MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జగిత్యాల: జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో చోటుచేసుకున్న అమానుష ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే సిబ్బంది పడుకున్న విద్యార్థులపై చీపురుతో దాడి చేసిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాధిత విద్యార్థుల వాంగ్మూలాల ప్రకారం, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న వారిని లేపుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులు “మమ్మల్ని కొట్టొద్దు” అంటూ వేడుకున్నప్పటికీ అతను ఆగకుండా దాడి కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనతో హాస్టల్‌లో భయానక వాతావరణం నెలకొంది. కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు కూడా తెలిసింది. ఇక, శ్రీనివాస్ తరచూ మద్యం మత్తులో ఉండి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయితే ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
విశాఖపట్నం, మార్చి 30: నగరాన్ని కలవరపరిచిన దారుణ ఘటనలో ప్రియురాలు మౌనిక (29)ను హత్య చేసి ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు రవీంద్ర ఫోటో తాజాగా బయటకు వచ్చింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం, రవీంద్ర-మౌనికల పరిచయం డేటింగ్ యాప్ ద్వారా ప్రారంభమై, తరువాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధంలో భాగంగా ఇప్పటివరకు రవీంద్ర మౌనికకు సుమారు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. ఘటన జరిగిన రోజు కూడా మౌనిక నేవీ ఐడీ కార్డు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం హత్యకు దారితీసిందని రవీంద్ర పోలీసులకు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హత్యకు ముందుగానే ఆన్లైన్లో కత్తి, శుభ్రపరిచే సామగ్రి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

గోదావరిఖనిరూరల్,19,మార్చి(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ)రామగుండం 22వ డివిజన్ ఎఫ్ సీఐ ఎలక్కలపల్లి గేట్ లో కాంపల్లి లక్ష్మీప్రసన్న రఘు కొత్తసంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సర సందర్భంగా ఒంటరి మహిళ చంద్రకళకు 25కిలోల బియ్యం1000రూపాయలు ఆర్థికసాయం గురువారం కేఆర్ టీం ఆధ్వర్యంలో అందజేశారు..22వ డివిజన్ ప్రజలు,హిందూ బంధువులందరు.ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి స్వీకరించారు,ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సందీప్,ప్రవీణ్,సురేష్,నవీన్,అరుణ్ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పల్గుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వార్డు సభ్యుడు జిల్లాల సంతోష్, సీనియర్ నాయకుడు కోడిపే బుచ్చయ్యలు గురువారం మంథని పట్టణంలోని రాజగృహలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నిట్టూరి రమాదేవి రమేష్, నిట్టూరి రమేష్, కొట్టే రాజయ్య, రాగం వెంకటమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగం రాజేందర్, మచ్చ రాజేష్, యూత్ నాయకులు కొట్టే సంపత్, పసుల రమేష్, రాగం రజనీకాంత్, కొట్టే మధు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని చిట్యాల మండలంలో ఇటీవల బీసీకి చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కుమారస్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రవి పటేల్, రాజ్యాంగం అమలులోకి వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా బీసీలపై అగ్రకులాల వ్యక్తులు భౌతిక దాడులు చేయడం, దూషణలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో, బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, అలా జరిగితేనే ఆధిపత్య కులాల దౌర్జన్యాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని రవి పటేల్ పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి యథేచ్ఛగా తిరుగుతూ ఇంకా ఎన్ని మందిపై దాడులు చేసిన తరువాత చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. భూకబ్జాలు, మట్టి మాఫియా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వెంటనే అరెస్టు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాదు మల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, గతంలో కూడా అనేక క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com