MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి, డీఆర్‌డీఓ  బాలకృష్ణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది.

సమావేశానికి ఎంపీడీవో  ఎ. బాబు, పీఏసీఎస్ చైర్మన్  టి. ప్రశాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,  సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పొందుపరిచిన ఎజెండా అంశాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా చర్చించారు.

మండల పరిధిలో వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. అభివృద్ధి పనుల పురోగతి, ఆయా శాఖల పనితీరుపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. వాటిపై అధికారులు వివరాలు వెల్లడించారు.

మండల అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఎజెండాలోని అంశాలపై చర్చ అనంతరం సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు.

భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాటం ఒక వ్యక్తికి పరిమితం కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం ఐసా విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఆమె చూపిన పోరాట మార్గంలో నడుస్తూ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని బుర్ర స్వాతి అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో ఇటీవల ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ములుగుపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం అనుప్‌ను మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అనుప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జాడి రాజయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న పురుషోత్తం అనుప్‌కు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్ష పదవి దక్కడం మహాముత్తారం మండలానికి గర్వకారణమన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ఎన్‌ఎస్‌యూఐని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

పురుషోత్తం అనుప్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దుర్ల శ్రీను బాబు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ కోసం ఎన్‌ఎస్‌యూఐ వేదికగా మరింత చురుకుగా పనిచేస్తానన్నారు.

కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు లింగమల దుర్గయ్య, నజీర్‌ ఖాన్‌, బౌతూ రమ్య, చిక్కింటి లక్ష్మి, లింగమల రాజయ్య, చిర్ర రమేష్‌, గుంపుల రామయ్య, మోత్కూరి రవి, కోరుకొప్పుల లింగయ్య, చీటూరి అశోక్‌, పొలం మల్లయ్య, యువజన నాయకులు హాట్కార్‌ రాకేష్‌, తాళ్లపల్లి సుధాకర్‌ గౌడ్‌, జోడే విజేందర్‌, నీలాల రాజు, కొయ్యల రాకేష్‌, రాంనేని కృష్ణంరాజు, మంద జనార్దన్‌, మరుపాక రాజేంద్రప్రసాద్‌తో పాటు కాంగ్రెస్‌, యువజన, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, పేదలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగల ప్రణయ్‌రాజ్, మండల నాయకులు గంధం సతీష్, యువజన నాయకుడు పిట్టల రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, సెప్టెంబర్ 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి, రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జాడి రాజయ్య మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగమళ్ల దుర్గయ్య, భౌతు రమ్య, చికింటి లక్ష్మి, లింగమళ్ల రాజయ్య, గుంపుల రామయ్య, మోత్కురి రవి, కోరుకోపుల లింగయ్య, పొలం మల్లయ్య, యూత్ టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జోడే విజేందర్, నీలాల రాజు, మరుపాక రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, సెప్టెంబర్ 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా ధైర్యం, సామాజిక న్యాయం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంగజాల అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల, ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, కాటారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టూరి మహేష్ గౌడ్, బొడ్డు మల్లయ్య, ఐయిత శకుంతల, అజ్మీర రఘురాం నాయక్, కామెడీ వెంకటరెడ్డి, బీసీ సెల్ నాయకులు కొట్టే ప్రభాకర్, పసుల మొగిలి, చీమల రాజు, కంకణాల రఘు, కొండ్ర శివ, కుమార్ యాదవ్, తెప్పల నరేష్, గోను మహేష్, జిల్లల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, సెప్టెంబర్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భాష, యాస, మాండలికాల గొప్పతనాన్ని చాటేలా విద్యార్థినులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, కవితలు, గేయాలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన ‘తెలంగాణ మాండలికపు భాషావాది’ పాటను ఇంటర్మీడియట్ విద్యార్థిని బి.వర్షిణి ఆలపించారు. ఆమె రచించిన పద్యాలను ఆరో తరగతి విద్యార్థినులు ఆలపించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కవిత ఆటవెలది పద్యాన్ని రచించి ఆలపించారు. తెలంగాణ మాండలిక పదాలను ఉపయోగిస్తూ ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు ఉపాధ్యాయురాలు కవిత సంభాషణ రూపంలో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు ఉపాధ్యాయురాలు సరిత తెలుగు భాషపై గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత మాట్లాడుతూ.. మాతృభాష, తెలంగాణ యాస, మాండలికాల పరిరక్షణకు కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సామాన్యుడే తన దేవుడని ప్రకటించిన కాళోజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు కవిత, సరిత, శిరీష, నళిని, సుజాత, అరుణ, మణిమాల, రాజమణి, స్వప్న, శ్రీలత, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్యలక్ష్మి, రిబ్కా తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Blog Archive


www.medigaddatvnews.com