కాటారం: అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, వెయ్యి రోజులైనా వాటిని అమలు చేయని దుద్దిళ్ల శ్రీధర్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ హామీల అమలుపై కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్యారంటీ కార్డులు పట్టుకుని ఇంటింటికీ తిరిగి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాల ప్రజలను దుద్దిళ్ల శ్రీధర్, రేవంత్రెడ్డి దగా చేశారని ఆరోపించారు. హామీలు ఆకాశంలో.. అమలు పాతాళంలోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. గతంలో సిపాయి మాటలు మాట్లాడిన మంథని ఎమ్మెల్యే ఇప్పుడు హామీల అమలుపై ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. హామీలు ఇవ్వకుండానే ప్రజల కష్టాలను తీర్చేలా పథకాలను రూపొందించి అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. గతంలో రూ.200గా ఉన్న వృద్ధాప్య పెన్షన్ను కేసీఆర్ ప్రభుత్వం రూ.వెయ్యికి, అనంతరం రూ.2 వేలకు పెంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ ఏమైందో సమాధానం చెప్పాలని కోరారు. వికలాంగుల పెన్షన్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా పెంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యోగుల వేతనాల పెంపు, మహిళా సంఘాలు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కాటారం మండల ప్రజలు ప్రతి ఎన్నికల్లో వేలల్లో మెజార్టీ ఇచ్చినా ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు మేలు చేసిందేమీ లేదని పుట్ట మధూకర్ అన్నారు. దుద్దిళ్ల కుటుంబం మంథని నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంథని పరువు తీస్తోందని విమర్శించారు. 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఒకే కుటుంబానికి ఐదుసార్లు ఓట్లు వేసి గెలిపిస్తే, మంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని దగా చేసి మంథనికి అపకీర్తి తీసుకొచ్చారని దుద్దిళ్ల శ్రీధర్పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ దగాకోరు పాలనపై ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాన్ని నిలదీయాలని పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.
MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని శ్రీను బాబు పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వేడుకల్లో సందడి చేశారు.
పెద్దపల్లి,రామగిరి,సెప్టెంబర్ 3 : రామగిరి మండలం చందనపూర్ గ్రామ పంచాయతీలో గురువారం ఎస్ఐఆర్ వెరిఫికేషన్ గ్రామసభ నిర్వహించారు..రామగిరి మండల్ ఎమ్మార్వో సుమన్, పాల్గొని సుమారు 250 ఓటర్ ఐడి కార్డులను సరి చేశారు. ఇంకెవరైనా నోటీసు వచ్చిన వారు ఉంటే బిఎల్ఓ శ్రీలతకు ఇచ్చి సరి చేసుకోవాలని ఎమ్మార్వో తెలిపారు..ఈ కార్యక్రమంల డిటి మానస,జిపిఓ వెంకటేశ్వర్లు,సర్పంచ్ కొండ మంజుల,ఉపసర్పంచ్ రజిత-రమ్ చందర్,మాజీ మండల కోఆప్షన్ యండి.ఇబ్రహీం,వార్డ్ మెంబర్స్ సౌందర్య-కుమర్,బాగే రాజు,కుమారస్వామి,బి ఎల్ఓ షాహిద్,యెరవెల్లి సాయికిరణ్,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు...
కాటారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకె శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అత్యంత దారుణమని తుడుం దెబ్బ జిల్లా నాయకుడు, కాటారం మండలం జాదరావుపేట ఉప సర్పంచ్ కోట అశోక్ పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి, కేసులో సాక్ష్యాలు తారుమారు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ ఆడబిడ్డల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రత్యేక పోలీస్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శిరీషకు న్యాయం జరిగే వరకు తుడుం దెబ్బ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, రాస్తారోకోలు చేపడతామని, న్యాయం జరగకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్కు పిలుపునిస్తామని తెలిపారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోట అశోక్ కోరారు.
శాయంపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వర్గం పార్టీ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనతో పాటు ఇతర ఏర్పాట్లపై వర్గీయులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిరికొండ మధుసూదనాచారి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన శాయంపేట మండలంలోనే పార్టీ కార్యాలయ ఏర్పాటుకు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా నిలిచిన శాయంపేట నుంచే మరోసారి పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఆయన వర్గం అడుగులు వేస్తోందనే చర్చ జరుగుతోంది.
మండలాల వారీగా కార్యాలయాల ఏర్పాటుకు ప్లాన్?
కేవలం శాయంపేటకే పరిమితం కాకుండా భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిరికొండ వర్గం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలను ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో కార్యాలయాలు అందుబాటులోకి వస్తే పార్టీ కేడర్తో నిత్యం సమావేశాలు నిర్వహించడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం మరింత సులభమవుతుందని సిరికొండ వర్గం భావిస్తున్నట్లు సమాచారం.
కార్యకర్తల్లో నూతన ఉత్సాహం
శాయంపేటలో కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తతో సిరికొండ వర్గంలోని నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా రాజకీయంగా స్తబ్దంగా ఉన్న కేడర్ను మళ్లీ యాక్టివ్ చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు చర్చ సాగుతోంది. మండలాల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాలకు ఒక వ్యవస్థ ఏర్పడటంతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలు మధుసూదనాచారి వ్యూహం ఏంటి?
అయితే శాయంపేట నుంచే పార్టీ కార్యాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం వెనుక సిరికొండ మధుసూదనాచారి అసలు వ్యూహం ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడానికే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారా? లేక రాబోయే రోజుల్లో నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఇప్పటి నుంచే కేడర్ను సిద్ధం చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శాయంపేట నుంచే మరోసారి రాజకీయ కార్యాచరణకు ఊపునివ్వడం వెనుక భవిష్యత్ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గ్రామస్థాయి వరకు పార్టీని తీసుకెళ్లే ప్రయత్నమా?
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన అమల్లోకి వస్తే గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. స్థానిక సమస్యలపై స్పందించడం, ప్రజా సమస్యలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాల్లో ఈ కార్యాలయాలు కీలకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. శాయంపేటలో కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు సిరికొండ వర్గంలో కొత్త చర్చకు తెరలేపాయి. ఇది కేవలం కార్యాలయం ఏర్పాటా? లేక భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త వ్యూహానికి నాందియా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరి సిరికొండ మధుసూదనాచారి మాస్టర్ ప్లాన్ ఏంటి? శాయంపేట నుంచి మొదలైన ఈ కార్యాలయాల పరంపర భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట శాంతినగర్ గ్రామ పరిధిలో గుట్టలను అక్రమంగా తవ్వి మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనుమతులు లేకుండానే రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి లారీల ద్వారా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, చిట్యాల మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు గత 15 రోజులుగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకుని అనుమతులు చూపించాలని కోరినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. పట్టా భూమి అయినప్పటికీ గుట్టల తవ్వకాలకు పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ప్రకారం అవసరమైన అనుమతులు ఉండాలని రవి పటేల్ పేర్కొన్నారు.
జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులను సంప్రదించగా అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, తవ్వకాల ప్రదేశంలో సరైన బోర్డులు, లారీ పాసులు, ప్రజలకు సమాచారం వంటి అంశాలు కనిపించడం లేదని ఆరోపించారు. లారీలు రాకపోకలు సాగించడంతో రోడ్లపై భారీగా దుమ్ము లేస్తోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. రోడ్లపై నీటిని చల్లకపోవడంతో వాయు కాలుష్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు ధ్వంసమై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టీఆర్పీ నాయకులు పేర్కొన్నారు. భూసార నష్టం, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం, గ్రామ ప్రజల జీవన విధానంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తవ్వకాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కూడా రికవరీ చేయాలని కోరారు. అధికారులు స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాటారం: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్బాబు, శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, పేదల ఆశాజ్యోతి, రైతుల ఆపద్బాంధవుడని కొనియాడారు. పేదలు, రైతుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మహానేతకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా, యువజన నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Blog Archive
- September (10)
- August (57)
- July (67)
- June (57)
- May (24)
- April (34)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
www.medigaddatvnews.com
















