పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్,28 : సింగరేణి సంరక్షణకై–మొండి  బకాయిలు వెంటనే చెల్లించాలి:సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు)డిమాండ్:సింగరేణి కాలరీస్ సంస్థను ఆర్థిక సంక్షోభం నుండిగట్టెక్కించాలని,జెన్‌కో(టిజిజిఇన్కో)ట్రాన్స్‌కోసంస్థలు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ,మంగళవారం హైదరాబాద్ విద్యుత్ సౌదా  వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించరు,అనంతరం యూనియన్ నాయకులు(టిజీజీఇఎన్ సిఓ)ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడరు.​ఆర్థిక సంక్షోభంతో సింగరేణి సంస్థలో సుమారు 40,000 మంది శాశ్వత ఉద్యోగులు,27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సింగరేణి సంస్థ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.కార్మికుల జీతభత్యాలు,సంక్షేమ పథకాలు,కనీస పనిముట్లు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి కీలకమైన హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ,డీజిల్ డోజర్లు,భూగర్భగనులలో  ఎల్ హెచ్ డి మిషనరీలు  కొనుగోలుకు కూడా నిధుల కొరత ఏర్పడటం శోచనీయం,డబ్బులు లేక సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని,రక్షణని గాలికి వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందిఅని,భారీగా పేరుకుపోయిన బకాయిలు, 2014 నుండి ఇప్పటివరకు విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు,46,000 కోట్లకు చేరుకున్నాయి.ఇప్పటివరకు జన్కోనుండి రూ.19000 కోట్లు బకాయిలు,ట్రాన్స్కో నుండి 27000 కోట్లు బకాయి ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.గత రెండేళ్లలోనే(2023-25) వరకు 10,000 కోట్లు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంఅని అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు,ప్రభుత్వ గ్యారెంటీతో బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి,ఇతర ప్రభుత్వ సంస్థలైన జెన్‌కో,ట్రాన్స్‌కోల నుండి బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది,ఒక ప్రభుత్వ సంస్థను కాపాడటానికి మరో సంస్థ బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తపరిచారు: డిమాండ్లు(టిజిజిఇన్కో),ట్రాన్స్‌కో నుండి రావాల్సిన.46,000 కోట్ల బకాయిలను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలి.సింగరేణి కార్మికుల సంక్షేమానికి,సంస్థ అభివృద్ధికి ఆటంకం కలగకుండా నిధులు విడుదల చేయాలి.బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చే పరిస్థితి నుండి సంస్థను విముక్తి చేయాలని పేర్కొన్నారు,​ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్,రాష్ట్ర అధ్యక్షులు మందా నర్సింహారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి,ఆర్టి-టూఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్,అధ్యక్షులు బానోత్ వినయ్ లు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: