ఇట్లు, కోట అశోక్ AHPS జిల్లా కార్యదర్శి ఉప సర్పంచ్, జాధరవ్పేట
నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన యువకుడు జాదవ్ మాధవరావ్ దేశవ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, కుబీర్ గ్రామానికి చెందిన జాదవ్ మాధవరావ్, గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను ప్రారంభించారు. అలాగే నరేంద్ర మోదీ గారు నాలుగోసారి ప్రధానమంత్రి కావాలని, అఖండ భారత్ నిర్మాణం జరగాలని సంకల్పంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు, బడా చార్ ధామ్, చోటా చార్ ధామ్ యాత్రలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగే ఈ యాత్రలో సుమారు 15 వేల కిలోమీటర్లు నడవనున్నట్లు తెలిపారు. మే 11, 2026న ప్రారంభమైన ఈ పాదయాత్రకు ఇప్పటివరకు 22 రోజులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పటివరకు కేవలం 10 రోజుల పాటు మాత్రమే నడవగలిగానని వెల్లడించారు. ఇవాళ ఉదయం 5:30 గంటలకు మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాత్రికి ఆసిరవెల్లి లేదా అంకిసా గ్రామంలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందన్నారు. సిరోంచాలో గంగా స్నానం చేసిన అనంతరం అక్కడి విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని, బస, భోజనం వంటి అవసరాలను స్థానికులే స్వచ్ఛందంగా సమకూరుస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా వారు తిరస్కరిస్తూ సేవాభావంతో సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. “జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతా కీ జై” అంటూ తన యాత్రను కొనసాగిస్తున్న జాదవ్ మాధవరావ్కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.
బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతను బోధించిన మార్గం. కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాధలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలి అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. శివుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, నందీశ్వరుడు పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడని చెబుతారు. శివుని ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రాని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు. ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతర కృషి చేశాడు. అతని బోధనలలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది. ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి. బసవేశ్వరుడు స్థాపించిన వేదాంత గోష్టికి 'అనుభవ మండపం' అని పేరు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు.
ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.
శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు:
మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.
శివుడే సత్యం, నిత్యం.
దేహమే దేవాలయం.
స్త్రీ పురుష భేదంలేదు.
శ్రమను మించిన సౌందర్యంలేదు.
భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.
దొంగలింపకు, హత్యలు చేయకు
ఆబద్దలు అడాకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల చెయ్యరాధు.
అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అని అంటారు.
బసవేశ్వరూని వచనాలు:
కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుని దివ్య జీవితగాధను పాల్కురికి సోమనాధుడు రచించిన 'బసవ పురాణం' తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయింది.
మానవతావాది బసవన్న :
ఒక్కరోజు సాయంత్రం వేళ దీపం వెలుతురులో మహాత్మా బసవేశ్వరుడు ఏదో చదువుతూ కూర్చొన్నాడు. ఆయన్ని కలవడానికి కొందరు పెద్దలు వచ్చారు. అందరూ బసవేశ్వరుడికి నమస్కరించి కూర్చొన్నారు. వారంతా ఏదో కార్యార్థమై తనవద్దకు వచ్చారని గ్రహించిన బసవేశ్వరుడు ‘‘నావద్దకు వ్యక్తిగత పని గురించి వచ్చారా? లేదంటే ప్రభుత్వ పని గురించి వచ్చారా? (బసవేశ్వరుడు బిజ్జల మహారాజు కొలువులో మహామంత్రి)’’ అని ప్రశ్నించాడు.
‘‘మతపరమైన చర్చ గురించి మీవద్దకు వచ్చాం’’ అన్నారు పెద్దలు.
వెంటనే బసవేశ్వరుడు అప్పటివరకు ఏ దీపం వెలుగులో తాను పనిచేసుకుంటున్నాడో, ఆ దీపాన్ని ఆర్పివేసి, మరో దీపం వెలిగించి వారితో మాట్లాడటానికి ఉపక్రమించాడు.
విషయం పెద్దలకు అర్థంకాలేదు. దీపం మార్చడంలో ఆంతర్యం ఏమిటో? అన్నట్లు బసవేశ్వరునివైపు చూసారు. మొదటి దీపం ప్రభుత్వానిది, రెండవది నా స్వంతానిది అన్నాడు బసవేశ్వరుడు. మతపరమైన చర్చ ధర్మసంబంధంగా నా వ్యక్తిగత విషయం. ఇందుకు ప్రభుత్వం వారి సొమ్ము వాడటం ‘తగదని’ అలా చేసాను అని బదులిచ్చాడు. ఒకచోట ఇసుమంతయినను పసిడి నాకెందుకు? అంటాడు. కాని ఈనాటి పరిస్థితి?
దాదాపు 800 ఏళ్ళ క్రితమే ఇంత గొప్ప రాజనీతి దృక్పథాన్ని మనకు అందించి నైతిక విలువలను ఆచరించి చూపిన మహనీయుడు బసవేశ్వరుడు. క్రీ.శ.1130-1170 మధ్య మాదలాంబిక, మాదిరాజు దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని ‘హింగుళేశ్వర బాగెవాడ’ జన్మించాడు బసవేశ్వరుడు. బసవేశ్వరుడి ప్రభావం కర్ణాటక ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆయన చెప్పిన ‘మాటలు’ వచనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ప్రభావంతోనే తెలుగులో పాల్కురికి సోమనాథుడు విశేషమైన రచనలు చేశాడు. తెలుగులో మొట్టమొదటి దేశిపురాణం బసవపురాణం. మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండూ సోమనాథుడు బసవేశ్వరుని ప్రభావంతో రచించినవే. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని రెండవ శంకరుడు అని సంబోదిన్చెవాడు.
కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించిన ఘనుడు బసవణ్ణ. శెట్టి అయిన సిరియాళుణ్ణి, రజకుడైన మడివాలు మాచయ్యను, చండాలుడిగా చెప్పే కక్కయ్యను, మాదిగ కులస్థుడైన చెన్నయ్యను, బాలిక అయిన గొడ గూచిని, స్ర్తి అయిన అక్కమహాదేవిని కుల, బాల, స్ర్తి, పురుష బేధం పాటించకుండా శివభక్తి ప్రస్థానంలో మహోన్నత స్థానంలో నిలబెట్టాడు బసవేశ్వరుడు.
అలనాడు కులాంతర వివాహమును జరిపించి కులాలు మానవ సృష్టియే అని పలికిన మహాత్ముడు బసవన్న. శివనాగుమ్య యనెడి యంత్యజుడుండెను. అతడు దీక్షను స్వీకరించి లింగాంగుడయ్యెను. అతడు దాసోహము చేయగా బసవన్న యతని యింటికేగా ప్రసాదమును బడసెను. గుణవంతులందరు సమానముగా గౌరవింపదగిన వారని తెలిపెను.
కులాన్ని త్రోసి రాజని సర్వమానముల చేతిలో చిన్న లింగాన్ని పెట్టి లింగార్చన చేయమన్నాడు. పరమేశ్వరుణ్ణి ప్రతి మనిషి ఎదపై నిలిపే లింగధారణ చేయించాడు. దేవుణ్ణి ప్రతివారి హస్తంలో సుప్రతిష్ఠం చేసి కులపు కుళ్ళును కడిగివేసాడు. ఎంత మాలిన్యమైన హృదయమైనా పరమేశ్వరతత్వం పరిఢవిల్లినపుడు ‘‘అంతా ఈశ్వరమనే’’ సత్యాన్ని లోకానికి చాటి చెప్పాడు బసవేశ్వరుడు. ఈ లింగార్చన ఒక ధ్యానయోగం. ఈ రోజుల్లో ఎందరో తమ మనస్సు శాంతి, ఏకాగ్రత కొరకు ధ్యానం అభ్యాసం చేస్తున్నారు. కాని బసవణ్ణి ఆ రోజుల్లోనే సహజంగానే ధ్యానం కుదిరే పద్ధతి వ్యాప్తి చేసాడు.
ధనమే ప్రధానం అనుకొనేవాడికి శివుణ్ణి చేరడం సాధ్యంకాదు అంటాడు బసవన్న. వడ్డీ వ్యాపారం మానవుల ఆర్థిక అసమానతలకు కారణం అని ఆనాడే నిరసించాడు. ధనవ్యామోహం దుర్బలమైంది అనేది బసవణ్ణ ప్రగాఢ విశ్వాసం. సత్యమే దైవము మరియు అన్ని ప్రాణుల యెడల దయకు మించిన దైవము మరొకటి లేదంటాడు. బసవేశ్వరుడు అస్పృశ్యతా నివారణ, స్ర్తిగౌరవము పెంపుదల, స్ర్తి సమానత్వము, కుటీర పరిశ్రమల పెంపు, ఎకనమిక్ ఈక్వాలిటీ మొదలైన సంస్కరణలు ఆరోజుల్లో అమలుపరచి సత్ఫలితాలను సాధించాడు. సత్యము, అహింస, భూతదయ గురించి ఎన్నో అనుసరించదగిన వచనాలను వచించిన మహాపురుషుడు బసవన్న.
గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, సద్గుణ సంపన్నుడు, అసమాన మేధాసంపన్నుడు అయిన మహాత్మా బసవేశ్వర జయంతి ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు ప్రపంచమంతా జరుపబడును. ఇది వారి 892వ జయంతి సంద్బంగా ఇవే మా శతాకోటి వందనాలు.
K.NAGARAJ
ADVOCATE Cell.No.8096755811
ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.








