MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు హిందీ భాషకు సంబంధించిన పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, నాటికలు, చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన ‘దేవనాగరి లిపిలో వ్రాయబడిన భాషరా’ పాటను ఇంటర్మీడియట్ విద్యార్థినులు వర్షిణి, అర్చనలు ఆలపించారు. హిందీ భాష గొప్పతనం, ప్రాధాన్యతపై హిందీ ఉపాధ్యాయురాలు రాజమణి వివరించారు. కోట్లాది ప్రజల గుండెచప్పుడు హిందీ భాష అని ప్రిన్సిపాల్ చల్ల సునీత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ, సుజాత, రాజమణి, స్వప్న, సరిత, కవిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మి, రిబ్కాతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీఓ బాలకృష్ణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది.
సమావేశానికి ఎంపీడీవో ఎ. బాబు, పీఏసీఎస్ చైర్మన్ టి. ప్రశాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పొందుపరిచిన ఎజెండా అంశాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా చర్చించారు.
మండల పరిధిలో వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. అభివృద్ధి పనుల పురోగతి, ఆయా శాఖల పనితీరుపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. వాటిపై అధికారులు వివరాలు వెల్లడించారు.
మండల అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఎజెండాలోని అంశాలపై చర్చ అనంతరం సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.
భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాటం ఒక వ్యక్తికి పరిమితం కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం ఐసా విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఆమె చూపిన పోరాట మార్గంలో నడుస్తూ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని బుర్ర స్వాతి అన్నారు.
మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో ఇటీవల ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ములుగుపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం అనుప్ను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అనుప్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జాడి రాజయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న పురుషోత్తం అనుప్కు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్ష పదవి దక్కడం మహాముత్తారం మండలానికి గర్వకారణమన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ఎన్ఎస్యూఐని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
పురుషోత్తం అనుప్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దుర్ల శ్రీను బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ కోసం ఎన్ఎస్యూఐ వేదికగా మరింత చురుకుగా పనిచేస్తానన్నారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగమల దుర్గయ్య, నజీర్ ఖాన్, బౌతూ రమ్య, చిక్కింటి లక్ష్మి, లింగమల రాజయ్య, చిర్ర రమేష్, గుంపుల రామయ్య, మోత్కూరి రవి, కోరుకొప్పుల లింగయ్య, చీటూరి అశోక్, పొలం మల్లయ్య, యువజన నాయకులు హాట్కార్ రాకేష్, తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, జోడే విజేందర్, నీలాల రాజు, కొయ్యల రాకేష్, రాంనేని కృష్ణంరాజు, మంద జనార్దన్, మరుపాక రాజేంద్రప్రసాద్తో పాటు కాంగ్రెస్, యువజన, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Blog Archive
- September (37)
- August (57)
- July (67)
- June (57)
- May (24)
- April (34)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
www.medigaddatvnews.com






