MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 15: కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలు వాహనదారులకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు, సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు, జెండాలు ఇప్పటికీ తొలగించకపోవడంతో కూడలి వద్ద దృశ్యమానత తగ్గుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. గారేపల్లి అంబేద్కర్ సెంటర్ మంథని–భూపాలపల్లి, భూపాలపల్లి–కాలేశ్వరం ప్రధాన రహదారులు కలిసే రద్దీ కూడలి కావడంతో అక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఒత్తిడి ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు, జెండాలు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని కోరుతున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గతంలోనూ అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని కొందరు విమర్శిస్తున్నారు. విగ్రహం గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఫ్లెక్సీ రహిత జోన్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల కొందరు యువకులు అక్కడ ఏర్పాటు చేసిన జెండాలను తొలగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ సెంటర్ పరిసరాల్లో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మంథని, జూన్ 14: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో చేపడుతున్న చెరువుల సుందరీకరణ పనులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, పోచక్క తల్లి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. తదనంతరం రావుల చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి, భారీ వర్షాలు కురిసేలోపు పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనిచేసి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా పనులకు అంతరాయం కలిగితే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల అమలులో స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అధికారులను ప్రశ్నించిన మంత్రి, ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట, జూన్ 12: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో తాటి ఈత చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో, సర్వే నంబర్ 105లో ఉన్న సుమారు 3 వేల తాటి ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయని స్థానిక గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ ఘటనలో తాటి చెట్లతో పాటు మోటార్లు, పైపులు పూర్తిగా కాలిపోవడంతో బాధితులకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గీత కార్మికుల జీవనోపాధికి తీవ్ర దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్ మాట్లాడుతూ, తాటి చెట్లను దహనం చేయడం ద్వారా గీత కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీశారని అన్నారు. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు ముష్మీర్ మహేష్ గౌడ్, బొమ్మకంటి రమేష్ గౌడ్, రాచకొండ బాలయ్య గౌడ్, బొమ్మకంటి కిషోర్ గౌడ్, బొమ్మకంటి చక్రపాణి గౌడ్, వ్యాసరేని కనకయ్య గౌడ్, వ్యాసరేని భూమేష్ గౌడ్, ఉత్కం పెంటయ్య గౌడ్, మద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, ప్రతినిధి: భూపాలపల్లి బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తి ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సింగరేణి పరిరక్షణ పేరిట భూపాలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అయితే ఈ సదస్సుకు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారికి ఆహ్వానం అందలేదనే ప్రచారం పార్టీలో చర్చకు దారితీసింది. అంతేకాకుండా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిలో మధుసూధనాచారి ఫోటో కనిపించకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తూ, విషయాన్ని నేరుగా హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాలతో భూపాలపల్లి బీఆర్ఎస్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూధనాచారి వర్గాల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని గమనించిన హరీష్ రావు పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంగా భూపాలపల్లి బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తుండగా, ఈ వర్గపోరు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట, జూన్ 13: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో ఉన్న తాటి చెట్ల తొలగింపు ఘటనపై జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీ సహాయంతో తొలగించారని ఆరోపిస్తూ గౌడ సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అంతకుముందు జై గౌడ ఉద్యమం నాయకులు సంబంధిత అధికారులను కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గీత కార్మికుల జీవనోపాధికి నష్టం వాటిల్లిందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్, జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు యాదగౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12: భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు శుక్రవారం భూపాలపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కార్యాలయానికి విచ్చేసిన హరీష్ రావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను పరిశీలించేందుకు ఓసీ–2 గనిని సందర్శించేందుకు హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. అయితే గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని చెబుతోందని, నిజంగా నిల్వలు ఉంటే వాటిని ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వల విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు గనిలోకి అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతసేపు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్: ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అలాగే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టడం వంటి హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దీక్షకారులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చే వరకు తమ ఆందోళన ఆగదని వారు స్పష్టం చేశారు. సర్వాయి పాపన్న మహారాజ్ తెలంగాణ గర్వించదగ్గ వీరయోధుడని, ఆయనకు తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టే వరకు తమ నిరవధిక దీక్ష కొనసాగుతుందని దీక్షకారులు వెల్లడించారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజలు, వివిధ సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కండ్లుండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ న్యాయమైన డిమాండ్‌కు సంఘీభావం తెలపాలని వారు కోరారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com