మహా ముత్తారం, ఆగస్టు 19: మహా ముత్తారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు చర్చించారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, మొక్కల సంరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత పొందిన 15 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేస్తామని, మధ్యవర్తులు, సిఫార్సులు అవసరం లేదని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: