MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందించిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ,సమాచార హక్కు అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో సమాచార బోర్డులు లేకపోవడం ప్రభుత్వ అధికారులు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పౌరులు దరఖాస్తు చేస్తే సరైన సమాచారం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారని పౌరులు కోరిన సమాచారాన్ని పటిష్టంగా సకాలంలో అందించాలని ఆయనే కోరారు మండల కేంద్రంలో పరిధిలో రేషన్ షాపులో ప్రజలకు అందిస్తున్న ప్రజా పంపిణీలో బియ్యం తూకంలో తేడా వస్తున్నాయి దీనిపై చర్య తీసుకోవాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టిఐ మండల కన్వీనర్ ఏలేటి రామ్ రెడ్డి సత్యనారాయణ తిరుపతి పున్నం తిరుపతి చైతన్య గుప్తా తదితరులున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విధించిన నిబంధనలను వెంటనే సవరించి, ఒక్కో ఇంటికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి పార్వతి డిమాండ్ చేశారు. శుక్రవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలతో పూర్తి స్థాయి ఇల్లు నిర్మించడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు 400–600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితి విధించడం వల్ల భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ పరిమితిని కనీసం 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంత్రుల నివాసాల మరమ్మతులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఇల్లు నిర్మించేందుకు మాత్రం రూ.5 లక్షలు మాత్రమే కేటాయించడం సమంజసం కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు నిబంధనలను సవరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూడిది లావణ్య, నాయకులు మంథని మల్లేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

పెద్దపల్లి,గోదావరిఖనిలో,ఆగస్టు,7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో,రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో తెలంగాణ ఉద్యమకారుల సమితి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమితి గోదావరిఖని ఆఫీసులో రాష్ట్ర మహిళా కమిటీ జిల్లా మహిళా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలుగా అనుముల కళావతి రాష్ట్ర కార్యదర్శిగా తోడేటి స్వరూప రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కోడిపుంజుల జ్యోతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా గంగారపు శాంతలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది మేకల సరోజన జిల్లా ఉపాధ్యక్షురాలుగా పున్నం మంజుల జిల్లా కార్యదర్శిగా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ తమ హక్కులు,సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అన్నారు.ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయడం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.హామీల అమలులో ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తోడేటి శంకర్ గౌడ్ తెలిపాడు,ఉద్యమకారులంతా పార్టీలు,వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడడం,వారి సంక్షేమాన్ని నిర్ధారించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అనిఆయన పేర్కొన్నారు.సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం,సభ్యత్వ నమోదు,ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ,రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.కమిటీని మరింత పటిష్టం చేసి ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి నగునూరి రాజయ్య గౌడ్ చీఫ్ అడ్వైజర్,జనరల్ సెక్రటరీ చిలుక శంకర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు,ఎరుకల పోసక్క ఈదునూరి పద్మ,జున్ను రమాదేవి,గంగారపు శాంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని ఆగస్టు,7: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఎన్నికైన ఏసిఎంఓ గా నియమితులైన డాక్టర్ ప్రసన్నకుమార్ ను ఘనంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపి స్వీట్లు తినిపించి బహుమతి ప్రధానం చేశారు.ఆల్ ఇండియా అంబేద్కర్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్,ఈ కార్యక్రమంలో కొంకటి కుటుంబ సభ్యులు,కొంకటి వెంకటేష్,కొంకటి పులేబాబు,కొంకటి సిద్ధార్థ.కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఆగస్టు 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామానికి చెందిన మారపాక ఏలారి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చికిత్సకు అనుకూలంగా లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ చిదినేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జూకంటి రమేష్ ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని సానుకూలంగా పరిశీలించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా రూ.2 లక్షల 20 వేల విలువైన ఎల్‌వోసీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ ఆర్థిక సహాయంతో చికిత్స కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఎల్‌వోసీ పత్రాలను అందుకున్న మారపాక ఏలారి, వారి కుటుంబ సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను వెంటనే గుర్తించి, వైద్య సహాయం అందించడంలో ప్రత్యేక చొరవ చూపిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జూకంటి రమేష్‌కు కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నారని వారు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామ పంచాయతీలో బుధవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దుర్గం శ్రీకృష్ణ, అంబాల పోసు, మంతెన రాజశ్రీ, రంగు ఊర్మిళ, ఆకుల సత్యక్క, నగునూరి రాజేశ్వరి, బౌతు పార్వతి, దాగం స్రవంతి, మొల్లు మాధవి తదితర లబ్ధిదారులు మంజూరు పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ మాట్లాడుతూ, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతలో అవకాశం రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తుందని సర్పంచ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఉప సర్పంచ్ రాజయ్య, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లింగయ్య, బి. రమేష్, గణేష్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day




కాటారం, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కాటారం మండలంలోని చీడెనేపల్లి, రెగులగూడెం రెవెన్యూ గ్రామాల్లో బుధవారం అవగాహన గ్రామసభలు నిర్వహించారు. చీడెనేపల్లి గ్రామపంచాయతీలో చీడెనేపల్లి రెవెన్యూ గ్రామానికి, రెగులగూడెం గ్రామపంచాయతీలో రెగులగూడెం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన గ్రామసభల్లో భూ రీ-సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ, భూ రికార్డుల ఖచ్చితత్వం, రైతులు సమర్పించాల్సిన పత్రాలు, భూ వివాదాల పరిష్కారంలో రీ-సర్వే ప్రాధాన్యతపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాటారం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భూములకు శాశ్వత హద్దులు ఖరారు చేయడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిచేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి రైతు సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ డిప్యూటీ ఐఓఎస్, సంబంధిత సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ పంచాయతీ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, చీడెనేపల్లి, రెగులగూడెం గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామసభలో రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి, రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.



Blog Archive


www.medigaddatvnews.com