భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. భూపాలపల్లి టౌన్ ఎల్‌బీనగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ కుమారస్వామి, నందిగామకు చెందిన ప్రభాకర్ గౌడ్‌తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా టీఆర్పీలో చేరుతున్నట్లు నూతన నాయకులు తెలిపారు. తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలు తమను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. పటేల్ వనజ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో మరింత మంది ప్రజలు టీఆర్పీలో చేరి రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాధికారం సాధించేందుకు పార్టీ కృషి చేస్తోందన్నారు. రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణీత్, సంతోష్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: