MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్, కొత్తపల్లి, మద్దులపెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

విలాసాగర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా పూసల శశికాంత్, ఉపాధ్యక్షులుగా మురుకుంట్ల స్వామి, వీరబోయిన రాజసాగర్, ప్రధాన కార్యదర్శిగా తిపిరి రమేష్, కార్యదర్శులుగా అట్టేం సత్తయ్య, మంచినీళ్ల సంపత్, బోగే లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆరేళ్ల సమ్మయ్యను నియమించారు.

విలాసాగర్ యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా రాజునాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా గుంజి ఆంజనేయులు, మంచినీళ్ల స్వామి, ప్రధాన కార్యదర్శిగా శెనిగల లక్ష్మణ్, కార్యదర్శిగా తిపిరి మహేష్, కోశాధికారిగా రాజీనాల అంజిని నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ తెలిపారు.

మద్దులపెల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ: గౌరవ అధ్యక్షుడిగా డోలి రామకృష్ణ, అధ్యక్షుడిగా మల్లారం మహేష్, ఉపాధ్యక్షులుగా టంగుటూరి శ్రావణ్, డోలి సతీష్, ప్రధాన కార్యదర్శులుగా గజ్జెల స్వామి, గోగు రాజబాపు, కార్యదర్శులుగా పాడి అశోక్, కొత్తపల్లి బాను ప్రకాష్, జనగాం కిష్టయ్య, కోశాధికారిగా పిట్టల రాజబాపును నియమించారు.

కొత్తపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా అజ్మీరా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా తుమ్మ అజయ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం అభిషేక్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి గడపగడపకు చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వంశి వర్ధన్ రావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాన్ని ప్రారంభించే సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు శుభ ముహూర్తంలో భూమిపూజ చేపట్టారు. దీంతో తమ సొంతింటి కల నెరవేరబోతుండటంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం వాస్తవ్యులు, వాస్తు నిపుణులు లక్ష్మీరాజు చార్యులు, కేశబోయిన సమ్మయ్య చారి, జాదరావుపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోట అశోక్, బొద్దుల సతీష్, బద్ది వెంకటేష్, పొరండ్ల రమేష్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో 5వ వార్డులో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకం ద్వారా సొంతింటి కల సాకారం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం ఎక్స్‌రోడ్ వద్ద అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు దినాలను ఆసరాగా చేసుకుని నిర్మాణ పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంగారం ఎక్స్‌రోడ్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అనుమతులు సాధ్యమా? ఒకవేళ అనుమతులు ఉంటే వాటిని ఎవరు మంజూరు చేశారు? నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అధికారులు బహిరంగంగా వెల్లడిస్తారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

పత్రికల్లో కథనాలు వచ్చినా.. ఆగని నిర్మాణాలు

ఇప్పటికే గంగారం ఎక్స్‌రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ నిర్మాణ పనులు నిలిచిపోకుండా మరింత వేగంగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలోనే సమస్య అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలపై మరో నిర్మాణం చేపడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

“అడ్డుకునేవారు ఎవరూ లేరా?”

గంగారం ఎక్స్‌రోడ్ వద్ద వరుసగా నిర్మాణాలు వెలుస్తుండటంతో “అక్రమ నిర్మాణాలను అడ్డుకునే అధికారం ఉన్న అధికారులు ఎక్కడ?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే వెంటనే పనులను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ స్థాయిలో ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఇచ్చి ఉంటే ఏ భూమికి, ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ లేదా అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సర్పంచ్ అండదండలున్నాయనే ఆరోపణలు.

ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ సర్పంచ్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత సర్పంచ్ లేదా గ్రామపంచాయతీ అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ఆరోపణలు నిజమా? కాదా? అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికారులదేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత ప్రభావాలకు తావులేకుండా భూముల రికార్డులు, నిర్మాణ అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతున్నారు.

అధికారుల మౌనం ఎందుకు?

ఒకవైపు ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? సెలవు రోజుల్లో నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నా సంబంధిత సిబ్బంది ఎందుకు తనిఖీలు చేయడం లేదు? గతంలో వచ్చిన ఫిర్యాదులు, పత్రికా కథనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమగ్ర విచారణకు డిమాండ్.

గంగారం ఎక్స్‌రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై తక్షణమే సమగ్ర క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాలు ఏ భూమిలో జరుగుతున్నాయి? భూమి స్వభావం ఏమిటి? సంబంధిత వ్యక్తుల వద్ద పట్టాలు లేదా హక్కు పత్రాలు ఉన్నాయా? గ్రామపంచాయతీ నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగి ఉంటే వెంటనే గుర్తించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. గంగారం ఎక్స్‌రోడ్‌లో వరుసగా వెలుస్తున్న నిర్మాణాల వెనుక అసలు కథేంటి? నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయా? అధికారుల అనుమతులు ఉన్నాయా? ఆరోపణల్లో వాస్తవమెంత? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు ఇచ్చే సమాధానాలపై ఇప్పుడు స్థానికుల దృష్టి నెలకొంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలందించిన గిడుగు రామమూర్తి పంతులు, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు రంగురంగుల అలంకరణలతో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ విద్యార్థినులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలుగు భాష ప్రాముఖ్యత, సంస్కృతి, సాహిత్య గొప్పతనాన్ని వివరించారు. క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. క్రీడల్లో విద్యార్థినులు మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉపాధ్యాయినీలు, ప్రత్యేకాధికారిణి ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా పూర్తిగా తెలుగులోనే ప్రసంగించడం విశేషంగా నిలిచింది. తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని కేజీబీవీ కాటారం ప్రిన్సిపాల్ చల్ల సునీత సూచించారు. అలాగే విద్యార్థినులు క్రీడల్లో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు ఉపాధ్యాయిని సరిత, శారీరక విద్యా ఉపాధ్యాయిని రాజేశ్వరి, ఉపాధ్యాయినీలు నళిని, సుజాత, అరుణ, మౌనిక తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, నాయకులు మూడేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శల వెనుక కుట్రలు ఉన్నాయని తేలిపోయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్‌ రీసెర్చ్‌ సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందాల నివేదికలు కాంగ్రెస్‌ ఆరోపణలను పటాపంచలు చేశాయని ఆయన పేర్కొన్నారు. మంథని మండలం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బ్యారేజీ వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి బుధవారం పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణితో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత దానిని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పుట్ట మధూకర్‌ ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిపై ప్రశ్నించకుండా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ఉండిపోయారని విమర్శించారు.

చెక్‌డ్యాంలు, బ్రిడ్జిలపై విమర్శలు

తండ్రి, కొడుకులు మంథని నియోజకవర్గాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించినప్పటికీ ఒక్క చెక్‌డ్యాం, ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదని పుట్ట మధూకర్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బొక్కలవాగుపై చెక్‌డ్యాంలు, గోదావరిపై బ్రిడ్జిలు నిర్మించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన సమయంలో మత్స్య సంపద పెరిగిందని, భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల మత్స్యకారులు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద పెరగడంతో గతంలో దుబాయ్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు తిరిగి స్వగ్రామాలకు వచ్చారని పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోవడంతో ఉపాధి లేక ప్రజలు మళ్లీ వలసబాట పడుతున్నారని ఆరోపించారు. సుందిళ్ల బ్యారేజీ విషయంలో నిపుణుల సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందం సూచనలు చేసినప్పటికీ నీటిని నిల్వ చేయకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలపై మమకారం పెరగలేదని పుట్ట మధూకర్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయాలని, లేదంటే ప్రజలే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుందని పుట్ట మధూకర్‌ హెచ్చరించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ఫెర్టిలైజర్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వివరాల ప్రకారం.. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.267 ఉండగా, కొన్ని దుకాణాల్లో రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే రూ.1,350 ధర ఉండాల్సిన డీఏపీని రూ.1,850 వరకు విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. అధికారిక యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని కొనుగోలు చేసినప్పటికీ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఒక్కో దుకాణంలో ఒక్కో ధర.

ఎరువులతో పాటు పంటలకు వినియోగించే పురుగుమందులు, స్ప్రే మందులను కూడా ఒక్కో దుకాణంలో ఒక్కో ధరకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ధరలపై ప్రశ్నించినప్పుడు కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు చేపట్టాలి.

ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. ప్రతి ఫెర్టిలైజర్‌ దుకాణంలో అన్ని ఉత్పత్తుల ధరలు స్పష్టంగా కనిపించేలా రేట్‌ బోర్డులు ఏర్పాటు చేయించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆయన అధికారులను కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 24: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్ల (CRT) నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇతర జిల్లాల వారికి అవకాశం కల్పిస్తున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ పీక కిరణ్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహాదేవపూర్‌ మండలాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 20 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని కిరణ్‌ ఆరోపించారు. వారికి భూపాలపల్లి జిల్లా నుంచి జీతాలు చెల్లిస్తూ, ఇతర జిల్లాల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అలాగే మేడిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ నియామకంలోనూ నిబంధనలు పాటించలేదని జేఏసీ ఆరోపించింది. 50 ఏళ్లు నిండని పురుష ఉపాధ్యాయుడైన ఎం. చంద్రశేఖర్‌రెడ్డికి హెడ్‌మాస్టర్‌ బాధ్యతలు అప్పగించారని, అదే పాఠశాలలో సీనియర్‌ మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నప్పటికీ నిబంధనలను పక్కనబెట్టారని పేర్కొంది. ఇక కాళేశ్వరం ఆశ్రమ పాఠశాల బాలికల వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని జేఏసీ ఆరోపించింది. పోషకాహారం సరిగా అందక విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. గతంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మందికి పడిపోయిందని తెలిపింది. మహాదేవపూర్‌లోని బాలికలు, బాలుర వసతిగృహాల్లోనూ మెనూ అమలుపై ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఇతర జిల్లాల వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం స్థానికుల హక్కులను కాలరాయడమేనని పీక కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్‌-లోకల్‌ సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేసి, నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, అవసరమైన సౌకర్యాలు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.

Blog Archive


www.medigaddatvnews.com