పెద్దపల్లి:గోదావరిఖని:సెప్టెంబర్:15:సింగరేణిలో మహిళా కార్మికులకు గాని,దళితులకు గాని,చివరకు అప్రెంటిస్ పేరుతో వచ్చిన భవిష్యత్తు కలిగిన నూతన తరానికి కూడా రక్షణ లేకుండా పోయినటువంటి ఉదాంతం,పరిస్థితి సింగరేణిలోనీ"ఖని"టుఇంక్లైన్ మైన్ లో చాలా స్పష్టంగా కనబడుతున్నది.సింగరేణిలో అప్రెంటిస్ కు వచ్చిన బిటెక్ చదువుతున్న అక్షితరాణి అనే దళిత అమ్మాయిని సింగరేణి ఓర్మెన్ అనే అధికారి అహంకారానికి మోసపోయి,బలి అయినా ఉదాంతాన్ని కూడా జనరల్ మేనేజర్ కు,గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ లేఖ ద్వారా,తెలిపినప్పటికీ న్యాయం జరగకపోవడంతో చివరకు ఆత్మహత్య?.హత్యనా?.. అనిఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పిట్ సెక్రెటరీ,ఆర్టీఐ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జనగామ స్వప్న మంగళవారం మీడియాకు పంపిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు..సింగరేణిలో మహిళలపై అనేక రకాలుగా వేధింపులు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా వైపల్యం చెందుతున్నది.పోరాట సంఘాలు,అధికార సంఘాలు,సింగరేణి సంఘాలు.గుర్తింపు ప్రాతినిధ్య జేబీసీఐ సంఘాలు అని చెప్పుకునే వారు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే నోరు మెదపకుండా యాజమాన్య అనుకూల విధానాలు అనుసరించడం దురదృష్టకరంఅని,జనగామ సప్న ఆగ్రహం వ్యక్తంచేశారు,అక్షిత రాణి కుటుంబానికి న్యాయం జరగాలంటే.అర్జీవన్ జిఎం,మేనేజర్,ఓర్ మెన్, అతని అనుచరులు,ఎఐటియుసి నాయకులు రంగు శీను లను ఉద్యోగం నుంచి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ,కేసులు నమోదు చేసి...ఆకుటుంబానికి నష్టపరిహారం అందే విధంగా పోలీస్ శాఖ చొరవసూపాలని ఆమె డిమాండ్ చేశారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: