చిదినేపల్లి, జూన్ 8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిదినేపల్లి గ్రామపంచాయతీలో సోమవారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ వ్యవసాయం, వైద్యం, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. గ్రామానికి సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో యూరియా బస్తాల కొరత ఉన్నందున రైతుల అవసరాలకు అనుగుణంగా తగిన నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఏఈఓ కన్యను కోరారు. మహిళా సాధికారత కోసం ఐసిడీఎస్ శాఖ మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదులో పాల్గొనాలని, ఇంటింటికి వస్తున్న బీఎల్ఓలకు సహకరించి ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోర్రాళ్ల రాజయ్య, ఎంపీడీవో అడ్డూరి బాబురావు, ఎమ్మార్వో నాగరాజ్, మెడికల్ ఆఫీసర్ మౌనిక, ఏఈఓ కన్య, ఐసిడీఎస్ అధికారులు, వార్డు సభ్యులు కాయిరి పోచమల్లు, సోదరి రజిత, బౌతు ప్రభాకర్, నగర రజనీకాంత్, మంతెన రాజశేఖర్, బౌతు అరుణ, మురుకుట్ల సుశీల, కొడపాక స్వరూప, సీసీ మారగోని సారక్క, సీఏలు, వీఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు. న్యూస్ పేపర్ క్రియేట్ చేయండి
