జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అంబేద్కర్ చౌరస్తా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం టీఆర్పీ పార్టీ సాధించిన రెండో విజయమని పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఈ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కలిపి 94 శాతం ఉన్నాయని, వారి అభ్యున్నతి కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం కొనసాగిస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్పీదేనని పేర్కొన్నారు. అలాగే గతంలో “ముగ్గురు పిల్లల నిబంధన” ఎత్తివేయడంలో కూడా తీన్మార్ మల్లన్న పోరాటం ఫలించిందని, అది పార్టీకి తొలి విజయమైతే, కులగణన నివేదిక విడుదల రెండో విజయమని వివరించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, బడుగు వర్గాల పక్షాన నిలబడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోరుకుంటారని, 2028లో టీఆర్పీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కార్పొరేట్ స్థాయి సేవలను ప్రజలకు అందించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, యువజన విభాగం అధ్యక్షుడు బండి సునీల్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షుడు అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం బయ్యారం గ్రామంలో సర్పంచ్ ఇనుగాల లింగయ్య ఆధ్వర్యంలో గ్రామసభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో పర్యవేక్షణ అధికారి కృష్ణ మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో కాలువ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితుల పేర్లను గ్రామసభలో చదివించారు. వారికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా పంచాయతీ కార్యదర్శి లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అనంతరం భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ ధర కంటే అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంవత్సరాలుగా భూమిని సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మరియు యాజమాన్య హక్కులు కల్పించాలని డిప్యూటీ తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు గుంటి శ్రీనివాస్, సురేందర్, మహేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఇరిగేషన్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ రమా, విఆర్ఏలు ఓదెలు, భాను ప్రసాద్, మాజీ సర్పంచ్ సంజీవయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి రాజబాబు, నాయకులు అయిలి శ్రీనివాస్, గోగు సమ్మయ్య, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ అయిలి రాజబాబు, కారోబార్ మీర్జా సాబీర్ బేగ్, పారిశుధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ నయీమ్ నగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకుడు వైద్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ కన్సల్టెన్సీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.వైద్య లక్ష్మణ్ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, కొత్తగా ప్రారంభమైన ఈ ఆఫీస్ విజయవంతంగా కొనసాగాలని, మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
హనుమకొండలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కళాకారుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు డప్పు, కోలాటం, భజన కళాకారులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పరస్పరం పరిచయ కార్యక్రమం నిర్వహించుకుని, అనంతరం కళాకారులు తమ సమస్యలను విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ కళలను కొనసాగిస్తున్న కళాకారుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల సమస్యలను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథి రవి పటేల్ మాట్లాడుతూ కళాకారుల సమస్యలను ఎమ్మెల్సీ మల్లన్నకు వివరించి, శాసన మండలిలో చర్చకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అలాగే త్వరలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కళాకారులు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘం నాయకులకు, కళాకారులకు రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే వాదనలు పూర్తయిన ఈ కేసులో, తుది తీర్పును ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. కమిషన్ సమర్పించిన నివేదికపై వివిధ అభ్యంతరాలు వ్యక్తమవడంతో, దాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ విధానం, దాని పరిధి, నివేదిక చట్టబద్ధతపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమిషన్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్ నియామకం పూర్తిగా చట్టబద్ధమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని కోర్టుకు వివరించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడం అవసరమని, అందుకే కమిషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు సమగ్రంగా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, నిర్ణయాన్ని ప్రకటించాల్సిన రోజున మరోసారి వాయిదా వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశముండటంతో, అన్ని వర్గాల దృష్టి ఇప్పుడు 22వ తేదీపై నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన నేపథ్యంలో, హైకోర్టు తుది తీర్పు కీలక మలుపు తిప్పే అవకాశముంది. కమిషన్ నివేదిక చెల్లుబాటు అవుతుందా? లేక రద్దవుతుందా? అనే అంశంపై స్పష్టత రానుంది. తుది తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.
భూపాలపల్లి, ఏప్రిల్ 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భూపాలపల్లి KTPP ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆయన పాల్గొన్నారు. గత రెండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న రవి పటేల్ అనంతరం మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించి, వారి విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు కొనసాగుతున్న నిరసన దీక్షలకు కూడా ఆయన సంఘీభావం తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అన్మాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వారికి భద్రతా చర్యలు కల్పించాలని, విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఈ కార్మికుల సేవలపై ఆధారపడి ఉందని, వారి సమస్యలను విద్యుత్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులు లేకుండా విద్యుత్ శాఖ ఒక్కరోజు కూడా ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించిన రవి పటేల్, భూపాలపల్లి జిల్లాలో కార్మికులు ఎప్పుడైనా పిలుపునిచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండి పోరాడతారని హామీ ఇచ్చారు. కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అనంతల సంపత్ (బొట్టు), ఎలక్ట్రిషియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా నాయకులు ప్రణయ్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం అందించే హామీతో సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ ఐదేళ్ల పదవీకాలంలో పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఓట్ల కోసం వారి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం మాట తప్పదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును దెబ్బతీయడానికే అబద్ధపు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని, మంత్రులందరూ కలిసి సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు విశ్రాంతి తీసుకోమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Blog Archive
- April (10)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
medigadda tv news
www.medigaddatvnews.com








