Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 20: తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం-1923లోని సెక్షన్ 5, 6 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శనివారం గ్రామ రీ-సర్వేకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో రీ-సర్వే ప్రక్రియ, భూ సరిహద్దుల నిర్ధారణ, సర్వే సమయంలో రైతులు, భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు.
రీ-సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజల సహకారం అవసరమని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), తహసీల్దార్, సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), పంచాయతీ కార్యదర్శి (పీఎస్), గ్రామ పెద్దలు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహాదేవపూర్, జూన్ 19: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దేవాలయ అభివృద్ధి పనులపై అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేవస్థాన అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. భక్తుల సహకారం, ప్రభుత్వ నిబద్ధతతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని తెలిపారు.
లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మెడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యలు, కుట్రలు, భూదందాలు, రౌడీయిజం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మహాదేవపూర్ ప్రాంత ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అఫ్జల్ ప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, గ్రామ సర్పంచ్ హసీనా బానో, ఎక్స్పీఎస్సీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, రామన్ రావు, తిరుపతిరెడ్డి, శంకరయ్య, శివరాజు, సంతోష్, మోత సాంబయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కోట సమ్మయ్య, వార్డ్ సభ్యులు గడ్డం స్వామి, నయూముద్దీన్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 18 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల ఉపాధ్యక్షుడు చీర్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమై ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, నాయకులు బండము మల్లారెడ్డి, గోగుల రాజేష్, కొండ రామ్, వార్డు సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, జిలేష్, గండు మల్లారెడ్డి, గండు తిరుపతి, చీర్ల చంద్రశేఖర్, వడ్ల రవీంద్రాచారి, సురేష్, రత్నాకర్, నరేష్, జగదీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కాటారం, మహాముత్తారం, మల్హర్రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), బీఎల్వో పర్యవేక్షకులకు కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారి, కాటారం, మహాముత్తారం, మల్హర్రావు తహసీల్దార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అమలు విధానం, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయి బాధ్యతలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించారు. మూడు మండలాలకు చెందిన బీఎల్వోలు, బీఎల్వో పర్యవేక్షకులు శిక్షణలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బుధవారం ఉదయం అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారుల ఇళ్ల స్థలాల వద్ద ముగ్గులు వేసి శుభారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి మొత్తం 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గతంలో ఇల్లు పొందిన వారు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల 8 దరఖాస్తులు కలెక్టరేట్ స్థాయిలో పెండింగ్లో ఉన్నట్లు మండల అభివృద్ధి అధికారి తెలిపారు. ఏళ్ల తరబడి సొంత ఇల్లు కలగానే మిగిలిపోయిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఆశలను నింపింది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, దినసరి కార్మికులు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సొంత ఇంటి నిర్మాణానికి దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత భూమి ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ లబ్ధిదారులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు మహిళలు ఇళ్ల స్థలాల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కర్ణాకర్, గ్రామ సర్పంచ్ బండం శోభారాణి-రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిప్పల ప్రభాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ ములకల నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) అమలుపై కాటారం, మహాముత్తారం, మల్హర్రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జూన్ 18న ఉదయం 11 గంటలకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, మాస్టర్ ట్రైనర్లు హాజరై ఓటరు జాబితాల సవరణ విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో 87 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), 10 మంది బీఎల్వో పర్యవేక్షకులు పాల్గొననున్నారు. ఇందులో కాటారం మండలం నుంచి 36 మంది బీఎల్వోలు, 4 మంది పర్యవేక్షకులు, మహాముత్తారం మండలం నుంచి 27 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు, మల్హర్రావు మండలం నుంచి 24 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు హాజరు కానున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా ప్రతినిధులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్ కోరారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17 : కాటారం మండలంలో 2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిణి (ఎంఈవో)పై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ఎంఈవో శ్రీదేవి గానీ, ఎంఆర్సీ సిబ్బంది గానీ తమ బిల్లుల మంజూరు విషయంలో ఎప్పుడూ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో ఎంఈవో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ బిల్లుల చెల్లింపుల విషయంలో డబ్బులు అడిగినట్లు కొందరు వ్యక్తులు ఉపాధ్యాయ సంఘాలకు తప్పుడు సమాచారం అందించడంతోనే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం బాధాకరమని, ఎంఈవో శ్రీదేవి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన అసత్య ప్రచారాలను 2008-డీఎస్సీ ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఖండన తెలిపిన ఉపాధ్యాయులు:
ఈ. అరుణ, జె. స్వప్న, పి. స్వప్న, వి. సుమతి, పి. పద్మజ.
ఇట్లు,
2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, కాటారం మండలం.
Subscribe to:
Posts (Atom)
















