హైదరాబాద్, జూలై 7: కాలేశ్వరం గ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్ కుమార్, వార్డు సభ్యులు రేవెల్లి రాకేష్, పానేం సంతోష్, వెన్నపురెడ్డి విజయలక్ష్మి, కావేరి జయలక్ష్మి, పెద్ది లక్ష్మి, షేక్ రహీమ బేగం, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంతతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముల్కల రాజిరెడ్డి, కాటారపు శేఖర్, వెన్నపురెడ్డి సుకుమార్ రెడ్డి, శనిగరం శ్రీధర్ రెడ్డి, అమృత రమేష్, ఎండీ ముస్తఫా, వెన్నపురెడ్డి రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు సన్నబియ్యం, మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పాటు యువతకు కల్పిస్తున్న అవకాశాలు తమను ఆకర్షించాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కామెడీ శ్రీనివాస్ రెడ్డి, మహాదేవపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకరి రాజబాబు, మాజీ సర్పంచ్ బందెల సత్యమ్మ, గ్రామ శాఖ ప్రచార కార్యదర్శి షేక్ షకీల్, యువ నాయకులు మాచర్ల అరుణ్ కుమార్, అమృతపు సారయ్య తదితరులు పాల్గొన్నారు.






Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: