భూపాలపల్లి: ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి, పోడు భూములు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు, వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఆదివాసీ యువతకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆదివాసుల హక్కులను కేవలం ఆదివాసుల దినోత్సవం రోజున మాత్రమే గుర్తు చేసుకోకుండా, రాజ్యాంగబద్ధంగా వారి హక్కులను పరిరక్షించి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ సంఘం విభాగం అధ్యక్షుడు సంతోష్ ఆదివాసీ, జిల్లా ఉపాధ్యక్షుడు వెనుకాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు సామల చంద్రశేఖర్, భూక్య సమ్మయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070
Total Pageviews
Trending Now
TRENDING NOW
కటారం, ఆగస్టు 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కటారం మండలం వీరాపూర్ గ్రామంలో గుడుంబా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో గుడుంబా విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తి వద్ద నుంచి సుమారు 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు గ్రామ పంచాయతీ వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న గుడుంబాను అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో నాశనం చేశారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు, తయారీకి అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.
యువత భవిష్యత్తుపై ప్రభావం
గుడుంబా వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తడంతో పాటు యువత భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో గుడుంబా విక్రయాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, గుడుంబా నియంత్రణకు అవసరమైన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. గ్రామాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసం గ్రామ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా గుడుంబా విక్రయాలు లేదా తయారీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
ప్రజల సహకారం అవసరం
గుడుంబా నిర్మూలన ఒక్కరి బాధ్యత కాదని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పూర్తిస్థాయిలో నియంత్రించగలమని గ్రామ పంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామంలో మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు భవిష్యత్తులోనూ అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ గుడుంబా నియంత్రణ కార్యక్రమంలో గుంటి కుమార్, గుమ్మల్లపల్లి ఉప సర్పంచ్ తాళ్ల శేఖర్ రెడ్డి, జాధరావుపేట ఉప సర్పంచ్ కోట అశోక్, 5వ వార్డు సభ్యుడు గడ్డల రాజమల్లు, బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గద్దల సంతోష్, నరేష్, మంద మల్లేష్, లక్ష్మిమలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టి వీరాపూర్ను గుడుంబా రహిత గ్రామంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రతినిధులు కోరారు.
హనుమకొండ: యువత రాజకీయాల్లో ముందుండి నడవాలని, రాష్ట్ర రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన “జెన్జీ యువత చర్చ విత్ తీన్మార్ మల్లన్న” కార్యక్రమంలో సుమారు 2,000 మంది విద్యార్థులతో ఆయన భవిష్యత్ రాజకీయాలు, యువత పాత్రపై చర్చించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా హనుమకొండకు తరలివచ్చారు. పబ్లిక్ గార్డెన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.. అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ మల్లన్న ఆశయాలు, ఆకాంక్షలకు ఆకర్షితులైన పలువురు విద్యార్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం రవి పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ భవన్లో జరిగిన యువత చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావడంలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. యువతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తగిన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్పై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గండు కరుణాకర్, బొగ్గు గని కార్మిక విభాగం అధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా పార్టీ మీడియా ఇన్చార్జి మడే సంతోష్, బసవరాజుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ యాదవ్, వనం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
తాడిచర్ల, ఆగస్టు 8: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉన్న నిబంధనలను తక్షణమే పునఃసమీక్షించాలని తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు డిమాండ్ చేశారు. ప్రస్తుత నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి కనీసం రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. శనివారం మలహరరావు మండలం కొయ్యూరులో నిర్వహించిన అత్యవసర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించాలని అన్నారు.
పేదలకు రూ.5 లక్షలేనా?
పాలకుల విలాసాలు, బంగ్లాల మరమ్మతులకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. నిరుపేద కుటుంబం జీవితాంతం నివసించే ఇంటి నిర్మాణానికి కేవలం రూ.5 లక్షలు కేటాయించడం సరికాదని బాపు విమర్శించారు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
విస్తీర్ణ పరిమితిని తొలగించాలి
ఇందిరమ్మ ఇళ్లకు 400 నుంచి 600 చదరపు అడుగుల వరకు మాత్రమే నిర్మాణ పరిమితి విధించడం పేద కుటుంబాలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. కుటుంబ అవసరాలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణానికి అవకాశం కల్పించాలని కోరారు.
అప్పుల ఊబిలో లబ్ధిదారులు
ఇంటి నిర్మాణానికి అరకొరగా నిధులు రావడం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారని బాపు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని కోరారు.
పోరాటాలకు సిద్ధం
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలను పునఃసమీక్షించి పేదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కార్మిక, ప్రజా సంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమాలు చేపడతామని బాపు హెచ్చరించారు. పేదల సొంతింటి కలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు కాలినేని రాజమణి తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందించిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ,సమాచార హక్కు అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో సమాచార బోర్డులు లేకపోవడం ప్రభుత్వ అధికారులు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పౌరులు దరఖాస్తు చేస్తే సరైన సమాచారం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారని పౌరులు కోరిన సమాచారాన్ని పటిష్టంగా సకాలంలో అందించాలని ఆయనే కోరారు మండల కేంద్రంలో పరిధిలో రేషన్ షాపులో ప్రజలకు అందిస్తున్న ప్రజా పంపిణీలో బియ్యం తూకంలో తేడా వస్తున్నాయి దీనిపై చర్య తీసుకోవాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టిఐ మండల కన్వీనర్ ఏలేటి రామ్ రెడ్డి సత్యనారాయణ తిరుపతి పున్నం తిరుపతి చైతన్య గుప్తా తదితరులున్నారు.
కాటారం, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విధించిన నిబంధనలను వెంటనే సవరించి, ఒక్కో ఇంటికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి పార్వతి డిమాండ్ చేశారు. శుక్రవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలతో పూర్తి స్థాయి ఇల్లు నిర్మించడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు 400–600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితి విధించడం వల్ల భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ పరిమితిని కనీసం 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంత్రుల నివాసాల మరమ్మతులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఇల్లు నిర్మించేందుకు మాత్రం రూ.5 లక్షలు మాత్రమే కేటాయించడం సమంజసం కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు నిబంధనలను సవరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూడిది లావణ్య, నాయకులు మంథని మల్లేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి,గోదావరిఖనిలో,ఆగస్టు,7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో,రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో తెలంగాణ ఉద్యమకారుల సమితి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమితి గోదావరిఖని ఆఫీసులో రాష్ట్ర మహిళా కమిటీ జిల్లా మహిళా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలుగా అనుముల కళావతి రాష్ట్ర కార్యదర్శిగా తోడేటి స్వరూప రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కోడిపుంజుల జ్యోతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా గంగారపు శాంతలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది మేకల సరోజన జిల్లా ఉపాధ్యక్షురాలుగా పున్నం మంజుల జిల్లా కార్యదర్శిగా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ తమ హక్కులు,సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అన్నారు.ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయడం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.హామీల అమలులో ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తోడేటి శంకర్ గౌడ్ తెలిపాడు,ఉద్యమకారులంతా పార్టీలు,వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడడం,వారి సంక్షేమాన్ని నిర్ధారించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అనిఆయన పేర్కొన్నారు.సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం,సభ్యత్వ నమోదు,ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ,రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.కమిటీని మరింత పటిష్టం చేసి ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి నగునూరి రాజయ్య గౌడ్ చీఫ్ అడ్వైజర్,జనరల్ సెక్రటరీ చిలుక శంకర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు,ఎరుకల పోసక్క ఈదునూరి పద్మ,జున్ను రమాదేవి,గంగారపు శాంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Blog Archive
- August (17)
- July (67)
- June (57)
- May (24)
- April (34)
- March (15)
- February (13)
- January (23)
- December (2)
- November (8)
- October (9)
- September (58)
- August (24)
- July (33)
- June (16)
- May (17)
- April (35)
- March (51)
- February (19)
- January (18)
- December (17)
- November (39)
- October (49)
- September (61)
- August (17)
- July (13)
- June (35)
- May (30)
- April (17)
- March (19)
- February (37)
- January (6)
- December (62)
- November (134)
- October (100)
- September (44)
- August (26)
- July (91)
- June (120)
- May (147)
- April (184)
- March (175)
- February (227)
- January (179)
- December (171)
- November (148)
- October (169)
- September (179)
- August (78)
www.medigaddatvnews.com








