MEDIGADDA TV NEWS CEO

MEDIGADDA TV NEWS CEO
CEO ANAPARTHI SRINIVAS GOUD Mobile Number 9848223934 9618970144

MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాటారం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. ఆమెతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డి పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో జరుగుతున్న శుభ్రత పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రజా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో రోజువారీ నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు క్రమబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని క్రిమేటోరియంను సందర్శించి నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పంత కానీ సడువలి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జిల్లాలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ (MRI) యంత్రానికి అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

టి20 వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సమానంగా పోరాడినా కీలక సమయంలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో విజయం భారత్‌ను వరించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ భారీ స్కోరు సాధించారు. ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. మధ్య ఓవర్లలో కూడా అదే జోరు కొనసాగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ భారీ స్కోరు నమోదు చేసి ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వేగంగా పరుగులు సాధించి జట్టుకు మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెథెల్ అద్భుతంగా ఆడి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు సాధిస్తూ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని మార్మోగించాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లినట్లే కనిపించింది. అయితే మ్యాచ్ చివరి దశలో భారత బౌలర్లు పుంజుకున్నారు. కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బందులు పడ్డారు. చివరి ఓవర్లలో వికెట్లు వరుసగా పడటంతో ఇంగ్లండ్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది. చివరికి నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ జట్టు లక్ష్యానికి 7 పరుగులు దూరంలో నిలిచిపోయింది. దీంతో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్ల పట్టుదలతో పాటు ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో భారత్ టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తుదిపోరు జరగనుంది. ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారత్ ట్రోఫీని గెలుచుకుంటుందా లేదా అన్న ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతి నిర్వహణపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ మండల శాఖ ఖండించింది. బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్, మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. గత నెల ఫిబ్రవరి 19న కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని, అయితే అనంతరం పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం బాధాకరమని తెలిపారు. కాటారం‌లో హిందువులు శివాజీ జయంతి జరుపుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఇదే మండల కేంద్రంలో జయంతి, వర్ధంతి పేరుతో ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కేసులు ఎందుకు పెట్టరని ఆయన నిలదీశారు. హిందువులు ఐక్యంగా ఉంటే హిందూ వ్యతిరేకుల ఆగడాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ తరఫున త్వరలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.మార్చి.1,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)44 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన మావో మల్లోజుల పెద్దపెళ్లికి కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపు..మావోయిస్టు పార్టీ మాజీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారతో కలిసి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం వచ్చారు.సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి అలింగణం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1980 వ దశలో అన్న కిషన్ జితో కలిసి ఉద్యమ బాటపట్టి 44 ఏళ్ల పాటు సాయిధ పోరాట జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే..అయితే అప్పటినుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది.మల్లోజుల సోదరుడు అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యారు.ఆయనను కలవడానికి వచ్చిన మల్లోజులను.పెద్ద సంఖ్యలో బంధువులు.స్నేహితులు తరలివచ్చారు కొంతసేపు కుటుంబ సభ్యులు.స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరితో కలిసి ఫోటోలు దిగారు.మల్లోజుల పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేకంగా నిఘ ఉంచింది.అయితే మల్లోజుల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.మల్లోజుల రాక పెద్దపల్లిలో చర్చనీయంగా మారింది...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం పట్టణంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ, నేరాల నియంత్రణలో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా మారి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఎస్ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలోని బయ్యారం గ్రామపంచాయతీ ప్రాంతంలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాలువ నిర్మాణానికి సంబంధించి అధికారులు చేపట్టిన సర్వే కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నిర్వహించేందుకు గ్రామానికి వచ్చిన అధికారులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూములే కుటుంబాల జీవనాధారమని పేర్కొన్నారు. ఆ భూముల మీదుగా కాలువ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ జీవనోపాధి సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న సారవంతమైన భూములను కోల్పోతే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కాలువ నిర్మాణానికి ముందు రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా సర్వేలు నిర్వహించడం సరికాదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. భూముల స్వాధీనం, పరిహారం చెల్లింపు, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలకు తగిన పరిష్కారం చూపే వరకు సర్వే పనులు కొనసాగించనివ్వమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సమస్యపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Blog Archive