Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, ఆగస్టు 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంశెట్టి రాజు పటేల్ అనే యువకుడు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం ప్రకారం, రాంశెట్టి రాజు పటేల్ స్నానానికి వెళ్లే సమయంలో బాత్రూం సమీపంలో ఉన్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు చేతికి తగలడంతో తీవ్ర కరెంట్ షాక్కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో దామెరకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, ఆగస్టు 1: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు దోమల వ్యాప్తి, అంటువ్యాధులను అరికట్టేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో అధికంగా పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలను నిర్మూలించేందుకు గడ్డి మందు పిచికారీ నిర్వహించారు.గ్రామంలో ఎక్కడా పిచ్చిమొక్కలు పెరగకుండా, దోమలు వృద్ధి చెందే పరిస్థితులు లేకుండా ఉండేలా పంచాయతీ సిబ్బంది విస్తృతంగా మందు పిచికారీ చేశారు. అలాగే గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్య కార్మికులతో పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. నిల్వ నీరు ఉండే ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి సువర్ణ-రమేష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే గ్రామపంచాయతీ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో దోమల వ్యాప్తిని అరికట్టి డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపసర్పంచ్ కోట అశోక్ మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం పారిశుధ్య నిర్వహణలో భాగస్వామ్యం కావాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, 5వ వార్డు సభ్యుడు దుర్గం అజయ్, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా గ్రామంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.