MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, పేదల ఆశాజ్యోతి, రైతుల ఆపద్బాంధవుడని కొనియాడారు. పేదలు, రైతుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్‌ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మహానేతకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మహిళా, యువజన నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను రవి పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వైద్యులు సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రోగుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించబోదని హెచ్చరించారు. గతంలోనూ ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడామని గుర్తుచేశారు. ఇకముందు కూడా ప్రజలు, రోగుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా నాయకులు మడే సంతోష్, లక్పతి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కాటారం మండల కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ సమాన పనికి సమాన వేతనం పొందుతున్నప్పటికీ, పెన్షన్‌ విషయంలో మాత్రం ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. 2003 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని నిలిపివేసి, నూతన పెన్షన్‌ విధానమైన సీపీఎస్‌ను అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఉద్యోగుల భవిష్యత్‌ భద్రతతో పాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు భవిష్యత్‌ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఓపీఎస్‌ పునరుద్ధరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు రాజు నాయక్‌, టీపీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు బొల్లం సతీష్‌, టీయూటీ మండల అధ్యక్షులు గురిసింగ విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు పద్మజ, సుజాత, సంధ్యారాణి, వెంకటస్వామి, రవిప్రసాద్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండల పరిధిలో 2026 వానాకాలం (ఖరీఫ్) డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. సర్వే బృందం రైతుల పొలాల వద్దకు వచ్చిన సమయంలో సంబంధిత రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

పంట వివరాలు ఖచ్చితంగా నమోదు చేయించాలి.

రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట రకం, విత్తిన తేదీ, సాగు విస్తీర్ణం తదితర వివరాలను సర్వే సిబ్బందికి ఖచ్చితంగా తెలియజేయాలని అధికారులు సూచించారు. పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు.

పలు ప్రయోజనాలకు సర్వే వివరాలే ఆధారం.

డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదు చేసిన పంట వివరాలు భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అలాగే బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడంలో కూడా ఈ వివరాలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించేందుకు డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదైన పంట వివరాలు ప్రామాణికంగా ఉపయోగపడతాయని తెలిపారు.

తప్పులకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలి.

రైతులు సర్వే బృందం తమ పొలానికి వచ్చినప్పుడు సహకరించి, పంటకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వివరాల నమోదులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సర్వే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో మండలంలోని రైతులందరూ భాగస్వాములు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం అశోక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ శాఖ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌ను గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దులపల్లి సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, బుర్రి శివరాజ్, సాంబయ్య, శంకర్, బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు అస్రార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, చంద్రుపల్లి సర్పంచ్ గురుసింగ బాపు, కుదురుపల్లి సర్పంచ్ సమ్మిరెడ్డి, కోట సమ్మన్న, సురేందర్, బాపురెడ్డి, కొట్టే రవీందర్, దుర్గయ్య, బానయ్య, సడవలి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీషపై హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద దారుణంగా కొట్టి అత్యాచారం చేసి హత్య చేయడాన్ని కుల సంఘాల జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సత్వర న్యాయం చేయాలి

ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నర్సింగ్ సిబ్బందిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శిరీష రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం అత్యంత ఘోరమైన చర్య అని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు మాట్లాడుతూ.. బాధితురాలి బట్టలు చిరిగిపోయి, ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు ఆమె మిత్రులు చెబుతున్నారని తెలిపారు. దీనికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మహిళల భద్రతపై ఆందోళన

ప్రజాసేవ చేసే నర్సులు, ఉద్యోగినుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లోనే కాకుండా వారి నివాసాల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పోరాటం కొనసాగిస్తాం

‘జస్టిస్ ఫర్ శిరీష’ పేరుతో బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని పీక కిరణ్ స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్, కొత్తపల్లి, మద్దులపెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

విలాసాగర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా పూసల శశికాంత్, ఉపాధ్యక్షులుగా మురుకుంట్ల స్వామి, వీరబోయిన రాజసాగర్, ప్రధాన కార్యదర్శిగా తిపిరి రమేష్, కార్యదర్శులుగా అట్టేం సత్తయ్య, మంచినీళ్ల సంపత్, బోగే లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆరేళ్ల సమ్మయ్యను నియమించారు.

విలాసాగర్ యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా రాజునాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా గుంజి ఆంజనేయులు, మంచినీళ్ల స్వామి, ప్రధాన కార్యదర్శిగా శెనిగల లక్ష్మణ్, కార్యదర్శిగా తిపిరి మహేష్, కోశాధికారిగా రాజీనాల అంజిని నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ తెలిపారు.

మద్దులపెల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ: గౌరవ అధ్యక్షుడిగా డోలి రామకృష్ణ, అధ్యక్షుడిగా మల్లారం మహేష్, ఉపాధ్యక్షులుగా టంగుటూరి శ్రావణ్, డోలి సతీష్, ప్రధాన కార్యదర్శులుగా గజ్జెల స్వామి, గోగు రాజబాపు, కార్యదర్శులుగా పాడి అశోక్, కొత్తపల్లి బాను ప్రకాష్, జనగాం కిష్టయ్య, కోశాధికారిగా పిట్టల రాజబాపును నియమించారు.

కొత్తపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా అజ్మీరా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా తుమ్మ అజయ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం అభిషేక్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి గడపగడపకు చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వంశి వర్ధన్ రావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















Blog Archive


www.medigaddatvnews.com