Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, టిఆర్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్పి పార్టీ సమ్మెలో పాల్గొంటుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా టిఆర్పి పార్టీ ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంతవరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటకు వెళ్లనివ్వమని హెచ్చరించారు. కార్మికులు తమ కష్టంతో ఆర్టీసీని నిలబెట్టుకుంటున్నారని, వారి న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, టిఆర్పి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.






