మంథని: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ  దుద్దిళ్ల శ్రీపాదరావు  సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య  సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల  (91) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సువర్ణ వనమాల  మరణవార్త తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొని సువర్ణ వనమాల  భౌతికకాయానికి తుది నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. దివంగత  సువర్ణ వనమాల  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, బంధువులు తదితరులు పాల్గొని సువర్ణ వనమాల గారికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: