హైదరాబాద్: ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అలాగే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టడం వంటి హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దీక్షకారులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చే వరకు తమ ఆందోళన ఆగదని వారు స్పష్టం చేశారు. సర్వాయి పాపన్న మహారాజ్ తెలంగాణ గర్వించదగ్గ వీరయోధుడని, ఆయనకు తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ట్యాంక్బండ్పై పాపన్న మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టే వరకు తమ నిరవధిక దీక్ష కొనసాగుతుందని దీక్షకారులు వెల్లడించారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజలు, వివిధ సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కండ్లుండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ న్యాయమైన డిమాండ్కు సంఘీభావం తెలపాలని వారు కోరారు.

Post A Comment: