కాటారం, జూలై 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చల్ల సునీత తెలిపారు. జూలై 17, 18 తేదీల్లో ఉదయం నుంచి అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. విద్యాలయంలో ప్రస్తుతం 7వ తరగతిలో 10 సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 10 సీట్లు, బైపీసీ విభాగంలో 9 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రవేశాలకు హాజరయ్యే విద్యార్థినులు సంబంధిత ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తదితర అవసరమైన పత్రాలతో విద్యాలయానికి హాజరుకావాలని కోరారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా కేజీబీవీ కాటారం కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ చల్ల సునీత సూచించారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యను అభ్యసించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
Recent Post Recent Post
View More Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 16: దేశంలోకి ఎల్నినో ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో రానున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కాటారం మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) పూర్ణిమ సూచించారు. గురువారం కాటారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆగస్టు నాటికి ఎల్నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. బిందు, తుంపర సేద్యం వంటి నీటి పొదుపు పద్ధతులను అనుసరించడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులు నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇదే సమయంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓలు) రైతులతో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ప్రతాపగిరిలో శ్రీకన్య, కొత్తపల్లిలో దివ్య, విలాసాగర్లో అస్మా, కాటారంలో రాజన్న, ఒడిపిలవంచలో దీపక్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటలు, సాగు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పలిమెల, జూలై 15: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని ఇంచంపల్లి ప్రాజెక్టును పునరుద్ధరించి జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతాన్ని పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. ఇంచంపల్లి ప్రాజెక్టుకు దశాబ్దాల చరిత్ర ఉందని, ఆనాటి నిజాం ప్రభుత్వం కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. అయితే అప్పట్లో కలరా, ప్లేగు వంటి మహమ్మారుల కారణంగా పనులు నిలిచిపోయాయని, నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రాంతంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే సరిహద్దు గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. బీడు భూములు సస్యశ్యామలంగా మారి రైతాంగం ఆర్థికంగా బలోపేతం అవుతుందని తెలిపారు. నీటిపారుదల శాఖ, టీజెన్కో అధికారులు క్షేత్రస్థాయిలో వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సరిహద్దు ప్రాంత ప్రజలు, కుల సంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు, లింగమల్ల సడవలి రావు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూలై 14: కేంద్రమంత్రి, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చంద్రరావును కాటారం డివిజన్ బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి మర్యాదపూర్వకంగా కలిసి కాటారం గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రంలో సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామంలో 1,200 సోలార్/ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ప్యానల్ సెట్లను మంజూరు చేయాలని కోరారు. అలాగే 1,300 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి 40 చొప్పున మొత్తం 52 వేల కొబ్బరి మొక్కలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ సౌందర్యవృద్ధికి దోహదపడుతుందని సడవలి వివరించారు. వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత సీఎస్ఆర్ సంస్థల ద్వారా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యులు మానేం రాజబాబు, కొండ రాము తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 14: మహా ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) డాక్టర్ డెప్యుటేషన్ను వెంటనే రద్దు చేయాలని, మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం యామనపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో మహా ముత్తారం పీహెచ్సీ డాక్టర్ను డెప్యుటేషన్పై పంపడం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని విమర్శించారు. నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డెప్యుటేషన్ ఉత్తర్వులను రద్దు చేసి డాక్టర్ను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న బీసీ హాస్టల్ను తరలించే ప్రయత్నాలను విరమించుకుని, యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించకపోతే మండలవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్ నాయక్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు, అయిత బాపు, మండల కో-కన్వీనర్ లింగమల్ల సడవలరావు, సురేష్, కాసర్ల రాజకుమార్, బానోత్ రాజు నాయక్, పులియాల దుర్గేష్, జనగామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి, జూలై 13: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (కేకే కమిటీ) నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో ప్రజాసంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. సోమవారం బాతల రాజన్న భవన్లోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పీక కిరణ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కామెర గట్టయ్య, జోగుల సమ్మయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలను గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి 250 గజాల ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, నిరుపేద ఉద్యమకారులకు రెండు ఎకరాల భూమి, ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న నిరుద్యోగ యువతకు రూ.25 వేల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారులపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, భౌగోళిక తెలంగాణ ఏర్పడినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ప్రజాస్వామిక తెలంగాణ సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. త్వరలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఉద్యమకారుల భారీ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జాలిగం రాజు, రత్నం కిరణ్, ఐతే బాపు, మల్లేష్, పార్వతక్క, రావుల రమేష్, నారా శంకర్, లావణ్య, మనోజ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం మహబూబ్పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నం సారయ్య (60)ను ఆయన కుమారుడు రవీందర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవీందర్ గొడ్డలితో సారయ్యపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సారయ్య మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Subscribe to:
Posts (Atom)
Blog Archive
- July (25)
- June (57)
- May (24)
- April (34)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
www.medigaddatvnews.com










