Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

గోదావరిఖనిరూరల్,19,మార్చి(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ)రామగుండం 22వ డివిజన్ ఎఫ్ సీఐ ఎలక్కలపల్లి గేట్ లో కాంపల్లి లక్ష్మీప్రసన్న రఘు కొత్తసంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సర సందర్భంగా ఒంటరి మహిళ చంద్రకళకు 25కిలోల బియ్యం1000రూపాయలు ఆర్థికసాయం గురువారం కేఆర్ టీం ఆధ్వర్యంలో అందజేశారు..22వ డివిజన్ ప్రజలు,హిందూ బంధువులందరు.ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి స్వీకరించారు,ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సందీప్,ప్రవీణ్,సురేష్,నవీన్,అరుణ్ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెల 15 తేదీ ఆదివారం కావడంతో, ఒంటిపూట బడులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇదిలా ఉండగా బోర్డ్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలలకు సూచించారు. విద్యార్థులపై ఎండల ప్రభావం తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాటారం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. ఆమెతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డి పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో జరుగుతున్న శుభ్రత పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రజా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో రోజువారీ నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు క్రమబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని క్రిమేటోరియంను సందర్శించి నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పంత కానీ సడువలి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జిల్లాలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ (MRI) యంత్రానికి అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతి నిర్వహణపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ మండల శాఖ ఖండించింది. బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్, మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. గత నెల ఫిబ్రవరి 19న కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని, అయితే అనంతరం పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం బాధాకరమని తెలిపారు. కాటారం‌లో హిందువులు శివాజీ జయంతి జరుపుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఇదే మండల కేంద్రంలో జయంతి, వర్ధంతి పేరుతో ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కేసులు ఎందుకు పెట్టరని ఆయన నిలదీశారు. హిందువులు ఐక్యంగా ఉంటే హిందూ వ్యతిరేకుల ఆగడాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ తరఫున త్వరలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.