March 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సంగారెడ్డి: మానవ హక్కుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా మానవ హక్కుల సంఘం ప్రతినిధులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) పరితోష్ పంకజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రజల హక్కుల పరిరక్షణ, పోలీస్-ప్రజల సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ప్రజల హక్కులను ఎవరైనా నిర్లక్ష్యం చేసినా, ఉల్లంఘించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ న్యాయం పొందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన మరింత పెరుగుతుందని సంఘం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను ఉరేసి హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ సమస్యలు మరియు వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కలచివేస్తున్నాయి. చిన్నారుల మృతితో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలు ఈ దారుణానికి కారణమా అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జగిత్యాల: జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో చోటుచేసుకున్న అమానుష ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే సిబ్బంది పడుకున్న విద్యార్థులపై చీపురుతో దాడి చేసిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాధిత విద్యార్థుల వాంగ్మూలాల ప్రకారం, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న వారిని లేపుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులు “మమ్మల్ని కొట్టొద్దు” అంటూ వేడుకున్నప్పటికీ అతను ఆగకుండా దాడి కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనతో హాస్టల్‌లో భయానక వాతావరణం నెలకొంది. కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు కూడా తెలిసింది. ఇక, శ్రీనివాస్ తరచూ మద్యం మత్తులో ఉండి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయితే ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
విశాఖపట్నం, మార్చి 30: నగరాన్ని కలవరపరిచిన దారుణ ఘటనలో ప్రియురాలు మౌనిక (29)ను హత్య చేసి ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు రవీంద్ర ఫోటో తాజాగా బయటకు వచ్చింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం, రవీంద్ర-మౌనికల పరిచయం డేటింగ్ యాప్ ద్వారా ప్రారంభమై, తరువాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధంలో భాగంగా ఇప్పటివరకు రవీంద్ర మౌనికకు సుమారు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. ఘటన జరిగిన రోజు కూడా మౌనిక నేవీ ఐడీ కార్డు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం హత్యకు దారితీసిందని రవీంద్ర పోలీసులకు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హత్యకు ముందుగానే ఆన్లైన్లో కత్తి, శుభ్రపరిచే సామగ్రి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

గోదావరిఖనిరూరల్,19,మార్చి(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ)రామగుండం 22వ డివిజన్ ఎఫ్ సీఐ ఎలక్కలపల్లి గేట్ లో కాంపల్లి లక్ష్మీప్రసన్న రఘు కొత్తసంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సర సందర్భంగా ఒంటరి మహిళ చంద్రకళకు 25కిలోల బియ్యం1000రూపాయలు ఆర్థికసాయం గురువారం కేఆర్ టీం ఆధ్వర్యంలో అందజేశారు..22వ డివిజన్ ప్రజలు,హిందూ బంధువులందరు.ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి స్వీకరించారు,ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సందీప్,ప్రవీణ్,సురేష్,నవీన్,అరుణ్ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పల్గుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వార్డు సభ్యుడు జిల్లాల సంతోష్, సీనియర్ నాయకుడు కోడిపే బుచ్చయ్యలు గురువారం మంథని పట్టణంలోని రాజగృహలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నిట్టూరి రమాదేవి రమేష్, నిట్టూరి రమేష్, కొట్టే రాజయ్య, రాగం వెంకటమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగం రాజేందర్, మచ్చ రాజేష్, యూత్ నాయకులు కొట్టే సంపత్, పసుల రమేష్, రాగం రజనీకాంత్, కొట్టే మధు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని చిట్యాల మండలంలో ఇటీవల బీసీకి చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కుమారస్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రవి పటేల్, రాజ్యాంగం అమలులోకి వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా బీసీలపై అగ్రకులాల వ్యక్తులు భౌతిక దాడులు చేయడం, దూషణలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో, బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, అలా జరిగితేనే ఆధిపత్య కులాల దౌర్జన్యాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని రవి పటేల్ పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి యథేచ్ఛగా తిరుగుతూ ఇంకా ఎన్ని మందిపై దాడులు చేసిన తరువాత చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. భూకబ్జాలు, మట్టి మాఫియా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వెంటనే అరెస్టు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాదు మల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, గతంలో కూడా అనేక క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెల 15 తేదీ ఆదివారం కావడంతో, ఒంటిపూట బడులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇదిలా ఉండగా బోర్డ్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలలకు సూచించారు. విద్యార్థులపై ఎండల ప్రభావం తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాటారం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. ఆమెతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డి పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో జరుగుతున్న శుభ్రత పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రజా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో రోజువారీ నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు క్రమబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని క్రిమేటోరియంను సందర్శించి నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పంత కానీ సడువలి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జిల్లాలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ (MRI) యంత్రానికి అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

టి20 వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సమానంగా పోరాడినా కీలక సమయంలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో విజయం భారత్‌ను వరించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ భారీ స్కోరు సాధించారు. ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. మధ్య ఓవర్లలో కూడా అదే జోరు కొనసాగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ భారీ స్కోరు నమోదు చేసి ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వేగంగా పరుగులు సాధించి జట్టుకు మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెథెల్ అద్భుతంగా ఆడి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు సాధిస్తూ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని మార్మోగించాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లినట్లే కనిపించింది. అయితే మ్యాచ్ చివరి దశలో భారత బౌలర్లు పుంజుకున్నారు. కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బందులు పడ్డారు. చివరి ఓవర్లలో వికెట్లు వరుసగా పడటంతో ఇంగ్లండ్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది. చివరికి నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ జట్టు లక్ష్యానికి 7 పరుగులు దూరంలో నిలిచిపోయింది. దీంతో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్ల పట్టుదలతో పాటు ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో భారత్ టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తుదిపోరు జరగనుంది. ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారత్ ట్రోఫీని గెలుచుకుంటుందా లేదా అన్న ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతి నిర్వహణపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ మండల శాఖ ఖండించింది. బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్, మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. గత నెల ఫిబ్రవరి 19న కాటారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని, అయితే అనంతరం పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం బాధాకరమని తెలిపారు. కాటారం‌లో హిందువులు శివాజీ జయంతి జరుపుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఇదే మండల కేంద్రంలో జయంతి, వర్ధంతి పేరుతో ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కేసులు ఎందుకు పెట్టరని ఆయన నిలదీశారు. హిందువులు ఐక్యంగా ఉంటే హిందూ వ్యతిరేకుల ఆగడాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ తరఫున త్వరలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.మార్చి.1,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)44 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన మావో మల్లోజుల పెద్దపెళ్లికి కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపు..మావోయిస్టు పార్టీ మాజీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారతో కలిసి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం వచ్చారు.సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి అలింగణం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1980 వ దశలో అన్న కిషన్ జితో కలిసి ఉద్యమ బాటపట్టి 44 ఏళ్ల పాటు సాయిధ పోరాట జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే..అయితే అప్పటినుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది.మల్లోజుల సోదరుడు అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యారు.ఆయనను కలవడానికి వచ్చిన మల్లోజులను.పెద్ద సంఖ్యలో బంధువులు.స్నేహితులు తరలివచ్చారు కొంతసేపు కుటుంబ సభ్యులు.స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరితో కలిసి ఫోటోలు దిగారు.మల్లోజుల పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేకంగా నిఘ ఉంచింది.అయితే మల్లోజుల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.మల్లోజుల రాక పెద్దపల్లిలో చర్చనీయంగా మారింది...