Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
అన్నారం: కాళేశ్వరం ఎక్స్ రోడ్డు వద్ద మూలమలుపులో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కాటారం డివిజన్ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మాదేపూర్ మండలం అన్నారం గ్రామ సర్పంచ్ నీర్ల ప్రభాకర్ నేతృత్వంలో దళిత సంఘాల నాయకులు మాదేపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్నారం గ్రామంలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు తొలగించేందుకు లేదా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహానికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. విగ్రహాన్ని తొలగించే కుట్రకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఫిర్యాదులో పాత్రధారులు బయటకు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఘటన వెనుక సూత్రధారులు దుద్దిళ్ల కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ విషయంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి అంబేడ్కర్ విగ్రహ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ నీర్ల ప్రభాకర్, సీనియర్ దళిత నాయకులు వేమూరి జక్కన్న, సంపత్ మహారాజ్, గోల్కొండ కిరణ్, జోడు శ్రీనివాస్, జక్కు శ్రావణ్, దిల్లీ రాజు, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, అరుణ, కొండ గొర్ల వెంకటస్వామి, బొడ్డు రాజబాబు, అటుకాపురం మల్లేష్, అటుకాపురం రాజేష్, పాలిక గణపతి, వేమూరి తిరుపతి రెడ్డి, పానుగంటి సంతోష్, పెంచిక గట్టయ్య, చుదారి పోచయ్య, పెంచిక మహేష్, పాగే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక కోల శాన్వి ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించింది.తెలంగాణ యోగా అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కోల జయసుధ–దుర్గరాజ్ దంపతుల కుమార్తె కోల శాన్వి అండర్–8 నుంచి 10 సంవత్సరాల విభాగంలో పాల్గొంది. పోటీల్లో అద్భుతమైన యోగాసనాలను ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.చిన్న వయసులోనే జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం పట్ల బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక జిల్లా స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యోగా కోచ్ వవిల్ల కిష్టయ్య కోల శాన్విని అభినందించారు. కాగా, ఈ నెల 11న కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు శాన్వి ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సకినారపు వెంకయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ వేల్పుల సరిత పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని కలిసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ సరిత భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, నాయకులు సురేందర్, బానయ్య, సమ్మయ్య, బాపు, రవి తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం: బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నిన్న కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద చేసిన వ్యాఖ్యలను ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కాటారం సబ్డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెప్పల దేవేందర్రెడ్డి మాట్లాడారు.పుట్ట మధు ఐదేళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు పెద్దపల్లి చైర్మన్గా పనిచేసి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పుట్ట మధు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శ్రీధర్బాబు కుటుంబం చేసిన మేలును మరిచి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఒకసారి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడ్డారని, ఇల్లు లేని స్థాయి నుంచి రాజగృహాలు, వందల కోట్ల ఫామ్హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతికి పాల్పడింది పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. ఆయన తల్లి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల బ్లాక్మనీని నిర్వహించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే, అభివృద్ధి జరగలేదని పుట్ట మధు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చేస్తున్న అభివృద్ధిని కళ్లుతెరిచి చూడాలని సూచించారు.గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఏమిటో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి ఏమిటో పుట్ట మధు చెప్పాలని, అంబేద్కర్ చౌక్ వద్ద బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ధైర్యం తమకు ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.జాడి కవిరాజు, మంథని మధుకర్, రేవెల్లి రాజబాబు, గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసుల్లో పుట్ట మధు ప్రమేయంపై ప్రశ్నలు సంధించారు. ఈ కేసులపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే పాలించడం చేతకాకపోయిన పుట్ట మధుకు శ్రీధర్బాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.నాలుగున్నరేళ్లు అసెంబ్లీలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడని పుట్ట మధు ఇప్పుడు ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఏకైక ప్రజాప్రతినిధి పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. హత్యల్లో తన బంధువులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారనే ఆరోపణలపై నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రశాంతంగా ఉన్న మంథని నియోజకవర్గంలో హత్యా సంస్కృతిని తీసుకొచ్చిన పుట్ట మధు, మంత్రి శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో ఐదు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోతు సుగుణ, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల, జిల్లా కిసాన్ అధ్యక్షుడు వంశవర్ధన్రావు, మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, కాటారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టూరి మహేష్గౌడ్, సర్పంచ్ల ఫోరం నాయకుడు కిషన్ నాయక్, గుడాల శ్రీను, కాటారం మండల సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా కాటారం కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత పాఠశాలలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఘనంగా సత్కరించారు. కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు ఎన్. శిరీష, పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని జి. నళిని, శారీరక విద్య ఉపాధ్యాయిని రాజేశ్వరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించారు. వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు తమ గురువుల గొప్పతనాన్ని వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గురువుల సేవలను కొనియాడుతూ పాటలు పాడారు. నృత్యాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల ప్రాధాన్యత, విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్రను వివరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అనంతరం ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన ‘గురువు గారి గొప్పదనం’ పాటను ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయ బృందం కలిసి ఆలపించారు. గురువు యొక్క గొప్పతనం, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను చాటిచెప్పేలా ఈ పాట సాగింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత మాట్లాడుతూ.. గురువు దైవంతో సమానమని అన్నారు. విద్యార్థుల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను, సూచనలను విద్యార్థినులు శ్రద్ధగా ఆలకించాలని సూచించారు. కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులను సత్కరించడం, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయ బృందం కలిసి పాట ఆలపించడం వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీతతో పాటు విజయ, శిరీష, నళిని, కవిత, శ్రీలత, సుజాత, స్వప్న, సరిత, అరుణ, మణిమాల, రాజమణి, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్య, లక్ష్మి, రిబ్కా తదితర ఉపాధ్యాయినులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
దేవరాంపల్లి: దేవరాంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు తమ గురువులపై ఉన్న గౌరవాభిమానాలను చాటుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్తో పాటు ఉపాధ్యాయులు లక్ష్మి, భోజ్య, తిరుపతి, లత, అనూషలను విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల గొప్పతనం, సమాజ నిర్మాణంలో వారి పాత్రను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. గురువులు తమకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా మంచి నడవడిక, క్రమశిక్షణ, మానవతా విలువలను అలవర్చుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పట్ల తమకున్న గౌరవాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని మంచి పేరు సంపాదించడమే తమకు లభించే నిజమైన గురుదక్షిణ అని అన్నారు. ప్రతి విద్యార్థి గురువుల సూచనలు, సలహాలను పాటిస్తూ విద్యలో రాణించాలని సూచించారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విద్యకు, ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ద్వారా గురువుల సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారికి గౌరవం అందిస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయుల విశిష్టతను కొనియాడుతూ విద్యార్థులు చేసిన ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణలో వేడుకలు సందడిగా సాగాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి రాధాకృష్ణన్ అందించిన సేవలను కొనియాడారు.విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ డ్రెస్లు, షూస్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు సదయ్య, పంచాయతీ కార్యదర్శి స్వాతి, పోస్టుమాన్ కళ్యాణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.