కాటారం, జూన్ 20: తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం-1923లోని సెక్షన్ 5, 6 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శనివారం గ్రామ రీ-సర్వేకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో రీ-సర్వే ప్రక్రియ, భూ సరిహద్దుల నిర్ధారణ, సర్వే సమయంలో రైతులు, భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు. 


రీ-సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజల సహకారం అవసరమని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), తహసీల్దార్, సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), పంచాయతీ కార్యదర్శి  (పీఎస్), గ్రామ పెద్దలు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: