MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

విజయవంతం చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు సంఘటిత, అసంఘటిత, ఉద్యోగ సేవారంగాలలో శ్రమజీవులుగా, చాలీ చాలని అతి తక్కువ వేతనాలు, జీతాలతో పని భద్రత లేకుండా 8 గంటల పని కన్నా అదనపు గంటలు యజమానులు చెప్పిన సమయం వరకు అదనపు శ్రమదోపిడికి గురి అవుతూ కాంట్రాక్టురంగా కార్మికులుగా కనీస వేతనాలు లేకుండా కార్మికులు మరింత పేదరికంలోకి మారి కుటుంబాల పోషణకు అప్పులు చేస్తూ జీవితాలు మరింత దుర్భరం గా మారుతున్నాయి. మేడే స్పూర్తితో పోరాడి చట్టబద్దంగా కార్మికహక్కులు సాధించుకుని, కార్మికులు అంటే బానిసలు కాదని, సంపదలో భాగస్వాములని ప్రభుత్వాల పెట్టుబడిదారుల నుండి శ్రమకు తగిన ఫలితం దక్కే వరకు పోరాడదమని *పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప* మేడే స్పూర్తితో 8గంటల పని దినాలను సాధించుకున్నాం. 2026 మేడే స్పూర్తితో 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం. శ్రమశక్తిని అందించే సమస్తరంగాల కార్మికులు చేసే శ్రమజీవుల రక్తం చెమటగా మారుస్తున్న కార్మికుల ఐక్యతలో  బలం ఉంది.కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమం చేద్దామని ఆయన కోరారు.. వి సి కె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్  ఏఐసీసీ టు జిల్లా కార్యదర్శి కన్నూరు డానియల్... పార్టీ జిల్లా నాయకులు బంధు కాంతి  సుజాత ఆత్కూరిశ్రీకాంత్ ఐసా రాష్ట్ర నాయకులు శిలపాక నరేష్ పాల్గొన్నారు
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఏప్రిల్ 28: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాటారం మండలంలోని కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల భద్రత రక్షణ మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్‌ల ఫోరం డివిజన్ అధ్యక్షుడు, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలని, ఈనాటి యువతే రేపటి దేశానికి వెన్నెముకవంటివారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయిని సరిగా ఉంచుకోవడం అవసరమని తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం నిర్వహించే ‘ఆరోగ్య మహిళా’ క్యాంపులకు హాజరై పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సఖి సెంటర్ ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ కిశోర బాలికలు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఎదుగుతున్న వయసులో అనవసర ఆకర్షణలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా బాధ్యత వహించే వ్యక్తులతో పంచుకోవాలని, అవసరమైతే హెల్ప్‌లైన్ నంబర్లు 1098, 181, 100లను వినియోగించుకోవాలని వివరించారు. సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ రక్తహీనత నివారణ కోసం చిరుధాన్యాలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై అంగన్వాడీ టీచర్ల సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ఏపీఎం రవికుమార్, సఖి DHEW గాయత్రి, సూపర్వైజర్లు శివరాణి, వీణ, ఎండి పర్జన, మహిళా సంఘ ప్రతినిధులు, సీసీలు, వీవోఏలు, అంగన్వాడీ టీచర్లు మరియు కిశోర బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా జనగణనను స్వీయ నమోదు చేసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు. ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా జనగణన స్వీయ గణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గనణలో తమ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ కొరకు https://se.census.gov.in లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయాలని, ఓటిపి నమోదు చేసి జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ నమోదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గనణలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిళ్లలో మే 10వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని తదుపరి మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎన్యూమ రేటర్లుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన సమయంలో వచ్చిన ఐడి నంబర్‌ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్, డిప్యూటీ ఎస్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్,28 : సింగరేణి సంరక్షణకై–మొండి  బకాయిలు వెంటనే చెల్లించాలి:సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు)డిమాండ్:సింగరేణి కాలరీస్ సంస్థను ఆర్థిక సంక్షోభం నుండిగట్టెక్కించాలని,జెన్‌కో(టిజిజిఇన్కో)ట్రాన్స్‌కోసంస్థలు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ,మంగళవారం హైదరాబాద్ విద్యుత్ సౌదా  వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించరు,అనంతరం యూనియన్ నాయకులు(టిజీజీఇఎన్ సిఓ)ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడరు.​ఆర్థిక సంక్షోభంతో సింగరేణి సంస్థలో సుమారు 40,000 మంది శాశ్వత ఉద్యోగులు,27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సింగరేణి సంస్థ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.కార్మికుల జీతభత్యాలు,సంక్షేమ పథకాలు,కనీస పనిముట్లు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి కీలకమైన హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ,డీజిల్ డోజర్లు,భూగర్భగనులలో  ఎల్ హెచ్ డి మిషనరీలు  కొనుగోలుకు కూడా నిధుల కొరత ఏర్పడటం శోచనీయం,డబ్బులు లేక సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని,రక్షణని గాలికి వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందిఅని,భారీగా పేరుకుపోయిన బకాయిలు, 2014 నుండి ఇప్పటివరకు విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు,46,000 కోట్లకు చేరుకున్నాయి.ఇప్పటివరకు జన్కోనుండి రూ.19000 కోట్లు బకాయిలు,ట్రాన్స్కో నుండి 27000 కోట్లు బకాయి ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.గత రెండేళ్లలోనే(2023-25) వరకు 10,000 కోట్లు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంఅని అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు,ప్రభుత్వ గ్యారెంటీతో బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి,ఇతర ప్రభుత్వ సంస్థలైన జెన్‌కో,ట్రాన్స్‌కోల నుండి బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది,ఒక ప్రభుత్వ సంస్థను కాపాడటానికి మరో సంస్థ బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తపరిచారు: డిమాండ్లు(టిజిజిఇన్కో),ట్రాన్స్‌కో నుండి రావాల్సిన.46,000 కోట్ల బకాయిలను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలి.సింగరేణి కార్మికుల సంక్షేమానికి,సంస్థ అభివృద్ధికి ఆటంకం కలగకుండా నిధులు విడుదల చేయాలి.బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చే పరిస్థితి నుండి సంస్థను విముక్తి చేయాలని పేర్కొన్నారు,​ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్,రాష్ట్ర అధ్యక్షులు మందా నర్సింహారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి,ఆర్టి-టూఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్,అధ్యక్షులు బానోత్ వినయ్ లు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని నాంచారిమడూరు గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే డిగ్రీ గురుకుల కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన రాచర్ల కార్తీక్ (19) అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 25: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కార్పొరేటర్ చాడ స్వాతి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహిళా సాధికారత, దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలు మరియు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై విస్తృతంగా మాట్లాడారు. మహిళల సాధికారతకు అత్యంత కీలకమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల ఆశయాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ‘మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టిందని, 2029 నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై పెద్దలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల అసలు వైఖరి పార్లమెంటులో బయటపడిందని, ఇది మహిళా వ్యతిరేక కూటమిగా స్పష్టమవుతోందని అన్నారు. మహిళలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుందని ఆరోపించారు. గతంలో కూడా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ విషయంలో నిర్లక్ష్య వైఖరినే చూపిందని విమర్శించారు. మహిళల హక్కులను అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు ఏకమయ్యాయని, భవిష్యత్తులో మహిళలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ, మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, రాష్ట్ర నాయకులు బట్టు రవి, అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్, కౌన్సిలర్ ఎరుకల రేణుక, మీడియా ఇంచార్జ్ మునీందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలిఫ్, మహిళా మోర్చా నాయకురాలు బూర పద్మ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో “చలో ఇందిరా పార్క్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, విద్య హక్కు చట్టం–2009 అమలు కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలాదిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా నుండి కూడా భారీగా తరలిరావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎల్కేజీ సీటు పొందాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్, బూట్లు తదితరాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ భారాన్ని భరించలేక ప్రజలు అప్పులపాలు అవుతూ, తమ ఆస్తులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా దోపిడీ ఇప్పటికే ఆగిపోయేదని, కానీ పాలకుల అండదండలతో విద్యా మాఫియా రెచ్చిపోతుందని రవి పటేల్ విమర్శించారు. విద్య హక్కు చట్టం–2009ను పూర్తిగా అమలు చేస్తే సామాన్యుడి బిడ్డ కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుందని, ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పడుతుందని, విద్యా వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ సమాజం ఇకనైనా మేల్కొని, పిల్లల విద్య కోసం అప్పులపాలు కావడం ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. “చదువు అమ్ముకునే వస్తువు కాదు – ఇది ప్రతి బిడ్డ హక్కు” అని స్పష్టం చేశారు. తెలంగాణలో వెంటనే విద్య హక్కు చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ విద్యా దోపిడిని అరికట్టాలని, పేదవారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మన హక్కులను సాధించాలంటే మరో ఉద్యమం తప్పదని, అందరం కలసి పోరాడాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మడే సంతోష్, వైద్య లక్ష్మణ్, రామ్ చరణ్, రేణుకుంట్ల సునీల్, లక్ష్మణ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com