున నామినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సక్రమంగా సాగాలంటే, ఈ పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయడం అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని రవి పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26 : దేశానికి గర్వకారణమైన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకలకు టిఆర్పి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అశోక్ ముదిరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగిస్తూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం ద్వారా దేశ పౌరులకు సమాన హక్కులు, స్వేచ్ఛలు, ఓటు హక్కు వంటి ప్రజాస్వామ్య విలువలు లభించాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం దేశ ప్రజలకు గౌరవప్రదమైన జీవనానికి పునాది వేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. తదుపరి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ… రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర్య ఫలాలను ప్రజలకు అందించిన రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచి వంటిదని అన్నారు. రాజ్యాంగం అమలైన ఈ పుణ్యదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, భూపాలపల్లి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ ముదిరాజ్‌కు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో టిఆర్పి జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, సామల శ్రీలత రాజు, ఎస్‌బీఐ అనంతల సంపత్ (బొట్టు), అశోక్ మడే, సంతోష్ ముక్తేశ్వర్, రొడ్డ శ్రీను, జింకల శ్రీను, మామిడి శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) తరఫున పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు భూపాలపల్లి జిల్లా టిఆర్పి అధ్యక్షుడు రవి పటేల్ ప్రకటించారు. భూపాలపల్లి పట్టణంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, గత పాలకులైన టిఆర్ఎస్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రజలను మభ్యపెట్టే దొంగ హామీలతో రెండు పార్టీలు ముందుకు వస్తున్నాయని విమర్శించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు టిఆర్పి పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీకి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందన్నారు. సామాన్యుడు కూడా కౌన్సిలర్‌గా పోటీ చేయగలిగే విధంగా టిఆర్పి పార్టీ అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇకపై ఆశావాహులు కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల హక్కుల కోసం ఏర్పడిన టిఆర్పి పార్టీ అందరినీ ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూపాలపల్లి మున్సిపాలిటీ దయనీయ స్థితిలో ఉందని, మళ్లీ పాత పాలకుల చేతికి అధికారాన్ని అప్పగిస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని హెచ్చరించారు. విజ్ఞులైన ప్రజలు టిఆర్పి పార్టీని ఆదరించాలని, ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు నేరుగా తనను సంప్రదించాలని రవి పటేల్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా నాయకులు రోడ్డ శ్రీనివాస్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు మామిండ్ల మధుకర్ గౌడ్, జిల్లా నాయకుడు మామిడి శ్రీకాంత్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తారంటూ కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి జిల్లాను భూకంపం వస్తే తప్ప ఎవరూ రద్దు చేయలేరని స్పష్టం చేశారు. జిల్లా రద్దు అంశం పూర్తిగా అవాస్తవమని, ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భూపాలపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరు రాజకీయ స్వార్థంతో ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఆయన ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం మీద అబద్ధాలు చెప్పి ఓట్లు గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, రహదారులు, వైద్య సదుపాయాలు, విద్యా సంస్థలు, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోందని చెప్పారు. ఇలాంటి సమయంలో జిల్లా రద్దు చేస్తారనే ప్రచారం చేయడం పూర్తిగా హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజల హక్కులను కాపాడేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు వీటిని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా రద్దు అనే ప్రశ్నే లేదని, భూపాలపల్లి జిల్లా భవిష్యత్తు మరింత బంగారంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో కొందరు సన్నాసులు అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం మానుకుని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. దుష్ప్రచారాలకు తగిన సమాధానం ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శుక్రవారం వెలువడిన ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పేలుడు వ్యాఖ్యలు చేసి పార్టీ వర్గాల్లో సంచలనం రేపారు. ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవటం పార్టీ “పూర్తిగా వైఫల్యం” అనే మాటకు నిదర్శనమని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకువచ్చి తమ అభ్యర్థి విజయానికి అహర్నిశలు శ్రమిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాదు—ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారు అంటూ ఆరోపించారు. పార్టీ కీలక నేతలైన కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్లను సూటిగా ప్రస్తావిస్తూ రాజాసింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. “ఇంత పెద్ద పరాభవంపై వారు సాధారణ కార్యకర్తలకు ఏమి సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తి అలలు ఎగసిపడుతున్న తరుణంలో రాజాసింగ్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఉపఎన్నిక ఫలితాలతో పార్టీ బలహీనత స్పష్టమైందని, ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అయన వ్యాఖ్యలతో బీజేపీ అంతర్గత రాజకీయాలు మళ్లీ ద్రవీభవించాయి. పార్టీ శ్రేణుల్లో ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఉపఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీ రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో ముఖ్యమైన మార్పు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ, “గత ప్రభుత్వ కాలంలో ‘ఇద్దరు పిల్లలు’ నిబంధన అమల్లో ఉండేది. అంటే, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు వార్డు సభ్యుడు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అయ్యేవారు. ఆ నిబంధనను మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది” అని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని, స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో తగిన సవరణలు చేయనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఈ మార్పుతో గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పాత నిబంధన కారణంగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన అనేక మందికి ఊరట లభించనుంది. మంత్రి వివరించిన ప్రకారం, కొత్త నిబంధనల ప్రకారం పిల్లల సంఖ్య ఆధారంగా అభ్యర్థుల అర్హతను నిరాకరించే పరిస్థితి ఇక ఉండదని స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేసే విధానాలు ఉండకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను ఎంచుకునే స్వేచ్ఛ కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది” అని పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ఇది కీలక పరిణామంగా భావించబడుతోంది. అనేక గ్రామాల్లో సామాన్య ప్రజల్లో ఈ నిర్ణయం సంతోషాన్ని కలిగించింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పూర్తిగా శూన్యమైందని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్ ఆరోపించారు. మొన్నటి వర్షాలతో నాలాలు, చెరువుల్లో నిల్వ నీళ్లు, మురుగు నీరు, ఎక్కడికక్కడ పెరిగిన పిచ్చిమొక్కలతో గ్రామం మొత్తం చెత్త మయంగా మారిందన్నారు. దీంతో దోమల బెడద విపరీతంగా పెరిగి, పిల్లలు, పెద్దలు విషజ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు.“శ్రీధర్ బాబు  సొంత మండలానికి చెందిన కాటారం పంచాయతీలో కనీస పరిశుభ్రత కనిపించదు. 14 వాడలలో ఒక్క వాడలో కూడా పరిశుభ్రత నిలకడగా లేదు. చెత్త కుప్పల మధ్య పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దళిత వాడల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎర్రగుంటపల్లెలో ఒకరిపై కోతులు దాడి చేయగా ఆయన చేతి విరిగింది. అయినా అధికారుల దృష్టి లేకపోవడం విచారకరం” అని రామిళ్ల కిరణ్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం పైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సంవత్సరంన్నరుగా సర్పంచులు లేక, వార్డు సభ్యులు లేక పాలన స్తబ్ధుగా మారింది. పంచాయతీ కార్యదర్శి గాని, స్పెషల్ అధికారి గాని క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఫోటోలు కోసం మాత్రం మెయిన్ రోడ్డు శుభ్రం చేసి కలెక్టర్‌కి చూపిస్తున్నారు. వాస్తవానికి వాడల్లో ఒక్క మొక్క కూడా తీసి వేయని పరిస్థితి ఉంది” అని విమర్శించారు. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్ల వినియోగం పూర్తిగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. “మునుపటి ప్రభుత్వంలో వాడవాడకు ఫాగింగ్ చేసి దోమలను అదుపులో పెట్టేవారు. ఈ ప్రభుత్వంలో అయితే ఫాగింగ్ మిషన్ల స్థితిగతులే తెలియడం లేదు. అవి ఎక్కడున్నాయో, నిధులు లేవని అమ్మేశారో అనే అనుమానం వస్తోంది” అన్నారు.
స్థానిక కాంగ్రెస్ నాయకుల పైన కూడా రామిళ్ల కిరణ్ తీవ్రంగా దాడి చేశారు. “వాళ్ల సారుకు ఒక్క మాట చెప్పే స్థితిలో కూడా లేరు. వారి రాజకీయ స్థాయి పెరిగినా ప్రజల పరిస్థితి మాత్రం ఏ మాత్రం మారలేదు. కనీసం రాబోయే ఎన్నికల్లో ఓటు కోసం అయినా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి” అని డిమాండ్ చేశారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు  సొంత మండలంలో కనీస పారిశుద్ధ్య పనులకైనా నిధులు కేటాయించాలని, ప్రజల ఆరోగ్య రక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామిళ్ల కిరణ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకుడు మనేం రాజబాబు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్: బీఆర్ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత రేపు మీడియా ముందుకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. పార్టీ తనపై తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై కవిత ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్‌ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అంతర్గత రాజకీయ తగాదాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో కవిత సస్పెన్షన్ నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారింది. ఆమె ప్రెస్‌మీట్‌లో తనపై జరిగిన చర్యల వెనుక కారణాలను బయటపెడతారా? లేక భవిష్యత్తు రాజకీయ ప్రణాళికపై స్పష్టత ఇస్తారా? అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాలపై కవిత వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు, రాజకీయ పరిశీలకులు ఆమె మాట్లాడబోయే మాటలపై కన్నేసి ఉన్నారు. బీఆర్ఎస్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు విసరనున్నారా? లేక తన భవిష్యత్తు దిశపై సంకేతాలు ఇస్తారా? అన్న దానిపై రేపటి ప్రెస్‌మీట్ కీలకంగా మారనుంది.