మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కోట రాజబాబు, వామన్రావు, రామారావు, మహాదేవపూర్ ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ గౌరవ సభ్యులు, మైనార్టీ సెల్ బ్లాక్ అధ్యక్షుడు అస్రార్, ఇర్షాద్, కోట సమ్మయ్య, శివరాజు, రవిచంద్ర, రాఘవేంద్ర, చక్రధర్, కొయ్యల సత్యం, తడకల జగదీశ్వర్, నాగరాజు, మాజీ ఎంపీటీసీ గంగులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో విశేష మార్పు తీసుకువచ్చాయని కొనియాడారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో విశేష మార్పు తీసుకువచ్చాయని కొనియాడారు.

Post A Comment: