కాటారం, జూలై 26: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా టోల్ రుసుములు వసూలు చేస్తున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ ఆరోపించారు. టోల్ ప్లాజా వద్ద ఉచిత బాత్రూమ్‌లు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని ఆయన విమర్శించారు. టోల్ ప్లాజా వద్ద ఒక్క అంబులెన్స్ మినహా ప్రయాణికులకు అవసరమైన ఇతర సదుపాయాలు కనిపించడం లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా మేడిపల్లి టోల్‌గేట్ పరిసరాల్లో రహదారి గుంతలమయంగా మారిందని, అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై ప్రయాణికుల నుంచి టోల్ రుసుములు వసూలు చేయడం సరికాదని పీక కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ వసూలు చేస్తున్న నిర్వాహకులు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారిపై గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద తక్షణమే శుభ్రమైన ఉచిత టాయిలెట్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసి, రహదారి మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. అధికారులు, టోల్ నిర్వాహకులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బాధితులు, వాహనదారులతో కలిసి టోల్ ప్లాజాను ముట్టడించి, టోల్ వసూళ్లను అడ్డుకుంటామని పీక కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ అయితే బాపు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: