భూపాలపల్లి, ఆగస్టు 20: భూపాలపల్లిలోని ఎస్ఆర్డీజీ స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకుడికి క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత ప్రవర్తన, ఇతరులను గౌరవించే గుణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరమని తెలిపారు. నాయకత్వం అంటే అధికారం కాదని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడమేనని సూచించారు. అనంతరం నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు సాష్లు ధరింపజేసి బాధ్యతలను అప్పగించారు. నాయకులు తమ బాధ్యతలను క్రమశిక్షణ, నిబద్ధతతో నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నూతన నాయకులకు అభినందనలు తెలిపారు.

Post A Comment: