సిద్దిపేట, జూన్ 13: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో ఉన్న తాటి చెట్ల తొలగింపు ఘటనపై జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీ సహాయంతో తొలగించారని ఆరోపిస్తూ గౌడ సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అంతకుముందు జై గౌడ ఉద్యమం నాయకులు సంబంధిత అధికారులను కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గీత కార్మికుల జీవనోపాధికి నష్టం వాటిల్లిందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్, జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు యాదగౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: