MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తోందని ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బంధు సుజాత, జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో కేంద్ర ప్రభుత్వం అనైతికంగా వ్యవహరించిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గుండాలను దింపి విద్యార్థులపై దాడులు చేయించి, విద్యార్థులే హింసకు పాల్పడ్డారనే విధంగా బీజేపీ ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరిగితే తప్ప మరోసారి ఇటువంటి తప్పులు జరగవని అన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు చివరికి పేపర్ లీకేజీలు ఎదురైతే వారు తమ భవిష్యత్తు కోసం పోరాటంలోకి దిగకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై అనైతికంగా లాఠీచార్జి చేయడం బీజేపీ ప్రభుత్వం క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని మోదీ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. లాఠీచార్జిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విద్యార్థుల పోరాట హక్కును హరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించరాదని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తన నియంతృత్వ వ్యవహారశైలిని విరమించుకోకపోతే విద్యార్థుల పోరాటాన్ని ఎదుర్కోక తప్పదని, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యాశాఖలో ప్రక్షాళన చేపట్టే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరుణ్, కార్తీక్, మైపాల్, మహేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

రామగిరి: దుద్దిళ్ల శ్రీధర్‌కు ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు ఖాకీ యూనిఫాంలకు అవమానాలేనని, ఇప్పటికే పలుమార్లు చెప్పినా పోలీసుల్లో మార్పు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీజీ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరూ రాజ్యాంగాన్ని తెలుసుకుని అభివృద్ధి చెందవద్దనే కక్షతో మంథని ఎమ్మెల్యే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలో తనపై అనేక కేసులు పెట్టించడంతో పాటు చివరకు రౌడీషీట్ ఓపెన్ చేయించిన కీర్తి దుద్దిళ్లకే దక్కుతుందని పుట్ట మధూకర్ అన్నారు. ప్రస్తుతం ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణ గౌడ్‌పై ఇప్పటికే 20 కేసులు పెట్టించి, అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. జూన్ 9న పూదరి సత్యనారాయణ గౌడ్‌పై ముత్తారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైతే, రామగిరి పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో సత్యనారాయణ గౌడ్ తల్లి, భార్య ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, ముత్తారంలో కేసు నమోదైందని, తీసుకెళ్లేందుకు వచ్చామని పోలీసులు చెప్పారని అన్నారు. ముత్తారంలో కేసు అయితే రామగిరి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా కేసు పెట్టారని పుట్ట మధూకర్ ఆరోపించారు. పూదరి సత్యనారాయణ గౌడ్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన రామగిరి పోలీసులపై దాడి చేసేందుకు ఆయన తల్లి, తండ్రి, భార్య, పెద్దమ్మ, బావలు కూడగట్టుకుని ఉన్నారని కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకచోటికి వస్తారని, అలా వచ్చినంత మాత్రాన ఇంత నీచమైన కేసు పెడతారా అని ప్రశ్నించారు. కేసు పెట్టడంతో పాటు 60 ఏళ్ల పూదరి సత్యనారాయణ గౌడ్ తల్లిపై దౌర్జన్యం చేసి గాయపర్చారని ఆరోపించారు. జూన్ 9న కేసు నమోదై ఇప్పటికి 42 రోజులు అవుతోందని, సత్యనారాయణ గౌడ్‌ను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక్కో బృందంలో పది మంది పోలీసులు, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక సీఐ, ఒక ఏసీపీ, ఒక డీసీపీ స్థాయి అధికారులు 42 రోజులుగా కేవలం సత్యనారాయణ గౌడ్ కోసమే తిరిగారని అన్నారు. సత్యనారాయణ గౌడ్‌ను పట్టుకోలేకపోతున్నారని ఇటీవల రాత్రి డీసీపీని దుద్దిళ్ల నానా దుర్భాషలాడారని ఆరోపించారు. దుద్దిళ్ల శ్రీధర్ కోసం పనిచేస్తే కోర్టులో చివాట్లు పడ్డాయని, ఏం కేసులు పెట్టారని, ఏం జ్ఞానం ఉందని హైకోర్టు జడ్జి హెచ్చరించారని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ఇప్పటికే రామగుండం సీపీకి విషయం చెప్పామని, ఐపీఎస్ అధికారిగా జాగ్రత్తగా ఉండాలని సూచించినా మార్పు రావడం లేదన్నారు. ఒకవైపు దుద్దిళ్లతో తిట్లు, మరోవైపు హైకోర్టులో చివాట్లతో ఖాకీ యూనిఫాంకు అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. పూదరి సత్యనారాయణ గౌడ్‌ను పట్టుకోలేకపోతున్నారనే కారణంతో రాజును తీసిపడేసి, వాడుకుని విసిరిపడేయడం దుద్దిళ్లకు అలవాటని పోలీసులు గుర్తించాలన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు దుద్దిళ్ల హైదరాబాద్‌లో ఉన్నా పూదరి సత్యనారాయణ గౌడ్‌కు జరిగినట్లే సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నమోదైన కేసులపై రివ్యూ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరాచకాలు, అక్రమ సంపాదనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చీకటి పాలన పోయే వరకు తన కొడుకుతో పాటు తన కుటుంబం అండగా ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ తల్లి, భార్య చెబుతున్నారని పుట్ట మధూకర్ తెలిపారు. నియోజకవర్గంలోని అనేక కుటుంబాలు కూడా ఇదే నిర్ణయానికి వస్తున్నాయని అన్నారు. ప్రజలు కోరుకునే అభివృద్ధి చేయాలని కోరితే పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే దుద్దిళ్ల అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ధన్వాడ స్కూల్‌లో ఒక్క బెంచీ కూడా వేయలేదని ఆరోపించారు. అమెరికాకు వెళ్లి సొంత ఊర్లకు సేవ చేయాలని చెప్పిన దుద్దిళ్ల.. తన సొంతూరిలో ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని అంతం చేయడానికి తన చేతులకు మట్టి అంటకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్న దుద్దిళ్ల నీచపు బుద్ధిని ప్రజలు గమనించాలని అన్నారు. ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు పెట్టి, తన వద్ద ఏమీ లేవని చెబుతున్న దుద్దిళ్ల అన్నదమ్ములు హైదరాబాద్‌లో ప్యాలెస్‌లు కట్టుకున్న విషయాన్ని ప్రజలకు చూపిస్తామని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు మారాల్సిన అవసరం ఉందని, దుద్దిళ్ల అడుగులకు మడుగులు ఒత్తకుండా బానిసలుగా వ్యవహరించవద్దని పుట్ట మధూకర్ సూచించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను గౌరవించామని, కలిసి పనిచేశామని గుర్తు చేశారు. దుద్దిళ్లతో తిట్టించుకోవడానికి పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదని, రాజ్యాంగం మూలంగానే వారికి ఉద్యోగాలు వచ్చాయని, దుద్దిళ్ల కుటుంబం వల్ల కాదని గుర్తించాలన్నారు.

న్యాయబద్ధమైన కేసు పెట్టి ఉంటే సత్యనారాయణ గౌడ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారని అన్నారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని తిరిగిన రాజును ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. పదేళ్లు వీళ్ల కోసం తాము పనిచేశామా అని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడుతున్నారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడితే న్యాయం మన పక్కనే ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ నిరూపించారని పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మంథని: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ  దుద్దిళ్ల శ్రీపాదరావు  సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య  సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల  (91) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సువర్ణ వనమాల  మరణవార్త తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొని సువర్ణ వనమాల  భౌతికకాయానికి తుది నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. దివంగత  సువర్ణ వనమాల  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, బంధువులు తదితరులు పాల్గొని సువర్ణ వనమాల గారికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరం, జూలై 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో 1వ వార్డులో చెట్టు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న 1వ వార్డు మెంబర్ రేవెల్లి రాకేష్ వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది ఎం.డి. వలి, ప్రవీణ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ వర్షం కొనసాగుతున్నప్పటికీ పరిస్థితిని పరిశీలించి, విద్యుత్ లైన్లకు అంతరాయం కలిగించిన చెట్టును సిబ్బంది చొరవతో తొలగించారు. అనంతరం విద్యుత్ లైన్లను పరిశీలించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో 1వ వార్డులోని కాలనీ ప్రజలకు విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించి, సంబంధిత సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు, సిబ్బందికి 1వ వార్డు మెంబర్ రేవెల్లి రాకేష్, వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సిబ్బంది అందించిన తక్షణ సేవలను వార్డు ప్రజలు అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

వరంగల్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఎర్రగోల్ల భరత్ వీర్  సోమవారం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భరత్ వీర్ శాలువాతో సత్కరించి ఆశీస్సులు పొందారు. సమావేశంలో వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతం, యువతను రాజకీయంగా చైతన్యపరచడం, గ్రామ స్థాయి వరకు యువ మోర్చా కమిటీలను విస్తరించడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై బీజేవైఎం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన సంక్షేమ పథకాలు, డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన భరత్ వీర్ యువతను బీజేపీ వైపు ఆకర్షించేలా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. భరత్ వీర్ మాట్లాడుతూ, తనపై మరోసారి విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నిరంతరం అండగా నిలుస్తున్న జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువ మోర్చా కమిటీలను మరింత పటిష్టం చేసి, యువత గొంతుకగా నిలుస్తామని, జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు యువశక్తిని ఏకం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూలై 20: కాటారం మండలం గుండా వెళ్లే జాతీయ రహదారి 353-సీపై మూగజీవాలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కాటారం పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు కాటారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఆవులు, బర్రెలు, లేగలు తదితర పెంపుడు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుండడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మూగజీవాలు రహదారిపై పడుకోవడం లేదా వాహనాలకు అడ్డుగా నిలవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మూగజీవాల యజమానులు తమ పశువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేయకుండా, తమకు చెందిన స్థలాలు లేదా పశువుల షెడ్లలోనే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ మూగజీవాలను రహదారులపై వదిలే యజమానులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత కోసం ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూలై 20: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అట్టెం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఈ పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, ఉప సర్పంచ్ తలారి అఖిల్, రత్నం సడవలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామోజీ, వార్డు సభ్యులు రత్నం లక్ష్మీస్వామి, అంతర్గం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






Blog Archive


www.medigaddatvnews.com