MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం మండలంలోని అంకుషాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ప్రోగ్రాము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా సర్పంచ్ కల్పన దేవయ్య  హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగపరుచుకోవాలని సూచించడం జరిగినది అలాగే చిరుధాన్యాలకు మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించడం జరిగినది. సూపర్వైజర్ శివరాణి  మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను ముర్రుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది అలాగే వెయ్యి రోజుల ( గర్భిణీ దశ నుండి రెండు సంవత్సరముల పిల్లల వరకు జరిగే అభివృద్ధి )ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది ప్రీస్కూలు ఆవశ్యకతను గురించి వివరించడం జరిగినది. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో స్వేచ్ఛ వాతావరణంలో ఆటపాటల ద్వారా విద్యను అందించడం వలన సమగ్ర అభివృద్ధి జరుగుతుందని వివరించడం జరిగినదిప్రథమ్ ఎన్జీవో సమ్మయ్య గారు పాఠశాల సంసిద్ధత మరియు బాలమేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదనంతరము గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన దేవయ్య ఉపసర్పంచ్ ఉమా శంకర్ అంగన్వాడి సూపర్వైజర్స్ శివరాణి రమాదేవి వ్రతం ఎన్జీవో సమ్మయ్య గారు కార్యదర్శి రజిత వార్డు మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తుల భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ TPF సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. 41 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం స్పందించకుండా 41 రోజుల తర్వాత ఐఏఎస్ తో  కమిటీ వేశామని కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది. గత ఎన్నికలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వంచనకు గురిచేసింది. ఈ స్థితిలో అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టింది. సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలంతా ఆర్టీసీ కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కార్మికులంతా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంగా ఉండాలని, ఎన్ని ఒత్తిడిలు ఎంత నిర్బంధం ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలని కిరణ్ పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు,  పాఠశాలలో మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను  ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరమ్మతులు చేయాల్సిన పనులను ఆయన పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ,  మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు,  ప్రభుత్వ పాఠశాలలో మరమత్తులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన సంబందిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  అన్ని పాఠశాలలో నూరు శాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10  వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   టెండర్ ప్రక్రియ పూర్తి అయిన పనులకు అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. టెండర్ పూర్తి అయిన పనులను తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న "వెల్ఫేర్ వీక్" సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో సంబంధిత శాఖల సంక్షేమ అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల  లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు  సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు "వెల్ఫేర్ వీక్" నిర్వహణలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటిలో ముఖ్యంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు సంక్షేమ హాస్టళ్లను  అధికారులు  సందర్శించి హాస్టల్ భవనాలు మరియు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా చూడాలన్నారు. ఏప్రిల్ 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధి గురించి విద్యార్థుల పురోగతి గురించి చర్చించడం,  తల్లిదండ్రులను మాట్లాడించడం మరియు వారి  నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం చేయాలన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని తెలిపారు. ఏప్రిల్ 24 తేదీన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం వివిధ అవకాశాలపై అవగాహన కల్పించడం, వాటిలో నమోదు అయ్యేలా చూడడం మరియు ఉపాధి అవకాశాల కల్పించే ఉద్దేశంలో  నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  భూపాలపల్లి, కాటారం ఏటిసి కేంద్రాల్లో విద్యార్థులకు వృత్తి నైపుణ్యం తరగతులు నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 25 తేదీన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్ లెర్నింగ్ మరియు వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగహన కల్పించాలని సూచించారు. ఏప్రిల్ 26 తేదీన బడిబాట /హాస్టల్ బాట కార్యక్రమం నిర్వహించాలని, దీనిలో భాగంగా పాఠశాలలో ఖాళీలను గుర్తించడం ప్రత్యేక డ్రైవ్ పెట్టి విద్యార్థులను గుర్తించాలని,  అలాగే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా ఖాళీ లను భర్తీ చేయాలని సూచించారు. వెల్ఫేర్ వీక్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమానికి  రిపోర్టులు పంపాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బిసి సంక్షేమ అధికారి ఇందిర, పీఆర్, గిరిజన, టీడబ్లుఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపిడివో  సురేందర్, సర్పంచ్ విజయ, ప్రిన్సిపల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా TGSRTC జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి డిపో ముందు జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని కార్మికులకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిపో ముందు కార్మికులతో కలిసి కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ రవి పటేల్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక డిమాండ్లు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో 30% ఫిట్మెంట్ అమలు చేయాలని, అలాగే 2025 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి ₹400 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులపై ఉన్న పనిభారం తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వెంటనే ఆర్టీసీకి అందించాలని, అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలని, అధిక సంఖ్యలో బస్సులను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రవి పటేల్ గారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికుల న్యాయపరమైన పోరాటంలో తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక సంఘం నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతల సంపత్, జిల్లా కోశాధికారి జిలకర శ్రీను, జిల్లా కమిటీ సభ్యుడు వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, టిఆర్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్పి పార్టీ సమ్మెలో పాల్గొంటుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా టిఆర్పి పార్టీ ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంతవరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటకు వెళ్లనివ్వమని హెచ్చరించారు. కార్మికులు తమ కష్టంతో ఆర్టీసీని నిలబెట్టుకుంటున్నారని, వారి న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, టిఆర్పి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: ప్రజా పాలనలో భాగంగా స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలుర కళాశాలలో హ్యాండ్‌బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ క్యాంప్ ఈనెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సోమోజీ  ప్రారంభించగా, గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి , సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పీడీ కె. కల్పన , కుడిమేత మహేందర్ , పీటీ మంతెన శ్రీనివాస్ , కోచ్ మూల వెంకటేష్ , డిప్యూటీ వార్డెన్ రజనీకాంత్  మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో  సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నాగరాజు  ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల జిల్లా కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నాగరాజు  సేవలను కొనియాడుతూ, ఆయన న్యాయపరమైన కృషి మరియు నిష్పక్షపాత ధోరణిని ప్రశంసించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ట్రెజరర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. అలాగే న్యాయవాదులు రవికుమార్, రాజేందర్, నీలం ప్రశాంత్, చీర్ల అశోక్, సతీష్, సురేందర్, ఎండీ రఫీ, రాయం రమేష్, శ్రీనివాస్ చారి, వసంత, ప్రియాంక, సంధ్య తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి నాగరాజు  మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా ప్రజల ప్రేమ, సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com