MEDIGADDA TV NEWS CEO

MEDIGADDA TV NEWS CEO
CEO ANAPARTHI SRINIVAS GOUD Mobile Number 9848223934 9618970144

MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 53 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ స్పీకర్ శ్రీపాద రావు స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు అండగా నిలుస్తూ ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న శ్రీను బాబు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. యువతకు మార్గదర్శిగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న శ్రీను బాబు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఎంపీడీవో అడ్డూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామాభివృద్ధి పనుల అమలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో పారదర్శక పాలనకు, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ నిర్వహణకు వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, ప్రజలతో సమన్వయం పెంచుకొని సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని అన్నారు. శిక్షణలో శ్రీనివాస్, డి.రాజశేఖర్, బి.దేవేందర్ రెడ్డి, కె.మహేష్ శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై మార్గదర్శనం చేశారు. గుండ్రాత్లి, దామరకుంట, ఎలసాగర్, రంగారం, రేగులగూడెం, శంకరంపల్లి గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్రాజెక్టుపై టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం, నిర్వహణ పనితీరును సమగ్రంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంపొందించడం ద్వారా విద్యుత్ సమస్యలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తనిఖీ సమయంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై వివరాలు వెల్లడించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం కొత్తపల్లి సుందరాజ్‌పేట్ గ్రామంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిధిలో కాలువలు నిర్మించవద్దని కోరుతూ ఇరిగేషన్ డీఈకు వినతిపత్రం సమర్పించారు. కాలువల నిర్మాణం వల్ల సాగుభూములు నష్టపోయే ప్రమాదం ఉందని, పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. భూములు కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములను రక్షిస్తూ కాలువ మార్గాన్ని మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వేసవికాలంలో తలెత్తే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమ్మర్ వాటర్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. గ్రామ పరిధిలోని దంతాలపల్లి, శ్రీనివాస కాలనీ, బొప్పారం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు పరిశీలించారు. మిషన్ భగీరథ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో కలిసి గ్రామంలోని వాటర్ ట్యాంకులను తనిఖీ చేసి, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించారు. వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దంతాలపల్లి, బొప్పారం ప్రాంతాల్లో కొత్త బోర్లు మంజూరు చేయాలని గ్రామ ప్రతినిధులు కోరగా, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొర్రల్ల రాజయ్య, అసిస్టెంట్ సంపత్, లైన్మెన్ వెంకటేశ్వర్లు, బాల్నే ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేసవికాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఫిబ్రవరి 23: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధిత కుటుంబానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, బీసీలపై వరుసగా జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రాణాలకు భద్రత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రెండు నెలల శిశువు మృతి దారుణమని, నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుండటం చట్టవ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. కుల అహంకారంతో జరిగే హత్యలు ఆగకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టే ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, వెంటనే “బీసీ అట్రాసిటీ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడిని సమాజంపై దాడిగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా చట్టం చేయాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిలకర శ్రీను, మామిడి శ్రీకాంత్, కౌటం సురేందర్, మోటపోతుల సమ్మయ్య, గంధం సిద్దు, దుస్స శ్రీకాంత్, ప్రభాత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కుమ్మేర మల్లన్న స్వామి జాతర సందర్భంగా రజక సోదరులపై జరిగిన దాడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పేర్కొన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై కులం పేరుతో దాడి చేయడం అమానుషమని, ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, పూర్తి రక్షణ కల్పించే వరకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమాజంలో ఎవరికైనా కులం పేరుతో అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి రజక తదితరులు పాల్గొన్నారు.

Blog Archive