MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మంథని: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ  దుద్దిళ్ల శ్రీపాదరావు  సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య  సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల  (91) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సువర్ణ వనమాల  మరణవార్త తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొని సువర్ణ వనమాల  భౌతికకాయానికి తుది నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. దివంగత  సువర్ణ వనమాల  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, బంధువులు తదితరులు పాల్గొని సువర్ణ వనమాల గారికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరం, జూలై 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో 1వ వార్డులో చెట్టు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న 1వ వార్డు మెంబర్ రేవెల్లి రాకేష్ వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది ఎం.డి. వలి, ప్రవీణ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ వర్షం కొనసాగుతున్నప్పటికీ పరిస్థితిని పరిశీలించి, విద్యుత్ లైన్లకు అంతరాయం కలిగించిన చెట్టును సిబ్బంది చొరవతో తొలగించారు. అనంతరం విద్యుత్ లైన్లను పరిశీలించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో 1వ వార్డులోని కాలనీ ప్రజలకు విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించి, సంబంధిత సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు, సిబ్బందికి 1వ వార్డు మెంబర్ రేవెల్లి రాకేష్, వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సిబ్బంది అందించిన తక్షణ సేవలను వార్డు ప్రజలు అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

వరంగల్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఎర్రగోల్ల భరత్ వీర్  సోమవారం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భరత్ వీర్ శాలువాతో సత్కరించి ఆశీస్సులు పొందారు. సమావేశంలో వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతం, యువతను రాజకీయంగా చైతన్యపరచడం, గ్రామ స్థాయి వరకు యువ మోర్చా కమిటీలను విస్తరించడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై బీజేవైఎం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన సంక్షేమ పథకాలు, డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన భరత్ వీర్ యువతను బీజేపీ వైపు ఆకర్షించేలా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. భరత్ వీర్ మాట్లాడుతూ, తనపై మరోసారి విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నిరంతరం అండగా నిలుస్తున్న జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువ మోర్చా కమిటీలను మరింత పటిష్టం చేసి, యువత గొంతుకగా నిలుస్తామని, జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు యువశక్తిని ఏకం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూలై 20: కాటారం మండలం గుండా వెళ్లే జాతీయ రహదారి 353-సీపై మూగజీవాలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కాటారం పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు కాటారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఆవులు, బర్రెలు, లేగలు తదితర పెంపుడు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుండడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మూగజీవాలు రహదారిపై పడుకోవడం లేదా వాహనాలకు అడ్డుగా నిలవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మూగజీవాల యజమానులు తమ పశువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేయకుండా, తమకు చెందిన స్థలాలు లేదా పశువుల షెడ్లలోనే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ మూగజీవాలను రహదారులపై వదిలే యజమానులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత కోసం ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూలై 20: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అట్టెం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఈ పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, ఉప సర్పంచ్ తలారి అఖిల్, రత్నం సడవలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామోజీ, వార్డు సభ్యులు రత్నం లక్ష్మీస్వామి, అంతర్గం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం : కాటారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టిటిడబ్ల్యూయూఆర్‌జేసీ (TTWURJC) బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థినికి ప్లాస్మోడియం ఫాల్సిపరం (PF) మలేరియా నిర్ధారణ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీహెచ్ మధుసూదన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సందీప్ ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో జిల్లా మలేరియా అధికారి ఏ. సుధాకర్, ఎపిడెమిక్ బృందం సభ్యులు హాస్టల్‌లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విద్యార్థినులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. హాస్టల్‌లోని వంటశాల, భోజనశాల, స్టోర్‌రూమ్, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల నివారణ కోసం హాస్టల్‌లోని అన్ని గదుల్లో ఆల్ఫా సైఫర్‌మెత్రిన్‌తో పిచికారీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరని, హాస్టల్‌లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. డాక్టర్ మౌనిక విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పర్సనల్ హైజీన్, సమతుల ఆహారం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంతకాని సడవలి, వార్డు సభ్యులు అక్కపాక మల్లయ్య తదితరులు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మున్వర్, జిల్లా మలేరియా అధికారి ఏ. సుధాకర్, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, ఎపిడెమిక్ బృంద సభ్యులు కపర్తి రాజు, ఊరుకొండ గోపీకృష్ణ, తలకోటి పరమేశ్వర్, సతీష్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కాలేశ్వర–ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రాత్రి వేళల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కాటారం డివిజన్ కేంద్రం బీఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం, గోదావరిలో అస్తికల నిమజ్జనం, రాత్రి బస కోసం కాలేశ్వరానికి వస్తున్నప్పటికీ రాత్రి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలేశ్వరం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, భక్తులకు అవసరమైన రాత్రి బస్సు సర్వీసులు లేకపోవడం బాధాకరమన్నారు. దీంతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, పేద, మధ్యతరగతి భక్తులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి ఒకటి, గోదావరిఖని నుంచి మరో బస్సును ప్రతిరోజూ సాయంత్రం బయలుదేరి రాత్రి 9 గంటలలోపు కాలేశ్వరం చేరుకునే విధంగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జక్కు శ్రావణ్ విజ్ఞప్తి చేశారు.

Blog Archive


www.medigaddatvnews.com