MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews


Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, సెప్టెంబర్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భాష, యాస, మాండలికాల గొప్పతనాన్ని చాటేలా విద్యార్థినులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, కవితలు, గేయాలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన ‘తెలంగాణ మాండలికపు భాషావాది’ పాటను ఇంటర్మీడియట్ విద్యార్థిని బి.వర్షిణి ఆలపించారు. ఆమె రచించిన పద్యాలను ఆరో తరగతి విద్యార్థినులు ఆలపించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కవిత ఆటవెలది పద్యాన్ని రచించి ఆలపించారు. తెలంగాణ మాండలిక పదాలను ఉపయోగిస్తూ ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు ఉపాధ్యాయురాలు కవిత సంభాషణ రూపంలో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు ఉపాధ్యాయురాలు సరిత తెలుగు భాషపై గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చల్ల సునీత మాట్లాడుతూ.. మాతృభాష, తెలంగాణ యాస, మాండలికాల పరిరక్షణకు కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సామాన్యుడే తన దేవుడని ప్రకటించిన కాళోజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు కవిత, సరిత, శిరీష, నళిని, సుజాత, అరుణ, మణిమాల, రాజమణి, స్వప్న, శ్రీలత, మౌనిక, రాజేశ్వరి, శ్రావ్యలక్ష్మి, రిబ్కా తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం, సెప్టెంబర్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ భాష, యాస, మాండలికం, సంస్కృతి పరిరక్షణకు కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి సమస్యలు, ఆకాంక్షలను తన రచనలు, ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప ప్రజాకవిగా కాళోజీ నిలిచిపోయారని పేర్కొన్నారు.

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచిన కాళోజీ స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆయన భాషా సేవలకు దక్కిన గౌరవానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని కాళోజీకి నివాళులర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, సెప్టెంబర్ 9: ప్రజాకవి, తెలంగాణ భాషా యాస, మాండలిక పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాళోజీ నారాయణరావు జన్మదినమైన సెప్టెంబర్ 9ను తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

కార్యక్రమంలో తొలుత కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భాష, యాస, మాండలికం కోసం కాళోజీ చేసిన కృషిని విద్యార్థులు తమ ప్రసంగాల ద్వారా వివరించారు. కాళోజీ రచనలు, కవితలు, ఆయన జీవితంలో తెలంగాణ భాష కోసం చేసిన పోరాటాన్ని విద్యార్థులు ప్రస్తావించారు. తెలంగాణ భాషకు, ప్రజల సమస్యలకు తన రచనల ద్వారా కాళోజీ అందించిన సేవలను కొనియాడారు.

అనంతరం విద్యార్థులకు కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర, సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాషకు ఆయన చేసిన సేవలపై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమలింగం మాట్లాడుతూ తెలంగాణ భాష, యాస, మాండలికం మన అస్తిత్వానికి ప్రతీకలని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాళోజీ నారాయణరావు ఆశయాలను కొనసాగించాలంటే ముందుగా మన భాషను, మన యాసను గౌరవించి పరిరక్షించుకోవాలని సూచించారు.

కాళోజీ తన రచనలు, కవితల ద్వారా ప్రజల గొంతుకగా నిలిచారని, సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు కాళోజీ సాహిత్యాన్ని, ఆయన భావజాలాన్ని తెలుసుకుని సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు నాయక్, పద్మజ, సతీష్, రజిత, కవిత, విజయలక్ష్మి, సంధ్యారాణి, శ్రీధర్, రవికుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, సెప్టెంబర్ 9: తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు తెలంగాణ సమాజం కోసం చేసిన సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు. తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో కాళోజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ సామాన్యుల గొంతుకగా నిలిచిన ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలు, ప్రజా చైతన్య స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. కాళోజీ రచనలు, సాహిత్య సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు ఎం. శ్రీధర్ బాబు, సీనియర్ సహాయకులు, టైపిస్ట్, వీఆర్‌బీఆర్‌ఏఎం సిబ్బందితో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొని కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, సెప్టెంబర్ 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాధరావ్‌పేట గ్రామ పంచాయతీలో కాటారం ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్యులు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలు, వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ప్రభుత్వ వైద్యులు, ANM శ్యామల, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తరచుగా నిర్వహించడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సెకండ్ ఏఎన్‌ఎంలు రవి పటేల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5,000 మందికి పైగా సెకండ్ ఏఎన్‌ఎంలు సుమారు 18 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో సేవలందిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయడంతో పాటు పెండింగ్ ఏఎన్‌ఎం పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. 2012–13 నుంచి హామీ ఇస్తున్న పోస్టులతో పాటు అదనంగా 1,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే సుమారు 5,000 మంది సెకండ్ ఏఎన్‌ఎంలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పులి శ్రీలత, చింత విజయ, ఉష్కమల్ల అనసూయ, అలుపుల కృష్ణవేణి, చడం భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మేడిపల్లి: మేడిపల్లి ఆశ్రమ పాఠశాల కాంపౌండ్‌వాల్‌, మరుగుదొడ్ల నిర్మాణ పనులపై గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో నాన్‌లోకల్‌ వారికి పనులు అప్పగించాలన్న గత తీర్మానాన్ని రద్దు చేశారు. గ్రామపంచాయతీకి చెందిన గాదె రామకృష్ణకు పనులు అప్పగించేందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఏడుగురు వార్డు సభ్యుల ఆమోదంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. రేపటి నుంచే కాంపౌండ్‌వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్‌ కోరారు. తనపై నమ్మకంతో పనులు అప్పగించిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Blog Archive


www.medigaddatvnews.com