MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, మే 27: తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్ గనిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందిన కార్మికుడు కొండ్ర వెంకటేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వెంకటేష్ మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలోని తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్‌లో గ్రేడర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురై మృతి చెందడం బాధాకరమని అన్నారు. కార్మికుడి మృతి విషయంలో ఏఎంఆర్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, ఇప్పటి వరకు కంపెనీ ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికుల భద్రత, సంక్షేమంపై కంపెనీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఆల్ ఇండియా సెంటర్ ఆఫ్ కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ (AICCTU) జిల్లా అధ్యక్షుడు బందు క్రాంతి మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్, నాయకురాలు బుర్ర స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

చిట్యాల, మే 27: చిట్యాల మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ ఎదురుగా గోదామును ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సంబంధిత భూమి, గోదామును సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే నంబర్ 160లో ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి తమదిగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించి భూమి హద్దులను నిర్ధారించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులకు అవసరమైన గోదాముల కొరత తీవ్రంగా ఉందని, రానున్న వర్షాకాల సీజన్‌లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడా వసతులు లేవని పేర్కొన్నారు. పాత గోదాములను పునర్నిర్మించడంతో పాటు కొత్త గోదాముల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని మారపెల్లి మల్లేష్ హెచ్చరించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, మే 26: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కాటారం డివిజన్ నాయకుడు జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. కాటారం డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలను గౌరవించని వ్యక్తికి దేవస్థానం చైర్మన్ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని అన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారనే వార్తలు వెలుగులోకి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆలయాలకు సేవ చేసేందుకు వచ్చే వారిలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలకు చెందిన మహిళలేనని, అలాంటి వారిని చిన్నచూపు చూడటం లేదా అవమానకరంగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అదే పరిస్థితిలో తన కుటుంబ సభ్యులు లేదా మంత్రి కుటుంబానికి చెందిన మహిళలు ఉంటే కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించేవారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్వయంగా స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎండోమెంట్స్ శాఖ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్థానం చైర్మన్‌పై విచారణ జరిపి, అవసరమైతే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా పేరొందిన కాలేశ్వరం క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించరాదని, భక్తుల మనోభావాలను గౌరవించేలా ఆలయ పరిపాలన కొనసాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, మే 26: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ(ఎంఎల్) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదాల కారణంగా అరటి తోటలు, మిరప, మొక్కజొన్న తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల పంట నష్టాల వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేపాకపల్లె దంపతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదాల నివారణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బంధు క్రాంతి, సుజాత, ఆత్కూరి శ్రీకాంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్, మే 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ శివారులో ఉన్న ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రమాదంలో గెస్ట్ హౌస్‌తో పాటు అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, ఇతర విలువైన సామగ్రి, సిబ్బందికి చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గెస్ట్ హౌస్ ఇన్‌చార్జ్ తపాస్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అగ్నిప్రమాదంలో జరిగిన మొత్తం నష్టం సుమారు రూ.1,48,11,795 (ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు)గా అంచనా వేశారు. సమాచారం అందుకున్న మహాదేవపూర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహాదేవపూర్ ఎస్‌ఐ కె. పవన్ కుమార్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

"కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం" అంటూ భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. పుష్కరాల 5వ రోజు సందర్భంగా త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమాతకు నీరాజనాలు అర్పిస్తున్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచి భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


సోమవారం ప్రత్యేకత.. దానధర్మాలకు ప్రాధాన్యం

పుష్కరాల తొలి 12 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. 5వ రోజు సోమవారం కావడంతో శివారాధనతో పాటు దానధర్మాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి పరిరక్షణ, నదీ సంస్కృతి పరిరక్షణకు సంకేతంగా పుష్కరాల సందర్భంగా నదీతీరాల్లో స్వచ్ఛత పాటించాలని, ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి, ఈడిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ ఈడిగ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా గౌడ, ఈడిగ ఉద్యోగులు మరియు సంప్రదాయ వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. గౌడ, ఈడిగ వర్గాల ఆర్థిక, సామాజిక పురోగతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్, జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ పాల్గొన్నారు.

Blog Archive


medigadda tv news

www.medigaddatvnews.com