కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి, డీఆర్‌డీఓ  బాలకృష్ణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది.

సమావేశానికి ఎంపీడీవో  ఎ. బాబు, పీఏసీఎస్ చైర్మన్  టి. ప్రశాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,  సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పొందుపరిచిన ఎజెండా అంశాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా చర్చించారు.

మండల పరిధిలో వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. అభివృద్ధి పనుల పురోగతి, ఆయా శాఖల పనితీరుపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. వాటిపై అధికారులు వివరాలు వెల్లడించారు.

మండల అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఎజెండాలోని అంశాలపై చర్చ అనంతరం సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: