MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 6: కాటారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ పనులను శనివారం బీజేపీ కాటారం మండల శాఖ నాయకులు పరిశీలించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాటారం పట్టణంలో ప్రస్తుతం కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. గతంలో ఇదే కారణంగా ఓ మహిళ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్వంత మండలంలోనే మార్కెట్ నిర్మాణం ఆలస్యమవుతుండటం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కాటారం మండల శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవీందర్, జిల్లా నాయకులు డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. 



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్, జూన్ 6 : మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో మొక్కలు నాటారు. "పచ్చదనాన్ని పెంచుదాం – ప్రకృతిని పరిరక్షిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల ద్వారా స్వచ్ఛమైన గాలి, నీడ లభించి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. "ప్రకృతి ఉంటేనే ప్రగతి – పర్యావరణం ఉంటేనే మనుగడ" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్ల సమ్మిరెడ్డి, వార్డు సభ్యుడు సోయం శశికాంత్, గ్రామ కార్యదర్శి చల్లూరి ఇందిర, ఫీల్డ్ అసిస్టెంట్ సల్ల రాజశేఖర్, యువకులు సల్లం రాజు, మంచినీళ్ళ రాజబాపు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, జూన్ 5: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల పేర్లతో పాటు "ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్, ఫౌండేషన్" వంటి పదాలను వినియోగిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జిల్లా కార్యదర్శి బి. సుజాత ఆరోపించారు. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రికలు మరియు ఇతర ప్రకటనల్లో పాఠశాల పేర్లకు అదనంగా ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను జోడించి ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ పదాలను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామనే భావన కల్పించి విద్యార్థులను ఆకర్షించడమే కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి పొందిన రాష్ట్ర లేదా కేంద్ర సిలబస్‌లను మాత్రమే బోధించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు స్వలాభం కోసం ఈ తరహా పదాలను వినియోగిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి ప్రకటనల వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పేర్లను ఉపయోగిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే నేపథ్యంలో జూన్ 13వ తేదీలోపు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, పాంప్లెట్లు మరియు ఇతర ప్రచార సామగ్రి నుంచి ఈ పదాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ పేర్లను ఉపయోగిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతితో పాటు సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 05:  కాటారం పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు భారీగా లీకై వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండాకాలంలో అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు విలువైన తాగునీరు గంటల తరబడి రోడ్లపై పారిపోతున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు లీకేజీని మరమ్మతు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 5: ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతాపగిరి గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా మొక్కల నాటకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటారం అటవీ క్షేత్ర అధికారి మరియు అటవీ శాఖ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ, విద్యుత్ తీగలు మరియు ఉచ్చులు ఏర్పాటు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అక్రమ అటవీ నరికివేతలు మరియు ఆక్రమణలను అరికట్టే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో హెచ్. సురేందర్ (డీఆర్‌వో, కాటారం సెక్షన్), డి. ఝాన్సీ రాణి (డీఆర్‌వో, యామన్‌పెల్లి సెక్షన్), పి. చంద్రశేఖర్ (ఎఫ్‌ఎస్‌వో, దామరకుంట సెక్షన్), పి. సోనీ కిరణ్ (ఎఫ్‌ఎస్‌వో, చింతకాని సెక్షన్), కాటారం రేంజ్ బీట్ అధికారులు రాజేందర్, సంజీవ్, మొయినుద్దీన్, హరీష్, మోనా కౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది మల్లేష్, రేంజ్ జీపు డ్రైవర్ మహమూద్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు నగునూరు శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు శ్రీనివాస్‌ను అడ్డుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడారు. అనంతరం ఆయనను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తాను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని, ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అన్యాయంగా తన పేరును జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కక్షలు, పక్షపాత ధోరణులు పక్కనపెట్టి తనలాంటి పేదవారికి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. 



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు మరియు విద్య ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న “బడి బడి బాట” కార్యక్రమంలో దేవరాంపల్లి గ్రామ ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ వీధులు, కాలనీలలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి బాలబాలిక విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రయత్నాలను అభినందించి, పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. “ప్రతి చిన్నారి బడిబాట – విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు” అనే నినాదంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com