కాటారం, జూలై 24: కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతకాని గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5,430 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి సమయంలో మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అరెస్ట్ చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కాటారం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్‌-100కు సమాచారం అందించాలని కోరారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: