MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, నాయకులు మూడేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శల వెనుక కుట్రలు ఉన్నాయని తేలిపోయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్‌ రీసెర్చ్‌ సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందాల నివేదికలు కాంగ్రెస్‌ ఆరోపణలను పటాపంచలు చేశాయని ఆయన పేర్కొన్నారు. మంథని మండలం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బ్యారేజీ వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి బుధవారం పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణితో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత దానిని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పుట్ట మధూకర్‌ ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిపై ప్రశ్నించకుండా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ఉండిపోయారని విమర్శించారు.

చెక్‌డ్యాంలు, బ్రిడ్జిలపై విమర్శలు

తండ్రి, కొడుకులు మంథని నియోజకవర్గాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించినప్పటికీ ఒక్క చెక్‌డ్యాం, ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదని పుట్ట మధూకర్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బొక్కలవాగుపై చెక్‌డ్యాంలు, గోదావరిపై బ్రిడ్జిలు నిర్మించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన సమయంలో మత్స్య సంపద పెరిగిందని, భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల మత్స్యకారులు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద పెరగడంతో గతంలో దుబాయ్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు తిరిగి స్వగ్రామాలకు వచ్చారని పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోవడంతో ఉపాధి లేక ప్రజలు మళ్లీ వలసబాట పడుతున్నారని ఆరోపించారు. సుందిళ్ల బ్యారేజీ విషయంలో నిపుణుల సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందం సూచనలు చేసినప్పటికీ నీటిని నిల్వ చేయకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలపై మమకారం పెరగలేదని పుట్ట మధూకర్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయాలని, లేదంటే ప్రజలే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుందని పుట్ట మధూకర్‌ హెచ్చరించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ఫెర్టిలైజర్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వివరాల ప్రకారం.. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.267 ఉండగా, కొన్ని దుకాణాల్లో రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే రూ.1,350 ధర ఉండాల్సిన డీఏపీని రూ.1,850 వరకు విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. అధికారిక యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని కొనుగోలు చేసినప్పటికీ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఒక్కో దుకాణంలో ఒక్కో ధర.

ఎరువులతో పాటు పంటలకు వినియోగించే పురుగుమందులు, స్ప్రే మందులను కూడా ఒక్కో దుకాణంలో ఒక్కో ధరకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ధరలపై ప్రశ్నించినప్పుడు కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు చేపట్టాలి.

ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. ప్రతి ఫెర్టిలైజర్‌ దుకాణంలో అన్ని ఉత్పత్తుల ధరలు స్పష్టంగా కనిపించేలా రేట్‌ బోర్డులు ఏర్పాటు చేయించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆయన అధికారులను కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 24: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్ల (CRT) నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇతర జిల్లాల వారికి అవకాశం కల్పిస్తున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ పీక కిరణ్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహాదేవపూర్‌ మండలాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 20 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని కిరణ్‌ ఆరోపించారు. వారికి భూపాలపల్లి జిల్లా నుంచి జీతాలు చెల్లిస్తూ, ఇతర జిల్లాల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అలాగే మేడిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ నియామకంలోనూ నిబంధనలు పాటించలేదని జేఏసీ ఆరోపించింది. 50 ఏళ్లు నిండని పురుష ఉపాధ్యాయుడైన ఎం. చంద్రశేఖర్‌రెడ్డికి హెడ్‌మాస్టర్‌ బాధ్యతలు అప్పగించారని, అదే పాఠశాలలో సీనియర్‌ మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నప్పటికీ నిబంధనలను పక్కనబెట్టారని పేర్కొంది. ఇక కాళేశ్వరం ఆశ్రమ పాఠశాల బాలికల వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని జేఏసీ ఆరోపించింది. పోషకాహారం సరిగా అందక విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. గతంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మందికి పడిపోయిందని తెలిపింది. మహాదేవపూర్‌లోని బాలికలు, బాలుర వసతిగృహాల్లోనూ మెనూ అమలుపై ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఇతర జిల్లాల వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం స్థానికుల హక్కులను కాలరాయడమేనని పీక కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్‌-లోకల్‌ సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేసి, నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, అవసరమైన సౌకర్యాలు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని ఆ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


దూదేకులపల్లి గ్రామానికి చెందిన నీలారపు రాజబాబు అనారోగ్యంతో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రవి పటేల్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.


చిట్యాల మండలంలో ఇటీవల దాడికి గురైన జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌ను ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడించి రవీందర్‌కు ధైర్యం కల్పించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


టేకుమట్ల మండలం కలికోటపల్లి గ్రామంలో టీఆర్పీ నాయకుడు కొలని సదయ్య కుమార్తె రవళి–ప్రశాంత్‌ల వివాహానికి హాజరైన రవి పటేల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. దూతుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు శస్త్రచికిత్స చేయించుకున్న లక్కాకుల హరీష్‌ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



చిట్యాల మండలం గోపాల్పూర్‌లో ఇటీవల మృతి చెందిన దుప్పటి సారయ్య కుటుంబాన్ని నాలుగో రోజు పరామర్శించిన రవి పటేల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా సహకరించడం, ప్రమాద బాధితులకు ధైర్యం కల్పించడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత అన్నారు. కార్యక్రమాల్లో సాదు మల్లన్న ముదిరాజ్, టీఆర్పీ నాయకులు ఇనుగల ప్రణయ్ రాజ్, పిట్టల వెంకటేష్, మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మద్దులపల్లి, ఆగస్టు 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్‌డీఏ ద్వారా అందిన బాంబూ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పన్నాల కేతక్క, స్వరూప, రాజక్కలకు బాంబూ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిత మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తున్న బాంబూ మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్తులో రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వీబిజి రామ్ పథకం ద్వారా రైతులకు 15 గంటల పనికి దాదాపు రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని సర్పంచ్ సరిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్ కోరారు. గ్రామీణ ప్రాంత రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఐకెపి సీసీ శశికాంత్, వార్డు మెంబర్ సంతోష్, వీఓఏ మొండయ్య, నాయకులు సురేందర్, సమ్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జాదరావుపేట, ఆగస్టు 21: జాదరావుపేట గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రేషన్ డీలర్ కటుక సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఉప సర్పంచ్ కోట అశోక్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని స్వాగతిస్తున్నామని, డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రజలు సకాలంలో కార్డులు పొందాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాజా, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోట్ల బక్కమ్మ–ఎల్లయ్య, పోట్ల పోషయ్య, ఎండీ అజారుద్దీన్, కోట రమేష్, బండి శ్రీధర్‌తో పాటు లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 21: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు, హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 23న వరంగల్ ప్రెస్ క్లబ్, హనుమకొండలో బహిరంగ చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కాటారంలో కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరత్వం పొందినవారు, జైలు శిక్షలు అనుభవించినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, గాయపడినవారు, మానసిక వేధింపులకు గురైనవారు ఎంతోమంది ఉన్నారని కిరణ్ పేర్కొన్నారు. ఉద్యమ కేసుల కారణంగా ఇప్పటికీ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి తగిన గుర్తింపు, సహాయం, సంక్షేమం అందాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజాసంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు, వివిధ కుల సంఘాలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను చర్చావేదికలో వెల్లడించి, ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక రూపంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంథని సంజీవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ముఖ్య వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం పాల్గొంటారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చర్చావేదికను విజయవంతం చేయాలని కిరణ్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, రాష్ట్ర నాయకులు కామర గట్టయ్య, అయితే బాపు, బూడిది లావణ్య, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Blog Archive


www.medigaddatvnews.com