విశాఖపట్నం, మార్చి 30: నగరాన్ని కలవరపరిచిన దారుణ ఘటనలో ప్రియురాలు మౌనిక (29)ను హత్య చేసి ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు రవీంద్ర ఫోటో తాజాగా బయటకు వచ్చింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం, రవీంద్ర-మౌనికల పరిచయం డేటింగ్ యాప్ ద్వారా ప్రారంభమై, తరువాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధంలో భాగంగా ఇప్పటివరకు రవీంద్ర మౌనికకు సుమారు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. ఘటన జరిగిన రోజు కూడా మౌనిక నేవీ ఐడీ కార్డు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం హత్యకు దారితీసిందని రవీంద్ర పోలీసులకు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హత్యకు ముందుగానే ఆన్లైన్లో కత్తి, శుభ్రపరిచే సామగ్రి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: