MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో భారీగా యువత చేరారు. గ్రామ 8వ వార్డు మెంబర్ అంబటి కార్తీక్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరగా, టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్దంపల్లి, దుంపిల్లపల్లి గ్రామాలకు చెందిన అంబటి కార్తీక్, ఎర్రబాటి హరీష్, వజ్జీరు కిరణ్, చలుకాని సైలని, బాబా, సిద్ధార్థ తదితరులకు రవి పటేల్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, అభ్యున్నతి, రాజ్యాధికారం కోసం టీఆర్పీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. గడపగడపకు వెళ్లి పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని కోరారు.

అంబటి కార్తీక్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకుని, రవి పటేల్ ఆధ్వర్యంలో బహుజనుల కోసం జరుగుతున్న పోరాటాలకు ఆకర్షితుడై టీఆర్పీలో చేరినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు గండు కరుణాకర్, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, సామల చంద్రశేఖర్, పిట్టల రాంబాబు, జినుకల శ్రీకాంత్, వేల్పుల దేవేందర్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం జిల్లాకు చెందిన సాంస్కృతిక, కోలాటం, భజన కళాకారులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా కళలను నమ్ముకుని జీవిస్తున్న తమను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

కళాకారులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం, పెన్షన్, కళాకారుల భృతి, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. జిల్లాలోని దేవాలయాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు కళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారం సాధించిన అనంతరం కళాకారుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కళలు, కళాకారులు తెలంగాణ సమాజానికి గర్వకారణమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాకారుల రాష్ట్ర నాయకులు కుడుముల కుమార్, జాతీయ అధ్యక్షుడు వీరభద్ర స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు కుంట్ల ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలు రజిత కీసర, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మయ్య, జనగాం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బందెర రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కుడుముల రామా తదితరులతో పాటు జిల్లా కోలాటం, భజన కళాకారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెదపల్లి: గోదావరిఖని సెప్టెంబర్ 12 : సింగరేణి సంస్థలో ప్రస్తుత గుర్తింపు సంఘం పదవీ కాలం ముగిసినందున వెంటనే నూతన కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని,సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్'(సీఐటీయూ)డిమాండ్ చేసింది.ఈ మేరకు శనివారం రామగుండం-2ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టు మేనేజర్ సంపత్ కుమార్‌ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడురు,డిసెంబర్ 27,2023న నిర్వహించిన ఎన్నికల ఆధారంగా,సెప్టెంబర్ 09,2024న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు యూనియన్ రెండేళ్ల కాలపరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ 08,2026తో ముగిసినందున...సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి నూతన ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.కొత్త ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడయ్యే వరకు,కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా నమోదు కాబడిన అన్ని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లకు సమాన అవకాశాలు,ప్రాతినిధ్యం సమానహోదా కల్పించాలని డిమాండ్ చేశారు.గతంలో 13-06-2023న హైదరాబాద్ సింగరేణి కాలర్స్ కంపెనీ వారి సమక్షంలో యాజమాన్యం సర్క్యులర్ ద్వారా తెలిపిన విధంగా,ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు అన్ని యూనియన్లకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాంప్రసాద్,వినేష్,సంపత్, శివకుమార్,శ్రీనివాస్,రాజేందర్,మల్లేష్,రాజశేఖర్,శ్యాం ప్రసాద్, సంతోష్‌లు...ఇతర కార్మిక సంఘ నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు హిందీ భాషకు సంబంధించిన పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, నాటికలు, చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ చల్ల సునీత రచించిన ‘దేవనాగరి లిపిలో వ్రాయబడిన భాషరా’ పాటను ఇంటర్మీడియట్ విద్యార్థినులు వర్షిణి, అర్చనలు ఆలపించారు. హిందీ భాష గొప్పతనం, ప్రాధాన్యతపై హిందీ ఉపాధ్యాయురాలు రాజమణి వివరించారు. కోట్లాది ప్రజల గుండెచప్పుడు హిందీ భాష అని ప్రిన్సిపాల్‌ చల్ల సునీత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ, సుజాత, రాజమణి, స్వప్న, సరిత, కవిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మి, రిబ్కాతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ, గంగారం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను డీఈ/ఆపరేషన్ నాగరాజు తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్లలో విద్యుత్ లోడ్, వోల్టేజ్ పరిస్థితులను పరిశీలించారు. వల్లంకుంట, తాడిచర్ల 33 కేవీ ఫీడర్లతో పాటు 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల లోడ్ పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ స్తంభాలపై విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, రక్షణ పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీలో కాటారం సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, లైన్‌మ్యాన్ ప్రవీణ్, అన్‌మ్యాన్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి, డీఆర్‌డీఓ  బాలకృష్ణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది.

సమావేశానికి ఎంపీడీవో  ఎ. బాబు, పీఏసీఎస్ చైర్మన్  టి. ప్రశాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,  సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పొందుపరిచిన ఎజెండా అంశాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా చర్చించారు.

మండల పరిధిలో వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. అభివృద్ధి పనుల పురోగతి, ఆయా శాఖల పనితీరుపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. వాటిపై అధికారులు వివరాలు వెల్లడించారు.

మండల అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఎజెండాలోని అంశాలపై చర్చ అనంతరం సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు.

భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాటం ఒక వ్యక్తికి పరిమితం కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం ఐసా విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఆమె చూపిన పోరాట మార్గంలో నడుస్తూ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని బుర్ర స్వాతి అన్నారు.

Blog Archive


www.medigaddatvnews.com