జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని చిట్యాల మండలంలో ఇటీవల బీసీకి చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కుమారస్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రవి పటేల్, రాజ్యాంగం అమలులోకి వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా బీసీలపై అగ్రకులాల వ్యక్తులు భౌతిక దాడులు చేయడం, దూషణలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో, బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, అలా జరిగితేనే ఆధిపత్య కులాల దౌర్జన్యాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని రవి పటేల్ పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి యథేచ్ఛగా తిరుగుతూ ఇంకా ఎన్ని మందిపై దాడులు చేసిన తరువాత చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. భూకబ్జాలు, మట్టి మాఫియా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వెంటనే అరెస్టు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాదు మల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, గతంలో కూడా అనేక క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి, ఫిబ్రవరి 23: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధిత కుటుంబానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, బీసీలపై వరుసగా జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రాణాలకు భద్రత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రెండు నెలల శిశువు మృతి దారుణమని, నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుండటం చట్టవ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. కుల అహంకారంతో జరిగే హత్యలు ఆగకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టే ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, వెంటనే “బీసీ అట్రాసిటీ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడిని సమాజంపై దాడిగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా చట్టం చేయాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిలకర శ్రీను, మామిడి శ్రీకాంత్, కౌటం సురేందర్, మోటపోతుల సమ్మయ్య, గంధం సిద్దు, దుస్స శ్రీకాంత్, ప్రభాత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి, : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలు, రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఐదుగురు అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి.
భూపాలపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి అవధూత కవిత,
18వ వార్డు నుంచి గాజ వేణుగోపాల్,
22వ వార్డు నుంచి కౌటం సౌమ్య,
28వ వార్డు నుంచి ఇనుగాల ప్రణయ్ రాజ్,
29వ వార్డు నుంచి మామిడి శ్రీకాంత్ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, తెలంగాణలో బహుజనుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతోందని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ఇతర పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు మన బహుజన అభ్యర్థులకు మన పార్టీ నుంచే బీ-ఫారాలు అందజేయడం గర్వకారణమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన టీఆర్పీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్పీ పార్టీ అభ్యర్థులు ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.పి.కే సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సంతోష్, శ్రీకాంత్, సిద్ధు, జస్వంత్, కోటేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ముంబయి: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ కీలక అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం అత్యంత గంభీరంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరై సునేత్ర పవార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన విషాదకర విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల అనంతరం సునేత్ర పవార్ను ఉపముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తూ అధికార కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పరిపాలనా స్థిరత్వం కొనసాగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. సునేత్ర పవార్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో విశేష గుర్తింపు సంపాదించారు. మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, విద్యా రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన నాయకత్వం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆమె ప్రమాణస్వీకారంతో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సునేత్ర పవార్ మాట్లాడుతూ, “ఈ పదవి నాకు గౌరవంతో పాటు బాధ్యతను కూడా ఇస్తోంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తాను” అని అన్నారు. అలాగే అజిత్ పవార్ ఆశయాలను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు. సునేత్ర పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మహిళా నాయకత్వానికి ఇది చారిత్రక మలుపుగా నిలవనుందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
मुंबई : महाराष्ट्राच्या राजकीय इतिहासात एक महत्त्वाचा टप्पा नोंदवला गेला आहे. राज्याच्या पहिल्या महिला उपमुख्यमंत्री म्हणून सुनैत्रा पवार यांनी आज शपथ घेतली. राजभवन येथे पार पडलेल्या शपथविधी सोहळ्यात राज्यपालांच्या उपस्थितीत त्यांनी पद व गोपनीयतेची शपथ घेतली. या ऐतिहासिक क्षणाचे साक्षीदार म्हणून अनेक मान्यवर नेते, मंत्री आणि वरिष्ठ अधिकारी उपस्थित होते. अलीकडेच झालेल्या दुर्दैवी विमान दुर्घटनेत उपमुख्यमंत्री अजित पवार यांचे निधन झाले होते. या घटनेनंतर राज्याच्या राजकारणात मोठी पोकळी निर्माण झाली होती. प्रशासन आणि सरकारची घडी विस्कळीत होऊ नये, यासाठी सत्ताधारी पक्षाने महत्त्वपूर्ण निर्णय घेत सुनैत्रा पवार यांच्यावर उपमुख्यमंत्रीपदाची जबाबदारी सोपवली. सुनैत्रा पवार या सार्वजनिक जीवनात फारशा सक्रिय नसल्या तरी सामाजिक कार्य, महिला सक्षमीकरण आणि ग्रामीण विकासाशी संबंधित उपक्रमांमध्ये त्यांचा सहभाग उल्लेखनीय राहिला आहे. त्यांच्या अनुभवाचा आणि सामाजिक बांधिलकीचा विचार करूनच हा निर्णय घेण्यात आल्याचे राजकीय वर्तुळात सांगितले जात आहे. शपथविधीनंतर प्रतिक्रिया देताना सुनैत्रा पवार म्हणाल्या, “राज्याच्या पहिल्या महिला उपमुख्यमंत्रीपदाची जबाबदारी मिळणे हे माझ्यासाठी सन्मानासोबतच मोठे आव्हान आहे. महाराष्ट्राच्या विकासासाठी आणि जनतेच्या हितासाठी प्रामाणिकपणे काम करेन.” तसेच स्वर्गीय अजित पवार यांच्या कार्याचा आणि विचारांचा वारसा पुढे नेण्याचा निर्धारही त्यांनी व्यक्त केला. सुनैत्रा पवार यांच्या शपथविधीमुळे महाराष्ट्राच्या राजकारणात महिलांच्या नेतृत्वाला नवे बळ मिळाले असून, हा निर्णय भविष्यातील राजकीय वाटचालीसाठी दिशादर्शक ठरेल, अशी प्रतिक्रिया विविध स्तरांतून व्यक्त होत आहे.
ముంబై/బారామతి: మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు వర్గాల పునఃకలయికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుండగా, మరోవైపు శరద్ పవార్తో అజిత్ కుమారుడు పార్థ్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బారామతిలో జరిగిన ఈ భేటీ సుమారు గంటకు పైగా కొనసాగినట్లు సమాచారం. NCP భవిష్యత్, రెండు వర్గాల ఐక్యత, పార్టీ పునర్నిర్మాణం అంశాలపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య పెరుగుతున్న సంకేతాలు ఈ భేటీకి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఇక అజిత్ పవార్ వర్గం ఇప్పటికే మహాయుతి ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతుండగా, శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్ పవార్) భవిష్యత్ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రెండు వర్గాలు ఒక్కటైతే, మహాయుతిలో NCP స్థానం కొనసాగుతుందా? లేక కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే, అది కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా రాజకీయ సంకేతంగా భావించాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది శరద్ పవార్ వర్గానికి పంపిన సందేశమా? లేక కలయికకు ముందడుగుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పవార్ కుటుంబంలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ‘మహా’ కలయికకు దారి తీస్తాయా? లేక అధికార సమీకరణాల్లో కొత్త చీలికలను తెస్తాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర రాజకీయాలు పవార్ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయన్నది విశ్లేషకుల మాట.
मुंबई/बारामती: महाराष्ट्राच्या राजकारणात पुन्हा एकदा मोठ्या घडामोडींना वेग आला आहे. राष्ट्रवादी काँग्रेस पार्टी (NCP)च्या दोन गटांच्या संभाव्य एकत्रिकरणाबाबत राज्यभरात उत्सुकता शिगेला पोहोचली आहे. अशाच पार्श्वभूमीवर उपमुख्यमंत्री अजित पवार यांच्या पत्नी सुनेत्रा पवार आज काही तासांत उपमुख्यमंत्री पदाची शपथ घेणार असल्याची चर्चा सुरू असताना, दुसरीकडे अजित पवार यांचे पुत्र पार्थ पवार यांनी राष्ट्रवादीचे ज्येष्ठ नेते शरद पवार यांची बारामतीत भेट घेतली आहे. बारामती येथे झालेली ही भेट सुमारे तासभर चालल्याची माहिती आहे. या भेटीत राष्ट्रवादी काँग्रेसचे भवितव्य, दोन गटांमधील मतभेद, तसेच पक्षातील संभाव्य एकजूट यावर सविस्तर चर्चा झाल्याचे राजकीय वर्तुळात सांगितले जात आहे. अलीकडच्या काळात शरद पवार गट आणि अजित पवार गट यांच्यात वाढत असलेले संवाद या भेटीला विशेष महत्त्व देत आहेत. सध्या अजित पवार गट महायुती सरकारमध्ये सहभागी असून, शरद पवार यांच्या नेतृत्वाखालील राष्ट्रवादी काँग्रेस (शरद पवार)ची पुढील भूमिका काय असेल, याबाबत प्रश्न उपस्थित होत आहेत. जर दोन्ही गट एकत्र आले, तर महायुतीमध्ये राष्ट्रवादीची भूमिका कायम राहणार का, की राज्याच्या राजकारणात नवे समीकरण आकाराला येणार, याकडे सर्वांचे लक्ष लागले आहे. दरम्यान, सुनेत्रा पवार यांच्या उपमुख्यमंत्री पदाच्या शपथविधीकडेही केवळ प्रशासकीय नव्हे, तर राजकीय दृष्टिकोनातून पाहिले जात आहे. हा निर्णय शरद पवार गटासाठी एखादा राजकीय संदेश आहे का, की संभाव्य एकत्रिकरणाच्या दिशेने टाकलेले पाऊल आहे, यावर तर्कवितर्क लढवले जात आहेत. एकूणच पवार कुटुंबातील या घडामोडींमुळे महाराष्ट्राच्या राजकारणात ‘महा’ एकत्रिकरण होणार का, की नव्या राजकीय संघर्षाला तोंड फुटणार, याबाबत संभ्रम कायम आहे. येणारे काही दिवस राज्याच्या राजकारणाच्या दृष्टीने अत्यंत निर्णायक ठरणार असल्याचे राजकीय विश्लेषकांचे मत आहे.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిపోయిన రెండు వర్గాలు తిరిగి ఏకం కావాలనే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. NCP, NCP–శరద్ పవార్ (NCP-SP) వర్గాల రీయూనియన్పై ఫిబ్రవరి రెండో వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు, ప్రజల్లో స్పందనను దృష్టిలో పెట్టుకుని గత కొన్ని నెలలుగా అజిత్ పవార్–శరద్ పవార్ మధ్య అంతర్గతంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ నిర్మాణం, కూటమి రాజకీయాలపై పలు దఫాలుగా సమావేశాలు జరిగినట్లు సమాచారం. అజిత్ పవార్ మరణం తర్వాత ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయని, పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలనే అభిప్రాయం బలపడినట్లు తెలుస్తోంది. విలీనం జరిగితే NCP మహాయుతి కూటమిలోనే కొనసాగుతుందన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ–శివసేన (శిండే వర్గం)తో కలిసి ముందుకు సాగాలన్న వ్యూహమే ప్రస్తుతం పార్టీ పెద్దల ఆలోచనగా టాక్. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ విభజన వల్ల కోల్పోయిన రాజకీయ బలం తిరిగి సాధించడమే ఈ విలీనానికి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. రాష్ట్రస్థాయిలో సునేత్రా పవార్ లేదా ప్రఫుల్ పటేల్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముందని సమాచారం. మరోవైపు జాతీయ స్థాయిలో శరద్ పవార్ నాయకత్వం కొనసాగుతుందని, ఆయన మార్గదర్శకత్వంలో పార్టీ కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లనుందని టాక్. యువ నాయకత్వానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విలీనం అమలైతే మహా వికాస్ అఘాడీకి ఇది భారీ రాజకీయ షాక్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న NCP పూర్తిగా మహాయుతి వైపు మొగ్గు చూపితే, ప్రతిపక్ష శక్తి సమీకరణాలు బలహీనపడే పరిస్థితి ఏర్పడనుందని అంచనా. అదే సమయంలో మహాయుతి మరింత బలపడి, రాబోయే ఎన్నికల్లో ఆధిపత్యం సాధించే అవకాశం పెరుగుతుందని విశ్లేషణ. మొత్తంగా చూస్తే, ఫిబ్రవరి రెండో వారంలో వెలువడే ప్రకటన మహారాష్ట్ర రాజకీయ దిశనే మార్చే కీలక మలుపుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. NCP రీయూనియన్పై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
మేడారం: ప్రపంచ ప్రఖ్యాత మేడారం మహా జాతర సందర్భంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ మహా ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జాతర తొలి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకున్న సందర్భంగా అరణ్య ప్రాంతం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. వనదేవతలకు అధికారికంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అమ్మవారి నామస్మరణతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టిందని అధికారులు వెల్లడించారు. భద్రత, వైద్య సేవలు, తాగునీరు, రవాణా వంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా జాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం గమనార్హంగా మారింది. ఈ గైర్హాజరుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, మంత్రుల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రి గైర్హాజరు అంశం జాతర వేళ రాజకీయంగా కొత్త చర్చలకు తెరలేపింది. పార్టీ అంతర్గత పరిణామాలు, శాఖల మధ్య సమన్వయం లోపించిందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు భక్తులు మాత్రం రాజకీయాలకతీతంగా అమ్మవారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. మేడారం మహా జాతర మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బారామతి, మహారాష్ట్ర — బుధవారం ఉదయం 8:45 గంటలకు బారామతి ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఆరుగురు ప్రయాణీకులు మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అదుపు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతులలో రెండు పైలట్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. విమానానికి పెద్ద మంటలు చెలరేగాయి. అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు త్వరగా చేరారు, మిగిలిన పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అజిత్ పవార్ కుటుంబం ఢిల్లీ నుండి బారామతికి బయలుదేరింది. ప్రస్తుతానికి అధికారులు ప్రమాద కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్యన కూడా తీవ్ర చింతను రేకెత్తించింది. ముఖ్య నాయకులు, భక్తులు, మరియు స్థానిక ప్రజలు ఈ మృతుల కుటుంబాల పట్ల విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తదుపరి సమాచారం : అధికారులు మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు, ప్రమాద కారణాలపై అధికారిక విచారణ ప్రారంభించబడింది.
భూపాలపల్లి టౌన్, జనవరి 27: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివెళ్తున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతున్న సమయంలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. జాతరలో పాల్గొనే ప్రజలు, అభ్యర్థులు, ప్రపోజర్లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో మేడారం వెళ్లే పరిస్థితి ఉన్నందున నామినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సక్రమంగా సాగాలంటే, ఈ పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేయడం అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని రవి పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26 : దేశానికి గర్వకారణమైన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకలకు టిఆర్పి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అశోక్ ముదిరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగిస్తూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం ద్వారా దేశ పౌరులకు సమాన హక్కులు, స్వేచ్ఛలు, ఓటు హక్కు వంటి ప్రజాస్వామ్య విలువలు లభించాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం దేశ ప్రజలకు గౌరవప్రదమైన జీవనానికి పునాది వేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. తదుపరి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ… రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర్య ఫలాలను ప్రజలకు అందించిన రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచి వంటిదని అన్నారు. రాజ్యాంగం అమలైన ఈ పుణ్యదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, భూపాలపల్లి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ ముదిరాజ్కు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో టిఆర్పి జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, సామల శ్రీలత రాజు, ఎస్బీఐ అనంతల సంపత్ (బొట్టు), అశోక్ మడే, సంతోష్ ముక్తేశ్వర్, రొడ్డ శ్రీను, జింకల శ్రీను, మామిడి శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) తరఫున పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు భూపాలపల్లి జిల్లా టిఆర్పి అధ్యక్షుడు రవి పటేల్ ప్రకటించారు. భూపాలపల్లి పట్టణంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, గత పాలకులైన టిఆర్ఎస్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రజలను మభ్యపెట్టే దొంగ హామీలతో రెండు పార్టీలు ముందుకు వస్తున్నాయని విమర్శించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు టిఆర్పి పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీకి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందన్నారు. సామాన్యుడు కూడా కౌన్సిలర్గా పోటీ చేయగలిగే విధంగా టిఆర్పి పార్టీ అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇకపై ఆశావాహులు కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల హక్కుల కోసం ఏర్పడిన టిఆర్పి పార్టీ అందరినీ ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూపాలపల్లి మున్సిపాలిటీ దయనీయ స్థితిలో ఉందని, మళ్లీ పాత పాలకుల చేతికి అధికారాన్ని అప్పగిస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని హెచ్చరించారు. విజ్ఞులైన ప్రజలు టిఆర్పి పార్టీని ఆదరించాలని, ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు నేరుగా తనను సంప్రదించాలని రవి పటేల్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా నాయకులు రోడ్డ శ్రీనివాస్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు మామిండ్ల మధుకర్ గౌడ్, జిల్లా నాయకుడు మామిడి శ్రీకాంత్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




















