MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, టిఆర్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్పి పార్టీ సమ్మెలో పాల్గొంటుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా టిఆర్పి పార్టీ ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంతవరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటకు వెళ్లనివ్వమని హెచ్చరించారు. కార్మికులు తమ కష్టంతో ఆర్టీసీని నిలబెట్టుకుంటున్నారని, వారి న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, టిఆర్పి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: ప్రజా పాలనలో భాగంగా స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలుర కళాశాలలో హ్యాండ్‌బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ క్యాంప్ ఈనెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సోమోజీ  ప్రారంభించగా, గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి , సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పీడీ కె. కల్పన , కుడిమేత మహేందర్ , పీటీ మంతెన శ్రీనివాస్ , కోచ్ మూల వెంకటేష్ , డిప్యూటీ వార్డెన్ రజనీకాంత్  మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో  సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నాగరాజు  ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల జిల్లా కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నాగరాజు  సేవలను కొనియాడుతూ, ఆయన న్యాయపరమైన కృషి మరియు నిష్పక్షపాత ధోరణిని ప్రశంసించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ట్రెజరర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. అలాగే న్యాయవాదులు రవికుమార్, రాజేందర్, నీలం ప్రశాంత్, చీర్ల అశోక్, సతీష్, సురేందర్, ఎండీ రఫీ, రాయం రమేష్, శ్రీనివాస్ చారి, వసంత, ప్రియాంక, సంధ్య తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి నాగరాజు  మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా ప్రజల ప్రేమ, సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఈనెల 6వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని హాసన్ పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పి. సుధా కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సిఓఈ వృత్తి విద్యలు సైనిక కళాశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ,ఎంఈసి, సీఈసీ, హెచ్ఈసి మొదలైన గ్రూపులలో ప్రవేశం పొందవచ్చు అని తెలిపారు పూర్తి వివరాల కోసం సమీపంలోని గురుకుల కళాశాలలో సంప్రదించవచ్చని హసన్పర్తి ప్రిన్సిపల్ పి .సుధాకృష్ణ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్ 20: పెద్దపల్లి,అనారోగ్యంతో పోరాడుతున్న డయాలసిస్ రోగికి సమాజం నుంచి అందిన సహాయం మరోసారి మానవత్వాన్ని ప్రతిబింబించింది.పెద్దపల్లి పట్టణానికి చెందిన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో,సోమవారం,తురకల మద్దికుంట గ్రామానికి చెందిన డయాలసిస్ బాధితుడు రాచకొండ లక్ష్మణ్‌కు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ములుగురి కమల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ములుగురి కమల్ మాట్లాడరు,శివసాయి సంస్థ తమ లాభాల్లో భాగాన్ని కష్టాల్లో ఉన్నవారికి పంచడం గొప్ప విషయం అని అన్నారు.ఇటువంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు.సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.శివసాయి సంస్థ చైర్మన్,డైరెక్టర్లు పెద్దపల్లి ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు ప్రశంసనీయం అని కమల్ అన్నారు.సంస్థ సేవలు వ్యాపార అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ,పెద్దపల్లి బ్రాంచ్‌లో కూడా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ సూచించారు.ప్రభుత్వం అందజేస్తున్న స్కూల్ యూనిఫాంల కుట్టు పనులను మహిళలకు అప్పగించేలా చైర్మన్,కమిషనర్‌లతో చర్చించి వారికి ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.శివసాయి సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు.కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలో సమాజం ముందుకు రావడం అవసరమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాళేశ్వరం ఆలయ పునఃప్రతిష్ఠ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఐఎస్‌డబ్ల్యూ అధికారులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణం, అప్రోచ్ రోడ్ల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని విభాగాల మధ్య సమన్వయం అవసరమని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, తక్షణ వైద్య సేవల కోసం వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భద్రతా పరమైన చర్యల్లో భాగంగా సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ సూచించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం మండలం (రెడ్డిపల్లి): మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖకు కొత్త అధ్యక్షునిగా ధరం సోత్ సారయ్యను నియమించారు. ఈ నియామకం ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి, నూతన అధ్యక్షుడికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC లింగమళ్ల శారద దుర్గయ్య, గ్రామ సర్పంచ్ సగుళం అనసూయ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశీ రాజ్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మాజీ ZPTC మడిపల్లి సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ వేముల మధుకర్ గౌడ్, నాయకులు నూకల రవి, సాగుళం నర్సింహా తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ధరం సోత్ సారయ్య తెలిపారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com