Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. సమస్యల పరిష్కారంలో మండల శాఖకు సహకరించిన జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్  కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇటీవల 317 జీవోకు సంబంధించిన నోటిఫికేషన్లో బాధిత ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే అవకాశం , మరి కొంతమంది బాధ్యత ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వలేదు కావున ప్రతి ఒక బాధిత ఉపాధ్యాయులకు ఈ ఒక నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.పై సమస్యను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మీ ద్వారా రాష్ట్ర శాఖకు ఈ సమాచారం తెలియజేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు ఎన్. సురేషు, అసోసియేట్ మహిళ  అధ్యక్షులు బాసాని రజిత మరియు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు,  ఎంపీపీ విలాసాగర్ పాఠశాలలో పనిచేస్తూ అనారోగ్యంతో అకాల మరణం చెందిన పద్మ మృతికి సంతాపంగా జిల్లా మరియు మండల నాయకులు నివాళులు అర్పించారు. ఈ రోజు పెద్దకర్మ సందర్భంగా ఆమె స్వగ్రామమైన నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘంలో సభ్యురాలిగా ఉన్న పద్మకు  పి ఆర్ టి యు తెలంగాణ సంక్షేమ నిధి నుండి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె భర్త యాదగిరి రెడ్డికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి సభ్యుని సంక్షేమానికి పి ఆర్ టి యు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు న్. సురేష్, రాజశేఖర్, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి: పి.ఆర్.టి.యూ తెలంగాణ రాష్ట్ర సంఘం తరపున సభ్యుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సభ్యురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పి.ఆర్.టి.యూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రెగురి శుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన ఎం.పి.పి.ఎస్. విలాసగర్ (ఎస్‌సి) పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి వై. పద్మ గారి కుటుంబానికి సంఘం సహాయక హస్తం అందించింది. సంఘం సంక్షేమ నిధి నుండి రూపాయల 1,00,000 చెక్కును మరణించిన ఉపాధ్యాయురాలి భర్త శ్రీ యాదగిరి రెడ్డి గారికి పెద్దకర్మ రోజున వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వాణిపాకల గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యూ మండల శాఖ అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి, నాయకులు ఎన్. సురేష్, ఎస్. రాజశేఖర్ రావు, గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున వై. పద్మ గారి కుటుంబానికి సంతాపం తెలియజేసి, అవసరమైన సహాయాన్ని అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

వరంగల్: నగర పరిధిలోని గొర్రెకుంట 15వ డివిజన్ బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు (45) ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొగిలిచర్ల గ్రామ శివారులోని చెరువు వద్ద రాజు మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజు మృతి వెనుక కారణాలపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులు రాజు ఇటీవల కొన్ని వ్యక్తులతో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ కోణం కూడా పరిశీలనలోకి తీసుకున్న పోలీసులు, రాజు మొబైల్ ఫోన్ డేటా, సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. “మరణం వెనుక ఉన్న అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు కొనసాగుతుంది,” అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గొర్రెకుంట, మొగిలిచర్ల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజు మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, న్యాయమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు."రాజు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. ఆయన మృతి మాకు తీవ్ర లోటు," అని బీఆర్ఎస్ స్థానిక నాయకులు పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

(ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 22 సెప్టెంబర్2025 న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మృతిచెందిన) మృతదేహం కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుండి ఈ రోజు 18 అక్టోబర్2025,శనివారం, ఉదయం 6-30,గంటలకు తీగలకుంటపల్లి గ్రామంలోకి ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామిక వాదులు నివాళులు అర్పించి ఊరేగింపుగా ఇంట్లో కి తీసుకువచ్చారు.నివాళుల తర్వాత  మధ్యాహ్నం   అంతిమయాత్ర ప్రారంభమై గ్రామపురి వీధులనుండి స్మశానం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది శ్రీదేవి అమరుడు ఖాతా రామచంద్రరెడ్డి@వికల్ప్ చివరి చూపు కోసం పౌర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు గ్రామస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నాటి తోటి స్నేహితులు అభ్యుదయ విప్లవ రచయిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో ముఖ్యమైన మార్పు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ, “గత ప్రభుత్వ కాలంలో ‘ఇద్దరు పిల్లలు’ నిబంధన అమల్లో ఉండేది. అంటే, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు వార్డు సభ్యుడు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అయ్యేవారు. ఆ నిబంధనను మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది” అని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని, స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో తగిన సవరణలు చేయనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఈ మార్పుతో గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పాత నిబంధన కారణంగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన అనేక మందికి ఊరట లభించనుంది. మంత్రి వివరించిన ప్రకారం, కొత్త నిబంధనల ప్రకారం పిల్లల సంఖ్య ఆధారంగా అభ్యర్థుల అర్హతను నిరాకరించే పరిస్థితి ఇక ఉండదని స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేసే విధానాలు ఉండకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను ఎంచుకునే స్వేచ్ఛ కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది” అని పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ఇది కీలక పరిణామంగా భావించబడుతోంది. అనేక గ్రామాల్లో సామాన్య ప్రజల్లో ఈ నిర్ణయం సంతోషాన్ని కలిగించింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల  ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాంపూర్ లోని  వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, మడికొండ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఈ రెండు విద్యాసంస్థల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డివో రాథోడ్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ: సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం లను భద్రపరిచే గోదాం భవన నిర్మాణ తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


 ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ తహసీల్దార్  రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

 స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హనుమకొండ,  జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్,  రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా  నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో    సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను  గుర్తించామని పేర్కొన్నారు. గత ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధానం, నమోదైన కేసులపై పరిశీలన చేయాలని అధికారులకు, ఏసీపిలకు కమిషనర్ సూచించారు. రూట్ లు, జోన్ల వారిగా మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టు లను, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించిన అంశాలలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రూట్ మ్యాపులను ఎంపీడీవో లు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్ పోస్ట్, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు నియమించు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల, రూట్ ల ఏర్పాటు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.


మండల స్థాయిలో సజావుగా ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.