మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనపై CISF సిబ్బంది అమానుషంగా లాఠీ చార్జీ జరిపి తలలు పగల గొట్టి కాళ్లు చేతులు విరగ గొట్టిన పాశవిక దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ .. గాయాల పాలైన కార్మికులను ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ లాఠీఛార్జ్ లో తీవ్ర గాయం కావడం జరిగిందని కార్మికులకు, అనేకమంది కార్మిక నేతలకు తీవ్ర గాయాలు అయ్యాయని వారు పేర్కొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ బీహారీ పాలసీని అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ వాదులపై తెలంగాణ కార్మికులపై సిఐఎస్ఎఫ్ బలగాలచే దాడి చేయించి పాశవిక ఆనందం పొందుతుందని వెంటనే దాడి చేసిన CISF అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు..

Post A Comment: