MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా, జూన్ 22: బిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్దన్నపేట, పరకాల నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, 


ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పునర్వైభవం, ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్యకర్తల సమన్వయం, రానున్న ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి బిఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
హనుమకొండ, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే యూనిఫార్మ్స్ అందించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టింది. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, సరైన తరగతి గదులు, ఫ్యాన్లు, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా సామగ్రి వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హనుమకొండ నగరంలో అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచే లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, జిల్లా కమిటీ సభ్యులు బొచ్చు ఈశ్వర్, ఎండి ఇస్మాయిల్, చెన్నూరి సాయికుమార్, పవన్ కుమార్, సాల్మన్ రాజ్, అభిషేక్, రణదీప్, ప్రభాస్, మల్లేష్, నాగరాజ్, సురాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పలిమెల, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలో గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదన్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని వీధులు, గుంతల్లో మురుగునీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో దోమల బెడద పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంత ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. సరిహద్దు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిరంతర నిఘా ఉంచి ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వర్షాలు కురిసే ముందే దోమతెరల పంపిణీ చేపట్టకపోతే గ్రామాలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
భూపాలపల్లి, జూన్ 21: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సామాజిక, రాజకీయ అభ్యున్నతే రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందాలని, బహుజన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రజలు పెద్ద ఎత్తున జూలై 5న జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, ప్రస్తుతం కొందరి చేతుల్లో నలిగిపోతోందని విమర్శించారు. రెడ్డి, వెలమ ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని రవి పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, కృష్ణ ప్రశాంత్, శ్రీపతి, భద్రయ్య, రంజిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 20: తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం-1923లోని సెక్షన్ 5, 6 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శనివారం గ్రామ రీ-సర్వేకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో రీ-సర్వే ప్రక్రియ, భూ సరిహద్దుల నిర్ధారణ, సర్వే సమయంలో రైతులు, భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు. 


రీ-సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజల సహకారం అవసరమని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), తహసీల్దార్, సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), పంచాయతీ కార్యదర్శి  (పీఎస్), గ్రామ పెద్దలు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
మహాదేవపూర్, జూన్ 19: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దేవాలయ అభివృద్ధి పనులపై అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేవస్థాన అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. భక్తుల సహకారం, ప్రభుత్వ నిబద్ధతతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని తెలిపారు. 

లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మెడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యలు, కుట్రలు, భూదందాలు, రౌడీయిజం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మహాదేవపూర్ ప్రాంత ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అఫ్జల్ ప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, గ్రామ సర్పంచ్ హసీనా బానో, ఎక్స్‌పీఎస్సీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, రామన్ రావు, తిరుపతిరెడ్డి, శంకరయ్య, శివరాజు, సంతోష్, మోత సాంబయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కోట సమ్మయ్య, వార్డ్ సభ్యులు గడ్డం స్వామి, నయూముద్దీన్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
కాటారం, జూన్ 18 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల ఉపాధ్యక్షుడు చీర్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమై ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, నాయకులు బండము మల్లారెడ్డి, గోగుల రాజేష్, కొండ రామ్, వార్డు సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, జిలేష్, గండు మల్లారెడ్డి, గండు తిరుపతి, చీర్ల చంద్రశేఖర్, వడ్ల రవీంద్రాచారి, సురేష్, రత్నాకర్, నరేష్, జగదీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Blog Archive


www.medigaddatvnews.com