MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 20: భూపాలపల్లిలోని ఎస్‌ఆర్‌డీజీ స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకుడికి క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత ప్రవర్తన, ఇతరులను గౌరవించే గుణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరమని తెలిపారు. నాయకత్వం అంటే అధికారం కాదని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడమేనని సూచించారు. అనంతరం నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు సాష్‌లు ధరింపజేసి బాధ్యతలను అప్పగించారు. నాయకులు తమ బాధ్యతలను క్రమశిక్షణ, నిబద్ధతతో నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నూతన నాయకులకు అభినందనలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం: అటవీ హక్కుల చట్టం–2006లో ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు (OTFD) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు వినతిపత్రం అందజేశారు. OTFDలకు వర్తించే మూడు తరాలు లేదా 75 సంవత్సరాల నిబంధనను సడలించేలా చట్ట సవరణకు సిఫారసు చేయాలని కోరారు. పాతకాలంలో సరైన రెవెన్యూ, అటవీ, సర్వే రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నిజమైన అటవీ నివాసితులు 75 ఏళ్ల నిరంతర చారిత్రక ఆధారాలు సమర్పించలేక హక్కులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. చట్ట సవరణ జరిగే వరకు OTFDలను తొలగింపులు, వేధింపుల నుంచి రక్షించేలా జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, AIAYS మండల గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలిరావు, సలహాదారు గంధం రాజేష్, ప్రధాన కార్యదర్శి లింగమళ్ల శంకర్, ప్రచార కార్యదర్శి పులియాల సురేష్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కోశాధికారి జినుకల శ్రీను భార్య దివ్య కుటుంబాన్ని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జిల్లా నాయకులతో కలిసి పరామర్శించారు. తలలో కణితితో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దివ్య మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఇద్దరు కుమార్తెల చదువులకు భవిష్యత్తులో సహకరిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జినుకల శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలను త్వరలో కలసి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు, కమలాపూర్ గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 20: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంపై ఈ నెల 23న హనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ చర్చ వేదికను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. గురువారం భూపాలపల్లిలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బహిరంగ చర్చ వేదిక కనపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కె. కేశవరావు చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హనుమకొండ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ వేదిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాచమౌని నాగభూషణం అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములునాయక్, ఉద్యమకారుల కమిటీ సభ్యుడు శోభన్‌రెడ్డి, ప్రొఫెసర్ చింతకింది కాసిం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొంటారని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర గట్టయ్య, టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ పార్వతి, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఐత బాపు, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఆగస్టు 19: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు పేద లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ అన్నారు. నిబంధనలు సవరించకపోతే లబ్ధిదారుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం ప్రస్తుత నిర్మాణ ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. సిమెంట్, ఇనుము, కూలీల ధరలు పెరిగిన నేపథ్యంలో నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటి వైశాల్య పరిమితిని 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. అరకొర ఆర్థిక సాయంతో పేదలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పీక కిరణ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి నిబంధనలు సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 19: రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్‌లో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న ఆదివాసీలు, ఉద్యమకారులు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కామెరా గట్టయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, ప్రజా ఫ్రంట్ దుబాసి పార్వతి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య నాయకుడు అయిత బాపుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, ఆగస్టు 19: మహాముత్తారం మండలం కోనంపేటలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్‌లో 60–80 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించడం లేదని, జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై జూలై 27, ఆగస్టు 3, ఆగస్టు 17న జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు.

Blog Archive


www.medigaddatvnews.com