MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నిన్న కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద చేసిన వ్యాఖ్యలను ఐదు మండలాల కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కాటారం సబ్‌డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెప్పల దేవేందర్‌రెడ్డి మాట్లాడారు. పుట్ట మధు ఐదేళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు పెద్దపల్లి చైర్మన్‌గా పనిచేసి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పుట్ట మధు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శ్రీధర్‌బాబు కుటుంబం చేసిన మేలును మరిచి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఒకసారి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడ్డారని, ఇల్లు లేని స్థాయి నుంచి రాజగృహాలు, వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్ల అవినీతికి పాల్పడింది పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. ఆయన తల్లి పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల బ్లాక్‌మనీని నిర్వహించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే, అభివృద్ధి జరగలేదని పుట్ట మధు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేస్తున్న అభివృద్ధిని కళ్లుతెరిచి చూడాలని సూచించారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఏమిటో, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయని అభివృద్ధి ఏమిటో పుట్ట మధు చెప్పాలని, అంబేద్కర్‌ చౌక్‌ వద్ద బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ నాయకులు సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రైతు భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని రేషన్‌ కార్డుల పంపిణీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ధైర్యం తమకు ఉందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. జాడి కవిరాజు, మంథని మధుకర్‌, రేవెల్లి రాజబాబు, గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసుల్లో పుట్ట మధు ప్రమేయంపై ప్రశ్నలు సంధించారు. ఈ కేసులపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే పాలించడం చేతకాకపోయిన పుట్ట మధుకు శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నాలుగున్నరేళ్లు అసెంబ్లీలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడని పుట్ట మధు ఇప్పుడు ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఏకైక ప్రజాప్రతినిధి పుట్ట మధు కాదా అని ప్రశ్నించారు. హత్యల్లో తన బంధువులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారనే ఆరోపణలపై నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న మంథని నియోజకవర్గంలో హత్యా సంస్కృతిని తీసుకొచ్చిన పుట్ట మధు, మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో ఐదు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్‌ సభ్యుడు దండు రమేష్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోతు సుగుణ, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతకాని తిరుమల, జిల్లా కిసాన్‌ అధ్యక్షుడు వంశవర్ధన్‌రావు, మంథని నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు చీమల సందీప్‌, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, కాటారం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిట్టూరి మహేష్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం నాయకుడు కిషన్‌ నాయక్‌, గుడాల శ్రీను, కాటారం మండల సీనియర్‌ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాటారం కేజీబీవీ ప్రిన్సిపాల్‌ చల్ల సునీత పాఠశాలలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఘనంగా సత్కరించారు. కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు ఎన్‌. శిరీష, పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని జి. నళిని, శారీరక విద్య ఉపాధ్యాయిని రాజేశ్వరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించారు. వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు తమ గురువుల గొప్పతనాన్ని వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గురువుల సేవలను కొనియాడుతూ పాటలు పాడారు. నృత్యాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల ప్రాధాన్యత, విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్రను వివరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రిన్సిపాల్‌ చల్ల సునీత రచించిన ‘గురువు గారి గొప్పదనం’ పాటను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ బృందం కలిసి ఆలపించారు. గురువు యొక్క గొప్పతనం, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను చాటిచెప్పేలా ఈ పాట సాగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ చల్ల సునీత మాట్లాడుతూ.. గురువు దైవంతో సమానమని అన్నారు. విద్యార్థుల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను, సూచనలను విద్యార్థినులు శ్రద్ధగా ఆలకించాలని సూచించారు. కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులను సత్కరించడం, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయ బృందం కలిసి పాట ఆలపించడం వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చల్ల సునీతతో పాటు విజయ, శిరీష, నళిని, కవిత, శ్రీలత, సుజాత, స్వప్న, సరిత, అరుణ, మణిమాల, రాజమణి, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్య, లక్ష్మి, రిబ్కా తదితర ఉపాధ్యాయినులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.





Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

దేవరాంపల్లి: దేవరాంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు తమ గురువులపై ఉన్న గౌరవాభిమానాలను చాటుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్‌తో పాటు ఉపాధ్యాయులు లక్ష్మి, భోజ్య, తిరుపతి, లత, అనూషలను విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల గొప్పతనం, సమాజ నిర్మాణంలో వారి పాత్రను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. గురువులు తమకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా మంచి నడవడిక, క్రమశిక్షణ, మానవతా విలువలను అలవర్చుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పట్ల తమకున్న గౌరవాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని మంచి పేరు సంపాదించడమే తమకు లభించే నిజమైన గురుదక్షిణ అని అన్నారు. ప్రతి విద్యార్థి గురువుల సూచనలు, సలహాలను పాటిస్తూ విద్యలో రాణించాలని సూచించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విద్యకు, ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ద్వారా గురువుల సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారికి గౌరవం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయుల విశిష్టతను కొనియాడుతూ విద్యార్థులు చేసిన ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణలో వేడుకలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి రాధాకృష్ణన్ అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ డ్రెస్‌లు, షూస్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు సదయ్య, పంచాయతీ కార్యదర్శి స్వాతి, పోస్టుమాన్ కళ్యాణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, వెయ్యి రోజులైనా వాటిని అమలు చేయని దుద్దిళ్ల శ్రీధర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ హామీల అమలుపై కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్యారంటీ కార్డులు పట్టుకుని ఇంటింటికీ తిరిగి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాల ప్రజలను దుద్దిళ్ల శ్రీధర్‌, రేవంత్‌రెడ్డి దగా చేశారని ఆరోపించారు. హామీలు ఆకాశంలో.. అమలు పాతాళంలోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. గతంలో సిపాయి మాటలు మాట్లాడిన మంథని ఎమ్మెల్యే ఇప్పుడు హామీల అమలుపై ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. హామీలు ఇవ్వకుండానే ప్రజల కష్టాలను తీర్చేలా పథకాలను రూపొందించి అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. గతంలో రూ.200గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం రూ.వెయ్యికి, అనంతరం రూ.2 వేలకు పెంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ ఏమైందో సమాధానం చెప్పాలని కోరారు. వికలాంగుల పెన్షన్లను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశలవారీగా పెంచిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాల పెంపు, మహిళా సంఘాలు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కాటారం మండల ప్రజలు ప్రతి ఎన్నికల్లో వేలల్లో మెజార్టీ ఇచ్చినా ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు మేలు చేసిందేమీ లేదని పుట్ట మధూకర్‌ అన్నారు. దుద్దిళ్ల కుటుంబం మంథని నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంథని పరువు తీస్తోందని విమర్శించారు. 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఒకే కుటుంబానికి ఐదుసార్లు ఓట్లు వేసి గెలిపిస్తే, మంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని దగా చేసి మంథనికి అపకీర్తి తీసుకొచ్చారని దుద్దిళ్ల శ్రీధర్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ దగాకోరు పాలనపై ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాన్ని నిలదీయాలని పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని శ్రీను బాబు పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వేడుకల్లో సందడి చేశారు.











Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,రామగిరి,సెప్టెంబర్ 3 : రామగిరి మండలం చందనపూర్ గ్రామ పంచాయతీలో గురువారం ఎస్ఐఆర్ వెరిఫికేషన్ గ్రామసభ నిర్వహించారు..రామగిరి మండల్ ఎమ్మార్వో సుమన్, పాల్గొని సుమారు 250 ఓటర్ ఐడి కార్డులను సరి చేశారు. ఇంకెవరైనా నోటీసు వచ్చిన వారు ఉంటే బిఎల్ఓ శ్రీలతకు ఇచ్చి సరి చేసుకోవాలని ఎమ్మార్వో తెలిపారు..ఈ కార్యక్రమంల డిటి మానస,జిపిఓ వెంకటేశ్వర్లు,సర్పంచ్ కొండ మంజుల,ఉపసర్పంచ్ రజిత-రమ్ చందర్,మాజీ మండల కోఆప్షన్ యండి.ఇబ్రహీం,వార్డ్ మెంబర్స్ సౌందర్య-కుమర్,బాగే రాజు,కుమారస్వామి,బి ఎల్ఓ షాహిద్,యెరవెల్లి సాయికిరణ్,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు...

Blog Archive


www.medigaddatvnews.com