మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని నాంచారిమడూరు గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే డిగ్రీ గురుకుల కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన రాచర్ల కార్తీక్ (19) అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Post A Comment: