మహా ముత్తారం, జూలై 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం మహబూబ్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నం సారయ్య (60)ను ఆయన కుమారుడు రవీందర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవీందర్ గొడ్డలితో సారయ్యపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సారయ్య మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: