MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహాముత్తారం మండల కేంద్రం, కొర్లకుంట, మాదారం గ్రామాల్లో మొబైల్ లీగల్ అవేర్‌నెస్ వ్యాన్ ద్వారా న్యాయ అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారు, కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, కుటుంబ, సివిల్, ప్రామిసరీ నోట్ తదితర వివాదాల్లో చిక్కుకున్న బాధితులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. అక్షయ, ప్యానెల్ లాయర్ పారానంది సురేందర్, సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని, న్యాయపరమైన సమస్యలను సామరస్యంతో అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జి. నవీన్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కే. వెంకటేష్, ఎం. రాజ్‌కుమార్, పారా లీగల్ వాలంటీర్ లింగమళ్ల రమాదేవి, పి. అంజయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పేద్దపల్లి :ఏడుగురు అరెస్ట్..రూ.35,200 నగదు,ఏడు మొబైల్ ఫోన్లు,52 పేకముక్కలు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి నాగేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.35,200 నగదు,52 పేకముక్కలు,ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం..నాగేపల్లి గ్రామంలోని ఓ నివాస గృహంలో నగదును పందెంగా పెట్టుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో రామగిరి పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.దాడి సమయంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద ఉన్న నగదు,పేకముక్కలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,పేకాట,జూదం,మాదకద్రవ్యాల విక్రయం,అక్రమ మద్యం తయారీ,గుట్కా అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలకు చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని,ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 3: మహాముత్తారం మండలం కోనంపేట మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP)లో కాంట్రాక్టర్ల అక్రమాలు, కార్మికుల శ్రమదోపిడీ, అలవెన్సుల కుంభకోణంపై కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) జిల్లా చైర్మన్ పీక కిరణ్ నాయకత్వంలోని ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూలై 27న ఇదే అంశంపై వినతిపత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆగస్టు 3న రిమైండర్ లేఖను అందజేశారు. ప్లాంట్‌లో నిబంధనల ప్రకారం 60 నుంచి 80 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 16 మందితోనే నిర్వహణ కొనసాగుతోందని ఆరోపించారు. దీంతో కార్మికులపై అధిక పనిభారం పడటమే కాకుండా ఆదివారాలు, పండుగ సెలవులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కార్మికుల జీతాల నుంచి PF, ESI, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు అక్రమ కోతలు విధిస్తున్నారని, లేని ఉద్యోగులను రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. సూపర్‌వైజర్ పోస్టుల పేరుతో లక్షల రూపాయల అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని కూడా తెలిపారు. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, కార్మికులకు బకాయి అలవెన్సులు, PF, ESI, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పందిస్తూ, మిషన్ భగీరథ మరియు కార్మిక శాఖ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాళేశ్వరం, ఆగస్టు 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానం చేసేందుకు గోదావరిలోకి దిగిన భక్తుడు బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి (50) ప్రమాదవశాత్తు బలమైన ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయి మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, శ్రీనివాస్ రెడ్డి పుణ్యస్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో అదుపుతప్పి లోతైన నీటిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన అక్కడే ఉన్న నిట్టూరి మహేశ్, దరిపెల్లి శ్రీకాంత్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గోదావరిలోకి దిగి ఆయనను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ప్రవాహం వేగంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న స్థానికులు, ఇతర భక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అనంతరం కొంతసేపటి తర్వాత శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని గోదావరి నుంచి వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో త్రివేణి సంగమం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పుణ్యస్నానానికి వచ్చిన భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంశెట్టి రాజు పటేల్ అనే యువకుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం ప్రకారం, రాంశెట్టి రాజు పటేల్ స్నానానికి వెళ్లే సమయంలో బాత్రూం సమీపంలో ఉన్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు చేతికి తగలడంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దామెరకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, ఆగస్టు 1: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు దోమల వ్యాప్తి, అంటువ్యాధులను అరికట్టేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో అధికంగా పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలను నిర్మూలించేందుకు గడ్డి మందు పిచికారీ నిర్వహించారు. గ్రామంలో ఎక్కడా పిచ్చిమొక్కలు పెరగకుండా, దోమలు వృద్ధి చెందే పరిస్థితులు లేకుండా ఉండేలా పంచాయతీ సిబ్బంది విస్తృతంగా మందు పిచికారీ చేశారు. అలాగే గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్య కార్మికులతో పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. నిల్వ నీరు ఉండే ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి సువర్ణ-రమేష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే గ్రామపంచాయతీ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో దోమల వ్యాప్తిని అరికట్టి డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపసర్పంచ్ కోట అశోక్ మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం పారిశుధ్య నిర్వహణలో భాగస్వామ్యం కావాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, 5వ వార్డు సభ్యుడు దుర్గం అజయ్, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా గ్రామంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూలై 31 : కాటారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ప్రత్యేక అధికారి పీ. బాలకృష్ణ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ఏఎంసీ చైర్‌పర్సన్, పీఏసీఎస్ చైర్మన్, మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి సూచించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల గ్రామాల్లో నెలకొనే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బయ్యారం, ప్రతాపగిరి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున స్థానికంగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో గంజాయి వినియోగం, బెల్ట్ షాపుల నిర్వహణ పెరుగుతున్నట్లు సమావేశంలో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించి, ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు.

Blog Archive


www.medigaddatvnews.com