భూపాలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీషపై హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద దారుణంగా కొట్టి అత్యాచారం చేసి హత్య చేయడాన్ని కుల సంఘాల జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సత్వర న్యాయం చేయాలి
ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నర్సింగ్ సిబ్బందిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శిరీష రూమ్లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం అత్యంత ఘోరమైన చర్య అని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు మాట్లాడుతూ.. బాధితురాలి బట్టలు చిరిగిపోయి, ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు ఆమె మిత్రులు చెబుతున్నారని తెలిపారు. దీనికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళల భద్రతపై ఆందోళన
ప్రజాసేవ చేసే నర్సులు, ఉద్యోగినుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లోనే కాకుండా వారి నివాసాల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోరాటం కొనసాగిస్తాం
‘జస్టిస్ ఫర్ శిరీష’ పేరుతో బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని పీక కిరణ్ స్పష్టం చేశారు.

Post A Comment: