MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: హక్కుల నేత, శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భూపాలపల్లిలో శనివారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి, వాంగ్చుక్ డిమాండ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి, దాని స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇచ్చిన "చలో సంసద్" పిలుపునకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. సోనం వాంగ్చుక్ డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ భూపాలపల్లిలో ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహా ముత్తారం: సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాపుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్పంచుల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి కొండగోర్ల బాపు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్ కుమార్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశిరాజ్, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహా ముత్తారం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ముత్తారం మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై BLAలు, BLA సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. TPCC ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, SIR మండల ఇన్‌చార్జి అంగజాల అశోక్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి BLA సూపర్వైజర్ చురుకుగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన దరఖాస్తులు పూర్తి చేయించడంతో పాటు, హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ప్రజలకు సహాయం అందించాలని కోరారు. నిబంధనల ప్రకారం SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి, సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ అధ్యక్షుడు కొండగోర్ల బాపు, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ నాయకులు, BLAలు, BLA సూపర్వైజర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూలై 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతమైన మహాముత్తారంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద ప్రజలు సరైన సమయంలో చికిత్స పొందలేక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు తక్షణ వైద్యం అవసరమవుతోందని తెలిపారు. అదే విధంగా రాత్రింబవళ్లు పొలాల్లో శ్రమించే రైతులు పాము, తేలు కాట్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అవసరమైన మందులు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. స్థానిక అధికారులతో పాటు అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల వైద్య సేవలు ప్రారంభించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు రామగిరి రాజుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: దేశంలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దంతాలపల్లి, బొప్పారం గ్రామాల్లో రైతుల అవగాహన సదస్సులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. జూలై 17న దంతాలపల్లి గ్రామంలో, జూలై 18న బొప్పారం గ్రామంలోని సడుక్‌పల్లి (శ్రీనివాస కాలనీ) సెంటర్‌లో జరిగిన సదస్సులకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి యాజమాన్యం, పంటల సంరక్షణ వంటి అంశాలపై వ్యవసాయ అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈఓ శ్రీకన్య మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవడంతో పాటు వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, వాతావరణ హెచ్చరికలను పాటించాలని కోరారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలను మార్చుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి సహకరించని పరిస్థితుల్లో కూడా రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వ్యవసాయ అధికారుల సలహాలతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని అన్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు సమయంలో నాణ్యమైన ఉత్పత్తులనే ఎంపిక చేసుకోవాలని, నీటి వినియోగంలో పొదుపు పాటిస్తూ పంటల నిర్వహణ చేపట్టాలని సూచించారు. సదస్సులో రైతులు పంటల సాగుకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. రైతుల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు భవిష్యత్‌లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూలై 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాధరావుపేట గ్రామపంచాయతీలో వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఉప సర్పంచ్ కోట అశోక్, 2వ వార్డు సభ్యుడు విలాసాగరం రవి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం కనీసం ఒక పండ్ల మొక్కను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. పండ్ల మొక్కలు ఇంటి పరిసరాలను పచ్చగా మార్చడంతో పాటు కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఫలాలను అందిస్తాయని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ కోట అశోక్ మాట్లాడుతూ నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించి భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలని గ్రామస్తులను కోరారు. వార్డు సభ్యుడు విలాసాగరం రవి కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రామపంచాయతీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూలై 17: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి ఇంట్లో కనీసం ఒక పండ్ల మొక్కను నాటి దానిని సంరక్షించాలని కాటారం మండలం ధన్వాడ గ్రామపంచాయతీ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ధన్వాడ గ్రామపంచాయతీలో ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చెట్లు ప్రకృతికి ప్రాణాధారం అని, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని జీవించేంత వరకు సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పండ్ల మొక్కలను ప్రతి ఇంటి ఆవరణలో నాటి, వాటిని క్రమం తప్పకుండా నీరు పోసి పెంచాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, మొక్కల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందించి మొక్కలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Blog Archive


www.medigaddatvnews.com