MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్, మే 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ శివారులో ఉన్న ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రమాదంలో గెస్ట్ హౌస్‌తో పాటు అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, ఇతర విలువైన సామగ్రి, సిబ్బందికి చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గెస్ట్ హౌస్ ఇన్‌చార్జ్ తపాస్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అగ్నిప్రమాదంలో జరిగిన మొత్తం నష్టం సుమారు రూ.1,48,11,795 (ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు)గా అంచనా వేశారు. సమాచారం అందుకున్న మహాదేవపూర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహాదేవపూర్ ఎస్‌ఐ కె. పవన్ కుమార్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

"కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం" అంటూ భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. పుష్కరాల 5వ రోజు సందర్భంగా త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమాతకు నీరాజనాలు అర్పిస్తున్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచి భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


సోమవారం ప్రత్యేకత.. దానధర్మాలకు ప్రాధాన్యం

పుష్కరాల తొలి 12 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. 5వ రోజు సోమవారం కావడంతో శివారాధనతో పాటు దానధర్మాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి పరిరక్షణ, నదీ సంస్కృతి పరిరక్షణకు సంకేతంగా పుష్కరాల సందర్భంగా నదీతీరాల్లో స్వచ్ఛత పాటించాలని, ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి, ఈడిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ ఈడిగ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా గౌడ, ఈడిగ ఉద్యోగులు మరియు సంప్రదాయ వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. గౌడ, ఈడిగ వర్గాల ఆర్థిక, సామాజిక పురోగతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్, జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,మే,16 పోరాట దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు.2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు,నేటి బీఆర్ఎస్ పార్టీ మంథనికి స్వాతంత్రం వచ్చిన రోజు,మంథని ప్రజాస్వామ్య పోరాటం–మే16విముక్తి దినాన్ని పురస్కరించుకొని,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు రామగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని ముస్త్యాల గ్రామంలో శనివారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్లను పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.తీవ్ర ఎండల మధ్య కూలీలకు చల్లని మజ్జిగ అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.సమాజసేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాసినేని వినోద్–సత్యనారాయణరావు మరియు సుందిళ్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొడ్డుపెల్లి రవి,గోశిక నరసయ్య,కాశిపేట ప్రశాంత్,మద్దెల కొమురయ్య,రైతు రమేష్,సుందిళ్ల సతీష్,బొండ్రా అంజయ్య,ఆవులూరి సాగర్,సాధుల సందీప్,బొడ్డుపెల్లి రాకేష్,సిద్ధ శేఖర్,సుధమల్ల రోహిత్,పులి అభిలాష్,కంది గురువయ్య,రామగిరి కృష్ణ,అవునూరి రాజేశం,ఎలుకటూరి అరవింద్,బొడ్డుపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం పుట్ట మధుకర్ ఆశయమని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూరల్ పరిధిలోని గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాలకు చెందిన పలువురు యువకులు భారీ ఎత్తున పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలు పార్టీకి అండగా నిలుస్తున్నాయని, పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో వంద మందిని చైతన్యపరిచి భూపాలపల్లిలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పేదల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్‌లను రవి పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్‌తో పాటు గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,మే,12 : ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.ముస్త్యాల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,అభిషేకము అర్చనలు నిర్వహించి గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.మరియు సంపత్తి భోజనం కూడా ఏర్పాటు చేశారు.ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో గ్రామ సర్పంచ్ సుంకరి మహేందర్-మాధవి,ఉపసర్పంచ్ బాసినేని వినోద-సత్యనారాయణరావు, వార్డుసభ్యులు,గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పరకాల, మే 11: కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమవుతున్న నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి రోడ్డులోని న్యూ భాస్కర్ సిమెంట్ అండ్ ఐరన్ దుకాణం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్‌ల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆరోపించారు. 2020లోనే పార్లమెంటులో ఆమోదించిన ఈ కోడ్‌లను దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో అమలు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ కోడ్‌ల అమలుకు ముందుకొచ్చిందని, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత వాటిని నోటిఫై చేయడం కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్‌లు కార్మికుల సంక్షేమం కోసం కాదని, కార్పొరేట్ సంస్థలకు శ్రమ దోపిడీకి మార్గం సుగమం చేయడానికేనని ఆయన ఆరోపించారు. వీటి రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొచ్చు ఆదాం, కృష్ణంరాజు, సాంబయ్య, గణేష్, వేణు, ఓంకార్, రాజు, రమేష్, మొగిలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com