మహాముత్తారం: అటవీ హక్కుల చట్టం–2006లో ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు (OTFD) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు వినతిపత్రం అందజేశారు. OTFDలకు వర్తించే మూడు తరాలు లేదా 75 సంవత్సరాల నిబంధనను సడలించేలా చట్ట సవరణకు సిఫారసు చేయాలని కోరారు. పాతకాలంలో సరైన రెవెన్యూ, అటవీ, సర్వే రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నిజమైన అటవీ నివాసితులు 75 ఏళ్ల నిరంతర చారిత్రక ఆధారాలు సమర్పించలేక హక్కులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. చట్ట సవరణ జరిగే వరకు OTFDలను తొలగింపులు, వేధింపుల నుంచి రక్షించేలా జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, AIAYS మండల గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలిరావు, సలహాదారు గంధం రాజేష్, ప్రధాన కార్యదర్శి లింగమళ్ల శంకర్, ప్రచార కార్యదర్శి పులియాల సురేష్ పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: