MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి, జూలై 13: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (కేకే కమిటీ) నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో ప్రజాసంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. సోమవారం బాతల రాజన్న భవన్‌లోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పీక కిరణ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కామెర గట్టయ్య, జోగుల సమ్మయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలను గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి 250 గజాల ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, నిరుపేద ఉద్యమకారులకు రెండు ఎకరాల భూమి, ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న నిరుద్యోగ యువతకు రూ.25 వేల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారులపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, భౌగోళిక తెలంగాణ ఏర్పడినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ప్రజాస్వామిక తెలంగాణ సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. త్వరలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఉద్యమకారుల భారీ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జాలిగం రాజు, రత్నం కిరణ్, ఐతే బాపు, మల్లేష్, పార్వతక్క, రావుల రమేష్, నారా శంకర్, లావణ్య, మనోజ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం మహబూబ్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నం సారయ్య (60)ను ఆయన కుమారుడు రవీందర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవీందర్ గొడ్డలితో సారయ్యపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సారయ్య మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 12: కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మేడిపల్లి, బస్వాపూర్ గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ.5 లక్షలు, సీఆర్‌ఆర్ నిధుల నుంచి రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ గడవేణి పవిత్ర దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పవిత్ర దేవేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుంటి మల్లయ్య, ఉపసర్పంచ్ రెడ్డి అనిల్, వార్డు సభ్యులు గుంటి శైలజ, మారావేణి మౌనిక, మానేటి రామచంద్రం, గుంటి లక్ష్మన్, పెరుమాళ్ల శివకుమార్, పొలం పుష్పలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడవేణి దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు లిక్కి రాజమౌళి, గాదె లచ్చయ్య, మారావేణి లక్ష్మన్, గుంటి హన్మంత్, గుంటి సమ్మయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి, జూలై 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భువనగిరిలో జూలై 5న నిర్వహించిన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయడం పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇలాంటి భారీ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన పార్టీని విస్తరించేలా కృషి చేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపడుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2028లో తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ప్రారంభించిన సర్జికల్ స్ట్రైక్ మరియు కౌంట్‌డౌన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ బీసీ ముఖ్యమంత్రి కాలేదని పేర్కొంటూ, రాజ్యాధికారం సాధించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా కోఆర్డినేటర్ మామిడి శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్ చరణ్, వామినోజు రాజేందర్, సామల చంద్రశేఖర్, బుర్రి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
గణపురం, జూలై 8: గణపురం మండల కేంద్రంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు బి. స్వాతి, జిల్లా కార్యదర్శి బి. సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం AISA నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో AISA కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేపట్టామని తెలిపారు. విద్యార్థుల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భగత్ సింగ్, సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల స్ఫూర్తిని పెంపొందించేందుకు వారి జయంతులు, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై విద్యార్థి నాయకులకు అవగాహన కల్పించి, భవిష్యత్‌లో విద్యా రంగ సమస్యలపై సమర్థవంతంగా పోరాడే నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశమని వివరించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేసేందుకు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థలు ఆర్థికంగా, నైతికంగా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో AISA జిల్లా నాయకులు యజ్ఞశ్రీ, అంజలి, ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో విధులు నిర్వహించాల్సిన డ్యూటీ డాక్టర్‌ను నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌పై జిల్లా కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మహా ముత్తారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లు పోస్టింగ్‌లో ఉన్నప్పటికీ, వారిలో ఒకరు అధికారుల సిఫార్సులు, పైరవీలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య గ్రామీణ ప్రజల ఆరోగ్య హక్కులను దెబ్బతీసేదిగా ఉందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లను జిల్లా కేంద్రాలకు తరలించడం వల్ల స్థానిక పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత డాక్టర్ డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేసి, ఆయనను యథావిధిగా మహా ముత్తారం పీహెచ్‌సీకి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలని, లేనిపక్షంలో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కోట రాజబాబు, వామన్‌రావు, రామారావు, మహాదేవపూర్ ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ గౌరవ సభ్యులు, మైనార్టీ సెల్ బ్లాక్ అధ్యక్షుడు అస్రార్, ఇర్షాద్, కోట సమ్మయ్య, శివరాజు, రవిచంద్ర, రాఘవేంద్ర, చక్రధర్, కొయ్యల సత్యం, తడకల జగదీశ్వర్, నాగరాజు, మాజీ ఎంపీటీసీ గంగులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో విశేష మార్పు తీసుకువచ్చాయని కొనియాడారు.

Blog Archive


www.medigaddatvnews.com