MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం, జూన్ 7: మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన భూక్యా నరేష్, భూక్యా సురేష్‌లపై అటవీశాఖ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారని, సంబంధిత అధికారులపై హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి న్యాయ విచారణ జరపాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం నిమ్మగూడెం గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ఆదివారం భూక్యా నరేష్ తన సొంత భూమిలో భూమి చదును పనులు చేపట్టేందుకు వెళ్లగా నిమ్మగూడెం బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రెడ్డిపల్లి బీట్ ఆఫీసర్ అఖిల్ రెడ్డి కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. నరేష్‌ను చంపే ఉద్దేశంతో పురుషాంగాలపై, కాళ్లపై కొట్టడంతో పాటు మెడపై నొక్కారని తెలిపారు. ఈ దాడిని అడ్డుకునేందుకు వచ్చిన భూక్యా సురేష్‌పై కూడా కర్రలతో దాడి చేసి, శరీరంలోని పలు భాగాలపై తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. వారి అరుపులు విని సమీపంలోని రైతులు, గ్రామస్తులు వచ్చి విడిపించారని తెలిపారు. దాడి కారణంగా ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా, గ్రామస్తులు పోలీసుల సహకారంతో అంబులెన్స్‌లో భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఇదే సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోందని పీక కిరణ్ విమర్శించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, సంబంధిత అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా ఎస్పీ, ఎస్సీ-ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు, మండల కోఆర్డినేటర్ పుల్యాల సురేష్, వావిళ్ల సడవలి, గోల్కొండ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
పలిమెల, జూన్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన దుగ్గిరాల రంగారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ముకునూరు గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వసంతరావు తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తిప్పనపల్లి ముత్తయ్యను సైతం పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స పొందాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యత అని ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

రామగుండం, జూన్ 7: కుల, మతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుతూ సమతా ఫౌండేషన్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచింది. రామగుండం 33వ డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ నిరుపేద ముస్లిం యువతి వివాహానికి సమతా ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులతో వివాహ ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న సమతా ఫౌండేషన్ చైర్మన్ డా. దుర్గం నగేష్ స్పందించి, వివాహానికి అవసరమైన 25 కిలోల బియ్యంతో పాటు రూ.5 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. దుర్గం నగేష్ మాట్లాడుతూ, పేదరికం ఎవరికీ శాపంగా మారకూడదని, ఆనంద క్షణాలను పంచుకోవడంలో ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మానవత్వమే సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చెప్పారు. సమతా ఫౌండేషన్ అందించిన సహాయంపై పెళ్లికూతురు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో ఆదుకున్న డా. దుర్గం నగేష్, ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల, మాసూమ్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ, సమతా ఫౌండేషన్ ద్వారా డా. దుర్గం నగేష్, ప్రమీల దంపతులు అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. నిరుపేద కుటుంబాల వివాహాలకు, అవసరమైన వారికి అందిస్తున్న సహాయం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నాసా సునీత, గన్న మహేష్, భూస్పాక రామచందర్, బెక్కం నిఖిల్ సాయి, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, జిమ్మిడి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 6: కాటారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ పనులను శనివారం బీజేపీ కాటారం మండల శాఖ నాయకులు పరిశీలించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాటారం పట్టణంలో ప్రస్తుతం కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. గతంలో ఇదే కారణంగా ఓ మహిళ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్వంత మండలంలోనే మార్కెట్ నిర్మాణం ఆలస్యమవుతుండటం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కాటారం మండల శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవీందర్, జిల్లా నాయకులు డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. 



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్, జూన్ 6 : మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో మొక్కలు నాటారు. "పచ్చదనాన్ని పెంచుదాం – ప్రకృతిని పరిరక్షిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల ద్వారా స్వచ్ఛమైన గాలి, నీడ లభించి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. "ప్రకృతి ఉంటేనే ప్రగతి – పర్యావరణం ఉంటేనే మనుగడ" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్ల సమ్మిరెడ్డి, వార్డు సభ్యుడు సోయం శశికాంత్, గ్రామ కార్యదర్శి చల్లూరి ఇందిర, ఫీల్డ్ అసిస్టెంట్ సల్ల రాజశేఖర్, యువకులు సల్లం రాజు, మంచినీళ్ళ రాజబాపు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 5: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల పేర్లతో పాటు "ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్, ఫౌండేషన్" వంటి పదాలను వినియోగిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జిల్లా కార్యదర్శి బి. సుజాత ఆరోపించారు. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రికలు మరియు ఇతర ప్రకటనల్లో పాఠశాల పేర్లకు అదనంగా ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను జోడించి ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ పదాలను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామనే భావన కల్పించి విద్యార్థులను ఆకర్షించడమే కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి పొందిన రాష్ట్ర లేదా కేంద్ర సిలబస్‌లను మాత్రమే బోధించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు స్వలాభం కోసం ఈ తరహా పదాలను వినియోగిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి ప్రకటనల వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పేర్లను ఉపయోగిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే నేపథ్యంలో జూన్ 13వ తేదీలోపు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, పాంప్లెట్లు మరియు ఇతర ప్రచార సామగ్రి నుంచి ఈ పదాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ పేర్లను ఉపయోగిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతితో పాటు సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 05:  కాటారం పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు భారీగా లీకై వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండాకాలంలో అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు విలువైన తాగునీరు గంటల తరబడి రోడ్లపై పారిపోతున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు లీకేజీని మరమ్మతు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.



Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com