వరంగల్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఎర్రగోల్ల భరత్ వీర్  సోమవారం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భరత్ వీర్ శాలువాతో సత్కరించి ఆశీస్సులు పొందారు. సమావేశంలో వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతం, యువతను రాజకీయంగా చైతన్యపరచడం, గ్రామ స్థాయి వరకు యువ మోర్చా కమిటీలను విస్తరించడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై బీజేవైఎం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన సంక్షేమ పథకాలు, డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన భరత్ వీర్ యువతను బీజేపీ వైపు ఆకర్షించేలా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. భరత్ వీర్ మాట్లాడుతూ, తనపై మరోసారి విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నిరంతరం అండగా నిలుస్తున్న జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువ మోర్చా కమిటీలను మరింత పటిష్టం చేసి, యువత గొంతుకగా నిలుస్తామని, జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు యువశక్తిని ఏకం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: