MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చిదినేపల్లి, జూన్ 23: చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పారం గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వర్షపు నీరు నిల్వ కావడంతో గ్రామపంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. గ్రామంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ సమీపంలోని పైపులను తొలగించి, సైడ్ డ్రైనేజీ కాలువలను పూర్తిగా శుభ్రం చేసి నీటి ప్రవాహాన్ని సక్రమంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కోరల్ల రాజయ్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, వార్డు సభ్యుడు మంతెన రాజశేఖర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ ఇళ్ల చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


అదేవిధంగా గ్రామంలో సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని సెంట్రల్ లైట్లను ఈరోజు మరమ్మతులు చేసి తిరిగి వెలిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ ముందంజలో ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : ఖరీఫ్-2026 సీజన్‌లో రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో కాటారం మండలంలోని రేగులగూడెం, దామరకుంట క్లస్టర్లలో మంగళవారం సీడ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. 


రేగులగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), దామరకుంట వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాట్లాడుతూ రైతులు సకాలంలో విత్తనాలను సేకరించుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రగతిశీల రైతులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం, రేగులగూడెం, దామరకుంట రైతువేదికలలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి "సీడ్ మేళ" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాటారం గ్రామ సర్పంచ్  పంతకాని సడవలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  వేమునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు వరి సాగుకు అనువైన 8 రకాల సన్న విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా, జూన్ 22: బిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్దన్నపేట, పరకాల నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, 


ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పునర్వైభవం, ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్యకర్తల సమన్వయం, రానున్న ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి బిఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
హనుమకొండ, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే యూనిఫార్మ్స్ అందించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టింది. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, సరైన తరగతి గదులు, ఫ్యాన్లు, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా సామగ్రి వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హనుమకొండ నగరంలో అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచే లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, జిల్లా కమిటీ సభ్యులు బొచ్చు ఈశ్వర్, ఎండి ఇస్మాయిల్, చెన్నూరి సాయికుమార్, పవన్ కుమార్, సాల్మన్ రాజ్, అభిషేక్, రణదీప్, ప్రభాస్, మల్లేష్, నాగరాజ్, సురాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పలిమెల, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలో గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదన్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని వీధులు, గుంతల్లో మురుగునీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో దోమల బెడద పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంత ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. సరిహద్దు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిరంతర నిఘా ఉంచి ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వర్షాలు కురిసే ముందే దోమతెరల పంపిణీ చేపట్టకపోతే గ్రామాలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
భూపాలపల్లి, జూన్ 21: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సామాజిక, రాజకీయ అభ్యున్నతే రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందాలని, బహుజన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రజలు పెద్ద ఎత్తున జూలై 5న జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, ప్రస్తుతం కొందరి చేతుల్లో నలిగిపోతోందని విమర్శించారు. రెడ్డి, వెలమ ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని రవి పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, కృష్ణ ప్రశాంత్, శ్రీపతి, భద్రయ్య, రంజిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Blog Archive


www.medigaddatvnews.com