Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
భూపాలపల్లి, ఆగస్టు 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహాముత్తారం మండల కేంద్రం, కొర్లకుంట, మాదారం గ్రామాల్లో మొబైల్ లీగల్ అవేర్నెస్ వ్యాన్ ద్వారా న్యాయ అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారు, కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, కుటుంబ, సివిల్, ప్రామిసరీ నోట్ తదితర వివాదాల్లో చిక్కుకున్న బాధితులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. అక్షయ, ప్యానెల్ లాయర్ పారానంది సురేందర్, సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని, న్యాయపరమైన సమస్యలను సామరస్యంతో అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జి. నవీన్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కే. వెంకటేష్, ఎం. రాజ్కుమార్, పారా లీగల్ వాలంటీర్ లింగమళ్ల రమాదేవి, పి. అంజయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు.






