MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 25: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కార్పొరేటర్ చాడ స్వాతి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహిళా సాధికారత, దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలు మరియు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై విస్తృతంగా మాట్లాడారు. మహిళల సాధికారతకు అత్యంత కీలకమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల ఆశయాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ‘మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టిందని, 2029 నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై పెద్దలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల అసలు వైఖరి పార్లమెంటులో బయటపడిందని, ఇది మహిళా వ్యతిరేక కూటమిగా స్పష్టమవుతోందని అన్నారు. మహిళలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుందని ఆరోపించారు. గతంలో కూడా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ విషయంలో నిర్లక్ష్య వైఖరినే చూపిందని విమర్శించారు. మహిళల హక్కులను అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు ఏకమయ్యాయని, భవిష్యత్తులో మహిళలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ, మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, రాష్ట్ర నాయకులు బట్టు రవి, అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్, కౌన్సిలర్ ఎరుకల రేణుక, మీడియా ఇంచార్జ్ మునీందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలిఫ్, మహిళా మోర్చా నాయకురాలు బూర పద్మ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో “చలో ఇందిరా పార్క్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, విద్య హక్కు చట్టం–2009 అమలు కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలాదిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా నుండి కూడా భారీగా తరలిరావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎల్కేజీ సీటు పొందాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్, బూట్లు తదితరాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ భారాన్ని భరించలేక ప్రజలు అప్పులపాలు అవుతూ, తమ ఆస్తులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా దోపిడీ ఇప్పటికే ఆగిపోయేదని, కానీ పాలకుల అండదండలతో విద్యా మాఫియా రెచ్చిపోతుందని రవి పటేల్ విమర్శించారు. విద్య హక్కు చట్టం–2009ను పూర్తిగా అమలు చేస్తే సామాన్యుడి బిడ్డ కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుందని, ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పడుతుందని, విద్యా వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ సమాజం ఇకనైనా మేల్కొని, పిల్లల విద్య కోసం అప్పులపాలు కావడం ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. “చదువు అమ్ముకునే వస్తువు కాదు – ఇది ప్రతి బిడ్డ హక్కు” అని స్పష్టం చేశారు. తెలంగాణలో వెంటనే విద్య హక్కు చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ విద్యా దోపిడిని అరికట్టాలని, పేదవారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మన హక్కులను సాధించాలంటే మరో ఉద్యమం తప్పదని, అందరం కలసి పోరాడాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మడే సంతోష్, వైద్య లక్ష్మణ్, రామ్ చరణ్, రేణుకుంట్ల సునీల్, లక్ష్మణ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన లింగంపల్లి సమ్మక్క కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతి రావు, బూత్ అధ్యక్షులు రాజేశ్వరరావు, నాయకులు పాపారావు, తిరుపతి రావు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల అభివృద్ధికి పునాది వేస్తూ ‘అమ్మవడి మొదటి బడి’గా నిలుస్తున్నాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి డివిజన్ అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం, సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాల జాబితాను సమర్పించాలని, వాటికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసి భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడిల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామ స్థాయిలో సేవలందించే సైనికులని పేర్కొంటూ, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి సేవలు ఎంతో దోహదపడు తున్నాయని అన్నారు. ప్రతి బిడ్డకు కనీసం ఆరు నెలలు తల్లిపాలు అందేలా చూడాలని, పోషకాహారం తీసుకునేలా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను చైతన్యపరచాలని సూచించారు. అంగన్వాడి సేవలను మరింత పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న వివిధ సర్వేల్లో అంగన్వాడి సిబ్బంది భాగస్వాములు అవుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూపాలపల్లి డివిజన్‌లోని 418 మంది అంగన్వాడి సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పోషణ మాసం నిర్వహించినట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో గర్భిణీలు, చిన్నారులకు సేవలు అందించడంలో అంగన్వాడి సిబ్బంది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ప్రతి చిన్నారి, గర్భిణి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని, పథకాల సమర్థవంతమైన అమలుకు అది దోహదపడుతుందని సూచించారు. ప్రతి కేంద్రంలో పిల్లల ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంధాలయ సంస్థల ఛైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి, కౌన్సిలర్లు, ఆర్టీఐ సభ్యులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల మూడవ రోజు సమ్మెకు మద్దతుగా ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో పలువురు కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణమే రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నవి తమ స్వంత డిమాండ్లు కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. కార్మికులు ఉంచిన 30 డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అమలు చేయాలని కోరారు. లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తీన్మార్ మల్లన్న నేతృత్వంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. “కార్మికులు లేనిదే ఏ ప్రభుత్వం నిలవదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. వెంటనే కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే రాస్తారోకాలు, పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం” అని ప్రభుత్వం ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక మరియు ఉపాధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా నాయకులు రాజేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం మండలంలోని అంకుషాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ప్రోగ్రాము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా సర్పంచ్ కల్పన దేవయ్య  హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగపరుచుకోవాలని సూచించడం జరిగినది అలాగే చిరుధాన్యాలకు మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించడం జరిగినది. సూపర్వైజర్ శివరాణి  మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను ముర్రుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది అలాగే వెయ్యి రోజుల ( గర్భిణీ దశ నుండి రెండు సంవత్సరముల పిల్లల వరకు జరిగే అభివృద్ధి )ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది ప్రీస్కూలు ఆవశ్యకతను గురించి వివరించడం జరిగినది. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో స్వేచ్ఛ వాతావరణంలో ఆటపాటల ద్వారా విద్యను అందించడం వలన సమగ్ర అభివృద్ధి జరుగుతుందని వివరించడం జరిగినదిప్రథమ్ ఎన్జీవో సమ్మయ్య గారు పాఠశాల సంసిద్ధత మరియు బాలమేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదనంతరము గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన దేవయ్య ఉపసర్పంచ్ ఉమా శంకర్ అంగన్వాడి సూపర్వైజర్స్ శివరాణి రమాదేవి వ్రతం ఎన్జీవో సమ్మయ్య గారు కార్యదర్శి రజిత వార్డు మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తుల భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ TPF సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. 41 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం స్పందించకుండా 41 రోజుల తర్వాత ఐఏఎస్ తో  కమిటీ వేశామని కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది. గత ఎన్నికలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వంచనకు గురిచేసింది. ఈ స్థితిలో అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టింది. సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలంతా ఆర్టీసీ కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కార్మికులంతా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంగా ఉండాలని, ఎన్ని ఒత్తిడిలు ఎంత నిర్బంధం ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలని కిరణ్ పిలుపునిచ్చారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com