Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 11: కాటారం మండలంలోని బయ్యారం గ్రామానికి చెందిన పసుల పద్మ అనే మహిళ ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్థులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.పద్మ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే 99635 92134 నంబర్ను సంప్రదించాలని కోరారు. గ్రామస్థులు కూడా ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాముత్తారం, జూన్ 11: మహాముత్తారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ను నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం సడువలి పాల్గొన్నారు. అలాగే నేతకాని రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజబాబు నేత కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాముత్తారం మండలం వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎస్సై రమేష్ను కోరారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత పాటిస్తూ మండల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన ఎస్సై రమేష్, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. మహాముత్తారం మండల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం దుర్గం సడువలి, రాజబాబు నేతలు ఎస్సై రమేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్పల్లి గ్రామంలో కులదైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో 12 సంవత్సరాల క్రితం నాటిన తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడంపై గౌడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న, కల్లు తీయడానికి అనువుగా ఎదిగిన తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేయడం గీత కార్మికుల జీవనోపాధిపై దెబ్బతీసే చర్యగా అభివర్ణించాయి.కాంతారెడ్డి సువర్ణదేవి, ఆమె కుటుంబ సభ్యులు జేసీబీ (AP 23 AI 6355) సహాయంతో చెట్లను తొలగించారని ఆరోపిస్తూ, ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తాటి చెట్లు గౌడ కుటుంబాల జీవనాధారమని, వాటిని అక్రమంగా తొలగించడం వందలాది గీత కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణగోని చంద్రం గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, కస్తూర్పల్లి గ్రామ అధ్యక్షుడు యాద గౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాద గౌడ్తో పాటు సంఘ సభ్యులు, గ్రామ గౌడ కులస్తులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన పంగ సురేష్, మారగోని బాపు (పులి బాపు), జాడి బాపులు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండ గొర్ల బాపు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, మార్క బాపు, మహిళా మండల ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గాదె రవీందర్, మహాముత్తారం టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకుడు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 11: కాటారం కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లకు మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) సమర్థవంతమైన అమలుపై గురువారం జెడ్పీహెచ్ఎస్ కాటారం వేదికగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యు. సోమలింగం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆహార నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత, ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం, రాగి జావ ప్రాముఖ్యత, అయోడైజ్డ్ ఉప్పు వినియోగం, పోషకాహార లోపాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం కీలకమని పేర్కొంటూ, కుక్-కమ్-హెల్పర్లు సేవాభావంతో పనిచేసి విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 11: మంథని నియోజకవర్గం కాటారం మండలంలోని గారేపల్లి ప్రాంతానికి చెందిన విలాసాగారం లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.2 లక్షల ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది.బాధితురాలి పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి సహాయకులు సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సహకారంతో వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక భరోసా లభించిందని వారు పేర్కొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 10 : కాటారం మండలం మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మేడిపల్లి–కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, పాఠశాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారిని బడిలో చేర్పించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్యా సదుపాయాలు తదితర అంశాలను వివరించారు. పిల్లల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల నమోదు పెంపుతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన ఉపాధ్యాయులు, ప్రతి చిన్నారి విద్యను పొందేలా తల్లిదండ్రులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.