భూపాలపల్లి: ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని ఆ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
దూదేకులపల్లి గ్రామానికి చెందిన నీలారపు రాజబాబు అనారోగ్యంతో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రవి పటేల్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
చిట్యాల మండలంలో ఇటీవల దాడికి గురైన జర్నలిస్ట్ పుల్ల రవీందర్ను ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్నతో ఫోన్లో మాట్లాడించి రవీందర్కు ధైర్యం కల్పించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
టేకుమట్ల మండలం కలికోటపల్లి గ్రామంలో టీఆర్పీ నాయకుడు కొలని సదయ్య కుమార్తె రవళి–ప్రశాంత్ల వివాహానికి హాజరైన రవి పటేల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. దూతుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు శస్త్రచికిత్స చేయించుకున్న లక్కాకుల హరీష్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
చిట్యాల మండలం గోపాల్పూర్లో ఇటీవల మృతి చెందిన దుప్పటి సారయ్య కుటుంబాన్ని నాలుగో రోజు పరామర్శించిన రవి పటేల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా సహకరించడం, ప్రమాద బాధితులకు ధైర్యం కల్పించడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత అన్నారు. కార్యక్రమాల్లో సాదు మల్లన్న ముదిరాజ్, టీఆర్పీ నాయకులు ఇనుగల ప్రణయ్ రాజ్, పిట్టల వెంకటేష్, మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




Post A Comment: