కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్, కొత్తపల్లి, మద్దులపెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.
విలాసాగర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా పూసల శశికాంత్, ఉపాధ్యక్షులుగా మురుకుంట్ల స్వామి, వీరబోయిన రాజసాగర్, ప్రధాన కార్యదర్శిగా తిపిరి రమేష్, కార్యదర్శులుగా అట్టేం సత్తయ్య, మంచినీళ్ల సంపత్, బోగే లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆరేళ్ల సమ్మయ్యను నియమించారు.
విలాసాగర్ యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా రాజునాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా గుంజి ఆంజనేయులు, మంచినీళ్ల స్వామి, ప్రధాన కార్యదర్శిగా శెనిగల లక్ష్మణ్, కార్యదర్శిగా తిపిరి మహేష్, కోశాధికారిగా రాజీనాల అంజిని నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ తెలిపారు.
మద్దులపెల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ: గౌరవ అధ్యక్షుడిగా డోలి రామకృష్ణ, అధ్యక్షుడిగా మల్లారం మహేష్, ఉపాధ్యక్షులుగా టంగుటూరి శ్రావణ్, డోలి సతీష్, ప్రధాన కార్యదర్శులుగా గజ్జెల స్వామి, గోగు రాజబాపు, కార్యదర్శులుగా పాడి అశోక్, కొత్తపల్లి బాను ప్రకాష్, జనగాం కిష్టయ్య, కోశాధికారిగా పిట్టల రాజబాపును నియమించారు.
కొత్తపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా అజ్మీరా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా తుమ్మ అజయ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం అభిషేక్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి గడపగడపకు చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వంశి వర్ధన్ రావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.























