కాళేశ్వరం ఆలయ పునఃప్రతిష్ఠ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఐఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణం, అప్రోచ్ రోడ్ల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని విభాగాల మధ్య సమన్వయం అవసరమని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, తక్షణ వైద్య సేవల కోసం వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భద్రతా పరమైన చర్యల్లో భాగంగా సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ సూచించారు.
Home
kaleshwaram ( కాళేశ్వరం )
కాళేశ్వరం ఆలయ పునఃప్రతిష్ఠ పనులకు సీఎం శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పరిశీలన

Post A Comment: