భూపాలపల్లి: బీసీల రాజ్యాధికారం, సామాజిక సమానత్వం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 14,500 కిలోమీటర్ల బీసీల రాజ్యాధికార పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని గోల్కొండ నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. పాదయాత్రను దశలవారీగా నిర్వహిస్తూ బీసీలకు రాజ్యాధికారం, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు గోల్కొండకు తరలివచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, వెంకటేష్, సంతోష్, శ్రీను, రాంబాబు, సతీష్, ముక్తేశ్వర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
భూపాలపల్లి, సెప్టెంబర్ 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్లోని అసెంబ్లీ భవన్లో మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూఐ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కళాశాలలో ఎన్ఎస్యూఐను విస్తరించాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్ఎస్యూఐను మరింత బలోపేతం చేసి విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పురుషోత్తం అనూప్ తెలిపారు.
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రదాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి హమర ప్రసాద్ ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ అనే పుస్తకాన్ని రచిస్తున్నట్లు/ప్రచురిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మహాముత్తారం మండల అధ్యక్షులు రామగిరి రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆలోచనలు, సామాజిక ఉద్యమం మరియు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను వక్రీకరించే విధంగా ఎలాంటి ప్రచారం జరిగినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని గౌరవ అధ్యక్షులు లింగమళ్ళ సడవలి రావ్ తెలిపారు. చారిత్రక వ్యక్తులపై అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, చారిత్రక ఆధారాలను వక్రీకరించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదా ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచురణలు చేయడం సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ప్రధాన కార్యదర్శి లింగమళ్ళ శంకర్ పేర్కొన్నారు. అందువల్ల ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ పుస్తకంలోని విషయాలను సంబంధిత అధికారులు, మేధావులు మరియు అంబేద్కర్వాద సంఘాల సమక్షంలో పరిశీలించాలని కోశాధికారి వేల్పుల రావణ్ కోరారు. పుస్తకంలో అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లు తేలితే, చట్టపరమైన మార్గాల్లో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం. ఎలాంటి అభ్యంతరకర అంశాలు ఉన్నా వాటిపై చట్టబద్ధంగా పోరాటం చేస్తాం” అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కోసం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ప్రజా ప్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి పంగ సురేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మేసినేని రాజన్న మాట్లాడుతూ నాయకపోడు కులస్తుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక అభ్యున్నతి కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
నూతన అధ్యక్షుడు గుంటి రమేష్, ప్రధాన కార్యదర్శి తైనేని శంకర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకపోడు కులస్తుల సమస్యల పరిష్కారంతో పాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని నాయకపోడు కుటుంబాలన్నింటినీ సంఘం పరిధిలోకి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందిస్తామని పేర్కొన్నారు.
అధ్యక్షుడిగా సుంకరి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా గాదె రవీందర్, ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ పోచయ్య, బద్ది సంతోష్, కోశాధికారిగా గంట నవీన్, సంయుక్త కార్యదర్శిగా గాదె గట్టయ్య, సాంస్కృతిక కార్యదర్శిగా చింతల సాయికిరణ్ ఎన్నికయ్యారు. యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల రామచందర్, భోజన్న, గొట్టం భూమయ్య, మాంత నాగరాజు శంకర్, నాయకపోడు నాయకులు తోట రాకేష్, తైనేని అంజి, గుంటి నాగరాజు, కాల్వపల్లి రాజబాబు, కాల్వపల్లి లింగయ్య, కాల్వపల్లి రమేష్, బచ్చేల సతీష్, కాలనేని దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను నాయకపోడు కులస్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు – RG-2 బ్రాంచ్ సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్, RG-1 అధ్యక్షులు వంగల శివరాం రెడ్డి, RG-3 అధ్యక్షులు అంబాల శ్రీనివాస్, తోట నరహరిరావు, సోమారపు వెంకన్న, ఎద్దు కుమార్, SK గౌస్, శ్రీహరి, ఎడ్ల వెంకటేష్, సురేష్, వినేష్, అహ్మద్ పాషా,గుగులోత్ రామకృష్ణ,కొమ్మ రమేష్ ,జంగ సమ్మయ్య,బుద్ధర్తి సంతోష్,తుమ్మ లక్ష్మణ్, కుమారస్వామి,బుర్ర శ్రీనివాస్,పోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Blog Archive
- September (47)
- August (57)
- July (67)
- June (57)
- May (24)
- April (34)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
www.medigaddatvnews.com






