Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా, జూన్ 22: బిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్దన్నపేట, పరకాల నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా,
ఈ సమావేశానికి కేటీఆర్తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పునర్వైభవం, ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్యకర్తల సమన్వయం, రానున్న ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి బిఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి కేటీఆర్తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పునర్వైభవం, ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్యకర్తల సమన్వయం, రానున్న ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి బిఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
















