మహాముత్తారం మండలం (రెడ్డిపల్లి): మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖకు కొత్త అధ్యక్షునిగా ధరం సోత్ సారయ్యను నియమించారు. ఈ నియామకం ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి, నూతన అధ్యక్షుడికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC లింగమళ్ల శారద దుర్గయ్య, గ్రామ సర్పంచ్ సగుళం అనసూయ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశీ రాజ్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మాజీ ZPTC మడిపల్లి సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ వేముల మధుకర్ గౌడ్, నాయకులు నూకల రవి, సాగుళం నర్సింహా తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ధరం సోత్ సారయ్య తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: