MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
కాటారం, జూన్ 18 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల ఉపాధ్యక్షుడు చీర్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమై ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, నాయకులు బండము మల్లారెడ్డి, గోగుల రాజేష్, కొండ రామ్, వార్డు సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, జిలేష్, గండు మల్లారెడ్డి, గండు తిరుపతి, చీర్ల చంద్రశేఖర్, వడ్ల రవీంద్రాచారి, సురేష్, రత్నాకర్, నరేష్, జగదీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), బీఎల్‌వో పర్యవేక్షకులకు కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారి, కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు తహసీల్దార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అమలు విధానం, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయి బాధ్యతలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించారు. మూడు మండలాలకు చెందిన బీఎల్‌వోలు, బీఎల్‌వో పర్యవేక్షకులు శిక్షణలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బుధవారం ఉదయం అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారుల ఇళ్ల స్థలాల వద్ద ముగ్గులు వేసి శుభారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి మొత్తం 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గతంలో ఇల్లు పొందిన వారు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల 8 దరఖాస్తులు కలెక్టరేట్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు మండల అభివృద్ధి అధికారి తెలిపారు. ఏళ్ల తరబడి సొంత ఇల్లు కలగానే మిగిలిపోయిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఆశలను నింపింది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, దినసరి కార్మికులు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సొంత ఇంటి నిర్మాణానికి దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత భూమి ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ లబ్ధిదారులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు మహిళలు ఇళ్ల స్థలాల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కర్ణాకర్, గ్రామ సర్పంచ్ బండం శోభారాణి-రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిప్పల ప్రభాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ ములకల నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) అమలుపై కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జూన్ 18న ఉదయం 11 గంటలకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, మాస్టర్ ట్రైనర్లు హాజరై ఓటరు జాబితాల సవరణ విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో 87 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), 10 మంది బీఎల్వో పర్యవేక్షకులు పాల్గొననున్నారు. ఇందులో కాటారం మండలం నుంచి 36 మంది బీఎల్వోలు, 4 మంది పర్యవేక్షకులు, మహాముత్తారం మండలం నుంచి 27 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు, మల్హర్‌రావు మండలం నుంచి 24 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు హాజరు కానున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా ప్రతినిధులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్ కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17 : కాటారం మండలంలో 2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిణి (ఎంఈవో)పై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ఎంఈవో శ్రీదేవి గానీ, ఎంఆర్సీ సిబ్బంది గానీ తమ బిల్లుల మంజూరు విషయంలో ఎప్పుడూ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో ఎంఈవో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ బిల్లుల చెల్లింపుల విషయంలో డబ్బులు అడిగినట్లు కొందరు వ్యక్తులు ఉపాధ్యాయ సంఘాలకు తప్పుడు సమాచారం అందించడంతోనే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం బాధాకరమని, ఎంఈవో శ్రీదేవి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన అసత్య ప్రచారాలను 2008-డీఎస్సీ ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఖండన తెలిపిన ఉపాధ్యాయులు:
ఈ. అరుణ, జె. స్వప్న, పి. స్వప్న, వి. సుమతి, పి. పద్మజ.
ఇట్లు,
2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, కాటారం మండలం.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణలో ప్రాథమిక విద్య (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) రంగం ఒకవైపు కొత్త సంస్కరణలతో ముందుకు సాగుతుండగా, మరోవైపు ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల నమోదు తగ్గుదల, మౌలిక సదుపాయాల సమస్యలు వంటి కీలక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కోట అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించడం స్వాగతించదగిన నిర్ణయమని పేర్కొన్నారు. దీనివల్ల చిన్నారుల్లో అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం, పాఠశాల సిద్ధత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఇంగ్లీష్ మీడియం బోధన విస్తరణతో ప్రభుత్వ పాఠశాలలపై కొంతమేర విశ్వాసం పెరిగిందని తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. అనేక ప్రాథమిక పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తుండగా, సుమారు 3 వేల పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయని వివరించారు. UDISE+ నివేదిక ప్రకారం ప్రతి ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి కేవలం ఒకే తరగతి గదితో నడుస్తోందని, దీంతో ఒకే గదిలో బహుళ తరగతుల విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతూ ఉండటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడగా, దేశవ్యాప్తంగా సున్నా నమోదు కలిగిన పాఠశాలల్లో తెలంగాణ వాటా అధికంగా ఉందని కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం 157 మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మన్ననూర్ తదితర ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాషలో విద్య పరిమితంగా ఉందని, ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మారుమూల తండాలు, గూడెల్లో పాఠశాలలకు చేరుకోవడం కష్టతరంగా మారడంతో డ్రాప్‌అవుట్ రేటు పెరుగుతోందన్నారు. గోండి, కొయ, నాయకపోడ్, కొలాం వంటి స్థానిక భాషల్లో ప్రాథమిక విద్య అందించడం అత్యవసరమని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అలాగే మాతృభాష ఆధారిత బహుభాషా విద్యను అమలు చేయడం, ఒకే గది పాఠశాలల సమస్యను పరిష్కరించడం, డిజిటల్ సదుపాయాలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రాథమిక విద్య ప్రస్తుతం అవకాశాలు మరియు సవాళ్ల మిశ్రమ దశలో ఉందని, ముఖ్యంగా ఆదివాసీ మరియు గ్రామీణ ప్రాంతాల పిల్లలకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం రాష్ట్ర విద్యా విధానంలో ప్రధాన లక్ష్యంగా ఉండాలని కోట అశోక్ అన్నారు.

ఇట్లు, కోట అశోక్ AHPS జిల్లా కార్యదర్శి ఉప సర్పంచ్, జాధరవ్‌పేట

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం గ్రామ పరిధిలోని ఆదర్శ కాలనీలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను లాక్కెళ్లడం, ఇంటి సామగ్రిని ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కోతుల దాడుల భయంతో బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. కోతుల సంచారంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కోతుల బెడద నుంచి ఆదర్శ కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




Blog Archive


www.medigaddatvnews.com