MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వార్డు సభ్యుడు వేల్పుల రాజమల్లు, దేవక్కలను కాంగ్రెస్ నాయకులు గురువారం పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. వికలాంగుల పింఛన్‌తో పాటు బీమా సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, శంకరంపల్లి సర్పంచ్, మండల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్‌నాయక్, సీనియర్ నాయకులు నవీన్‌రావు, పాగే సురేష్, కోడిపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గద్దె సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అంగోత్ సుగుణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల, వైస్ చైర్మన్ చిన్నాల బ్రహ్మారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్, కాటారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టూరి మహేష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: బీసీల రాజ్యాధికారం, సామాజిక సమానత్వం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 14,500 కిలోమీటర్ల బీసీల రాజ్యాధికార పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని గోల్కొండ నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. పాదయాత్రను దశలవారీగా నిర్వహిస్తూ బీసీలకు రాజ్యాధికారం, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు గోల్కొండకు తరలివచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, వెంకటేష్, సంతోష్, శ్రీను, రాంబాబు, సతీష్, ముక్తేశ్వర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


భూపాలపల్లి, సెప్టెంబర్ 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన్‌లో మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐను విస్తరించాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐను మరింత బలోపేతం చేసి విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పురుషోత్తం అనూప్ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రదాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి హమర ప్రసాద్ ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ అనే పుస్తకాన్ని రచిస్తున్నట్లు/ప్రచురిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మహాముత్తారం మండల అధ్యక్షులు రామగిరి రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆలోచనలు, సామాజిక ఉద్యమం మరియు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను వక్రీకరించే విధంగా ఎలాంటి ప్రచారం జరిగినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని గౌరవ అధ్యక్షులు లింగమళ్ళ సడవలి రావ్ తెలిపారు. చారిత్రక వ్యక్తులపై అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, చారిత్రక ఆధారాలను వక్రీకరించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదా ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచురణలు చేయడం సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ప్రధాన కార్యదర్శి లింగమళ్ళ శంకర్ పేర్కొన్నారు. అందువల్ల ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ పుస్తకంలోని విషయాలను సంబంధిత అధికారులు, మేధావులు మరియు అంబేద్కర్‌వాద సంఘాల సమక్షంలో పరిశీలించాలని కోశాధికారి వేల్పుల రావణ్ కోరారు.  పుస్తకంలో అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లు తేలితే, చట్టపరమైన మార్గాల్లో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం. ఎలాంటి అభ్యంతరకర అంశాలు ఉన్నా వాటిపై చట్టబద్ధంగా పోరాటం చేస్తాం” అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కోసం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ప్రజా ప్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి పంగ సురేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి:సుల్తానాబాద్:సెప్టెంబర్:16 :ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి బీటెక్ విద్యార్థి తాండ్ర అక్షితరాణి ఆత్మహత్యకు కారకులైన పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్,సింగరేణి ఓవర్ మెన్ బొమ్మకంటి రవికుమార్ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి..ప్రభుత్వం ఆకుటుంబానికి అండగా నిలవాలి...గోదావరిఖని లెనిన్ నగర్ లో తాత్కాలికంగా నివాసముంటున్న తాండ్ర అక్షిత రాణి 21 సంll,శనివారం 12 సెప్టెంబరు సాయంత్రం గడ్డి మందు తాగి13సెప్టెంబర్ 2026 ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందిన సంఘటనపై పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రేగడి మద్దికుంట గ్రామములో అక్షిత తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సేకరించిన వివరాలు.. ఎస్సీ దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాండ్ర ఐజాక్ పాస్టర్ రజితల కూతురు తాండ్ర అక్షితరాణి గర్రెపల్లిలో గురుకుల పాఠశాలలో పదవ తరగతి పాసై 2022లో మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలిటెక్నిక్ లో మైనింగ్ డిప్లమా చేస్తున్న కాలంలో రెండవ సంవత్సరములో ఆకాలేజీ లెక్చరర్(పాలిటెక్నిక్)జెట్టి నవీన్,అక్షితరాణిపై తీవ్రమైన లైంగిక వేధింపులు చేస్తే కుటుంబ సభ్యులు కాలేజీకి పోయి వేధింపులకు వ్యతిరేకంగా నవీన్ ను నిలదీస్తే అతను వారిని తీవ్రంగా బెదిరింపులు.భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు.ఆసందర్భంగా బెదిరిపోయిన అక్షిత తల్లిదండ్రులు మేనమామలు చదువు క్యారియర్ కోసం జాగ్రత్తతో పాలిటెక్నికు మైనింగ్ డిప్లవం కోర్సు పాస్ అయింది.డిప్లమా విద్యార్థులకు ఈసెట్ ఎంట్రెన్స్ ద్వారా మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ లో అడ్మిషన్లు భాగంగా అక్షిత ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాదులో అడ్మిషన్ తీసుకుంది.బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో అప్రెంటిషిప్ కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు గనుల ప్రాంతంలో గోదావరిఖని రామగుండం డివిజన్ 1 లోని 2 ఇంక్లైన్ బొగ్గు బావిలో జనవరి ఫిబ్రవరి 2026 లో 12 రోజుల అప్రెంటిషిప్ చేసింది. ఆ బొగ్గుగని మైనింగ్ సూపర్వైజర్ బొమ్మ కంటి రవికుమార్ అక్షితను వేధింపులకు గురి చేసిండు రవికుమార్ కూడా నస్పూర్ పాలిటెక్నిక్ లో మైనింగ్ డిప్లమా చదివినాడు రవికుమార్,నవీన్ లెక్చరర్ స్టూడెంట్ వీరిద్దరి మధ్యల చాలా సాన్నిత్యము ఉంది.కొద్ది రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి క్లాసులకు అక్షిత పోతున్న సందర్భంగా కూడా రవి కుమార్ వేధింపులు కొనసాగించాడు.ఈ వేధింపుల వల్ల కొద్ది రోజులు అక్షిత యూనివర్సిటీ క్లాసులకు పోకుండా ఇంటి దగ్గరే ఉంది,తిరిగి ఓయూ ప్రొఫెసర్ ను కలిసి 4వ సెమిస్టర్ లో జాయిన్ అయింది.అప్పుడు తన తల్లి తండ్రి మేనమామ,అడ్వకేట్ జీవన్ కుమారులతో కలిసి,అప్రెంటిషిప్ కాలంలో జీడికే టూయింగ్ లైన్ లో ఓవర్ మెన్ రవికుమార్ తనపై చేసిన వేధింపులపై రామగుండం డివిజన్ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.పోలీస్ స్టేషన్ లేదా సింగరేణి హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయమన్నాడు జిఎం..గత కొద్ది కాలంగా వర్క్ నాలెడ్జి కోసం గోదావరిఖని గౌతమి నగర్ లోని ఒక ఆటోమొబైల్ షాప్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా అక్షితారాణి పని చేస్తున్నది,12 సెప్టెంబర శనివారం సాయంత్రం డ్యూటీ నుండి గోదావరిఖని బస్టాండ్ కు ఆటోలో వస్తున్నానని తన తండ్రికి ఫోన్ చేసి బస్టాండ్ వద్దకు సాయంత్రం 6:30 గంటలకు రమ్మన్నది.కొద్దిసేపటికి తనకు వాంతులు అవుతున్నాయని గోదావరిఖని బస్టాండ్ వద్ద ఉన్నానని అక్షిత తండ్రికి ఫోన్ లో చెప్పింది వర్షం ఉన్నందున ఆటో తీసుకొని తండ్రి ఆమెను ఇంటికి రమ్మన్నాడు.కొద్ది సేపు తర్వాత ఫోన్ చేస్తే అక్షిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు.45 నిమిషాల తర్వాత ఏడున్నర గంటలకు అక్షిత తండ్రికి నవీన్ ఆమె ఫోన్ నుండి కాల్ చేసి,అక్షిత గడ్డి మందు తాగిందని చెప్పి ఆమరుక్షణమే వాళ్ల ఇంటి దగ్గరలోని చర్చి వద్దకు భారీ వర్షం కురుస్తున్న సమయంలో కారులో నవీను అక్షితను నోటి నుండి నురుగలు కక్కుతున్న స్థితిలో తీసుకువచ్చి అక్షిత తల్లిదండ్రులతో పాటు అతని కారులో గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ అడ్మిట్ చేయించారు.తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితికి లోనై 13 సెప్టెంబర్ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు అక్షిత మరణించారు.మొత్తం ఈ వ్యవహారంలో పాలిటెక్నిక్ లెక్చరర్ నవీన్ వేధింపులు రవికుమార్ల ఆగడాలతోనే మనస్థాపానికి గురై అక్షితరాణి ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా పౌర హక్కుల సంఘం నాయకులు భావించి ఈ పత్రిక ప్రకటన ద్వారా వివరిస్తున్నాం.గోదావరిఖనిలోని లెనిన్ నగర్ లో ప్రస్తుత నివాసముంటున్న అక్షిత తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని తమ సొంత గ్రామమైన రేగడి మద్దిగుంటకు అదే రోజు రాత్రి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు...డిమాండ్స్ 1.అక్షితరాణి ఆత్మహత్యకు కారకులైన పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్,సింగరేణి ఓవర్ మెన్ బొమ్మ కంటి రవికుమార్ లపై ఎస్సీ ఎస్టీ ఆస్ట్రాసిటీ కేసు నమోదు చేయాలి.వెంటనే ఆఇద్దరిని పోలీసులు అరెస్టు చేయాలి.2 అక్షిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.3.సింగరేణి రామగుండం డివిజన్ వన్1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ నిర్లక్ష్యంగా అక్షిత ఫిర్యాదుపై వ్యవహరించినందున చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి,4 పాలిటెక్నిక్ విద్యా సంస్థలు,సింగరేణి ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణ కోసం మహిళా ఉద్యోగులు,మహిళా ఆఫీసర్లు,పోలీస్ షీటీంల ఆధ్వర్యంలో మహిళా వేధింపుల నిరోధక కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి..5.బుధవారం వరకు ఈ సంఘటన పట్ల పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ లు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు,ఇది అత్యంత బాధ్యతారహిత్యం. జయహో అని పేర్కొన్నారు..ఈ నిజ నిర్ధారణలో పాల్గొన్న వారు మాదన కుమారస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌరహక్కుల సంఘం తెలంగాణ.9849548275నార వినోద్,ఉపాధ్యక్షుడు,పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ,బండారి రాజలింగం,బండి శంకర్ గౌడ్,బండి సతీష్ గౌడ్,ప్రజా సంఘాల నాయకుడు,మృతురాలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, సెప్టెంబర్ 16 :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నాయకపోడ్ సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా గుంటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా తైనేని శంకర్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు మేసినేని రాజన్న నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మేసినేని రాజన్న మాట్లాడుతూ నాయకపోడు కులస్తుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక అభ్యున్నతి కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన అధ్యక్షుడు గుంటి రమేష్, ప్రధాన కార్యదర్శి తైనేని శంకర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకపోడు కులస్తుల సమస్యల పరిష్కారంతో పాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని నాయకపోడు కుటుంబాలన్నింటినీ సంఘం పరిధిలోకి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందిస్తామని పేర్కొన్నారు.

అధ్యక్షుడిగా సుంకరి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాదె రవీందర్, ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ పోచయ్య, బద్ది సంతోష్, కోశాధికారిగా గంట నవీన్, సంయుక్త కార్యదర్శిగా గాదె గట్టయ్య, సాంస్కృతిక కార్యదర్శిగా చింతల సాయికిరణ్ ఎన్నికయ్యారు. యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల రామచందర్, భోజన్న, గొట్టం భూమయ్య, మాంత నాగరాజు శంకర్, నాయకపోడు నాయకులు తోట రాకేష్, తైనేని అంజి, గుంటి నాగరాజు, కాల్వపల్లి రాజబాబు, కాల్వపల్లి లింగయ్య, కాల్వపల్లి రమేష్, బచ్చేల సతీష్, కాలనేని దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను నాయకపోడు కులస్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Blog Archive


www.medigaddatvnews.com